జీతాల్లేకుండా ‘పొరుగు సేవల’ పోస్టులు
ఏ శాఖలో అయినా పొరుగుసేవల కింద పోస్టుల భర్తీ చేపట్టినా.. వారికి సంబంధిత గుత్తేదారు సంస్థ ద్వారానో, ఆప్కాస్ ద్వారానో ప్రతి నెలా జీతం ఇచ్చేలా ఆదేశాలుంటాయి.
ఆర్అండ్బీలో 467 కొలువుల భర్తీకి హడావుడి
అతిథిగృహాల్లో అద్దెలు వసూలు చేసి జీతాలివ్వాలని ఆర్థికశాఖ వింత ఆదేశాలు!
ఈనాడు, అమరావతి: ఏ శాఖలో అయినా పొరుగుసేవల కింద పోస్టుల భర్తీ చేపట్టినా.. వారికి సంబంధిత గుత్తేదారు సంస్థ ద్వారానో, ఆప్కాస్ ద్వారానో ప్రతి నెలా జీతం ఇచ్చేలా ఆదేశాలుంటాయి. కానీ రహదారులు భవనాల శాఖలోని ఇన్స్పెక్షన్ బంగ్లాల్లో (అతిథిగృహాల్లో) 467 పోస్టులు భర్తీ చేస్తుండగా.. వారి జీతాల విషయంలో మాత్రం విచిత్రమైన నిబంధన పెట్టారు. ప్రభుత్వం తరఫున జీతాలివ్వకుండా, ఆయా అతిథిగృహాల్లో గదులు వినియోగించుకున్నవారి నుంచి అద్దె వసూలు చేసి, వాటితో జీతాలు ఇవ్వాలంటూ ఆర్థికశాఖ ఆదేశాలిచ్చింది. ఇది జరిగే పనేనా అని ఆర్అండ్బీ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 139 ఆర్అండ్బీ అతిథిగృహాల్లో.. ఖాళీ అయిన ఆఫీస్ సబార్డినేట్లు, వాచ్మన్లు, పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి మొత్తం 467 పోస్టులను పొరుగుసేవల కింద భర్తీ చేయడానికి గత ఏడాది ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అయితే వీరికి జీతాలివ్వాల్సిన ఆర్థికశాఖ కొత్త ప్రతిపాదన తెచ్చింది. అతిథిగృహాలను వినియోగించుకున్న వీఐపీలు, అధికారులు, ప్రైవేటు వ్యక్తుల నుంచి అద్దె వసూలు చేసి, ఆ సొమ్ముతో పొరుగుసేవల సిబ్బంది జీతాలు చెల్లించి, నిర్వహణ ఖర్చులకు కూడా వినియోగించాలని సూచించింది. ఈ మేరకు ఆర్అండ్బీ అధికారులు జనవరి 11న ఉత్తర్వులు జారీచేశారు.
అద్దెల వసూలు సాధ్యమేనా?
రాష్ట్రంలో తిరుపతి, కడప మినహా అన్ని జిల్లాల్లోని ఆర్అండ్బీ అతిథిగృహాల్లో ఒక్కో గది అద్దె నాన్ ఏసీకి రూ.90, ఏసీకి రూ.180 చొప్పున ఉంది. దశాబ్దాల కిందట ఖరారుచేసిన ఈ ధరల్నే ఇప్పటికీ అమలుచేస్తున్నారు. తాజాగా జాయింట్ కలెక్టర్ ఛైర్మన్గా కమిటీ ఏర్పాటు చేసి, స్థానిక మార్కెట్ ధరల ప్రకారం కొత్తగా అద్దె ధరలు ఖరారు చేసి వసూలు చేయాలని, ఆ సొమ్మంతా ఆర్అండ్బీ జిల్లా ఎస్ఈ ఖాతాలోకి చేరాలని సూచిస్తూ వేరొక ఉత్తర్వు ఇచ్చారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కల్టెక్టర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాలకు వచ్చినపుడు ఆర్అండ్బీ అతిథిగృహాలను వినియోగించుకుంటారు. వీరి నుంచి గాని, ఆయా శాఖల నుంచి గానీ అద్దెలు వసూలు చేయడం సాధ్యమేనా? అద్దె చెల్లించాలని అక్కడి ఈఈ, డీఈ, ఏఈ స్థాయి అధికారులు అడగగలరా అనేది ప్రశ్నార్థకం. ఇలా అద్దెలు రాకపోతే, పొరుగుసేవల కింద చేరబోతున్న ఒక్కో ఉద్యోగికి రూ.15 వేల చొప్పున జీతం ఎవరిస్తారు? కొన్నిచోట్ల ముగ్గురు, నలుగుర్ని కూడా నియమిస్తున్నారు. అంటే ప్రతినెలా రూ.60 వేలు కావాలి. నిర్వహణకు ఎంత లేదన్నా ప్రతి నెలా రూ.10-20 వేలు ఖర్చవుతాయి. ఈ సొమ్మంతా అద్దెల రూపంలో రాకపోతే ఏం చేయాలో ఆర్అండ్బీ అధికారులకు అంతుచిక్కడం లేదు. 467 మందికి కలిపి నెలకు జీతాల రూపంలో రూ.70.05 లక్షలు, ఏడాదికి రూ.8.40 కోట్లు చెల్లించాలి. వీరికి జీతాలివ్వాల్సిన ఆర్థికశాఖ తెలివిగా తన బాధ్యత నుంచి తప్పించుకుంది. ఆర్అండ్బీ ఇంజినీర్లే వారి పాట్లు వాళ్లు పడతారనేలా వదిలేసింది.
సిఫార్సులు.. ఒత్తిళ్ల పరంపర
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపు ఆఘమేఘాలపై ఈ పోస్టులు భర్తీ చేయాలని భావిస్తున్నారు. కలెక్టర్/జాయింట్ కలెక్టర్ ఛైర్మన్గా, ఆర్అండ్బీ ఎస్ఈ కన్వీనర్గా కమిటీ వేసి నియామక ప్రక్రియ చేపట్టారు. గత నెల 27 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఒక్కో జిల్లా నుంచి సగటున వచ్చిన 500-600 దరఖాస్తుల పరిశీలన శనివారంతో ముగిసింది. సోమవారం జిల్లాల్లో మెరిట్ జాబితాలు ప్రకటిస్తారు. అభ్యంతరాలను పరిశీలించి, తుది మెరిట్ జాబితా 8న ప్రకటిస్తారు. 11న నియామక ఆదేశాలు ఇవ్వనున్నారు. 11వ తేదీ తర్వాత సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు వెలువడే అవకాశం ఉండటంతో, ఆలోగా పూర్తిచేయాలన్నది ఆలోచన. మరోవైపు దరఖాస్తుదారుల్లో తమకు తెలిసినవారు ఉన్నారని, వారికి పోస్టింగ్ ఇవ్వాల్సిందేనంటూ పలు జిల్లాల్లో అమాత్యులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్దసంఖ్యలో సిఫార్సు లేఖలిచ్చారు. పదోతరగతి మార్కులు, గతంలో పొరుగుసేవల కింద పనిచేసిన అనుభవం వంటి వాటి ఆధారంగా పాయింట్లు కేటాయించి ఎంపిక చేయాలి. కానీ అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు బలంగా పనిచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!