భృంగి వాహనంపై శ్రీశైల మల్లన్న

నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల రెండో రోజైన శనివారం భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

Published : 03 Mar 2024 04:22 IST

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల రెండో రోజైన శనివారం భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో స్వామి, అమ్మవార్లకు అర్చకులు, వేదపండితులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం కళాకారుల సందడి నడుమ పురవీధుల్లో గ్రామోత్సవం జరిగింది. ద్వారకాతిరుమల దేవస్థానం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని