గన్నవరంలో వైకాపా నేతల అరాచకం
రాష్ట్రంలో వైకాపా నేతలు బరితెగించి దాడులకు తెగబడుతున్నారు. కోడ్ ఉల్లంఘనలపై సీ-విజిల్ యాప్లో చిత్రాలను అప్లోడ్ చేసి సామాన్య పౌరులు సైతం ఫిర్యాదు చేయాలంటూ ఎన్నికల సంఘం ప్రచారం చేస్తోంది.
కడప తెదేపా అభ్యర్థి మాధవి కారుపై దాడి
సిద్ధం పోస్టర్లను ఫొటో తీసినందుకు గూండాగిరీ
సీ-విజిల్ యాప్లో అప్లోడ్ చేశారని దౌర్జన్యం
కారు కదలకుండా ఇరువైపులా అడ్డంగా వాహనాలు
దాడి చేసిన వంశీ అనుచరులకే పోలీసుల వత్తాసు
ఈనాడు - అమరావతి, న్యూస్టుడే-గన్నవరం గ్రామీణం: రాష్ట్రంలో వైకాపా నేతలు బరితెగించి దాడులకు తెగబడుతున్నారు. కోడ్ ఉల్లంఘనలపై సీ-విజిల్ యాప్లో చిత్రాలను అప్లోడ్ చేసి సామాన్య పౌరులు సైతం ఫిర్యాదు చేయాలంటూ ఎన్నికల సంఘం ప్రచారం చేస్తోంది. కానీ తెదేపా అభ్యర్థులు సీ-విజిల్ యాప్లో ఫిర్యాదులు చేస్తుంటే, వారిపై వైకాపా వర్గీయులు దాడులకు దిగుతున్నారు. తెదేపా కడప అసెంబ్లీ అభ్యర్థి రెడ్డెప్పగారి మాధవికి ఇలాంటి పరిస్థితే కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఎదురైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా గన్నవరంలోని చాలా ప్రాంతాల్లో వైకాపా జెండాలు, సిద్ధం పోస్టర్లు, జెండా దిమ్మెలకు రంగులను తొలగించకుండా అలాగే ఉంచారు.
గన్నవరం మీదుగా కారులో శుక్రవారం వెళుతున్న మాధవి వాటిని చూసి.. ఫొటోలు తీసి, సీ-విజిల్ యాప్లో అప్లోడ్ చేసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేశారు. దీన్ని గమనించిన వంశీ అనుచరులు 50 మందికి పైగా ఒకేసారి కారును చుట్టుముట్టారు. కారుకు అడ్డంగా ట్రక్కులు, ద్విచక్ర వాహనాలను పెట్టి, చక్రాల కింద సిమెంట్ ఇటుకలను పడేసి.. నడిరోడ్డుపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. కారు అద్దాలను చేతులతో కొడుతూ.. అరుస్తూ.. తిడుతూ.. భయానక వాతావరణం సృష్టించారు. వంశీ ముఖ్య అనుచరులు ఓలుపల్లి రంగా, మేచినేని బాబు, ఆర్వీఆర్, చిరంజీవి తదితరులు కారు చుట్టూ చేరి బయటకు రావాలంటూ మాధవిని బెదిరించారు. దీంతో కారులో ఉన్న మాధవి, ఆమె కుమార్తె శ్రియాంక భయభ్రాంతులకు గురయ్యారు. 100కు ఫోన్చేసి సమాచారం ఇచ్చారు. కాసేపటికి గన్నవరం పోలీసులు వచ్చారు. కానీ.. వచ్చీ రావడంతోనే మాధవి, ఆమె కుమార్తెదే తప్పన్నట్టు.. దాడిచేసిన వాళ్లకే మద్దతుగా నిలిచారు.
వైకాపా కార్యాలయాన్ని ఫొటోలు తీస్తున్నట్లు తమకు ఫిర్యాదు వచ్చిందని, తమతో రావాలంటూ మాధవిని కారులోంచి దించి పోలీసుస్టేషన్కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దాడి చేసినవాళ్లను వదిలేసి తనను స్టేషన్కు తీసుకెళ్లడం ఏంటని మాధవి ప్రశ్నించినా పోలీసులు కనీసం వినేందుకూ ఆసక్తి చూపించలేదు. తమ కారుకు అడ్డంగా పెట్టిన వాహనాలైనా తీయించాలని మాధవి అడిగినా.. ఎలాంటి స్పందనా లేదు. సమాచారం అందుకున్న తెదేపా గన్నవరం ఇన్ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు, ఆయన అనుచరులు ఘటనా స్థలానికి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఇరువర్గాలను సముదాయించి ఘటనా స్థలం నుంచి పంపేశారు.
డీజీపీ, ఈసీ సమాధానం చెప్పాలి
‘‘గన్నవరంలో ప్రజాస్వామ్యం లేదనడానికి ఈ ఘటన ప్రత్యక్ష నిదర్శనం. దాడిచేసిన వాళ్లకే ఇక్కడి పోలీసులు వత్తాసు పలుకుతూ బాధితులపైనే కేసులు పెడుతున్నారు. పోలీసులు వైకాపా కార్యకర్తల్లా మారిపోయారు. కోడ్ ఉల్లంఘనపై సీ-విజిల్ యాప్లో ఫిర్యాదు చేసినందుకే మాధవిపై దాడిచేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అధికార వైకాపా నిత్యం అరాచకాలకు పాల్పడుతూనే ఉంది. ఈ ఘటనపై డీజీపీ, ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి. జగన్ ప్రభుత్వానికి మరో 40 రోజులే గడువు ఉంది. అరాచకవాదులకు మద్దతుగా నిలుస్తున్న ఏ పోలీసునూ విడిచిపెట్టేదే లేదు.’’
యార్లగడ్డ వెంకట్రావు, గన్నవరం అసెంబ్లీ తెదేపా అభ్యర్థి
ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించాలి
‘‘ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి వారం అవుతున్నా ఇప్పటికీ వైకాపా రంగులు, సిద్ధం పోస్టర్లను తొలగించకపోవడం దారుణం. ఈ పోస్టర్లను ఫొటోలు తీసి సీ-విజిల్ యాప్లో అప్లోడ్ చేశా. అసలు ఎన్నికల కోడ్ అమలులో ఉందనే స్పృహే ఇక్కడ కనిపించడం లేదు. సామాన్య పౌరులు ఎవరైనా వీటిని ఫొటోలు తీసి ఈసీకి ఫిర్యాదు చేయొచ్చు. నేనూ అదే చేశా. కానీ ఇలా దాడి చేసి.. కారు కదలకుండా రాళ్లు, వాహనాలు అడ్డం పెట్టి నడిరోడ్డుపై ఆపేసి భయానక వాతావరణం సృష్టించడమేంటి? ఇద్దరు మహిళలు కారులో ఉండగా ఇంత దారుణంగా దాడి చేసి బెదిరింపులకు దిగడం అత్యంత హేయం. పట్టపగలు మాకే ఈ పరిస్థితి ఎదురైతే అరాచక వైకాపా నుంచి సామాన్య పౌరులకు ఈసీ ఎలా రక్షణ కల్పిస్తుందో చెప్పాలి. ఈ ఘటనను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించాలి. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసులు సైతం దాడిచేసిన అధికార పార్టీకే వత్తాసు పలుకుతున్నారు. వారి తీరు అత్యంత దారుణం.’’
రెడ్డప్పగారి మాధవి, కడప అసెంబ్లీ తెదేపా అభ్యర్థి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?