విద్యుత్పై అదనపు లోడ్ ఛార్జీల భారం
ఆదాయ మార్గాలను అన్వేషించి ప్రజలను పీల్చి పిప్పిచేయడం జగన్ ప్రభుత్వానికి రివాజుగా మారింది. వడ్డీ వ్యాపారుల మాదిరి విద్యుత్ వినియోగదారులపై ఛార్జీల భారాన్ని మోపుతోంది.
నెలాఖరులోగా వసూలుకు ఒత్తిళ్లు
కొన్ని చోట్ల సిబ్బంది నోటీసులు.. మరికొందరికి మౌఖిక ఆదేశాలు
ఈనాడు, అమరావతి: ఆదాయ మార్గాలను అన్వేషించి ప్రజలను పీల్చి పిప్పిచేయడం జగన్ ప్రభుత్వానికి రివాజుగా మారింది. వడ్డీ వ్యాపారుల మాదిరి విద్యుత్ వినియోగదారులపై ఛార్జీల భారాన్ని మోపుతోంది. అదనపు లోడ్ ఛార్జీల పేరుతో సామాన్యులను దండుకునేందుకు వ్యూహం పన్నుతోంది. ఈ ఛార్జీలను చెల్లించాలంటూ నోటీసులిస్తోంది. కొన్నిచోట్ల విద్యుత్ సిబ్బంది ఈ మేరకు మౌఖిక ఆదేశాలనిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తామంటూ బెదిరిస్తున్నారు. సామాన్యులు అప్పోసప్పో తెచ్చి డబ్బులు కట్టక తప్పని పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. రాష్ట్రంలోని మూడు డిస్కంల పరిధిలోనూ కిలోవాట్ అదనపు లోడ్గా ఉన్నా.. రూ.2,284 వరకు భారం పడుతోంది. ప్రభుత్వం ఇప్పటికే ట్రూఅప్, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో వేసిన భారాలను మోయడమే సామాన్యులకు కష్టమవుతోంది. పదుల యూనిట్ల విద్యుత్ వినియోగానికి రూ.వేలల్లో వస్తున్న బిల్లులు కట్టలేక అవస్థలు పడుతున్నారు.
ఒకరికి నోటీసు ఇస్తే.. వంద మందికి ఇచ్చినట్లేనా?
విజయవాడ పాయకపురానికి చెందిన సర్వీసు నంబరు 6425253227151 వినియోగదారుడికి ఉన్నట్టుండి విద్యుత్ సిబ్బంది నోటీసునిచ్చారు. గతేడాది అక్టోబరు 18న తనిఖీ చేశామని, అనుమతించిన లోడ్కంటే ఎక్కువగా వాడినట్లు గుర్తించామని నోటీసులో పేర్కొన్నారు. వాడుతున్న 2 కిలోవాట్ల అదనపు కాంట్రాక్టెడ్ లోడ్కు సర్వీసు లైన్ ఛార్జీలు, డెవలప్మెంట్ ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.4,568 చెల్లించాలన్నది నోటీసు సారాంశం. నెలలో నిర్దేశిత మొత్తాన్ని చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తామని నోటీసులో స్పష్టం చేశారు. ఈ సబ్స్టేషన్ పరిధిలోని సుమారు 160 మంది వాడకందారులూ అదనపు లోడ్ఛార్జీలను చెల్లించాలంటూ సిబ్బంది మౌఖికంగా ఆదేశిస్తున్నారు. నోటీసులు ఇవ్వలేదు. 1, 2 రోజుల్లో ఆ మొత్తాన్ని చెల్లించకుంటే సరఫరా నిలిపేస్తామని హెచ్చరిస్తున్నారు.
నెల విద్యుత్ బిల్లు కింద రూ.700 (అన్ని అదనపు ఛార్జీలు కలిపి) చెల్లింపు కనీస మొత్తంగా మారింది. దీనికి కిలోవాట్ అదనపు లోడ్ఛార్జీలు కలిపినా రూ.2,984 కట్టాల్సి వస్తోంది. ఇంత మొత్తాన్ని ఒకేసారి చెల్లించడం దిగువ, మధ్యతరగతి వర్గాలకు సాధ్యమేనా? ఇవేమీ పట్టించుకోకుండా ఏదో ఒక మార్గంలో అదనపు ఆదాయాన్ని రాబట్టుకోవడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఎప్పుడో అక్టోబరులో తనిఖీ చేసి 4నెలలపాటు ఊరుకుని ఇప్పుడు హడావుడి చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
ఏంటీ కాంట్రాక్టెడ్ లోడ్?
కొత్త కనెక్షన్ తీసుకునేటప్పుడు ఎంత లోడ్ వాడతామనే వివరాలను దరఖాస్తులో ప్రస్తావించాలి. దీన్ని కాంట్రాక్టెడ్ లోడ్ కింద పరిగణించి తదనుగుణంగా డెవలప్మెంట్ ఛార్జీలను డిస్కంలు తీసుకుంటాయి. గతంలో ఒక చిన్న ఇంటికి కిలోవాట్ సామర్థ్యంతో డిస్కంలు కనెక్షన్లు ఇచ్చేవి. ఇప్పుడు కనీస కాంట్రాక్టెడ్ లోడ్ను రెండు కిలోవాట్లు చేసి ఆ స్థాయిలో వినియోగం లేకున్నా కిలోవాట్కు రూ.2 వేల చొప్పున డిపాజిట్ మొత్తాన్ని వసూలు చేస్తున్నాయి. దీంతో కొత్త కనెక్షన్ దరఖాస్తుకు రూ.5 వేలు తప్పనిసరిగా కావాల్సి వస్తోంది. ఇలా ఆదాయ సముపార్జనకు అలవాటు పడిన విద్యుత్ సంస్థలు కాంట్రాక్టెడ్ లోడ్కంటే కనెక్టెడ్ లోడ్ ఎక్కువగా ఉందంటూ కొత్త పల్లవి అందుకుంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ