ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు.
జగన్ బటన్ నొక్కుడులో తిరకాసు
కోడ్ కంటే ముందు చెల్లించినట్లు పోజు
ఇప్పటికీ కొనసాగుతున్న చెల్లింపులు ఆర్థికశాఖ అధికారుల వత్తాసు
ఈనాడు, అమరావతి: ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. మహా అయితే ఒకటి, రెండు రోజులు పట్టవచ్చు. రోజుల తరబడి రాకుండా ఉండవు కదా! మరి సీఎం జగన్ ఎన్నో పథకాలకు హడావుడిగా బటన్ నొక్కితే ఇప్పటికీ ఆ నిధులు లబ్ధిదారులకు చేరలేదు. ఎందుకు? ఖజానాలో నిధులు లేకపోయినా బటన్ నొక్కి ఆ మొత్తాలు బదిలీ చేసేశారు. సామాజిక పింఛన్లు మినహా మిగిలిన పథకాల సొమ్ములన్నీ ఏడాదికి ఒకసారి ఇచ్చేవి. నిధులు ఉన్నప్పుడే వాటిని లబ్ధిదారులకు ఇవ్వచ్చు. అలాంటిది మార్చిలో ఎన్నికల కోడ్ రావడానికి కొద్దిరోజుల ముందు ఎందుకు బటన్ నొక్కారు? కోడ్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఆ సొమ్ములు లబ్ధిదారులకు చేరలేదు? ఇందులో అచ్చమైన ఎన్నికల తిరకాసు ఉంది. ఎన్నికలు సమీపించిన తర్వాత ఆ సొమ్ము లబ్ధిదారులకు చేరితే.. ఆ ప్రభావం ఓటర్లపై ఉంటుందనే స్కెచ్ ఇందులో ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. కోడ్ రాకముందే బటన్ నొక్కి, కోడ్ వచ్చిన తర్వాత ఆ మొత్తాలు లబ్ధిదారులకు చేరేలా వైకాపా ప్రభుత్వం గీసిన ప్రణాళికకు ఆర్థికశాఖ అధికారులు సహకరిస్తున్నారు. చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం, విద్యాదీవెన, పెట్టుబడి రాయితీ అందించేందుకు ఎన్నికల కోడ్ రాకముందే సీఎం జగన్ బటన్ నొక్కినా ఇందులో చెల్లింపులు అందరికీ పూర్తికాలేదు. పోలింగు వరకు ఈ నిధులిస్తూ ఎన్నికలపై ప్రభావం పడేలా ఆర్థికశాఖ అధికారులు ఎలా సహకరిస్తున్నారని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆర్థికశాఖ కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ పర్యవేక్షిస్తున్నారు. దీనిపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల వేళ రూ.వేల కోట్ల పందేరం
ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో రూ.వేల కోట్ల పందేరానికి తెరతీసింది.
- చేయూత పథకం కింద సుమారు రూ.5,060 కోట్లు చెల్లించేలా మార్చి 6న సీఎం జగన్ బటన్ నొక్కారు. ఇప్పటికీ ఆ సొమ్ములు అందరికీ జమకాలేదు. సగం మందికే జమ అయినట్లు తెలిసింది.
- ఆసరా పథకం కింద రూ.4,600 కోట్లు ఇవ్వాలి. చాలామందికి ఇప్పటికీ నిధులు ఖాతాలకు చేరుతూనే ఉన్నాయి.
- విద్యాదీవెన పథకం కింద ఫిబ్రవరిలోనే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల కోసం రూ.708 కోట్లకు బటన్ నొక్కారు. కానీ సగం మందికే వారి ఖాతాల్లో చేరాయి. దాదాపు రూ.350 కోట్లకు పైగా చెల్లింపులు ఇంకా పెండింగులోనే ఉన్నాయి.
- ఈబీసీ నేస్తం కింద రూ.629 కోట్లు చెల్లించాలి. అందులోనూ కొన్నే బటన్ నొక్కిన తర్వాత లబ్ధిదారులకు అందాయి.
- తుపానుతో నష్టపోయిన రైతులకు సంక్రాంతికే పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం జగన్ ఎప్పుడో ప్రకటించారు. పంటరుణాలపై సున్నా వడ్డీ 2023 నవంబరులోనే ఇస్తామని చెప్పారు. సున్నా వడ్డీ, రైతు భరోసా, పెట్టుబడి సాయం కింద రూ.2,600 కోట్లు ఇస్తున్నట్లు ఫిబ్రవరి 28, మార్చి 6 తేదీల్లో ప్రకటించినా చాలామందికి ఇంతవరకు ఆ సొమ్ము దక్కలేదు.
- పెండింగులో ఉన్న రూ.వేల కోట్లు ఏప్రిల్ నెలాఖరు వరకు ఇచ్చేలా ఆర్థికశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తే ఆ ప్రభావం ఎన్నికల్లో అధికారపార్టీకి అనుచిత లబ్ధి కలిగించడానికే అన్న విమర్శలు రేగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం