అంకెలు పెంచి.. ఆశలు తుంచారు!
ముందుచూపు మందగించిన జగన్ ఏలుబడిలో పోలవరం పనులు అటకెక్కాయి! పోనీ నిర్వాసితులకు పరిహారమైనా.. అందిందా అంటే ఊహూ.. అదీ లేదు!! ముంపును కళ్లారా చూశానన్నారు... ముప్పు నుంచి అమాయకులను రక్షించాల్సిందేనన్నారు... ఇస్తున్న ప్యాకేజీని పెంచాలన్నారు... ఇచ్చిన పరిహారం సరిపోదన్నారు... బాధితులే తొలి లబ్ధిదారులు కావాలన్నారు.
పోలవరం నిర్వాసితులకిచ్చిన హామీలేవీ నెరవేర్చని జగన్
రూ.10 లక్షల ప్యాకేజీ ఇవ్వలేదు
పాత భూములకు కొత్త ధరా లేదు
12 వేల కుటుంబాలకే తరలింపు పరిమితం
వరదల ముంపులో పిల్లాపాపల విలవిల
నాటి మాటలను నమ్మినందుకు నిలువునా మోసం
ముందుచూపు మందగించిన జగన్ ఏలుబడిలో పోలవరం పనులు అటకెక్కాయి!
పోనీ నిర్వాసితులకు పరిహారమైనా.. అందిందా అంటే ఊహూ.. అదీ లేదు!!
ముంపును కళ్లారా చూశానన్నారు... ముప్పు నుంచి అమాయకులను రక్షించాల్సిందేనన్నారు...
ఇస్తున్న ప్యాకేజీని పెంచాలన్నారు... ఇచ్చిన పరిహారం సరిపోదన్నారు... బాధితులే తొలి లబ్ధిదారులు కావాలన్నారు...
తనను గెలిపిస్తే అన్నీ చేస్తానన్నారు... ఆశలు కల్పించి పోల‘వరం’ పొందారు... ఆనక బాధితులను గోదావరికే వదిలేశారు...
తమ రాష్ట్ర బాగుకు, దేశ ఉన్నతికి సొంత ఊళ్లను, పొలాలను, ఉపాధిని, సంస్కృతిని త్యాగం చేసిన ఆ అమాయక నిర్వాసితులు ఇప్పటికీ తల్లడిల్లుతున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కోసం తమ సర్వస్వాన్ని ధారబోస్తే జగన్ వచ్చాక వారి జీవితాలు అల్లకల్లోలం అయ్యాయి. మాట ఇస్తే మడమ తిప్పబోనని ఆయన తరచూ చెబుతుంటారు. ఒక్కసారి పోలవరం నిర్వాసితుల్లో ఎవరిని కదిపినా... జగన్ చెబుతున్న విశ్వసనీయత ఆ ప్రాజెక్టులోని గైడ్బండ్లాగే కుంగిపోయినట్లు అర్థమవుతుంది. ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా నిర్వాసితులకు ఆయన ఎన్నో హామీలు ఇచ్చారు. ఐదేళ్లు అధికారంలో కొనసాగినా వాటిలో ఒక్కటీ నెరవేర్చలేదు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో మొత్తం 1,06,006 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. ఇప్పటికి 12 వేల కుటుంబాలను మాత్రమే తరలించారు. ఒకవైపు ఎగువ కాఫర్ డ్యాంను 42 మీటర్ల ఎత్తుకుపైగా నిర్మించారు. దీంతో గోదావరి వరదల్లో ఆ ఊళ్లన్నీ జలదిగ్బంధంలో చిక్కుకుని నిర్వాసితులు అల్లాడుతున్నారు.
వరద బాధలు మరింత పెరిగాయి...
పోలవరం నిర్వాసితులు ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నారు. ఏటా వచ్చే వరదలలో వారి బతుకులు ఛిద్రమవుతున్నాయి. పునరావాసం చూపాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించింది. తెదేపా హయాంలో 2017-18లో భూసేకరణ పూర్తి చేశారు. ఎకరాకు రూ.10.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించారు. అప్పట్లో నిర్వాసితులు కొన్ని మార్పులు కోరుకున్నారు. ప్యాకేజీ మొత్తం ఒకేసారి ఇవ్వాలని, పునరావాసంతోపాటు మిగిలినవన్నీ తక్షణమే అందించాలని విన్నవించారు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ నిర్వాసితులను ఆశల పల్లకీలో ఊరేగించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నమ్మిన బాధితులు... ఆయన్ని సీఎంని చేస్తే ఏ ఒక్కటీ నెరవేర్చిన పాపాన పోలేదు. కనీసం పరిహారం ప్యాకేజీని రూ.10 లక్షలకు పెంచడం, గతంలో సేకరించిన భూములకు అదనంగా రూ.5 లక్షలను చెల్లించడం, తొలిదశలో ముంపునకు గురవుతున్న అన్ని గ్రామాలకు పునరావాసం కల్పించడం అన్న మూడు హామీలనైనా మొదట నెరవేర్చినా తమ బతుకులు మరోలా ఉండేవని వారు అంటున్నారు. మరోవైపు వరద బాధలు రెట్టింపయ్యాయి. కాఫర్డ్యాం నిర్మించి నది సహజ ప్రవాహానికి అడ్డుకట్ట వేయడంతో వర్షాకాలంలో ఎగువ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. 2022లో వచ్చిన వరదలు నిర్వాసిత మండలాల్లోని చాలా గ్రామాలను ముంచేశాయి.
తొలిదశ, మలిదశగా విభజించినా ప్రయోజనం శూన్యం
మొత్తం 348 నిర్వాసిత గ్రామాల్లో లక్షకు పైగా కుటుంబాలకు ఒకేసారి పునరావాసం కల్పించకుండా రెండు దశలుగా విడగొట్టారు. మొత్తం 45.72 కాంటూరు పరిధి వరకు వరద ముంచెత్తుతుందని అంచనా వేశారు.పోలవరంలో పూర్తి స్థాయిలో నీటిని నిలువచేస్తే 1,06,006 కుటుంబాలు నిర్వాసితులవుతాయి. ఇంతవరకు అధికారిక లెక్కల ప్రకారం 12 వేల కుటుంబాలకు పునరావాసం కల్పించినట్లు చెబుతున్నా... వాస్తవంగా 6,351 కుటుంబాలకే అది దక్కింది. తొలిదశలో 20,946 కుటుంబాలను తరలించాల్సి ఉంటుందని మొదట లెక్కించారు. లైడార్ సర్వే తర్వాత మరో 36 గ్రామాల్లోని 16,642 కుటుంబాలు కూడా తొలిదశలోనే పునరావాసం కల్పించాలని తేల్చారు. అందుకు అనుగుణంగా ఇప్పటికీ పునరావాసానికి అవసరమైన చర్యలు తీసుకోలేదు. ప్యాకేజీ కూడా ఇవ్వలేదు.
నిర్వాసితుల జీవితాలతో ఆటలు
హామీ-1:
సర్వం త్యాగం చేస్తున్న నిర్వాసితుల కళ్లల్లో ఆనందం చూడాలి. దేవుడి దయ, మీ చల్లని దీవెనలతో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే, ప్రస్తుతం ఇస్తున్న వ్యక్తిగత ప్యాకేజీ రూ.6.36 లక్షలను రూ.10 లక్షలకు పెంచుతాం.
2019 మార్చి 19న కొయ్యలగూడెం ఎన్నికల సభలో జగన్
ఉత్తుత్తి ఉత్తర్వులు: ఇందుకు సంబంధించి 2021 జూన్ 30న ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతవరకు ఒక్క నిర్వాసిత కుటుంబానికైనా రూ.10 లక్షలు ఇవ్వలేదు. కొత్త ఉత్తర్వులు వచ్చాక పోలవరం, దేవీపట్నం మండలాలకు చెందిన తొలి దశ నిర్వాసిత కుటుంబాలకు వ్యక్తిగత ప్యాకేజీని వారి ఖాతాల్లో జమ చేసినా... వారికి దక్కింది రూ.6.36 లక్షలు మాత్రమే. అంటే ఉత్తుత్తి ఉత్తర్వులిచ్చి, హామీని అటకెక్కించారు.
హామీ-2:
ఈ ప్రాజెక్టు కోసం 2007, 2010 సంవత్సరాల్లో జరిపిన భూసేకరణలో ఎకరాకు రూ.1.15 లక్షల నుంచి రూ.1.40 లక్షలు మాత్రమే ఇచ్చారు. ఇది చాలా తక్కువ. ప్రస్తుతం ఎకరాకు రూ.10.50 లక్షలు ఇస్తున్నారు. అది కూడా తక్కువే. పట్టిసీమలో ఎకరానికి రూ.20 లక్షలు ఇచ్చి... దాని పక్కనే ఉన్న పోలవరం ముంపు రైతులకు రూ.10.50 లక్షలే ఇవ్వడం అన్యాయం. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2007, 2010 భూసేకరణలో భూములను కోల్పోయిన వారందరికీ ఎకరానికి మరో రూ.5 లక్షలు అదనంగా ఇస్తాం.
2019 మార్చి 31న కుక్కునూరు బహిరంగ సభలో జగన్
ఇంకా అందని అ‘ధనం’: ఈ హామీ ఇంతవరకు నెరవేరలేదు. ఒక్క రైతుకు కూడా అదనంగా రూ.5 లక్షలు అందించలేదు.
హామీ-3:
వరదలతో నిర్వాసితులు పడుతున్న ఇబ్బందులను కళ్లారా చూశా. ఇంకా వారిని ఇక్కడే ఉంచితే మనం తీరని అన్యాయం చేసినట్లే అవుతుంది. 2022 సెప్టెంబరు నెలాఖరులోగా 41.15 కాంటూరు పరిధిలోని 107 గ్రామాలను ఖాళీ చేయించి, వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం అందాల్సిన అన్ని రకాల పరిహారాలిచ్చి, ఇళ్లు కేటాయించి, పునరావాస కాలనీలకు తరలిస్తాం.
2022 జూలై 28న వరదపీడిత మండలాలైన వేలేరుపాడు, చింతూరులలో పర్యటించాక జగన్ స్పందన
నిజంగా అన్యాయమే చేశారు: ఆయన చెప్పిన గడువు దాటి 17 నెలలు పూర్తయింది. ఆ హామీ తర్వాత 2023 సంవత్సరంలోనూ గోదావరికి తీవ్ర వరదలొచ్చాయి. ఇప్పటికీ 41.15 కాంటూరు పరిధిలోని నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించలేదు.
హామీ-4:
పోలవరం ప్రాజెక్టుతో 45.72 కాంటూరు పరిధిలో ముంపులో చిక్కుకునే గ్రామాలు కూడా ఈ వరదల్లో మునిగాయి. ప్రస్తుతం 41.15 కాంటూరు పరిధిలోని గ్రామాలకే మనం పరిహారమిచ్చే అవకాశముంది. ఇటీవల లైడార్ సర్వే చేయించాం. అది విశ్లేషణ దశలో ఉంది. దాని ప్రకారం తొలిదశలో ఎన్ని గ్రామాలకు వరద ముంపు ఏర్పడుతుందని తేలుతుందో అన్ని గ్రామాలనూ పరిహారం జాబితాలో చేరుస్తాం. ఈ నిర్వాసితులకు కూడా 2022 సెప్టెంబరు నెలాఖరుకల్లా పరిహారం ఇచ్చి పునరావాసం కల్పిస్తాం.
2022 జూలై 28న వరద ప్రాంతాల పరిశీలనకు వచ్చినప్పుడు వేలేరుపాడు మండలం కన్నాయిగుట్టలో సీఎం జగన్
అమలు తీరు: లైడార్ సర్వే ఆధారంగా మరో 48 గ్రామాలను తొలిదశ పునరావాసం కల్పించే జాబితాలో చేర్చారు. అంతేతప్ప ప్యాకేజీ ఇవ్వలేదు. తరలింపూ జరగలేదు.
ఈనాడు, అమరావతి, - కుక్కునూరు, న్యూస్టుడే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం