జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత!
జగన్ అనే నేను...
ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత!
భారీ పెట్టుబడితో రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ ఏర్పాటైతే- చదువుకున్న పిల్లలకు వేలల్లో ఉద్యోగాలొస్తాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్నాచితకా వ్యాపారాలన్నీ పెరిగి కొన్ని లక్షల జీవితాలు బాగుపడతాయి. పన్నుల రాబడి అధికమై రాష్ట్రానికి ఆదాయం బాగా వస్తుంది. అభివృద్ధి వేగవంతమవుతుంది. కడుపు కొట్టడమే తప్ప కడుపు నింపడం తెలియని జగన్మోహన్రెడ్డి మూలంగా ఆ బంగారు అవకాశాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ పోగొట్టుకోవాల్సి వచ్చింది. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అవకాశవాదం, అధికార దాహం, అరాచకత్వాలే పంచ ప్రాణాలైన జగన్- పెద్ద పరిశ్రమలను తీసుకురాలేదు. చిన్న పరిశ్రమలను బతకనివ్వలేదు. గత ప్రభుత్వ కృషితో ఏపీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన పారిశ్రామికవేత్తలనూ జగన్ బయటికి తరిమేశారు. పారిశ్రామిక రాష్ట్రంగా, ఉద్యోగ ఉపాధి అవకాశాల స్వర్గంగా ఎదగాల్సిన ఏపీని ఆయన వైకాపా రాక్షసులకు రాసిచ్చేశారు!
పరిశ్రమలపై పగ
మాయావి రావణుడు ముని వేషం వేశాడు. ‘భవతీ భిక్షాందేహి’ అన్నాడు. నమ్మిన సీతమ్మను అపహరించాడు. మోసకారి జగన్ కూడా అచ్చం అలాగే ప్రజానాయకుడి ముసుగు వేసుకున్నారు. ‘‘మన పిల్లలకు మన దగ్గరే ఉద్యోగాలు’’ అని ఊరించి ఓట్లభిక్ష అడిగారు. నమ్మి గెలిపించిన ప్రజలను నట్టేట ముంచారు. నలుగురికి అన్నం పెట్టే పరిశ్రమలపై పగబట్టినట్లుగా ప్రవర్తించారు జగన్. పారిశ్రామిక ప్రగతిలో మిగిలిన పెద్ద రాష్ట్రాలకంటే ఏపీ చాలా చాలా వెనకపడిపోయేలా చేశారు. దీనివల్ల నష్టం జరిగిందెవరికి? అక్రమాల మేడల్లో హాయిగా కులుకుతున్న జగన్కు రాష్ట్రం ఏమైపోయినా బాధ లేదు. కానీ, సామాన్యుల గతేంటి? సర్కారీ కొలువులు లేవు.. ఉద్యోగాలిచ్చే పరిశ్రమల్లేవు.. ఇక యువతరం ఏం చేసి బతకాలి? అమ్మానాన్నలను, బంధుమిత్రులను వదిలేసి ఎన్నాళ్లని పరాయి రాష్ట్రాలకు వలసపోవాలి? అవినీతి, అబద్ధాలే రెండు కళ్లుగా ప్రజావిద్రోహ రాజకీయాలు చేసే జగన్కు ఇవేమీ పట్టవు. జనంకోసం అది చేశా, ఇది చేస్తానని సొంత బాకా ఊదుకోవడమే కానీ, చెప్పిందేదీ చేసిన పాపాన పోలేదాయన. ‘‘రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమ పెట్టాలనుకుంటే ఒకే ఒక్క దరఖాస్తు నింపితే సరిపోతుంది. నా కార్యాలయమే దగ్గరుండి అన్ని పనులూ చూసుకుంటుంది. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునేవారికి ఎలాంటి అడ్డంకులు ఉండబోవు’’ అని సీఎం అయిన కొత్తలో జగన్ ఒక రంగుల సినిమా చూపించారు. అదే చేతల్లోకి వచ్చేసరికి- పారిశ్రామికవేత్తలను నిలువు దోపిడీ చేసే గజదొంగల రాజ్యాన్ని సృష్టించారు. దానివల్ల రాష్ట్రానికి రావాల్సిన రూ.1.21 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాకుండా పోయాయి. దాంతో రెండు లక్షలకు పైగా ఉద్యోగావకాశాలూ మనకు దక్కకుండా పోయాయి. జాదూగర్ జగన్ సీఎంగా వెలగబెట్టింది ఏంటంటే- ఖాజానాను కళకళలాడించే పారిశ్రామిక దీపాలను ఒకచేత్తో ఆర్పేస్తూ, ఇంకో చేత్తో అప్పుల ముష్టి ఎత్తడం!
అక్కచెల్లెమ్మల పొట్టకొట్టిన జగన్
‘జనాన్ని పట్టిపీడించడం నాకు తెలియదు’ అంటూ వెనకటికి ఒక కొరివి దెయ్యం సాధుజీవిలా మొహం పెట్టిందట! దానికి ఏమాత్రం తక్కువ కాదన్నట్లు మాట్లాడే జగన్- ‘రాజకీయ రంగస్థల నట పాషాండ’ బిరుదుకు అర్హులు. ‘‘పైనుంచి కిందిస్థాయి వరకు పారిశ్రామిక వేత్తలను లంచాలు అడిగేవారు ఉండరని చెబుతున్నాను’’ అని సీఎంగా జగన్ వీరలెవల్లో ప్రకటిం చారు. పైన ఆయన అలా అపరబుద్ధుడిలా నటిస్తుంటే- కిందిస్థాయిలో జగన్ సామంతులేమో అంతర్జాతీయ కంపెనీలనూ వెంటాడి వేధించారు. కోట్ల రూపాయల కప్పం కడితే తప్ప పనిచేసుకోనివ్వమంటూ పారిశ్రామిక సంస్థల మెడపై కత్తిపెట్టారు. ప్రసిద్ధ దుస్తుల బ్రాండ్ ‘జాకీ’ తయారీ సంస్థ పేజ్ ఇండస్ట్రీస్ను ఏపీకి తెచ్చేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వం చాలా శ్రమించింది. ఫలితంగా ఏడాదికి 3.24 కోట్ల దుస్తులను తయారుచేసే భారీ కర్మాగారం, గిడ్డంగిని అనంతపురం జిల్లా రాప్తాడులో ఏర్పాటుచేసేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. దానికి భూమి కేటాయింపు, అనుమతుల మంజూరు అన్నీ తెదేపా హయాంలోనే పూర్తయ్యాయి. నిర్మాణ పనులు ప్రారంభ సమయంలో ప్రభుత్వం మారి జగన్ సీఎం అయ్యారు. ఆ వెంటనే ఆయన బంటు వంటి ఒక ప్రజాప్రతినిధి ఆ కంపెనీ మీద పడ్డారు. ఇంకేముంది.. జగన్ పార్టీ సొరచేపను మేపలేక ప్రాజెక్టును రద్దుచేసుకుని రాష్ట్రంలోంచి ‘జాకీ’ వెళ్లిపోయింది. ఆ దుస్తుల కర్మాగారం ఏర్పాటై ఉంటే- వేలాది గ్రామీణ మహిళలకు ఉపాధి లభించేది. ఆ సువర్ణావకాశాన్ని దూరంచేసి అక్కచెల్లెమ్మల పొట్టకొట్టింది జగన్ పార్టీయే. రూ.అయిదు వేల కోట్లతో అనుబంధ యూనిట్ల ఏర్పాటుకు సిద్ధమైన ‘కియా’ కార్ల కంపెనీనీ వదిలిపెట్టలేదు వైకాపా అక్రమార్కులు. వారి బీభత్స చేష్ఠలకు జడిసి విస్తరణ ఆలోచననే విరమించుకుంది ఆ సంస్థ. లులు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ట్రైటాన్, బెస్ట్ బ్యాటరీ, రిలయన్స్, ఏషియన్ పల్ప్ సంస్థలూ రాష్ట్రానికి దండం పెట్టి తిరిగి చూడకుండా వెళ్లిపోవడానికి కారణమూ జగన్ పీడనే.
వైకాపా అధినేత వికృత మనస్తత్వం
చిత్తూరు జిల్లాలోని ‘అమరరాజా’ ఫ్యాక్టరీలు ప్రత్యక్షంగా పరోక్షంగా 70వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. బ్యాటరీల తయారీలో అంతర్జాతీయ స్థాయిలో పేరున్న కంపెనీ అది. అలాంటి సంస్థ... రూ. 9,500 కోట్ల పెట్టుబడితో కొత్తగా లిథియం అయాన్ బ్యాటరీ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలనుకుంది. అదే జరిగి ఉంటే వేలసంఖ్యలో కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చేవి. జనం బాగుపడటం ఇష్టం లేని జగన్- ‘అమరరాజా’పై అతిదారుణంగా కత్తిగట్టారు. తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందినది అనే ఏకైక కారణంతో కాలుష్య నియంత్రణ పేరిట ఆ కంపెనీని చెండుకుతిన్నారు. దాంతో ఏపీలో ఏర్పాటుకావాల్సిన భారీ పరిశ్రమ తెలంగాణకు తరలిపోయింది. రాష్ట్రం మట్టికొట్టుకుపోయినా పర్లేదు, తన కక్ష తీరితే చాలనుకునే వికృత మనస్తత్వం జగన్ది. ‘అమరరాజా’కు ఎదురైన చేదు అనుభవమే దానికి తిరుగులేని తార్కాణం!
ప్రగతి విఘాతకుడు
తాను పట్టిన కుందేలుకు మూడు కాళ్లు కాదు, అసలు కాళ్లే లేవని వాదించే మూర్ఖత్వం జగన్ది. తన మాటను కాదన్నవారిని కాల్చుకుతినే పైశాచికత్వమూ ఆయనలో నిండుగా ఉంది. అలాంటి వ్యక్తి అధికారంలో ఉన్న రాష్ట్రంవైపు తొంగి చూడటానికి కూడా పెట్టుబడిదారులు ఇష్టపడరు. పైపెచ్చు తెదేపాపై పగతో పాత ఒప్పందాలను జగన్ తిరగదోడారు. దానివల్ల దేశంలో పెట్టుబడుల వాతావరణం దెబ్బతింటుందని కేంద్రం ఆందోళన వ్యక్తంచేసింది. జగన్ సర్కారు నిర్ణయాల వంటివాటితో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారని పారిశ్రామికవేత్తలూ హెచ్చరించారు. అయితేనేమి, జగమొండి జగన్ తాను అనుకున్నదే చేశారు. ఏపీలో పెట్టుబడులకు రక్షణ ఉంటుందన్న నమ్మకాన్ని ఆయన చంపేశారు. దానివల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ దిగనాసిల్లిపోయింది. 2016-19లో ఏపీకి సుమారు రూ.50వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐలు) వచ్చాయి. విధ్వంసకర ఎజెండాతో జగన్ సీఎం అయ్యాక ఏపీ పరిస్థితి తిరగబడింది. 2019 అక్టోబరు నుంచి 2023 సెప్టెంబరు మధ్యలో మహారాష్ట్రకు రూ.4.72 లక్షల కోట్ల పెట్టుబడులు పోటెత్తాయి. కర్ణాటకకు రూ.3.58 లక్షల కోట్ల ఎఫ్డీఐలు వెల్లువెత్తాయి. రూ.19,370 కోట్ల పెట్టుబడుల సాధనతో ఆ జాబితాలో ఝార్ఖండ్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఆ చిన్న రాష్ట్రానికి వచ్చిన ఎఫ్డీఐల్లో కనీసం సగమైనా ఏపీకి రాలేదంటే- ఆ పాపం జగన్ అనే పీడక ప్రభువుదే. ఎఫ్డీఐల్లో రాజస్థాన్, పశ్చిమబెంగాల్ వంటి వాటికన్నా కిందకు ఏపీని లాక్కుపోయిన ప్రగతి విఘాతకుడు జగనే.
అన్ని వర్గాలనూ ముంచిన జగన్
‘నా ఎస్సీలు.. నా ఎస్టీలు..’ అంటూ జగన్ చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలే. ‘‘ఎస్సీ, ఎస్టీలను జగన్ మోసం చేశారు. మాకు చెల్లించాల్సిన రాయితీలను ఆపేశారు’’ అంటూ సీఎం సొంత జిల్లాకు చెందిన దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలే మొన్న ఫిబ్రవరిలో ఆందోళనకు దిగారు. భూముల కొనుగోళ్లకోసం బీసీ పారిశ్రామికవేత్తలకు గత ప్రభుత్వం కల్పించిన రాయితీలనూ జగన్ ఎత్తిపారేశారు. తాను దోచుకోవడం, అయినవారికి రాష్ట్రాన్ని దోచిపెట్టడమే తప్ప సీఎంగా జగన్ చేసిందేమీ లేదు. పారిశ్రామికవాడలనూ ఆయన పట్టించుకోలేదు. పరిశ్రమలకు ప్రోత్సాహక బకాయిలను చెల్లించని జగన్ దొంగ నాటకాలు- ఎన్నో కుటుంబాలను ఆకలి మంటల్లోకి నెట్టేశాయి. కొత్త పరిశ్రమలను తీసుకురాని జగన్- ఉన్నవాటి ఉసురు కూడా తీసేశారు. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బతీసి యువత భవితను ఆయన బుగ్గిచేశారు.
జగన్ పాలన.. ఓ పీడకల!
కరోనాను మించిపోయి అన్ని పరిశ్రమలనూ ముంచేసిన మహమ్మారి జగన్. ఏయే పరిశ్రమలను ఉద్ధరిస్తానని ప్రతిపక్షనేతగా ఆయన మాటిచ్చారో- అధికారంలోకి వచ్చాక వాటన్నిటి నడుములనూ విరగ్గొట్టారు. ‘‘ప్రకాశం జిల్లాలో లక్ష మందికి పైగా గ్రానైట్ యూనిట్లపై ఆధారపడి బతుకుతున్నారు. ఈ యూనిట్లను కాపాడుకుంటేనే మన పిల్లలకు ఉపాధి, ఉద్యోగాలు దొరుకుతాయి. వలసలు ఆగుతాయి’’ అని జగన్ ఉపన్యాసాలు దంచారు. కరెంట్ ఛార్జీలను తగ్గిస్తానన్నారు. అదే జగన్.. సీఎం కాగానే తనలోని పీడకుణ్ని నిద్రలేపారు. పన్నులూ కరెంట్ ఛార్జీల బాదుడును తట్టుకోలేక పోతున్నామని యజమానులు మొత్తుకునే దుస్థితిని కల్పించారు. ఎందరికో ఆసరాగా ఉన్న గ్రానైట్ యూనిట్ల తలుపులకు తాళాలుపడేలా చేశారు. ‘‘వైకాపా అధికారంలోకి రాగానే మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలన్నింటినీ తెరిపిస్తా’’నంటూ జగన్ డప్పు కొట్టుకున్నారు. కానీ, ఆయన ఏలుబడిలోనే ఉత్తరాంధ్రలో నాలుగు సహకార చక్కెర పరిశ్రమలను మూసేశారు. ఆరు చక్కెర ఫ్యాక్టరీలకు చెందిన రూ.2వేల కోట్ల ఆస్తులను ప్రైవేటుపరం చేసేందుకూ కుతంత్రాలు పన్నారు. కరెంటు ఛార్జీలను జగన్ విపరీతంగా పెంచడంతో ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమలు కుదేలయ్యాయి. వస్త్ర పరిశ్రమలూ నిర్జీవమయ్యాయి. కార్మికుల జీవితాలెన్నో రోడ్డున పడ్డాయి. పరిశ్రమలకు, వాటిని నమ్ముకున్నవారికి ప్రాణాంతకమైన జగన్ పాలన- ఎన్నటికీ మర్చిపోలేని ఒక పీడకల!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే