వ్యవస్థలను కాపాడుకుంటేనే రక్షణ
మన పిల్లలు గౌరవంగా బతకాలంటే.. వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు.
సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్
రాష్ట్రంలో ఓటుహక్కు కోసం పోరాడాల్సిన పరిస్థితి
నిమ్మగడ్డ రమేశ్కుమార్
ఈనాడు, అమరావతి: మన పిల్లలు గౌరవంగా బతకాలంటే.. వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని బతికించుకోకపోతే మన భవిష్యత్తు క్షేమంగా ఉండదనే విషయం అందరికీ అర్థం కావాలి’ అని చెప్పారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ(సీఎఫ్డీ) ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో ‘ప్రజాస్వామ్యం-ఓటుహక్కు ప్రాధాన్యం’ అన్న అంశంపై పై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ‘ఓటు, ఎన్నికలకు సంబంధించిన హక్కులన్నీ చట్టం ద్వారా సంక్రమించాయని సుప్రీంకోర్టు ఎక్కడో పొరపాటు పడింది. అందుకే రాజ్యాంగంలో దీనికి ప్రాతిపదిక లేదని చాలా తీర్పులు వచ్చాయి. అసంపూర్తిగా విశ్లేషణ, రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించకుండా చేసిన వ్యాఖ్యానాల ఫలితం అది’ అని జస్టిస్ చలమేశ్వర్ వివరించారు. ‘నేనేదైనా పార్టీ పెట్టి 400 సీట్లు సంపాదించాక.. ఎన్నికలు పెద్ద తలనొప్పిగా ఉందంటూ ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని రద్దు చేయాలనే దుర్మార్గపు ఆలోచన చేస్తే ఏమవుతుంది? దానికి రాజ్యాంగంలో ఏమీ లేదని నమ్మితే.. ఓటు హక్కు, ఎన్నికలు.. పార్లమెంటు, అసెంబ్లీ ఉండవు. చట్టానికి మించి ఏమీ లేదని మనం నమ్మితే లాజికల్గా వచ్చే కన్క్లూజన్ ఇది’ అని వివరించారు.
రాచరిక కాలంలోనూ భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉండేది
- జస్టిస్ గ్రంధి భవానీప్రసాద్, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, ఛైర్మన్, సీఎఫ్డీ
‘రాచరిక కాలంలో చక్రవర్తులు సైతం ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యం, విలువ ఇచ్చేవారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక ఎంతో కొంత వెనకేసుకునేందుకే ప్రయత్నిస్తున్నారు. ఇలాంటివారు చాలా ప్రమాదకరం. దేశంలో మారాల్సింది నాయకులు కాదు. ప్రజలే మారాలి. ప్రతి ఒక్కరినీ చైతన్య పరచాలి’ అని జస్టిస్ భవానీప్రసాద్ అన్నారు. ‘2022లో జరిగిన తిరుపతి ఉపఎన్నికల్లో 35 వేల దొంగ ఓట్లు చొరబడ్డ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇంకాస్త లోతుగా దర్యాప్తుచేసి ఉండాలి. గ్రామంలో నివసించడంలేదనే సాకుతో ఓటు హక్కు ఇవ్వడానికి అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ప్రధాని మోదీ గుజరాత్ వెళ్లి ఓటు వేస్తారు. ఆయన అక్కడ నివాసం ఉండటం లేదని ఓటు హక్కు నిరాకరిస్తే ఎలా? వారి మూలాలు జన్మించిన ప్రాంతంలో ఉంటాయి.. అక్కడ ఓటు వేయాలనుకుంటారు. ఓటు హక్కు నిరాకరించే హక్కు అధికారులకు ఎక్కడిది? నేను హైదరాబాద్ నుంచి నా స్వగ్రామం దుగ్గిరాలలో ఓటు కోసం నానా వ్యయప్రయాసలకు లోనై పోరాడాల్సి వచ్చింది’ అని పూర్వ ఎస్ఈసీ, కార్యదర్శి, సీఎఫ్డీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ తెలిపారు. ‘విద్యావంతులు వివేకంతో ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలి’ అని డాక్టర్ సమరం పిలుపునిచ్చారు. ‘వ్యక్తిగత గోప్యత జీవించే హక్కులో అంతర్భాగం. గోప్యత విషయంలో రాష్ట్రంలో వాలంటీర్లు ప్రజల హక్కులకు భంగం కలిగిస్తున్నారు’ అని సిద్దార్థ న్యాయ కళాశాల ప్రిన్సిపల్ దివాకర్బాబు ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విజయవాడ తొలి మేయర్ జంధ్యాల శంకర్, సీఎఫ్డీ సంయుక్త కార్యదర్శి లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత