సంక్షిప్త వార్తలు(8)
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఈనాడు, అమరావతి: ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది (2023-24)కి సంబంధించి కనీస వేతనం రూ.272గా అమలు చేస్తున్నారు. అదనంగా మరో రూ.28 జోడించి 2024-24 సంవత్సరానికి రూ.300గా కేంద్రం నిర్ణయించింది.
55 మంది వాలంటీర్ల తొలగింపు
న్యూస్టుడే, యంత్రాంగం: రాష్ట్రంలో బుధవారం 55 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు. గుంటూరు జిల్లా పొన్నూరు వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ ఈ నెల 16న నియోజకవర్గంలోని చేబ్రోలు, పెదకాకానిలలో నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్న 52 మంది వాలంటీర్లను తొలగించారు. వీరు కాక.. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఇద్దరిని, విశాఖ జిల్లాలో మరొకరిని కూడా తొలగించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో 15 మంది వాలంటీర్లు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తమ రాజీనామా పత్రాలను బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అందజేశారు.
ఒంగోలులో 900 చీరల పట్టివేత
ఒంగోలు, న్యూస్టుడే: ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం గుత్తికొండవారిపాలెంలోని ఓ గోదాంలో ఎన్నికల అధికారులు 900 చీరలు పట్టుకున్నారు. చీరల డబ్బాలపై సీఎం జగన్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఫొటోలు ముద్రించి ఉన్నాయి. మంజునాథ గ్రానైట్స్ అండ్ మినరల్స్ పేరిట సూరత్ నుంచి దిగుమతి చేసుకున్నట్లు నిర్ధారించారు.
గ్రీన్కో సంస్థకు భూముల అడ్వాన్స్ పొజిషన్
ఈనాడు, అమరావతి: కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సౌర విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటుకు గ్రీన్కో సంస్థకు అవసరమైన భూములకు అడ్వాన్స్ పొజిషన్ ఇస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ నోటిఫికేషన్ జారీ చేశారు. 800 మెగావాట్లు, 1500 మెగావాట్లతో రెండు ప్రాజెక్టుల ఏర్పాటుకు ఈ భూములకు అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చింది.
సలహాదారు చంద్రశేఖరరెడ్డిపై ఈసీకి ఫిర్యాదు
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డిని ఆ పదవి నుంచి తొలగించాలని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. ‘‘ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వ నిధుల నుంచి జీతం తీసుకుంటున్నవారు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. కానీ చంద్రశేఖరరెడ్డి మంగళవారం సచివాలయంలో రాజకీయ నాయకుడిలా తెదేపా నేతలపై విమర్శలు చేశారు. ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేసేలా విలేకర్ల సమావేశం నిర్వహించి, ప్రకటన విడుదల చేశారు. కోడ్ ఉల్లంఘించిన ఆయనపై చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండు చేశారు.
ప్రసూతి సెలవుపై కాకినాడ కలెక్టర్ కృతికా శుక్లా
ఈనాడు, అమరావతి: కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రసూతి సెలవుపై వెళుతున్నారు. ఆమె స్థానంలో కలెక్టర్గా నియమించేందుకు జె.నివాస్తోపాటు హరికిరణ్, శ్రీకేష్ బాలాజీల పేర్లను సీఈసీకి ప్రభుత్వం పంపింది. వారిలోంచి నివాస్ పేరును సీఈసీ ఎంపిక చేసింది. కాకినాడ కలెక్టర్గా ఆయన గురువారం బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) సూచించింది. పీహెచ్డీ ప్రవేశపరీక్షల స్థానంలో నెట్ స్కోరును తీసుకోవాలని పేర్కొంది. జాతీయ విద్యావిధానం-2020 అమల్లో భాగంగా పీహెచ్డీ ప్రవేశాల కోసం జాతీయ ప్రవేశ పరీక్షతోపాటు జాతీయ అర్హత పరీక్ష (నెట్) నిబంధనలను సమీక్షించడానికి యూజీసీ నిపుణుల కమిటీని ఏర్పాటుచేసింది. 2024-25 నుంచి నెట్ స్కోరుతో ప్రవేశాలు కల్పించాలని వెల్లడించింది.
ఉన్నత విద్యామండలి ఛైర్మన్, వైస్ ఛైర్మన్లకు అందని జీతాలు
ఈనాడు, అమరావతి: ఉన్నత విద్యామండలి ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు, సంయుక్త సంచాలకులకు ఇంతవరకు ఫిబ్రవరి నెల జీతాలు రాలేదు. వీరికి ప్రభుత్వమే జీతాలు చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటివరకు ఇవ్వలేదు. మరోవైపు మార్చి నెల జీతం సైతం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మార్చి జీతాల బిల్లులను ఏప్రిల్లో పెట్టాలని ఆర్థిక శాఖ ఇప్పటికే ఆదేశించింది. దీంతో రెండు నెలలు జీతాలకు కష్టాలు ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో జీతాలు ఆలస్యమైతే ఉన్నత విద్యామండలిలోని నిధుల నుంచి అప్పుగా ఇచ్చేవారు. ఆ తర్వాత జీతాలు వచ్చాక రికవరీ చేసుకునేవారు. ఈసారి ఉన్నత విద్యామండలి ఇలాంటి చర్యలు తీసుకోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM