జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
ఎన్నికల వేళ వైకాపా విద్యుత్ నాటకం
ఇళ్లకు అధిక కరెంటు ఇవ్వడానికి సేద్యానికి కోత
వ్యవసాయానికి ఇస్తోంది 7 గంటలే...
అదీ పగలో విడత... రాత్రి మరో విడత
ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే...
మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే...
ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు...
వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు...
అన్నదాతల పొలాలను ఎండబెడుతూ... ఇళ్లలో ఫ్యాన్లు తిప్పే ఎత్తుగడ వేశారు...
అన్నదాతలు బోరుమంటున్నా... ఈ అభినవ నీరో పట్టనట్లే ఉంటున్నారు!!
ఎన్నికల ఏడాది కావడంతో గృహ విద్యుత్ వినియోగదారులకు కోతలు పెడితే ఓట్లకు నష్టం కలుగుతుందని సీఎం జగన్ ఆలోచన. మరోవైపు... పీక్ డిమాండ్ సమయంలో అధిక ధరకు విద్యుత్ను కొనాలన్నా మార్కెట్లో దొరికే పరిస్థితి లేదు. ప్రత్యామ్నాయంగా సేద్యానికిచ్చే విద్యుత్లో రోజుకు రెండు గంటలు కోతలు పెట్టారు. గత రెండేళ్లుగా వేసవిలో విద్యుత్ కోతలతో ప్రజలకు జగన్ ప్రభుత్వం చుక్కల్నే చూపించింది. ఈ ఏడాదీ కోతలు కొనసాగిస్తే ఎన్నికల్లో నష్టపోవాల్సి వస్తుందన్న భయం పట్టుకుంది. దీంతో వ్యవసాయ విద్యుత్ను గృహ వినియోగదారులకు మళ్లించింది. పైగా ఎప్పుడు మిగులు విద్యుత్ ఉంటే అప్పుడు సేద్యానికి ఫీడర్ల వారీగా సర్దుబాటు చేసేలా పథక రచన చేసింది. అసలే... వర్షాభావ పరిస్థితులతో పంటలు కాపాడుకోవడానికి నానాతంటాలు పడుతున్న రైతులకు దిక్కుతోచడంలేదు. బోర్లు పనిచేయక కళ్లెదుటే పంటలు ఎండిపోతుంటే అల్లాడుతున్నారు. కొన్నిచోట్ల పశువులకు వదలిపెట్టక తప్పని పరిస్థితి. పంటల దిగుబడి తగ్గే ప్రమాదముందని వాపోతున్న రైతులను పట్టించుకునే పరిస్థితిలో జగన్ సర్కారు లేదు.
రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో ప్రస్తుతం సేద్యానికి రోజుకు ఏడు గంటలు మాత్రమే విద్యుత్ అందుతోంది. పగటివేళ మూడు గంటలు(ఉదయం 8 నుంచి 11 గంటలు) ఇస్తే... అర్ధరాత్రి సమయంలో నాలుగు గంటలు (రాత్రి 12 నుంచి వేకువజాము 4 గంటలు) మాత్రమే ఇస్తున్నారు. అందులోనూ అడపాదడపా లోడ్ రిలీఫ్ పేరుతో కోతలు పెడుతున్నారు. ఫలితంగా పంటలు వేగంగా ఎండిపోతున్నాయి.
అన్నదాతల కన్నీళ్లకు కారణమెవరు?
అనంతపురం జిల్లా కణేకల్ మండలం ఉద్దేహాళ్ గ్రామంలో లోకన్న అనే రైతు ఆరు ఎకరాల్లో వరి సాగు చేశారు. విద్యుత్ సమస్య కారణంగా... ఆయన పొలానికి సరిపడా నీరు అందక మూడు ఎకరాల్లో పైరు కళ్ల ఎదుటే ఎండిపోయింది. గత్యంతరం లేక దాన్ని పశువుల మేత కింద వదలిపెట్టేశారు.
కర్నూలు జిల్లా తుగ్గలికి చెందిన రైతు గుండాల ఆంజనేయులు నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. ఎకరంలో ఉల్లి, మరో ఎకరంలో వేరుశెనగ వేశారు. వ్యవసాయ విద్యుత్ను ఆరు గంటలే ఇస్తున్నారు. సాగునీరు పూర్తిగా అందదని ముందే గ్రహించి రెండు ఎకరాలు బీడు పెట్టారు. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి రెండు గంటలపాటు.. మళ్లీ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ వస్తోందని, నీరు చాలక దిగుబడి దెబ్బతిందని ఆయన వాపోతున్నారు.
కణేకల్ మండలం ఉద్దేహాళ్ గ్రామానికే చెందిన మరో రైతు ఎర్రిస్వామి 10 ఎకరాల్లో వరి సాగు చేశారు. పొలానికి సరిగా నీరందక నాలుగు ఎకరాల్లో పైరు పూర్తిగా ఎండిపోయింది. సరిపడా తడులు అందితే ఎకరాకు కనీసం 40 బస్తాల దిగుబడి వచ్చేది. ఇప్పుడు 10 బస్తాలకు మించి రావడం కష్టమని ఆయన కన్నీళ్లు పెడుతున్నారు. రాయదుర్గం నియోజకవర్గ పరిధిలో 1,200 ఎకరాల్లో వివిధ పంటలు ఎండిపోయాయని అంచనా.
కృత్రిమమేధనూ ఏ‘మార్చి’న ప్రభుత్వం
విద్యుత్ డిమాండ్ను ముందస్తుగా అంచనా వేయడానికి వీలుగా రాష్ట్ర విద్యుత్ సంస్థలు కృత్రిమ మేధతో సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేశాయి. దీనివల్ల విద్యుత్ వినియోగ అంచనాల్లో కచ్చితత్వం వస్తుందని, అందుకనుగుణంగా అవసరమైన విద్యుత్ కోసం ముందస్తు ప్రణాళిక రూపొందించుకునే వెసులుబాటు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ తరహా విధానాన్ని అభివృద్ధి చేసినందుకు ఇటీవల యూఏఈ వెళ్లి గోల్డెన్ పీకాక్ అవార్డును సైతం వారు అందుకున్నారు. ఆ సాంకేతికత కూడా జగన్ వ్యూహం ముందు చిన్నబోయింది. ప్రస్తుత మార్చిలో దాని అంచనాలు తప్పాయి. ఈ నెలలో ఏపీలో విద్యుత్ వినియోగం 245 నుంచి 250 మిలియన్ యూనిట్ల(ఎంయూ) మధ్య ఉంటుందని కృత్రిమమేధ అంచనా వేసింది. కానీ, అది 230 ఎంయూలు దాటడం లేదు. గత బుధ(20న), గురువారాల్లో(21న) మరీ దారుణంగా 225 ఎంయూలకు పడిపోయింది. ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవడంతో రాత్రి వేళల్లో ఏసీ లేకుండా గడవడమే కష్టంగా ఉంది. అలాంటప్పుడు వినియోగం పెరగాలి కదా?
వారం రోజుల కిందట రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 245 ఎంయూలుగా ఉంది. డిమాండ్ సర్దుబాటు చేయడానికి డిస్కంలు రియల్టైం మార్కెట్లో 2.22 ఎంయూలను కొన్నాయి. అప్పటి నుంచి విద్యుత్ వినియోగం క్రమేణా తగ్గుతూ శుక్రవారం(22) నాటికి 230.74 ఎంయూలకు చేరింది.
థర్మల్ ప్లాంట్లు పరిగెత్తుతూనే ఉన్నాయి
గత శనివారం(23న) మిట్ట మధ్యాహ్నం గ్రిడ్ గరిష్ఠ డిమాండ్ 12,466 మెగావాట్లుగా ఉంది. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 8,310 మెగావాట్లు. వాటి ద్వారా శుక్రవారం(22న) పీక్ డిమాండ్ సమయంలో 5,604 మెగావాట్ల విద్యుత్ గ్రిడ్కు అందితే... ఆఫ్ పీక్ సమయంలో 4,849 మెగావాట్లు అందింది. రోజులో సగటున 5,261 మెగావాట్ల ఉత్పత్తి జరిగింది. వేసవిలో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వీలైనంత మేరకు థర్మల్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. డిమాండ్ తగ్గితే అంతగా ఒత్తిడి పెట్టి మరీ ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏముంది?
ఫలితమివ్వని పనులు... దిక్కులేని పొలాలు
‘‘రైతులకు పగటి పూటే 9 గంటలు విద్యుత్ ఇచ్చేలా అడుగులు వేశాం. రాష్ట్రంలోని 90% పైచిలుకు ఫీడర్లను పగలు విద్యుత్ అందించేలా తీర్చిదిద్దాం. మిగిలిన 10% ఫీడర్లనూ సిద్ధం చేస్తాం’’ మూడేళ్ల కిందట సీఎం జగన్ చెప్పిన మాటలివి. ప్రభుత్వం అప్పట్లో ఫీడర్ల అభివృద్ధికి రూ.1,700 కోట్లు ఖర్చు చేసింది. ఆ తర్వాత విద్యుత్ పంపిణీ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) కింద వివిధ అభివృద్ధి పనులకు రూ.8,358 కోట్లు వెచ్చించింది. మొత్తం రూ.10,058 కోట్లు ఖర్చు చేసినా.. తీగల్లో కరెంటు లేకుంటే ఉపయోగమేంటి? రైతుల పొలాల్లో మోటార్లు తిరగకుంటే లాభమేంటి?
డిమాండ్ తగ్గిందని తప్పుడు లెక్కలు
ప్రభుత్వం వ్యవసాయానికి ఇచ్చే కరెంటులో రోజుకు రెండు గంటలు కోతలు పెట్టడంతో వాస్తవ విద్యుత్ డిమాండ్లో సుమారు 15 ఎంయూలు తగ్గింది. దీంతో మార్చిలోనూ రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 225 నుంచి 230 ఎంయూల మధ్య ఉంటోంది. ఏదో ఒకట్రెండు రోజులు వాతావరణ మార్పుల కారణంగా డిమాండ్ తగ్గిందని సరిపెట్టుకోవచ్చు. కానీ, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.5 డిగ్రీలకు తగ్గడం లేదు. అయినా, విద్యుత్కు నిరుటి అంత డిమాండ్ లేదని జగన్ సర్కారు లెక్కల్లో గోల్మాల్ చేస్తోంది.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?