నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు.
ఆళ్లగడ్డలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయో చూపించగలరా..?
రూ.8 కోట్లు ఇవ్వలేక గాలికొదిలేసిన ఆసుపత్రి పరిస్థితి ఏమిటి?
మాటల్లో మీరేసిన రింగురోడ్దు మీదుగానే నంద్యాలకు వెళతారా..?
నేడు ఆళ్లగడ్డ, నంద్యాలలో సీఎం పర్యటన
ఈనాడు, అమరావతి: ‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో, పాదయాత్రలో, తర్వాత అధికారంలోకొచ్చాక సీఎంగా నంద్యాల, ఆళ్లగడ్డకు వెళ్లినప్పుడు జగన్ ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ఇప్పుడా రెండు పట్టణాల రూపురేఖలే మారిపోయేవి. కానీ ఇవన్నీ ఊహలే. జగనన్న చెప్పారంటే చేయరంతే! ఆయన చేయలేదు కాబట్టే ఈ రెండు పట్టణాల్లో అభివృద్ధి, రైతులకు సాగునీరు కలగానే మిగిలాయి.
నంద్యాలలో నమ్మించిన మాటలు గుర్తున్నాయా..?
‘ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాక పులివెందులపై ఎంత శ్రద్ధ పెడతానో అదే స్థాయిలో నంద్యాలపైనా చూపిస్తా. నంద్యాల అభివృద్ధిని నాకొదిలేయండి. పరుగులు పెట్టిస్తా. నంద్యాలను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్ది గుర్తింపు తెస్తా’ వై.ఎస్.జగన్ ఇచ్చిన హామీల పరంపరలోని మాటలివి. తర్వాత సీఎం హోదాలో వెళ్లినప్పుడు నంద్యాలకు రింగురోడ్డు ఏర్పాటు చేయిస్తాననీ చెప్పారు.
ఏం చెప్పారు.. ఏం చేశారు?
నంద్యాల అభివృద్ధి పరుగు మాట తర్వాత.. ఈ అయిదేళ్లలో కనీసం నడక కూడా ప్రారంభించలేదు. ఔటర్ రింగ్రోడ్డుకు ప్లాన్ కూడా ఇంకా పూర్తికాలేదు. ఈ లెక్కన ఆ పట్టణం ఎన్ని వందల ఏళ్లకు పూర్తిస్థాయిలో అభివృద్ధి కాగలదో ఏలినవారే చెప్పాలి. నంద్యాలను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతానని జగన్ చెబితే స్థానికులు కలలు కన్నారు. ఇప్పుడా కలలు మురుగు కాలువల రూపంలో వారిముందే కనిపిస్తున్నాయి. కొద్దిపాటి వర్షానికే కాలనీలు నీట మునుగుతాయి. నంద్యాల చిన్న చెరువును ట్యాంక్బండ్గా అభివృద్ధి చేస్తామని జగన్ చెప్పారు. గురువారం ఆ ట్యాంక్బండ్ చూపించగలరా? పట్టణ శివార్లలో పీవీ నగర్ డంప్యార్డులో చెత్తను శుద్ధిచేసి ఎరువుగా మార్పిస్తామన్నారు. అదీ అంతే. బొమ్మలసత్రం నుంచి నూనెపల్లె పైవంతెన వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి మూడేళ్ల కిందట రూ.13.40 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచి గుత్తేదారుకు పనులు అప్పగించారు. అందులోభాగంగా కిలోమీటరు పొడవున మురుగుకాలువల నిర్మాణాన్ని ప్రారంభించినా ఆ పనులూ పూర్తికాలేదు. కుందూ నదిపై వంతెన నిర్మాణ పనులు తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రారంభమైనా జగన్ ప్రభుత్వం నిధులు ఇవ్వక ఆగిపోయాయి. తెదేపా హయాంలో అమృత్ పథకం కింద వెలుగోడు రిజర్వాయరు నుంచి నంద్యాలకు తాగునీటి పైపులైన్ ఏర్పాటుచేసే పనులు ప్రారంభించారు. ప్రభుత్వం మారే సమయానికి 30% పనులు మిగిలాయి. వాటినీ పూర్తిచేయలేదు.
ఆళ్లగడ్డ అధోగతి
2022 అక్టోబరు 17న సీఎం జగన్ ఆళ్లగడ్డలో పర్యటించారు. అప్పుడు ఇచ్చిన హామీలు ఒక్కటీ ఆచరణకు నోచుకోలేదు. యువతకు ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని అట్టహాసంగా ప్రకటించారు. ఇప్పటివరకూ ఒక్కటంటే ఒక్కటీ ఏర్పాటుకాలేదు.
- ఆళ్లగడ్డలోని 50 పడకల ఆసుపత్రి విస్తరణకు రూ.8కోట్లు మంజూరు చేస్తామన్నారు. 18 నెలలైనా రూపాయి ఇవ్వలేదు.
- ఆళ్లగడ్డ పురపాలికలో విలీనమైన గ్రామాలు, వార్డుల అభివృద్ధికి రూ.56 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇందులో రూపాయి కూడా రాలేదు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా పదివార్డుల్లో పనులకు రూ.5 కోట్లు కేటాయించారు.
- శిరివెళ్ల-రుద్రవరం, రుద్రవరం-యర్రగుడిదిన్నె గ్రామాల మధ్య హైలెవెల్ వంతెనలకు రూ.16 కోట్లు మంజూరుచేస్తున్నట్లు హామీ ఇచ్చినా పనులు ప్రారంభించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్