ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో!
చిన్నాన్నను ఎవరు చంపించారో అందరికీ తెలుసన్న జగన్
ప్రొద్దుటూరు సభలో వ్యాఖ్యలు
ఈనాడు, అమరావతి: దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! ఈ హత్యకేసులో అసలైన కుట్రదారు అవినాష్రెడ్డేనని సీబీఐ తేల్చిచెప్పినా.. ఆయన్నే పక్కన పెట్టుకుని మరీ ‘‘మా చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, జిల్లా ప్రజలందరికీ తెలుసు’’ అని వ్యాఖ్యానించటం జగన్కే చెల్లింది.
పక్కనే నిందితుడిని పెట్టుకుని... నంగనాచి కబుర్లా!
జగన్: మా చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, జిల్లా ప్రజలందరికీ తెలుసు.
వివేకా హత్య కేసులో తీవ్ర నేరాభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడు అవినాష్రెడ్డిని పక్కన పెట్టుకుని మరీ మీరు పలికించిన నవరసాలు నభూతో... నభవిష్యతి. హత్యకు కుట్ర పన్నింది, హత్యానంతరం సాక్ష్యాలను ధ్వంసం చేసింది కడప ఎంపీ వై.ఎస్.అవినాష్రెడ్డేనని సీబీఐ అభియోగపత్రంలోనే స్పష్టం చేసింది. తన అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్రెడ్డి ద్వారా ఈ హత్య చేయించారనే అనుమానం ఉందనీ పేర్కొంది. వివేకాతో అవినాష్రెడ్డికి, ఆయన తండ్రి భాస్కరరెడ్డికి విభేదాలు ఉండటంతోనే ఈ కుట్రకు తెరలేపారని తేల్చింది. భాస్కరరెడ్డిని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండులో ఉంచింది. అవినాష్ను సాంకేతికంగా కాగితాలపై అరెస్టు చేసి వెంటనే బెయిల్ ఇచ్చేసింది. సీబీఐ ఇంత స్పష్టంగా అభియోగపత్రాల్లో వెల్లడిస్తే ఇంకా వివేకాను ఎవరు చంపారో అందరికీ తెలుసనడం ఏంటి?
ఒక కన్ను మరో కంటిని పొడుచుకుంటుందా? అంటూ క్లీన్చిట్ ఇచ్చేసింది మీరు కాదా?
జగన్: వివేకా చిన్నాన్నను అతి దారుణంగా, హేయంగా చంపిన హంతకుడు బహిరంగంగా తిరుగుతున్నారు. ఆయనకు మద్దతిస్తున్నదో ఎవరో అందరూ రోజూ చూస్తున్నారు.
మీరన్నది నిజమే... వివేకా హత్య కేసులో ఎనిమిదో నిందితుడైన కడప ఎంపీ అవినాష్రెడ్డి దర్జాగా బయట తిరుగుతున్నారు. ఆయన స్వేచ్ఛకు కారణం ఎవరో రాష్ట్ర ప్రజలందరూ రోజూ చూస్తున్నారు. ఈ కేసులో సీబీఐ ఒక్కో తీగ లాగుతూ... అవినాష్రెడ్డి ప్రమేయాన్ని బయటపెట్టే సమయంలో దర్యాప్తు అధికారిపైనే కేసు పెట్టారు. అవినాష్ను సీబీఐ అనుమానితుడిగా గుర్తించిన వెంటనే ‘‘ఒక కన్ను మరో కంటిని పొడుచుకుంటుందా?’’ అంటూ ఆయనకు క్లీన్చిట్ ఇచ్చేస్తూ, దర్యాప్తును ప్రభావితం చేసేలా మీరే అసెంబ్లీలో మాట్లాడారు. అవినాష్ అమాయకుడని మీరు నమ్మితే సరిపోతుందా? సీబీఐ లాంటి సంస్థే ఆయనే కుట్రదారని చెబుతుంటే... అందుకు విరుద్ధంగా మీరు మాట్లాడటమేంటి? మీ కోటరీలో అత్యంత కీలకమైన వ్యక్తి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే అనేక సందర్భాల్లో ప్రెస్మీట్లు పెట్టి మరీ సీబీఐపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ, అవినాష్ను సమర్ధించుకొచ్చారు కదా! దీన్నిబట్టి నిందితులకు ఎవరు మద్దతిస్తున్నారో తేలిపోయింది కదా!
జైలుకు వెళ్లకుండా అడ్డుకున్నది మీరే!
జగన్: వివేకాను చంపినోళ్లు ఉండాల్సింది జైల్లో. కానీ నెత్తిన పెట్టుకుని మరీ చంద్రబాబు, ఆయన మనుషులు వారికి మద్దతిస్తున్నారు.
ఈ కేసులో కుట్రదారుగా సీబీఐ పేర్కొన్న నిందితుడు అవినాష్రెడ్డి జైలుకు వెళ్లకుండా అడ్డుకున్నది మీరు, మీ అనుచరగణం, మీ పార్టీ, మీ ప్రభుత్వ యంత్రాంగమే. అవినాష్ నిందితుడని తేలాక పదేపదే న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేయిస్తూ న్యాయపరమైన చిక్కులు కల్పించారు. వాటన్నింటినీ దాటుకుని ఆయన్ను అరెస్టు చేయడానికి సీబీఐ అధికారులు కర్నూలు వెళ్లగా... వారికి సహాయ నిరాకరణ చేసి, ముప్పుతిప్పలు పెట్టారు. అవినాష్ ఉన్న ఆసుపత్రి ప్రాంగణం దరిదాపుల్లోకి కూడా సీబీఐ అధికారులను రానీయకుండా రోజుల తరబడి ఆసుపత్రి లోపల, బయట మోహరించి వీరంగం, దౌర్జన్యం చేశారు. వారిని అక్కడనుంచి ఖాళీ చేయించకుండా రాచమర్యాదలు చేయించారు. నిందితులు జైల్లో ఉండాలని చెబుతున్నారే.. ఆ నిందితుల్ని జైల్లోకి వెళ్లకుండా కాపాడింది ఎవరు మీరు, మీ ప్రభుత్వం కాదా?
వాస్తవాలు చెబుతుంటే బురద చల్లడమంటారా?
జగన్: మా బాబాయ్ హత్యకేసు విషయంలో బురద చల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనక ఎవరున్నారో మీ అందరికీ రోజూ కనిపిస్తోంది.
తన తండ్రి హంతకులకు, హత్య కుట్రదారులకు శిక్ష పడేలా పోరాటం చేస్తున్న సునీతపై, ఆమెకు మద్దతుగా నిలిచిన షర్మిలపై అభాండాలు వేస్తున్నది ఎవరో అందరికీ కనిపిస్తోంది. న్యాయం కోసం పోరాడుతున్న ఆ ఇద్దరు ఆడబిడ్డలపై బురద చల్లుతున్నది, చల్లిస్తున్నది ఎవరో ప్రతి ఒక్కరి కళ్లకూ కడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్