డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు.
నేడో, రేపో రూ.55 కోట్లు చెల్లింపులకు సిద్ధం
కమలాపురం కాంట్రాక్టర్కు రూ.6.38 కోట్ల టోకెన్లు!
ఇతర గుత్తేదారులకు మొండిచేయి
ఈనాడు, అమరావతి: కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఏడాదిగా వీరికి చెల్లింపుల్లేవు. ఆర్థిక సంవత్సరం చివర్లో అయినా బిల్లులు వస్తాయనే ఆశతో ఉన్నారు. ఇంతలో అధికార పార్టీ కీలక నేతల తాలూకా గుత్తేదారులు పది రోజుల కిందట బిల్లులు అప్లోడ్ చేసి, ఆఘమేఘాలపై టోకెన్లు జారీ చేయించుకున్నారు. ఒకటి, రెండు రోజుల్లో వారికి బిల్లులు చెల్లించేందుకు రంగం సిద్ధమైపోయింది. ఇప్పటికే ఇతర గుత్తేదారులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా సరే.. ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక అధికారి ఒత్తిడితో, ఆర్థికశాఖ అధికారులు మాత్రం ఆ గుత్తేదారులకు బిల్లులివ్వడానికి సన్నద్ధమైనట్లు తెలిసింది.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా ఆర్అండ్బీ గుత్తేదార్లకు సరైన న్యాయం జరగడం లేదు. అధికార పార్టీలో కీలక నేతలు, పెద్దల ఆశీస్సులున్న వారికే బిల్లులు వస్తున్నాయి. తాజాగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి నియోజకవర్గం డోన్లో సీఆర్ఐఎఫ్ పనులు చేసిన పి.తిరుపతిరెడ్డి అనే గుత్తేదారుకు రూ.48.86 కోట్లు, ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఓ సీనియర్ ఎమ్మెల్యేకు చెందిన శ్రీనివాస కన్స్ట్రక్షన్స్కు రూ.7.04 కోట్లు చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 16న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నట్లు తెలియగానే, 15వ తేదీ రాత్రి రూ.67 కోట్లకు బడ్జెట్ రిలీజ్ ఆదేశాలు (బీఆర్వోలు) ఇచ్చారు. సీఎంఓలోని ఓ కీలక అధికారి.. ఆర్థిక శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి బీఆర్వో ఇచ్చేలా చూసినట్లు తెలిసింది. సాధారణంగా బీఆర్వో వస్తే.. రాష్ట్రంలోని 33 ఆర్అండ్బీ డివిజన్లలో ఎక్కడి నుంచి అయినా గుత్తేదారులు బిల్లులు అప్లోడ్ చేసేందుకు వీలుంటుంది. కానీ సీఎఫ్ఎంఎస్ అధికారులతో మాట్లాడి కేవలం డోన్ నియోజకవర్గం, ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఓ నియోజకవర్గ పరిధిలో బిల్లులు మాత్రమే అప్లోడ్ అయ్యేలా ఆ డివిజన్ల ఈఈలకు మాత్రమే అవకాశం కల్పించారు. తర్వాత ఈ బిల్లుల చెల్లింపులకు వీలుగా 6 టోకెన్లు కూడా జారీచేశారు. దీంతో ఏ క్షణమైనా వీరికి చెల్లింపులు చేయొచ్చని తెలిసింది.
క్యూసీ లేకపోయినా బిల్లు ఇస్తారట!
సీఎం జగన్ మేనమామ రవీంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కమలాపురం నియోజకవర్గంలో పనులు చేసిన ఈశ్వర్రెడ్డి అనే గుత్తేదారుకు రూ.6.38 కోట్ల బిల్లులు ఉండగా, దీనీకి బీఆర్వో ఇచ్చారు. వాస్తవానికి ఈ పనులకు క్వాలిటీ కంట్రోల్ (క్యూసీ) విభాగం నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదు. క్యూసీ లేకుండా బిల్లులు అప్లోడ్ చేయకూడదు. అయినా సరే అప్లోడ్ చేసి, టోకెన్ల జారీకి ఒత్తిళ్లు తెస్తున్నారు.
ఎన్నికల సంఘం అనుమతిస్తుందా?
తొలుత బిల్లులు అప్లోడ్ చేసినవారికి తొలుత చెల్లింపులు (ఫస్ట్ ఇన్.. ఫస్ట్ అవుట్) అనే విధానానికి బదులు, జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇష్టానుసారం చెల్లింపులు చేస్తున్నారని గుత్తేదారులు వాపోతున్నారు. పాత విధానాన్నే కొనసాగించాలని చాలాకాలంగా కోరుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక దీనిపై బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్), స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (సబ్కా) నేతలు వేర్వేరుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖలు రాశారు. అయినా సరే ఆర్థికశాఖ అధికారులు అధికార పార్టీకి కావాల్సిన గుత్తేదార్లకే చెల్లింపులు జరిపేందుకు ఏర్పాట్లు చేయడంపై ఇతర గుత్తేదారులు మండిపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్