సంక్షిప్త వార్తలు (14)
తిరుమల శ్రీవారిని మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ గురువారం దర్శించుకున్నారు.
శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తులు
తిరుమల, న్యూస్టుడే: తిరుమల శ్రీవారిని మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ గురువారం దర్శించుకున్నారు. తిరుమలలోని పుష్పగిరి మఠంలో ఆయన సోదరుడు వెంకటసత్యం, రామరత్నం దంపతుల కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహం బుధవారం జరిగింది. నూతన వధూవరులు, కుటుంబ సభ్యులతో కలిసి న్యాయమూర్తి ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్నారు.
గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.మానవేంద్రనాథ్ రాయ్ గురువారం సాయంత్రం నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.
18 కిలోల పుచ్చకాయ!
డోన్, న్యూస్టుడే: పుచ్చకాయలు సాధారణంగా 5 నుంచి 10 కిలోల బరువు ఉంటాయి. కానీ నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ఓ దుకాణం వద్ద పుచ్చకాయ ఏకంగా 18.5 కిలోల బరువు తూగింది. చూపరులను ఆకట్టుకుంది.
కూటమి విజయానికి కాపు బలిజ సంక్షేమ సంఘం కృషి
హరిరామజోగయ్య
పాలకొల్లు మార్కెట్, న్యూస్టుడే: తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయమే ధ్యేయంగా కాపు బలిజ సంక్షేమ సంఘం పనిచేస్తోందని మాజీ మంత్రి, ఆ సంఘ వ్యవస్థాపకుడు చేగొండి వెంకట హరిరామజోగయ్య అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో గురువారం విలేకరులతో మాట్లాడారు. కాపు, బలిజ సంక్షేమ సంఘాన్ని కొంత మంది సన్నిహితులతో కలిసి తానే స్థాపించినట్లు చెప్పారు. కూటమి గెలుపు కోసం పవన్కల్యాణ్ వెనుక పరుగుతీసే గుర్రాలతో కలిసి పరుగుపెడతామని, సీఎం జగన్ ఓటమికి పనిచేస్తామని చెప్పారు. బీసీలతో సమానంగా కాపు జాతికి కూడా వారి మ్యానిఫెస్టోలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రకటించాలని కోరారు.
వెబ్సైట్లో జేఈఈ మెయిన్స్ పరీక్షా కేంద్రాల వివరాలు
ఈనాడు డిజిటల్, అమరావతి: జేఈఈ మెయిన్స్-2024 సెషన్-2 పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. దేశవ్యాప్తంగా 309, విదేశాల్లో 19 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే నెల 4, 5, 6, 8, 9 తేదీల్లో పేపర్-1(బీఈ, బీటెక్), 12న పేపర్-2(బీ-ఆర్క్) పరీక్షలు జరగనున్నాయి. పూర్తి వివరాలకు https://jeemain.nta.ac.in వెబ్సైట్ను సందర్శించాలని ఎన్టీఏ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది.
ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓకి అదనపు బాధ్యతలు
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్గా పూర్తి అదనపు బాధ్యతలను ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ డి.కె.బాలాజీకి అప్పగించారు. ఆ శాఖ కమిషనర్గా ఉన్న నివాస్ కాకినాడ జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యారు. దాంతో ఆయన బాధ్యతలను బాలాజీకి అప్పగిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
తాగునీటిని ఇతర అవసరాలకు వాడొద్దు
ప్రజలకు సీఎస్ జవహర్రెడ్డి విజ్ఞప్తి
ఈనాడు, అమరావతి: తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించొద్దని ప్రజలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.ఎస్.జవహర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. బెంగళూరులో తలెత్తిన తాగునీటి సమస్యను దృష్టిలో పెట్టుకుని వాహనాలు, ఇళ్లు శుభ్రం చేయడానికి, మొక్కలకు తాగునీరు వాడొద్దని సూచించారు. సచివాలయంలో గురువారం ఆయన గ్రామీణ, పట్టణ తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ‘కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్న నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడాలి. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రచారం చేయాలి. తాగునీటికి ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలి. సమస్య తీవ్రంగా ఉన్న ఆవాస ప్రాంతాలకు ట్యాంకర్లతో నీరు సరఫరా చేయాలి. ఇందుకోసం సిద్ధం చేసిన యాప్ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలి’ అని అధికారులను ఆదేశించారు.
‘‘కంటెయినర్’ ఎందుకు వచ్చింది?’
ఈనాడు, అమరావతి: సీఎం జగన్ తన ఇంటికి కంటెయినర్ ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పాలని రాష్ట్ర భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం డిమాండ్ చేశారు. విజయవాడలో గురువారం ఆయన మాట్లాడుతూ అవినీతి సొమ్ముతో జగన్ రానున్న ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పురందేశ్వరిపై సీఎం నోరుపారేసుకుంటే తగిన బుద్ధి చెబుతామని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించండి
సీపీఐ మావోయిస్టు తెలంగాణ కమిటీ
దుమ్ముగూడెం, న్యూస్టుడే: బూటకపు పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని సీపీఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో గురువారం మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు. హిందుత్వ ఫాసిస్టు భారతీయ జనతా పార్టీని, దాని మిత్రపక్షాలను, ప్రజావ్యతిరేక కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈడీ, సీబీఐ, న్యాయ వ్యవస్థల స్వేచ్ఛను మోదీ దెబ్బతీశారని లేఖలో ఆరోపించారు.
ప్రత్యేక రైళ్ల పొడిగింపు: ద.మ.రైల్వే
ఈనాడు, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఐదు జతల ప్రత్యేక రైళ్లను మరికొద్దిరోజులు పొడిగిస్తున్నట్లు ద.మ.రైల్వే గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం (నెం.08579/08580) రైళ్లను జూన్ 27 వరకు పొడిగించింది. తెలుగు రాష్ట్రాల పరిధిలో రాకపోకలు సాగించే విశాఖపట్నం-తిరుపతి-విశాఖపట్నం రైళ్లనూ జూన్ 25 వరకు, విశాఖపట్నం-కర్నూలు-విశాఖపట్నం రైళ్లను జూన్ 26 వరకు పొడిగించినట్లు తెలిపింది.
విశాఖ నుంచి నూతన విమాన సర్వీసులు
విశాఖపట్నం, న్యూస్టుడే: విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రెండు దేశీయ, రెండు విదేశీ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్ 9 నుంచి విశాఖపట్నం-బ్యాంకాక్(థాయ్లాండ్), 26 నుంచి కౌలాలంపూర్(మలేసియా)- విశాఖపట్నం, మార్చి 31 నుంచి విశాఖ-దిల్లీ, విశాఖ-హైదరాబాద్ సర్వీసులు నడుస్తాయని విమానాశ్రయవర్గాలు గురువారం వెల్లడించాయి.
డిప్యూటీ ఈఓ పరీక్ష వాయిదా
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు, డీఎస్సీ పరీక్షల నిర్వహణ దృష్ట్యా ఏప్రిల్ 13న జరగాల్సిన విద్యాశాఖలోని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్(డీవైఈఓ) ప్రాథమిక పరీక్షను వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. దానిని మే 25న నిర్వహిస్తామని గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
జూన్ 11 నుంచి ఏపీపీఈసెట్ ఎంపికలు
ఎ.ఎన్.యు, న్యూస్టుడే: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యాయామ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీపీఈసెట్ ఎంపికలను జూన్ 11 నుంచి నిర్వహిస్తున్నామని కన్వీనర్ ఆచార్య జాన్సన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. డీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో చేరే విద్యార్థులు మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్ వెల్లడించారు. రూ.500 అపరాధ రుసుంతో మే 22 వరకు, రూ.1,000 అపరాధ రుసుంతో మే 29 వరకు చెల్లించవచ్చన్నారు. మే 30, 31 తేదీల్లో సవరణకు అవకాశం కల్పించామని తెలిపారు. జూన్ 4 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని.. జూన్ 11 ఉదయం 6 గంటల నుంచి ఎంపికలు నిర్వహిస్తామన్నారు.
ఏపీ ఆర్సెట్ గడువు పెంపు
తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్టుడే: ఏపీ ఆర్సెట్ (2023-24)కు మే 3వ తేదీ వరకు రూ.2,000, ఏప్రిల్ 6 వరకు రూ.5,000 అపరాధ రుసుంతో దరఖాస్తు గడువును పొడిగించినట్లు కన్వీనర్ డా.బి.దేవప్రసాదరాజు తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ డా.హేమచంద్రారెడ్డి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏప్రిల్ 10 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని, మే 2 నుంచి 5వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు.
పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించండి
డిఫెన్స్ సర్వీసుల్లోని సివిలియన్ ఉద్యోగుల వినతి
ఈనాడు, విశాఖపట్నం: రక్షణ రంగంలో పని చేస్తూ దూరప్రాంతాల్లో ఉంటున్న సివిలియన్ ఉద్యోగులకు కూడా పోస్టల్ బ్యాలెట్ కల్పించాలనే వినతులు పెరుగుతున్నాయి. ఈ అంశంపై పరిశీలన చేయాలని ఎన్నికల సంఘానికి లేఖ పంపించనున్నట్లు విశాఖ డిఫెన్స్ మెటీరియల్ ఆర్గనైజేషన్ ఉద్యోగులు కొందరు తెలిపారు. రక్షణ రంగంలో పనిచేసే వారిలో సర్వీసు, సివిలియన్ అనే రెండు కేటగిరీలు ఉంటాయి. ఇందులో సర్వీసు కేటగిరీ ఉద్యోగులకు శాఖ తరఫున పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పిస్తారు. సర్వీసు ఉద్యోగులకు సహాయకులుగా పనిచేసే సివిలియన్ ఉద్యోగులకు మాత్రం పోస్టల్ బ్యాలెట్ అవకాశం లేదు. వీరికి ఒక రోజు వేతనంతో కూడిన సెలవు కల్పిస్తారు. ‘దేశంలో వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సుమారు 1000-1200 కి.మీ. దూరం ప్రయాణించి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఒక రోజు సరిపోదు. ఒకవేళ సొంత ఖర్చులతో వెళ్లాలన్నా పోలింగ్ ముందు, తర్వాత మరో రోజు సెలవులు పెట్టుకోవాల్సి ఉంటుంది. తక్కువ జీతాలు వచ్చే ఉద్యోగులు ఇంత సమయం, డబ్బులు ఖర్చు చేసుకుని ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లలేరు’ అని సివిలియన్ ఉద్యోగుల వాదన. ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద దూర ప్రాంతంలో ఉంటున్న సివిలియన్ ఓటర్లకు కూడా పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పిస్తే ఏపీలో దాదాపు 20 వేల మంది ఓటు హక్కు వినియోగించుకోగలుగుతారని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
జగన్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ దయనీయంగా తయారైంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను విద్యుత్తు కోతల కష్టాలు పీడిస్తున్నాయి. -
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
‘ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడతా. జగనన్న ప్రభుత్వంలో నాకు, నా బిడ్డకు రక్షణ లేదు. వారణాసిలో కుమార్తెతో కలిసి తలదాచుకుంటున్నా..’ అని కాకినాడకు చెందిన రాజులపల్లి ఆరుద్ర తెలిపారు. -
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్లపై జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానానికి చరమగీతం పాడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నాసిక్ నుంచి స్టాంపు పేపర్లను తెప్పించడం ఇప్పటికే నిలిపేసింది. -
గోవా మద్యానికి ‘వైకాపా’ గ్రీన్ఛానల్!
సార్వత్రిక ఎన్నికల వేళ కొంతమంది వైకాపా నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యంతో జనాల్ని ప్రలోభపెడుతూ వారి ప్రాణాల్ని బలిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
అన్న క్లాస్.. తమ్ముడు మాస్.. భూములన్నీ ఖల్లాస్!
భూమిని నమ్ముకున్నోళ్లెవ్వరూ ఆగం కాలేదు. అందుకేనేమో.. వైకాపా నేతలంతా ఒకరిని మించి మరొకరు కబ్జాలకు తెరతీశారు. -
ఎవరి ఆధీనంలో ఎవరు?
ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా...? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది. -
బ్రో... ఏ రాష్ట్రానికి పొమ్మంటావ్?
మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడి ఎక్కడా అభివృద్ధి లేకుండా చేశారు. నిర్మాణ రంగం కుదేలైంది. స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినడంతో వ్యాపారులు పెద్ద నగరాలకు తరలిపోయారు. -
మేనమామ కాదు.. మేకవన్నె పులి
ఓట్ల వేటలో.. చిన్నారులనూ పావులను చేసి... వారి చదువులను చట్టుబండలు చేసి... బైజూసనీ... ట్యాబ్లనీ.. టోఫెలనీ... ఐబీ అనీ... అమాయక పిల్లల్ని అర్థంలేని ప్రయోగాలకు బలి చేసిన... అయోమయం జగన్నాథం.... ఆంధ్రావని చేసుకున్న పాపం! -
ప్లాస్టర్ తీసేసిన సీఎం.. వెలంపల్లి ‘కట్టు’ కథా ముగిసింది!
సీఎం జగన్ నుదిటిపై వేసుకున్న ప్లాస్టర్ను తీసేశారు. ఈనెల 13న విజయవాడలో గులకరాయి తగిలిన రోజు నుంచి 25 వరకూ ప్లాస్టర్తోనే కనిపించారు. శనివారం పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా సీఎం ప్లాస్టర్ లేకుండా కనిపించారు. -
ఇలాగేటి.. బాదేస్తన్రు!
ఉత్తరాంధ్ర ప్రజానీకం ఏ సంకోచాలు లేకుండా వైకాపా పాలనపై గళమెత్తుతోంది. జగన్ ప్రభుత్వంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. విశాఖ వంటి మహా నగరంలోనే కాదు శ్రీకాకుళం వంటి నగరం, పలాస, పాలకొండ వంటి పల్లెలను ఆనుకుని ఉన్న పెద్ద, చిన్న పట్టణ ప్రాంతాల్లోనే కాదు. -
వైద్య సీట్లకు కోత
వైకాపా ప్రభుత్వం సన్నద్ధంగా లేనందున ఎంబీబీఎస్ సీట్లకు కోత పడింది. 2024-25లో కొత్తగా ప్రారంభం కానున్న 5 వైద్య కళాశాలల్లో వంద చొప్పున మాత్రమే ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయబోతున్నారు. -
యువ ఓటర్ల భుజస్కంధాలపైనే దేశ భవిష్యత్తు
పోలింగ్ శాతం గణనీయంగా పెంచేందుకు ప్రతి జిల్లాలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. లెట్స్ ఓట్ సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా శనివారం గుంటూరులో 3కె వాక్ నిర్వహించాయి. -
ఉపాధి పనుల్లో పశువులు!
‘ఉపాధి’ పని చేస్తున్న కూలీల చిత్రం ఉండాల్సిన చోట గేదెల చిత్రం అప్లోడ్ చేశారు.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల ఉపాధి ఉద్యోగులు. -
సంపాదనపై కాదు.. నేర్చుకోవడంపై దృష్టి సారించాలి
యువ న్యాయవాదులు ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో సంపాదనపై కాకుండా నేర్చుకోవడంపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు. -
‘ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ని విధుల నుంచి తప్పించండి’
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి నిరుద్యోగులను ప్రభావితం చేసేలా ఈనెల 29న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం (ఏపీఎన్ఎఫ్) అధ్యక్షుడు బి.శ్రీరాములు పేర్కొన్నారు. -
వారాంతమిస్తానని.. వాయింపే.. వాయింపు!
అధికారంలోకి రావడానికి జగన్ అన్ని వర్గాలను పావులుగా వాడుకున్నారు. ఎన్నెన్నో హామీలను గుప్పించారు. అన్నింటినీ నెరవేరుస్తానంటూ మ్యానిఫెస్టో ముద్రించారు. -
గులకరాయి కేసు నిందితుడికి ముగిసిన పోలీసు కస్టడీ
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ మూడు రోజుల పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. -
పాలిసెట్- 2024కి 88.74 శాతం మంది హాజరు
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్-2024కు 88.74శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా