మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు.
ద్రవిడ వర్సిటీలో బోధనేతర పోస్టులను ‘బోధన’గా మార్పు
ఉన్నత విద్యామండలి కీలక అధికారి సహకారం
యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన
ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. వర్సిటీ విభాగాలపై ఒత్తిడి తెచ్చి, బోధనేతర సిబ్బందిని అధ్యాపకులుగా మార్చారు. దీనికి ఉన్నత విద్యా మండలిలోని ఓ కీలక వ్యక్తి సహకారం అందించారు. ఇప్పటికే ఆ అత్యున్నతాధికారి బినామీ పేర్లతో విశాఖలో భారీగా ఎసైన్డ్ భూములను కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. చిత్తూరు జిల్లాలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో ద్రవిడ సాహిత్యం కోసం ప్రచురణల విభాగాన్ని ఏర్పాటు చేశారు.
ఇందులో అత్యున్నతాధికారి మేనల్లుడితో సహా 11మంది బోధనేతర సిబ్బంది పని చేస్తున్నారు. ఆయన మేనల్లుడు సహాయ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. వాస్తవంగా వీరు ద్రవిడ భాష పుస్తకాల ముద్రణ చేపట్టాలి. మేనల్లుడికి లబ్ధి చేకూర్చేందుకు ఆయా బోధనేతర పోస్టులను బోధనలోకి మార్చేందుకు అత్యున్నతాధికారి తన అధికారాన్ని వినియోగించారు. దీంతో డైరెక్టర్ పోస్టును ప్రొఫెసర్గా, డిప్యూటీ డైరెక్టర్ను అసోసియేట్ ప్రొఫెసర్గా, ఎడిటోరియల్ సహాయకులు, సహాయ డైరెక్టర్లు, సహాయ ఎడిటర్ పోస్టులను సహాయ ఆచార్యులుగా మార్పు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చేసింది.
నిబంధనల ఉల్లంఘన
ఉమ్మడి ఏపీలో 1999లో ఇచ్చిన ఉత్తర్వులు-208 ప్రకారం.. సహాయ ఆచార్యుల భర్తీకి దేశవ్యాప్తంగా ప్రకటన ఇచ్చి, నియామక ప్రక్రియ చేపట్టాలి. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం.. బోధనేతర పోస్టులను బోధనలోకి మార్చకూడదని ఉమ్మడి ఏపీలోని అన్ని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యామండలికి 2007 మార్చి 23న ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ రెండింటికీ విరుద్ధంగా ద్రవిడ వర్సిటీలో బోధనేతర పోస్టులను బోధన విభాగంలోకి మార్చారు. దీన్ని ఆడిట్ విభాగం మొదట తప్పుపట్టింది. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన తర్వాత ఆడిట్ విభాగానికి అభ్యంతరం ఏంటంటూ అత్యున్నతాధికారి ప్రశ్నించడంతో ఆ అభ్యంతరాలు తొలగిపోయాయి.
గూడుపుఠాణీ
వర్సిటీలోని బోధనేతర పోస్టులను బోధన పోస్టులుగా మార్చేందుకు మొదట ఉన్నత విద్యామండలి తరఫున ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు సత్యనారాయణ, శ్రీకాంత్రెడ్డి, బాబివర్దన్లు సభ్యులుగా.. ఉన్నత విద్యా మండలికి చెందిన శ్రీరంగం మేథ్యూ కన్వీనర్గా ఉన్నారు. ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్న శ్రీకాంత్రెడ్డి ఇప్పుడు వెంకటేశ్వర యూనివర్సిటీ వీసీ అయ్యారు. ఈ కమిటీ అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు ఉన్నత విద్యామండలిలోని కీలక అధికారి చక్రం తిప్పారు. విద్యార్హతలు ఉన్నందున, బోధనేతర విభాగంలో పని చేస్తున్నప్పటికీ వీరు తరగతులు చెబుతున్నట్లుగా నివేదికలో పేర్కొన్నారు. పాఠాలు బోధిస్తున్నందున వీరిని ఆచార్యులుగా మార్చవచ్చని కమిటీ సిఫార్సు చేసింది. ఆ నివేదికను వర్సిటీ పాలకవర్గంలో పెట్టి ఆమోదించేశారు. అనంతరం దాన్ని ప్రభుత్వానికి పంపి, బోధన పోస్టులుగా మార్చేశారు. అత్యున్నతాధికారి మేనల్లుడు ఒక్కరికే ప్రయోజనం కల్పిస్తే ఇబ్బందులు వస్తాయని, ఆ విభాగంలో పని చేస్తున్న 11 మందినీ మార్చారు. ప్రస్తుతం వీరు తమకు పదోన్నతులు కల్పించాలంటూ ఒత్తిడి చేస్తుండటం గమనార్హం.
ప్రచురణ విభాగంలో నియమించేందుకే ముగ్గురికి అర్హత లేదని, విద్యార్హతలు లేకుండా వారిని తీసుకున్నారని గతంలో ఇద్దరు విశ్రాంత వీసీలతో ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికలో పేర్కొంది. దాని ప్రకారం.. వారిని ఉద్యోగాల నుంచి తొలగించాల్సి ఉండగా, ఇప్పుడు ఏకంగా బోధన పోస్టుల్లోకి తీసుకోవడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు