మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు.
ద్రవిడ వర్సిటీలో బోధనేతర పోస్టులను ‘బోధన’గా మార్పు
ఉన్నత విద్యామండలి కీలక అధికారి సహకారం
యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన
ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. వర్సిటీ విభాగాలపై ఒత్తిడి తెచ్చి, బోధనేతర సిబ్బందిని అధ్యాపకులుగా మార్చారు. దీనికి ఉన్నత విద్యా మండలిలోని ఓ కీలక వ్యక్తి సహకారం అందించారు. ఇప్పటికే ఆ అత్యున్నతాధికారి బినామీ పేర్లతో విశాఖలో భారీగా ఎసైన్డ్ భూములను కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. చిత్తూరు జిల్లాలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో ద్రవిడ సాహిత్యం కోసం ప్రచురణల విభాగాన్ని ఏర్పాటు చేశారు.
ఇందులో అత్యున్నతాధికారి మేనల్లుడితో సహా 11మంది బోధనేతర సిబ్బంది పని చేస్తున్నారు. ఆయన మేనల్లుడు సహాయ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. వాస్తవంగా వీరు ద్రవిడ భాష పుస్తకాల ముద్రణ చేపట్టాలి. మేనల్లుడికి లబ్ధి చేకూర్చేందుకు ఆయా బోధనేతర పోస్టులను బోధనలోకి మార్చేందుకు అత్యున్నతాధికారి తన అధికారాన్ని వినియోగించారు. దీంతో డైరెక్టర్ పోస్టును ప్రొఫెసర్గా, డిప్యూటీ డైరెక్టర్ను అసోసియేట్ ప్రొఫెసర్గా, ఎడిటోరియల్ సహాయకులు, సహాయ డైరెక్టర్లు, సహాయ ఎడిటర్ పోస్టులను సహాయ ఆచార్యులుగా మార్పు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చేసింది.
నిబంధనల ఉల్లంఘన
ఉమ్మడి ఏపీలో 1999లో ఇచ్చిన ఉత్తర్వులు-208 ప్రకారం.. సహాయ ఆచార్యుల భర్తీకి దేశవ్యాప్తంగా ప్రకటన ఇచ్చి, నియామక ప్రక్రియ చేపట్టాలి. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం.. బోధనేతర పోస్టులను బోధనలోకి మార్చకూడదని ఉమ్మడి ఏపీలోని అన్ని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యామండలికి 2007 మార్చి 23న ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ రెండింటికీ విరుద్ధంగా ద్రవిడ వర్సిటీలో బోధనేతర పోస్టులను బోధన విభాగంలోకి మార్చారు. దీన్ని ఆడిట్ విభాగం మొదట తప్పుపట్టింది. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన తర్వాత ఆడిట్ విభాగానికి అభ్యంతరం ఏంటంటూ అత్యున్నతాధికారి ప్రశ్నించడంతో ఆ అభ్యంతరాలు తొలగిపోయాయి.
గూడుపుఠాణీ
వర్సిటీలోని బోధనేతర పోస్టులను బోధన పోస్టులుగా మార్చేందుకు మొదట ఉన్నత విద్యామండలి తరఫున ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు సత్యనారాయణ, శ్రీకాంత్రెడ్డి, బాబివర్దన్లు సభ్యులుగా.. ఉన్నత విద్యా మండలికి చెందిన శ్రీరంగం మేథ్యూ కన్వీనర్గా ఉన్నారు. ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్న శ్రీకాంత్రెడ్డి ఇప్పుడు వెంకటేశ్వర యూనివర్సిటీ వీసీ అయ్యారు. ఈ కమిటీ అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు ఉన్నత విద్యామండలిలోని కీలక అధికారి చక్రం తిప్పారు. విద్యార్హతలు ఉన్నందున, బోధనేతర విభాగంలో పని చేస్తున్నప్పటికీ వీరు తరగతులు చెబుతున్నట్లుగా నివేదికలో పేర్కొన్నారు. పాఠాలు బోధిస్తున్నందున వీరిని ఆచార్యులుగా మార్చవచ్చని కమిటీ సిఫార్సు చేసింది. ఆ నివేదికను వర్సిటీ పాలకవర్గంలో పెట్టి ఆమోదించేశారు. అనంతరం దాన్ని ప్రభుత్వానికి పంపి, బోధన పోస్టులుగా మార్చేశారు. అత్యున్నతాధికారి మేనల్లుడు ఒక్కరికే ప్రయోజనం కల్పిస్తే ఇబ్బందులు వస్తాయని, ఆ విభాగంలో పని చేస్తున్న 11 మందినీ మార్చారు. ప్రస్తుతం వీరు తమకు పదోన్నతులు కల్పించాలంటూ ఒత్తిడి చేస్తుండటం గమనార్హం.
ప్రచురణ విభాగంలో నియమించేందుకే ముగ్గురికి అర్హత లేదని, విద్యార్హతలు లేకుండా వారిని తీసుకున్నారని గతంలో ఇద్దరు విశ్రాంత వీసీలతో ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికలో పేర్కొంది. దాని ప్రకారం.. వారిని ఉద్యోగాల నుంచి తొలగించాల్సి ఉండగా, ఇప్పుడు ఏకంగా బోధన పోస్టుల్లోకి తీసుకోవడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!