రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి.
రాజకీయ పార్టీలను అన్నదాతలు నిలదీయాలి
వ్యవసాయం అంటరాని వృత్తిగా మారిపోయింది
చట్టసభల్లో కర్షకులకు ప్రాతినిధ్యం లేదు
విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ వ్యాఖ్యలు
ఈనాడు - అమరావతి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. లేనిపక్షంలో కొన్ని సంపన్న కుటుంబాలకు చెందిన వ్యక్తుల ఆధిపత్యంలోనే ఆ వ్యవస్థలు ఉండిపోయి రైతాంగానికి న్యాయం లభించదు. దీన్ని సాధించుకోవడానికి అన్నదాతల్లో రాజకీయ చైతన్యం రావాలి. ఇందుకోసం రైతు సంఘాలు పోరాడాలి. తమకు ఏం చేయబోతున్నారని రాజకీయ పార్టీలను రైతాంగం నిలదీయాల్సిన సమయం, సందర్భం వచ్చాయి’ అని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అభిప్రాయపడ్డారు. కృష్ణా జిల్లా వీరవల్లిలో కృష్ణా మిల్క్ యూనియన్(విజయ డెయిరీ) కొత్తగా నిర్మించిన ‘కామధేను’ యూనిట్ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాల సంఘాల ప్రతినిధులు, రైతులతో నిర్వహించిన సమావేశంలో జస్టిస్ రమణ మాట్లాడుతూ... ‘రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి అన్నం పెడుతున్న రైతుకు గుర్తింపు లేదు. ఈ ఆధునిక యుగంలో పారిశ్రామికీకరణ పెరిగాక వ్యవసాయం అంటరాని వృత్తిగా మారింది. అధికారంలో ఉన్న పార్టీలుగానీ, ప్రతిపక్షాలుగానీ దేశంలోని కోట్ల మంది రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాల్ని చేపట్టడం లేదు’ అని ఆయన అన్నారు. దేశంలో వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తించలేదని, చట్ట ప్రకారం అవసరమైన రక్షణ లేదని అన్నారు.
ఒక్కోసారి న్యాయవ్యవస్థా దుర్మార్గంగా ఆలోచిస్తుంది
ప్రస్తుతం వివిధ వ్యవస్థల్లో, ప్రత్యేకించి న్యాయవ్యవస్థలో వ్యవసాయదారుల కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారు తక్కువగా ఉన్నారని, అక్కడ రైతుల గురించి ఒక్కోసారి చాలా దుర్మార్గంగా ఆలోచిస్తారని జస్టిస్ రమణ తెలిపారు. ‘ఒకసారి సుప్రీంకోర్టుకు.. ఒక రైతు భూమికి పరిహారం గురించిన కేసు వచ్చింది. నా సహచర న్యాయమూర్తి ఆ రైతు గురించి కొంత చులకనగా మాట్లాడారు. తాత తండ్రుల నుంచి సంక్రమించిన ఆ భూమికి ప్రభుత్వం ఎంతో కొంత పరిహారం ఇచ్చినప్పుడు ఆ రైతు సుప్రీంకోర్టు దాకా వచ్చి పోరాడాల్సిన అవసరమేమిటన్నట్లు వ్యాఖ్యలు చేశారు. భూమికి, రైతుకు మధ్య సంబంధం... తల్లికి బిడ్డకు మధ్య ఉండే అనుబంధం వంటిదని, రైతు భూమిని కోల్పోతే కుటుంబం సర్వస్వాన్నీ పోగొట్టుకున్నట్లు బాధపడతారని ఆ న్యాయమూర్తికి అర్థమయ్యేలా చెప్పడానికి నాకు ఒకరోజు పట్టింది. ఆయా నేపథ్యాల నుంచి వచ్చినవారు కీలక పోస్టుల్లో ఉన్నప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది. అందుకే రైతులు, రైతుకూలీల వంటి వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలంటున్నాను’ అని ఆయన చెప్పారు.
చట్టసభల్లో రైతు ప్రతినిధులు లేకపోవడం వల్లే అన్యాయం
కొన్నేళ్లుగా చట్టసభల్లో రైతు ప్రతినిధులు లేకుండా పోవడం వల్లే రైతాంగ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 1985 వరకు చట్టసభల్లో రైతుకు ప్రాధాన్యం ఉండేది. రాజకీయ పార్టీలు రైతు నాయకులకు టికెట్లు ఇచ్చి ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిపించేవి. అన్నదాతలకు ప్రాధాన్యమిస్తున్నామని ఘనంగా చెప్పుకొనేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. పారిశ్రామికవేత్తలు, ఉన్నత ఉద్యోగాలు చేసి పదవీ విరమణ పొందిన వారు, ధనవంతులకే చట్టసభల్లో ప్రాతినిధ్యం లభిస్తోంది. ఇప్పుడున్న పారిశ్రామికవేత్తలు రైతుల ముసుగులో వచ్చి చట్టసభల్లో చెలామణీ అవుతున్నారు. ఇటీవల పార్లమెంటులో అనేక రైతు వ్యతిరేక చట్టాల్ని ఆమోదించారు. వాటిని ప్రశ్నించేవారు లేరు. వాటిపై ఎవరైనా కోర్టుల్లో కేసులు వేసినా.. అవి తేలేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు’ అని జస్టిస్ రమణ చెప్పారు. ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణాదిన రైతు సంఘాల్లో ఐక్యత చాలా తక్కువని అభిప్రాయపడ్డారు. ‘కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వం చేసిన కొన్ని చట్టాలు రైతులకు హాని చేస్తాయంటూ ఉత్తరభారతంలో అన్నదాతలు సంవత్సరంపాటు దిల్లీ వీధుల్లో చలి, ఎండ, వానల్ని భరిస్తూ, టెంట్లు వేసుకుని, పోలీసుల లాఠీ దెబ్బలు తిని పోరాటం చేశారు. ఆ చట్టాల్ని ప్రభుత్వం ఉపసంహరించుకునేలా చేసిన ఘనత రైతు సంఘాలకు దక్కింది. ఈ రోజుకూ ఉత్తరభారతంలో రైతు సంఘాలన్నా, రైతు సమస్యలన్నా... అన్ని పార్టీలూ పట్టించుకుని న్యాయం చేస్తాయి. దురదృష్టవశాత్తూ ఇక్కడ అలాంటి రైతు సంఘాలుగానీ, సంఘటిత శక్తిగానీ లేక బలహీనంగా కనిపిస్తున్నాం. కాబట్టే ప్రభుత్వాలు రైతుల సమస్యల్ని పట్టించుకోవడం లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
నా మూలాలు ఇక్కడే ఉన్నాయని మరువను
జస్టిస్ ఎన్.వి.రమణను కృష్ణా మిల్క్ యూనియన్ పాలక మండలి ఘనంగా సన్మానించింది. మ్యాక్ చట్టాలపై జస్టిస్ రమణ గతంలో ఇచ్చిన తీర్పుల వల్లే ఈ రోజు కృష్ణా మిల్క్ యూనియన్ నిలదొక్కుకోవడంతో పాటు, ఇంత పురోగతి సాధించిందని ఛైర్మన్ చలసాని ఆంజనేయులు కొనియాడారు. ‘దిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే. నేను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినా నా మూలాలు కృష్ణా జిల్లాలోనే ఉన్నాయన్న విషయాన్ని మరవను. మనం ఎన్ని ఘన విజయాలు సాధించినా అంతిమంగా సొంతూరు, సొంత మనుషుల మధ్య సంబరం చేసుకోవడం, ఆనందించడం గొప్ప అనుభూతి’ అని జస్టిస్ రమణ పేర్కొన్నారు.
లీగల్ సర్వీసెస్ అథారిటీ సేవల్ని వినియోగించుకోవాలి
‘కొన్ని కంపెనీలు రోడ్లు వేసేటప్పుడు, ప్రాజెక్టులు కట్టేటప్పుడు రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా వారి భూముల్ని లాగేసుకున్న సందర్భాలున్నాయని కొందరు నా దృష్టికి తెచ్చారు. ఇలాంటి వారి సమస్యల్ని రైతు సంఘాలు పట్టించుకోవాలి. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఖర్చు లేకుండానే న్యాయం పొందవచ్చు’ అని జస్టిస్ రమణ సూచించారు. రైతులు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వృత్తిలో ఉన్నారని, నిరంతరం ఎండల్లో.. క్రిమిసంహారకాల మధ్య పనిచేయడం వల్ల వారు క్యాన్సర్ వంటి వ్యాధుల బారినపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ‘రైతులకు సెలవు, విశ్రాంతి లేవు. హ్యాపీ ట్రిప్లు ఉండవు. రైతు పండిస్తే తినే దేశంలో రైతుకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చెప్పాను. ఇప్పుడున్న వాతావరణంలో, ప్రత్యేకించి ఎన్నికల సందర్భంలో ఇంకా ఎక్కువ మాట్లాడితే రాజకీయ కోణాల్లో ఆలోచించి దురుద్దేశాలు ఆపాదించే పరిస్థితి ఉంటుంది’ అని ఆయన అన్నారు. ‘మీ పిల్లలు బాగా చదువుకుని మంచి ఉద్యోగులుగా, జడ్జీలుగా, పారిశ్రామికవేత్తలుగా తయారవ్వాలి. మీ తాత తండ్రుల నుంచి కొన్ని తరాలుగా మీరు సమాజానికి సేవ చేశారు. జీవితాల్ని త్యాగం చేశారు. ఇది మీరు అనుభవించాల్సిన సమయం’ అని రైతులనుద్దేశించి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం