రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి.
రాజకీయ పార్టీలను అన్నదాతలు నిలదీయాలి
వ్యవసాయం అంటరాని వృత్తిగా మారిపోయింది
చట్టసభల్లో కర్షకులకు ప్రాతినిధ్యం లేదు
విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ వ్యాఖ్యలు
ఈనాడు - అమరావతి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. లేనిపక్షంలో కొన్ని సంపన్న కుటుంబాలకు చెందిన వ్యక్తుల ఆధిపత్యంలోనే ఆ వ్యవస్థలు ఉండిపోయి రైతాంగానికి న్యాయం లభించదు. దీన్ని సాధించుకోవడానికి అన్నదాతల్లో రాజకీయ చైతన్యం రావాలి. ఇందుకోసం రైతు సంఘాలు పోరాడాలి. తమకు ఏం చేయబోతున్నారని రాజకీయ పార్టీలను రైతాంగం నిలదీయాల్సిన సమయం, సందర్భం వచ్చాయి’ అని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అభిప్రాయపడ్డారు. కృష్ణా జిల్లా వీరవల్లిలో కృష్ణా మిల్క్ యూనియన్(విజయ డెయిరీ) కొత్తగా నిర్మించిన ‘కామధేను’ యూనిట్ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాల సంఘాల ప్రతినిధులు, రైతులతో నిర్వహించిన సమావేశంలో జస్టిస్ రమణ మాట్లాడుతూ... ‘రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి అన్నం పెడుతున్న రైతుకు గుర్తింపు లేదు. ఈ ఆధునిక యుగంలో పారిశ్రామికీకరణ పెరిగాక వ్యవసాయం అంటరాని వృత్తిగా మారింది. అధికారంలో ఉన్న పార్టీలుగానీ, ప్రతిపక్షాలుగానీ దేశంలోని కోట్ల మంది రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాల్ని చేపట్టడం లేదు’ అని ఆయన అన్నారు. దేశంలో వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తించలేదని, చట్ట ప్రకారం అవసరమైన రక్షణ లేదని అన్నారు.
ఒక్కోసారి న్యాయవ్యవస్థా దుర్మార్గంగా ఆలోచిస్తుంది
ప్రస్తుతం వివిధ వ్యవస్థల్లో, ప్రత్యేకించి న్యాయవ్యవస్థలో వ్యవసాయదారుల కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారు తక్కువగా ఉన్నారని, అక్కడ రైతుల గురించి ఒక్కోసారి చాలా దుర్మార్గంగా ఆలోచిస్తారని జస్టిస్ రమణ తెలిపారు. ‘ఒకసారి సుప్రీంకోర్టుకు.. ఒక రైతు భూమికి పరిహారం గురించిన కేసు వచ్చింది. నా సహచర న్యాయమూర్తి ఆ రైతు గురించి కొంత చులకనగా మాట్లాడారు. తాత తండ్రుల నుంచి సంక్రమించిన ఆ భూమికి ప్రభుత్వం ఎంతో కొంత పరిహారం ఇచ్చినప్పుడు ఆ రైతు సుప్రీంకోర్టు దాకా వచ్చి పోరాడాల్సిన అవసరమేమిటన్నట్లు వ్యాఖ్యలు చేశారు. భూమికి, రైతుకు మధ్య సంబంధం... తల్లికి బిడ్డకు మధ్య ఉండే అనుబంధం వంటిదని, రైతు భూమిని కోల్పోతే కుటుంబం సర్వస్వాన్నీ పోగొట్టుకున్నట్లు బాధపడతారని ఆ న్యాయమూర్తికి అర్థమయ్యేలా చెప్పడానికి నాకు ఒకరోజు పట్టింది. ఆయా నేపథ్యాల నుంచి వచ్చినవారు కీలక పోస్టుల్లో ఉన్నప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది. అందుకే రైతులు, రైతుకూలీల వంటి వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలంటున్నాను’ అని ఆయన చెప్పారు.
చట్టసభల్లో రైతు ప్రతినిధులు లేకపోవడం వల్లే అన్యాయం
కొన్నేళ్లుగా చట్టసభల్లో రైతు ప్రతినిధులు లేకుండా పోవడం వల్లే రైతాంగ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 1985 వరకు చట్టసభల్లో రైతుకు ప్రాధాన్యం ఉండేది. రాజకీయ పార్టీలు రైతు నాయకులకు టికెట్లు ఇచ్చి ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిపించేవి. అన్నదాతలకు ప్రాధాన్యమిస్తున్నామని ఘనంగా చెప్పుకొనేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. పారిశ్రామికవేత్తలు, ఉన్నత ఉద్యోగాలు చేసి పదవీ విరమణ పొందిన వారు, ధనవంతులకే చట్టసభల్లో ప్రాతినిధ్యం లభిస్తోంది. ఇప్పుడున్న పారిశ్రామికవేత్తలు రైతుల ముసుగులో వచ్చి చట్టసభల్లో చెలామణీ అవుతున్నారు. ఇటీవల పార్లమెంటులో అనేక రైతు వ్యతిరేక చట్టాల్ని ఆమోదించారు. వాటిని ప్రశ్నించేవారు లేరు. వాటిపై ఎవరైనా కోర్టుల్లో కేసులు వేసినా.. అవి తేలేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు’ అని జస్టిస్ రమణ చెప్పారు. ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణాదిన రైతు సంఘాల్లో ఐక్యత చాలా తక్కువని అభిప్రాయపడ్డారు. ‘కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వం చేసిన కొన్ని చట్టాలు రైతులకు హాని చేస్తాయంటూ ఉత్తరభారతంలో అన్నదాతలు సంవత్సరంపాటు దిల్లీ వీధుల్లో చలి, ఎండ, వానల్ని భరిస్తూ, టెంట్లు వేసుకుని, పోలీసుల లాఠీ దెబ్బలు తిని పోరాటం చేశారు. ఆ చట్టాల్ని ప్రభుత్వం ఉపసంహరించుకునేలా చేసిన ఘనత రైతు సంఘాలకు దక్కింది. ఈ రోజుకూ ఉత్తరభారతంలో రైతు సంఘాలన్నా, రైతు సమస్యలన్నా... అన్ని పార్టీలూ పట్టించుకుని న్యాయం చేస్తాయి. దురదృష్టవశాత్తూ ఇక్కడ అలాంటి రైతు సంఘాలుగానీ, సంఘటిత శక్తిగానీ లేక బలహీనంగా కనిపిస్తున్నాం. కాబట్టే ప్రభుత్వాలు రైతుల సమస్యల్ని పట్టించుకోవడం లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
నా మూలాలు ఇక్కడే ఉన్నాయని మరువను
జస్టిస్ ఎన్.వి.రమణను కృష్ణా మిల్క్ యూనియన్ పాలక మండలి ఘనంగా సన్మానించింది. మ్యాక్ చట్టాలపై జస్టిస్ రమణ గతంలో ఇచ్చిన తీర్పుల వల్లే ఈ రోజు కృష్ణా మిల్క్ యూనియన్ నిలదొక్కుకోవడంతో పాటు, ఇంత పురోగతి సాధించిందని ఛైర్మన్ చలసాని ఆంజనేయులు కొనియాడారు. ‘దిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే. నేను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినా నా మూలాలు కృష్ణా జిల్లాలోనే ఉన్నాయన్న విషయాన్ని మరవను. మనం ఎన్ని ఘన విజయాలు సాధించినా అంతిమంగా సొంతూరు, సొంత మనుషుల మధ్య సంబరం చేసుకోవడం, ఆనందించడం గొప్ప అనుభూతి’ అని జస్టిస్ రమణ పేర్కొన్నారు.
లీగల్ సర్వీసెస్ అథారిటీ సేవల్ని వినియోగించుకోవాలి
‘కొన్ని కంపెనీలు రోడ్లు వేసేటప్పుడు, ప్రాజెక్టులు కట్టేటప్పుడు రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా వారి భూముల్ని లాగేసుకున్న సందర్భాలున్నాయని కొందరు నా దృష్టికి తెచ్చారు. ఇలాంటి వారి సమస్యల్ని రైతు సంఘాలు పట్టించుకోవాలి. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఖర్చు లేకుండానే న్యాయం పొందవచ్చు’ అని జస్టిస్ రమణ సూచించారు. రైతులు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వృత్తిలో ఉన్నారని, నిరంతరం ఎండల్లో.. క్రిమిసంహారకాల మధ్య పనిచేయడం వల్ల వారు క్యాన్సర్ వంటి వ్యాధుల బారినపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ‘రైతులకు సెలవు, విశ్రాంతి లేవు. హ్యాపీ ట్రిప్లు ఉండవు. రైతు పండిస్తే తినే దేశంలో రైతుకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చెప్పాను. ఇప్పుడున్న వాతావరణంలో, ప్రత్యేకించి ఎన్నికల సందర్భంలో ఇంకా ఎక్కువ మాట్లాడితే రాజకీయ కోణాల్లో ఆలోచించి దురుద్దేశాలు ఆపాదించే పరిస్థితి ఉంటుంది’ అని ఆయన అన్నారు. ‘మీ పిల్లలు బాగా చదువుకుని మంచి ఉద్యోగులుగా, జడ్జీలుగా, పారిశ్రామికవేత్తలుగా తయారవ్వాలి. మీ తాత తండ్రుల నుంచి కొన్ని తరాలుగా మీరు సమాజానికి సేవ చేశారు. జీవితాల్ని త్యాగం చేశారు. ఇది మీరు అనుభవించాల్సిన సమయం’ అని రైతులనుద్దేశించి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM