సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు.
గ్రామస్థులతో చర్చ పేరుతో జగన్ భజన
సమావేశం అంతా ఐ ప్యాక్ కనుసన్నల్లోనే
సీఎంపై పొగడ్తలతోనే సరిపెట్టారు
ఈనాడు, కర్నూలు: గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. వెంటనే అక్కడకు వచ్చినవారు భజన మొదలుపెట్టారు. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం యర్రగుంట్లలో సీఎం జగన్ ప్రజలతో ‘ముఖాముఖి’ కాస్తా.. భ‘జన’సభగా మారింది. మాట్లాడినవారంతా జగన్పై పొగడ్తలతోనే సరిపెట్టారు. ఎర్రగుంట్లలో గురువారం నిర్వహించిన సమావేశం మొత్తం సీఎంను పొగుడుతూ, ప్రభుత్వ పథకాలతో తమ జీవితాలు పూర్తిగా మారిపోయినట్లు మాట్లాడించారు. ఐప్యాక్ సభ్యుల ఆధ్వర్యంలో ముందే పలువురు లబ్ధిదారులకు శిక్షణ ఇచ్చారు. కొందరు మాట్లాడిన తీరు చూస్తే... బట్టీకొట్టి వచ్చినట్లు అర్థమవుతుంది. కార్యక్రమానికి వచ్చేవారిపై కఠిన ఆంక్షలు విధించారు. పాస్ ఉన్నవారు తప్ప వేరెవ్వరూ రాకుండా ఏర్పాట్లు చేశారు. పాస్లు ఉన్నవారిపైనా సెల్ఫోన్లు, పెన్నులు, చేతిరుమాలు, మంచినీటి సీసాలు, పుస్తకాలు తీసుకెళ్లనివ్వకుండా ఆంక్షలు విధించారు.
మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించకుండా కార్యక్రమం గుట్టుగా నిర్వహించారు. ప్రాంగణం మొత్తానికి పరదాలు కట్టేశారు. లోపల ఉన్నవారికి తప్ప బయట ఉన్నవారికి కార్యక్రమం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ యర్రగుంట్లలో 1,496 ఇళ్లు ఉండగా అందులో 1,391 ఇళ్ల వారికి ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరిందని చెప్పారు. అన్ని పథకాలద్వారా రూ.48.74 కోట్ల ప్రయోజనం కలిగిందన్నారు. తర్వాత ప్రజలతో సీఎం ముఖాముఖి ప్రారంభమైంది. తన కుమార్తెకు కళ్లు కనిపించవని, పింఛను అందట్లేదని సీఎం సమక్షంలో ఒకరు రోదించగా.. కారణాలు కనుక్కొంటానని సమాధానమిచ్చారు.
అంతా వైకాపా కార్యకర్తలే
యర్రగుంట్లకు చెందిన పుష్పలత జగన్ను పొగడ్తలతో ముంచెత్తారు. సంక్షేమ పథకాలతో లాభం పొందానని, వచ్చే అయిదేళ్లు జగనే సీఎం కావాలని కోరుకోవడంతో పాటు ‘వైనాట్ 175’ అన్నారు. గోవిందపల్లెకు చెందిన వైకాపా ఎంపీటీసీ సభ్యురాలు వాణి సాధారణ పౌరురాలిలా మాట్లాడారు. మహిళా సాధికారత జగన్తోనే సాధ్యమని, ఈ పాలనలో పేదరికం, అవినీతి తగ్గుతున్నాయని చెప్పారు. ఆళ్లగడ్డకు చెందిన అపర్ణ, ప్రసాద్ అనే దివ్యాంగ దంపతులు తమను తాము జగన్ అభిమానులుగా పేర్కొంటూ ప్రసంగించారు. తామిద్దరికి నెలకు రూ.6వేల పింఛను అందుతోందని, జగన్ చిత్రపటాన్ని గీసి చూపించారు. తర్వాత జగన్ డైలాగ్లను మిమిక్రీ చేస్తూ వినిపించారు.
రైతుపై వైకాపా నాయకుల దాడి
సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వస్తున్న రైతులపై వైకాపా నాయకులు దాడి చేశారు. సభాస్థలికి ఎదురుగా ఉన్న జాతీయరహదారిపైకి ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియ వచ్చారు. ఆమె ముఖ్యమంత్రికి రైతు సమస్యలపై వినతిపత్రం ఇవ్వాలని ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. తన స్థానంలో యర్రగుంట్ల రైతులు వినతిపత్రం ఇస్తారనడంతో సమ్మతించి అయిదుగురికి అనుమతిచ్చారు. వారు వినతిపత్రం ఇచ్చేందుకు వస్తుండగా వైకాపా నాయకులు అడ్డుకున్నారు. నాయకుల అనుచరులు ఒక రైతుపై దాడి చేశారు. ఆళ్లగడ్డలో బయల్దేరిన జగన్.. ఎర్రగుంట్ల, సిరువెళ్ల, దీబగుంట తదితర గ్రామాల్లో ఆగారు. పలు గ్రామాల్లో ఆగి ఆగి ప్రయాణించనున్న నేపథ్యంలో ఆళ్లగడ్డ-నంద్యాల మార్గంలో బస్సులను అనుమతించలేదు. నంద్యాల వెళ్లాల్సిన వాహనాలను దారిమళ్లించారు. దీంతో ఆ మార్గంలో పదేపదే ట్రాఫిక్ అవాంతరాలు తలెత్తి మండుటెండలో ప్రజలు ప్రత్యక్ష నరకం అనుభవించారు.
ఎన్నికల కోడ్కు పాతరేసి విచ్చలవిడిగా ఖర్చు: నంద్యాల సభకు జనాల్ని తరలించేందుకు కర్నూలు జిల్లాలోని వందల ఆర్టీసీ బస్సులతోపాటు తిరుపతి, చిత్తూరు, అలిపిరి, ప్రొద్దుటూరు, కడప, అనంతపురం తదితర సుదూర ప్రాంతాల్లోని బస్సులనూ తీసుకొచ్చారు. దీంతో రాయలసీమలోని పలు ప్రాంతాలకు చెందిన వేలమంది ప్రయాణికుల బస్టాండ్లలో నిరీక్షిస్తూ నరకం అనుభవించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వెచ్చించే ప్రతి పైసాకు లెక్కచూపాలి. ఆ స్పృహ లేకుండా వేల బస్సులను జనాల తరలింపునకు ఉపయోగించారు. అన్నిచోట్లా భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ