ఎన్నికల వేళ రూ.530 కోట్ల ఎర
కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులనూ ఇతర అవసరాలకు మళ్లించి పట్టణ స్థానిక సంస్థలను తీవ్ర అవస్థలకు గురి చేసిన జగన్ సర్కార్ ఎన్నికల వేళ సొంత పార్టీకి చెందిన పాలక వర్గాలను బుజ్జగించేందుకు కొత్త ఎత్తుగడ వేసింది.
పట్టణ స్థానిక సంస్థల్లో ఆర్థిక సంఘం పనుల పెండింగ్ బిల్లుల చెల్లింపు
పాలకవర్గాల మద్దతు కూడగట్టేలా జగన్ ప్రభుత్వం ఎత్తుగడ
కోడ్కు ముందే ఉత్తర్వులు.. ఆలస్యంగా వెలుగులోకి
ఈనాడు, అమరావతి: కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులనూ ఇతర అవసరాలకు మళ్లించి పట్టణ స్థానిక సంస్థలను తీవ్ర అవస్థలకు గురి చేసిన జగన్ సర్కార్ ఎన్నికల వేళ సొంత పార్టీకి చెందిన పాలక వర్గాలను బుజ్జగించేందుకు కొత్త ఎత్తుగడ వేసింది. ఆర్థిక సంఘం నిధులతో గత మూడేళ్లలో చేసిన పనులకు కొన్ని బిల్లులు చెల్లించే ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రూ.530.50 కోట్ల నిధులను ఎన్నికల కోడ్ వెలువడే ముందు పట్టణ స్థానిక సంస్థలకు విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన మెమో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)తో సంబంధం లేకుండా పెండింగ్ బిల్లులను పుర కమిషనర్లే చెల్లించేలా ఆదేశాలిచ్చింది. పట్టణ స్థానిక సంస్థల్లో 2020-21, 2021-22, 2022-23లో కేంద్ర ఆర్థిక సంఘం నిధులతో చేసిన పనులకు సంబంధించిన బిల్లులను సీఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విడుదల చేయకుండా గత మూడేళ్లుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.
ఎన్నికలు నిర్వహించిన 100 పుర, నగరపాలక సంస్థల్లో, నగర పంచాయతీల్లో వైకాపాకి చెందిన వారే మేయర్లుగా, ఛైర్మన్లుగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో ఆర్థిక సంఘం పనులంటేనే టెండర్లు వేయడానికి గుత్తేదారులు భయపడుతున్నారు. కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను పట్టణ స్థానిక సంస్థల పీడీ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసి..ఖాతాలను సీఎఫ్ఎంఎస్ పోర్టల్కి అనుసంధానించింది. దీంతో ఈ నిధులతో చేసే పనులకు బిల్లుల చెల్లింపులపై రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతి తప్పనిసరి అయింది. పీడీ ఖాతాల్లో నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించి అప్పుడప్పుడు బిల్లులు చెల్లించింది. దీంతో వైకాపాకి చెందిన మేయర్లు, పురపాలక ఛైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కొద్దికాలంగా ప్రభుత్వంపై రగిలిపోతున్నారు. పనులు చేయించినా బిల్లులు రావడం లేదని కొందరైతే తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు.
పాత పనులే కొత్తగా చూపించి చెల్లింపులు...
ఆర్థిక సంఘం నిధులతో పనులు చేసి సీఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేసిన బిల్లులను ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం పుర కమిషనర్లు మొదట రద్దు చేయాలి. అదే పనుల కోసం పాలకవర్గాలతో మరోసారి తీర్మానం చేయించి బిల్లులు చెల్లించనున్నారు. పాత పనులే మరోసారి కొత్తగా చూపించి బిల్లులు చెల్లిస్తారు. ఇందుకోసం రూ.530.50 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను పట్టణ స్థానిక సంస్థల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. పూర్తి చేసిన పనులకే కొత్తగా మరోసారి బిల్లులు తయారు చేసి చెల్లింపులు చేయనున్నారు. ఎన్నికల వేళ బిల్లులు చెల్లించడం ద్వారా పనులు చేయించిన పాలకవర్గ సభ్యులు, వైకాపా అనుకూల గుత్తేదారుల అభిమానాన్ని చూరగొనాలని జగన్ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఎన్నికల కోడ్ వెలువడక ముందే ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఈనెల 5న పట్టణ స్థానిక సంస్థలకు మెమో జారీ చేశారు.
మరో రూ.1,000 కోట్ల నిధుల మాటేమిటి?
ఆర్థిక సంఘం నిధులతో చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపులకు 2022-23 సంవత్సరానికి కేంద్రం కేటాయించిన రూ.530.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2020-21, 2021-22 సంవత్సరాలకు కేంద్రం ఇచ్చిన నిధుల సంగతి ఏమిటన్నది పట్టణ స్థానిక సంస్థల నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్న. కేంద్రం నిధులు ఇచ్చినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. వాటిని ఇతర అవసరాలకు మళ్లించడం ద్వారా బిల్లుల చెల్లింపుల్లో జాప్యమైంది. ఇప్పుడు కూడా రెండేళ్లకు కేంద్రం ఇచ్చిన నిధులు ఊసెత్తకుండా..2022-23లో కేటాయించిన నిధులను పెండింగ్ బిల్లులకు వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఇవి కాకుండా గుత్తేదారులకు ఇంకా పెండింగ్ ఉన్న రూ.1,000 కోట్లను మరచిపోవలసిందేనా? అని పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు