ఎన్నికల వేళ రూ.530 కోట్ల ఎర
కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులనూ ఇతర అవసరాలకు మళ్లించి పట్టణ స్థానిక సంస్థలను తీవ్ర అవస్థలకు గురి చేసిన జగన్ సర్కార్ ఎన్నికల వేళ సొంత పార్టీకి చెందిన పాలక వర్గాలను బుజ్జగించేందుకు కొత్త ఎత్తుగడ వేసింది.
పట్టణ స్థానిక సంస్థల్లో ఆర్థిక సంఘం పనుల పెండింగ్ బిల్లుల చెల్లింపు
పాలకవర్గాల మద్దతు కూడగట్టేలా జగన్ ప్రభుత్వం ఎత్తుగడ
కోడ్కు ముందే ఉత్తర్వులు.. ఆలస్యంగా వెలుగులోకి
ఈనాడు, అమరావతి: కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులనూ ఇతర అవసరాలకు మళ్లించి పట్టణ స్థానిక సంస్థలను తీవ్ర అవస్థలకు గురి చేసిన జగన్ సర్కార్ ఎన్నికల వేళ సొంత పార్టీకి చెందిన పాలక వర్గాలను బుజ్జగించేందుకు కొత్త ఎత్తుగడ వేసింది. ఆర్థిక సంఘం నిధులతో గత మూడేళ్లలో చేసిన పనులకు కొన్ని బిల్లులు చెల్లించే ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రూ.530.50 కోట్ల నిధులను ఎన్నికల కోడ్ వెలువడే ముందు పట్టణ స్థానిక సంస్థలకు విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన మెమో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)తో సంబంధం లేకుండా పెండింగ్ బిల్లులను పుర కమిషనర్లే చెల్లించేలా ఆదేశాలిచ్చింది. పట్టణ స్థానిక సంస్థల్లో 2020-21, 2021-22, 2022-23లో కేంద్ర ఆర్థిక సంఘం నిధులతో చేసిన పనులకు సంబంధించిన బిల్లులను సీఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విడుదల చేయకుండా గత మూడేళ్లుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.
ఎన్నికలు నిర్వహించిన 100 పుర, నగరపాలక సంస్థల్లో, నగర పంచాయతీల్లో వైకాపాకి చెందిన వారే మేయర్లుగా, ఛైర్మన్లుగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో ఆర్థిక సంఘం పనులంటేనే టెండర్లు వేయడానికి గుత్తేదారులు భయపడుతున్నారు. కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను పట్టణ స్థానిక సంస్థల పీడీ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసి..ఖాతాలను సీఎఫ్ఎంఎస్ పోర్టల్కి అనుసంధానించింది. దీంతో ఈ నిధులతో చేసే పనులకు బిల్లుల చెల్లింపులపై రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతి తప్పనిసరి అయింది. పీడీ ఖాతాల్లో నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించి అప్పుడప్పుడు బిల్లులు చెల్లించింది. దీంతో వైకాపాకి చెందిన మేయర్లు, పురపాలక ఛైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కొద్దికాలంగా ప్రభుత్వంపై రగిలిపోతున్నారు. పనులు చేయించినా బిల్లులు రావడం లేదని కొందరైతే తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు.
పాత పనులే కొత్తగా చూపించి చెల్లింపులు...
ఆర్థిక సంఘం నిధులతో పనులు చేసి సీఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేసిన బిల్లులను ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం పుర కమిషనర్లు మొదట రద్దు చేయాలి. అదే పనుల కోసం పాలకవర్గాలతో మరోసారి తీర్మానం చేయించి బిల్లులు చెల్లించనున్నారు. పాత పనులే మరోసారి కొత్తగా చూపించి బిల్లులు చెల్లిస్తారు. ఇందుకోసం రూ.530.50 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను పట్టణ స్థానిక సంస్థల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. పూర్తి చేసిన పనులకే కొత్తగా మరోసారి బిల్లులు తయారు చేసి చెల్లింపులు చేయనున్నారు. ఎన్నికల వేళ బిల్లులు చెల్లించడం ద్వారా పనులు చేయించిన పాలకవర్గ సభ్యులు, వైకాపా అనుకూల గుత్తేదారుల అభిమానాన్ని చూరగొనాలని జగన్ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఎన్నికల కోడ్ వెలువడక ముందే ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఈనెల 5న పట్టణ స్థానిక సంస్థలకు మెమో జారీ చేశారు.
మరో రూ.1,000 కోట్ల నిధుల మాటేమిటి?
ఆర్థిక సంఘం నిధులతో చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపులకు 2022-23 సంవత్సరానికి కేంద్రం కేటాయించిన రూ.530.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2020-21, 2021-22 సంవత్సరాలకు కేంద్రం ఇచ్చిన నిధుల సంగతి ఏమిటన్నది పట్టణ స్థానిక సంస్థల నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్న. కేంద్రం నిధులు ఇచ్చినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. వాటిని ఇతర అవసరాలకు మళ్లించడం ద్వారా బిల్లుల చెల్లింపుల్లో జాప్యమైంది. ఇప్పుడు కూడా రెండేళ్లకు కేంద్రం ఇచ్చిన నిధులు ఊసెత్తకుండా..2022-23లో కేటాయించిన నిధులను పెండింగ్ బిల్లులకు వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఇవి కాకుండా గుత్తేదారులకు ఇంకా పెండింగ్ ఉన్న రూ.1,000 కోట్లను మరచిపోవలసిందేనా? అని పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
జగన్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ దయనీయంగా తయారైంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను విద్యుత్తు కోతల కష్టాలు పీడిస్తున్నాయి. -
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
‘ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడతా. జగనన్న ప్రభుత్వంలో నాకు, నా బిడ్డకు రక్షణ లేదు. వారణాసిలో కుమార్తెతో కలిసి తలదాచుకుంటున్నా..’ అని కాకినాడకు చెందిన రాజులపల్లి ఆరుద్ర తెలిపారు. -
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్లపై జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానానికి చరమగీతం పాడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నాసిక్ నుంచి స్టాంపు పేపర్లను తెప్పించడం ఇప్పటికే నిలిపేసింది. -
గోవా మద్యానికి ‘వైకాపా’ గ్రీన్ఛానల్!
సార్వత్రిక ఎన్నికల వేళ కొంతమంది వైకాపా నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యంతో జనాల్ని ప్రలోభపెడుతూ వారి ప్రాణాల్ని బలిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
అన్న క్లాస్.. తమ్ముడు మాస్.. భూములన్నీ ఖల్లాస్!
భూమిని నమ్ముకున్నోళ్లెవ్వరూ ఆగం కాలేదు. అందుకేనేమో.. వైకాపా నేతలంతా ఒకరిని మించి మరొకరు కబ్జాలకు తెరతీశారు. -
ఎవరి ఆధీనంలో ఎవరు?
ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా...? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది. -
బ్రో... ఏ రాష్ట్రానికి పొమ్మంటావ్?
మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడి ఎక్కడా అభివృద్ధి లేకుండా చేశారు. నిర్మాణ రంగం కుదేలైంది. స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినడంతో వ్యాపారులు పెద్ద నగరాలకు తరలిపోయారు. -
మేనమామ కాదు.. మేకవన్నె పులి
ఓట్ల వేటలో.. చిన్నారులనూ పావులను చేసి... వారి చదువులను చట్టుబండలు చేసి... బైజూసనీ... ట్యాబ్లనీ.. టోఫెలనీ... ఐబీ అనీ... అమాయక పిల్లల్ని అర్థంలేని ప్రయోగాలకు బలి చేసిన... అయోమయం జగన్నాథం.... ఆంధ్రావని చేసుకున్న పాపం! -
ప్లాస్టర్ తీసేసిన సీఎం.. వెలంపల్లి ‘కట్టు’ కథా ముగిసింది!
సీఎం జగన్ నుదిటిపై వేసుకున్న ప్లాస్టర్ను తీసేశారు. ఈనెల 13న విజయవాడలో గులకరాయి తగిలిన రోజు నుంచి 25 వరకూ ప్లాస్టర్తోనే కనిపించారు. శనివారం పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా సీఎం ప్లాస్టర్ లేకుండా కనిపించారు. -
ఇలాగేటి.. బాదేస్తన్రు!
ఉత్తరాంధ్ర ప్రజానీకం ఏ సంకోచాలు లేకుండా వైకాపా పాలనపై గళమెత్తుతోంది. జగన్ ప్రభుత్వంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. విశాఖ వంటి మహా నగరంలోనే కాదు శ్రీకాకుళం వంటి నగరం, పలాస, పాలకొండ వంటి పల్లెలను ఆనుకుని ఉన్న పెద్ద, చిన్న పట్టణ ప్రాంతాల్లోనే కాదు. -
వైద్య సీట్లకు కోత
వైకాపా ప్రభుత్వం సన్నద్ధంగా లేనందున ఎంబీబీఎస్ సీట్లకు కోత పడింది. 2024-25లో కొత్తగా ప్రారంభం కానున్న 5 వైద్య కళాశాలల్లో వంద చొప్పున మాత్రమే ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయబోతున్నారు. -
యువ ఓటర్ల భుజస్కంధాలపైనే దేశ భవిష్యత్తు
పోలింగ్ శాతం గణనీయంగా పెంచేందుకు ప్రతి జిల్లాలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. లెట్స్ ఓట్ సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా శనివారం గుంటూరులో 3కె వాక్ నిర్వహించాయి. -
ఉపాధి పనుల్లో పశువులు!
‘ఉపాధి’ పని చేస్తున్న కూలీల చిత్రం ఉండాల్సిన చోట గేదెల చిత్రం అప్లోడ్ చేశారు.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల ఉపాధి ఉద్యోగులు. -
సంపాదనపై కాదు.. నేర్చుకోవడంపై దృష్టి సారించాలి
యువ న్యాయవాదులు ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో సంపాదనపై కాకుండా నేర్చుకోవడంపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు. -
‘ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ని విధుల నుంచి తప్పించండి’
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి నిరుద్యోగులను ప్రభావితం చేసేలా ఈనెల 29న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం (ఏపీఎన్ఎఫ్) అధ్యక్షుడు బి.శ్రీరాములు పేర్కొన్నారు. -
వారాంతమిస్తానని.. వాయింపే.. వాయింపు!
అధికారంలోకి రావడానికి జగన్ అన్ని వర్గాలను పావులుగా వాడుకున్నారు. ఎన్నెన్నో హామీలను గుప్పించారు. అన్నింటినీ నెరవేరుస్తానంటూ మ్యానిఫెస్టో ముద్రించారు. -
గులకరాయి కేసు నిందితుడికి ముగిసిన పోలీసు కస్టడీ
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ మూడు రోజుల పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. -
పాలిసెట్- 2024కి 88.74 శాతం మంది హాజరు
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్-2024కు 88.74శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య