పప్పూబెల్లాల్లా ఉన్నత విద్యామండలి నిధులు
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేషీ నిర్వహణ, ప్రభుత్వ సలహాదారు (విద్య) సాంబశివారెడ్డి కారు బిల్లు, సచివాలయంలోని ఉన్నత విద్యాశాఖలో పని చేస్తున్న సిబ్బందికి జీతాభత్యాలకు ఉన్నత విద్యామండలి నిధులను పప్పూ బెల్లాల్లా ఖర్చు పెట్టేస్తున్నారు.
మంత్రి బొత్స పేషీ జీతభత్యాలకు నెలకు రూ.3 లక్షలు
వైకాపాకు ప్రచారం చేస్తున్న సలహాదారు సాంబశివారెడ్డి కారుకు నెలకు రూ.81 వేలు
ఈనాడు, అమరావతి: విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేషీ నిర్వహణ, ప్రభుత్వ సలహాదారు (విద్య) సాంబశివారెడ్డి కారు బిల్లు, సచివాలయంలోని ఉన్నత విద్యాశాఖలో పని చేస్తున్న సిబ్బందికి జీతాభత్యాలకు ఉన్నత విద్యామండలి నిధులను పప్పూ బెల్లాల్లా ఖర్చు పెట్టేస్తున్నారు. విద్యార్థుల ప్రయోజనం, విద్యాభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన నిధులను ఇలా ఏటా రూ.కోటికిపైగా ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారు. ఎంతోమంది పేద పిల్లలు తల్లిదండ్రులు కష్టపడి ప్రవేశ పరీక్షల దరఖాస్తు, కౌన్సెలింగ్ కోసం చెల్లించిన డబ్బులను విలాసాలకు వ్యయం చేస్తున్నారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో వైకాపా తరఫున ప్రచారం చేస్తున్న ప్రభుత్వ సలహాదారు సాంబశివారెడ్డి ఫిబ్రవరి నెల కారు కిరాయి కింద నిబంధనలకు విరుద్ధంగా ఉన్నత విద్యామండలి నుంచి రూ.81 వేలు తీసుకున్నారు. ఒక్క నెలలో ఆయన 1,635 కిలోమీటర్లు తిరిగారట.. ఎవరికి సలహాలు ఇవ్వడానికి ఇన్ని కిలోమీటర్లు తిరిగారో ఆయనకే తెలియాలి.
మంత్రి పేషీ అడ్డగోలు దోపిడీ..
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేషీలో పని చేస్తున్న ఓఎస్డీ ఎంఎస్ భగవాన్కు గౌరవ వేతనం కింద నెలకు రూ.1.40 లక్షలు ఉన్నత విద్యామండలి నుంచే చెల్లిస్తున్నారు. మంత్రి పేషీలో స్టేషనరీ కొనుగోలు కోసమంటూ ప్రతి నెలా రూ.75 వేలకు బిల్లులు పెట్టి తీసుకుంటున్నారు. దీంట్లో చాలా వరకు దొంగ బిల్లులనే ఆరోపణలున్నాయి. ఇలా దొంగ బిల్లులతో ప్రతి నెలా విద్యాశాఖలోని అన్ని విభాగాల నుంచి భారీగా పేషీకి దండుకుంటున్నట్లు విమర్శలున్నాయి.
- పేషీ కారు ఖర్చు రూ.95 వేలట. ఓఎస్డీ కార్యాలయానికి వచ్చి కూర్చోవడం తప్ప బయట తిరిగే పనే ఉండదు. అయినా కారు బిల్లులు రూ.95 వేలు ప్రతి నెలా పెడుతున్నారు. మంత్రి పేషీ పేరుతో ప్రతి నెలా రూ.3 లక్షలకుపైగా ఉన్నత విద్యామండలి చెల్లిస్తోంది.
- సచివాలయంలోని ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్నవారికి పొరుగుసేవలు లేదా ఒప్పంద ఉద్యోగుల కింద ప్రభుత్వమే జీతం చెల్లించాలి. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఉన్నతాధికారి ఇష్టారాజ్యంగా నియమించుకుంటూ ఉన్నత విద్యామండలి నుంచి జీతాలు ఇప్పిస్తున్నారు. మధ్యస్థాయి కన్సల్టెంట్ జీతం కింద ప్రతి నెలా రూ.1.25 లక్షలు, మరో కన్సల్టెంట్కు నెలకు రూ.25 వేల జీతాన్ని మండలే భరిస్తోంది. సచివాలయంలో పని చేస్తున్న ఇద్దరు అధికారులకు కారు బిల్లులు చెల్లిస్తోంది. గతంలో పురపాలక శాఖలో పదవీవిరమణ పొంది, ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖలో పని చేస్తున్న సకలారెడ్డికి కారు భత్యం కింద ప్రతి నెలా రూ.35 వేలు చెల్లిస్తోంది.
- ఉన్నతాధికారి ఇంట్లో పనిచేసే ముగ్గురు సిబ్బందికి కృష్ణా, జేఎన్టీయూ, కాకినాడ విశ్వవిద్యాలయాల నుంచి వేతనాలు చెల్లిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సచివాలయంలో నియమించిన డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్లకు నెలకు రూ.52 వేల జీతాన్ని సైతం ఉన్నత విద్యామండలే భరిస్తోంది. వాస్తవంగా ఈ ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే పెట్టాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్