బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం.
ఎక్కడికక్కడ భూ కబ్జాలు
ఎసైన్డ్ స్థలాల ఎసరుకు యత్నం
సొంత భూముల ధరలు పెంచుకోవడానికి పన్నాగం
ఆయన పేరు చెబితేనే కంపించిపోతున్న జనం
పోలీసుల అండతో అరాచకాలు
ప్రశ్నించే రైతులు, ప్రజలపై కేసులు
పల్నాడులో ఓ ప్రజాప్రతినిధి అక్రమాల దందా
ఈనాడు, అమరావతి
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. మరి ఇప్పుడో.. ఈ ‘బ్రహ్మ’నేత్రుడు కాలుమోపితే అక్కడి భూములు భస్మమైపోతున్నాయి. ఆయన పేరు చెబితే చాలు.. రైతులు, ప్రజలు కంపించిపోతున్నారు. ప్రజల అవసరాలు కాదు.. తనకు లబ్ధికలగడమే ఆ నేత అంతిమ లక్ష్యం. ఆయనకు అడ్డుతిరిగితే.. ఆ ‘బ్రహ్మ’ చెప్పినా వినడు అంతే..!!
‘రాజ్యం వీరభోజ్యం కాదు.. ఫలాలన్నీ ప్రజలందరికీ సమానంగా అందాలి’ అంటూ అలనాటి రాచరిక వ్యవస్థలో ధర్మమే ధ్యేయంగా, న్యాయబద్ధ పాలన కోసం కృషి చేసిన మహాయోధుడు.. పలనాటి బ్రహ్మనాయుడు. తరాలుగా వేళ్లూనుకుపోయిన కుల, మత, వర్ణ విభేదాలను పెకిలించి.. అంతా సమానమేనని చాటేందుకు చాపకూటి(సహపంక్తి భోజనం) సిద్ధాంతాన్ని సృష్టించిన సంఘ సంస్కర్త. అంతటి ఆదర్శ పురుషుడు ఏలిన గడ్డపై ప్రస్తుతం అధికారాన్ని వెలగబెడుతున్న ప్రజాప్రతినిధి తీరు మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. జగన్ పాలన అంతా రివర్సే కదా.. ‘యథా రాజ తథా ప్రజ’ అన్నట్లు ఆయన కూడా ‘రివర్స్’ బాటలో నడుస్తున్నారు. కన్నమదాసుకు అప్పట్లోనే సర్వ సైన్యాధ్యక్ష పదవిని కట్టబెట్టి రాజ్యాధికారంలో దళితులకు పట్టం కట్టిన మహామనీషి బ్రహ్మనాయుడు. ఈ ప్రజాప్రతినిధి మాత్రం ‘రాజ్యం’ కట్టబెట్టిన దళితుల ఎసైన్డ్ భూములకు ఎసరు పెడుతున్నారు. ఒకప్పటి విష్ణుకుండినుల రాజ్యంగా విలసిల్లిన ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ మహా‘మేత’.. రెవెన్యూ, పోలీసు వ్యవస్థలను తన అక్రమాలకు కవచ కుండలాలుగా వాడుకుంటున్నారు. ప్రశ్నించే వారిపై పోలీసులను ఉసిగొల్పుతూ సాధారణ జనాన్ని వణికిస్తున్నారు.
వంద ఎకరాలపై కన్నేశారు
జగన్ పాలనలో పేదల కోసం ఉద్దేశించిన ఇళ్ల పట్టాలు, జగనన్న కాలనీలు ఆ ప్రజాప్రతినిధికి సిరులు కురిపించాయి. భవిష్యత్తులో మంచి ధర పలుకుతుందన్న ఉద్దేశంతో ఆ నేత.. నియోజకవర్గ కేంద్రానికి కొంత దూరంలో 2016లో భూమిని కొనుగోలు చేశారు. ‘ఉపాధి’ నిధులతో ఆ భూమిని చదును చేయించి రహదారులు నిర్మించారు. అధికారులతో ఒత్తిడి తీసుకొచ్చి జగనన్న కాలనీ కోసం తన 120 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసేలా చక్రం తిప్పారు. గతంలో ఎకరాకు రూ.8 లక్షల చొప్పున కొనుగోలు చేసిన భూమిని ప్రభుత్వానికి ఎకరాకు రూ.16 లక్షల చొప్పున విక్రయించారు. వాస్తవానికి జాతీయ రహదారికి సమీపంలో 100 ఎకరాలకుపైగా ఉన్న ఎసైన్డ్ భూమిని అధికారులు ఇళ్ల స్థలాల కోసం పరిశీలించారు. ఆ భూమిని తీసుకోనివ్వకుండా తన భూమినే కొనుగోలు చేసేలా పన్నాగం పన్నిన ఆ నేత ఖజానాకు చిల్లుపెట్టారు. అలా వచ్చిన రూ. కోట్లతో అక్కడి 100 ఎకరాలకుపైగా ఉన్న ఎసైన్డ్ స్థలాన్ని తన పేరిట క్రమబద్ధీకరించుకోవాలని పావులు కదుపుతున్నారు.
భూ యజమానులకు చుక్కలు చూపుతారు
నియోజకవర్గ కేంద్రానికి శివారులోని 9.31 ఎకరాల వివాదాస్పద భూమిని గతంలో ఆ నాయకుడు చౌకగా కొట్టేశారు. దాని పక్కనే ఉన్న మరో సర్వే నం.లోని 1.72 ఎకరాల్లో 60 సెంట్లను ఆ ప్రజాప్రతినిధి 2022లో తన బంధువు పేరిట కొనుగోలు చేశారు. ఇదే సర్వే నం.లో ఇద్దరు తెదేపా నేతలు గతంలో 24 సెంట్ల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ భూమి తమదే అంటూ ప్రజాప్రతినిధి అందులో పాగా వేశారు. అధికారులూ నాయకుడి అడుగులకు మడుగు లొత్తుతుండటంతో ఆ భూముల యజమానులు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఈ పట్టణ సమీపంలో 37.74 ఎకరాల చుక్కల భూమిని తన అనుచరులతో కొనుగోలు చేయించారు. దానికి డీటీసీపీ అనుమతులు ఇప్పించి ప్లాట్లు వేసి అమ్ముతున్నారు. ఆ స్థలంలో అధికారులు అంతకుముందు ‘ఇది ప్రభుత్వ భూమి’ అంటూ బోర్డులు పెట్టారు. ఆ నేత అనుయాయులు భూమిని సొంతం చేసుకున్నాక బోర్డులు మాయమవడం గమనార్హం. నాయకుడి ప్రోద్బలంతోనే అధికారులు బోర్డులు తీసేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రూ.100 కోట్ల విలువైన భూమి కొట్టేసేందుకు యత్నం!
నియోజకవర్గ కేంద్రంలో ఒక మత సంస్థకు 3.14 ఎకరాల భూమి ఉంది. దీని ధర ప్రభుత్వ విలువ ప్రకారమే రూ.19 కోట్లు. మార్కెట్ ధర ప్రకారం రూ.100 కోట్ల వరకు ఉంటుంది. ఇక్కడ వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించి ఆ మత సంస్థకు భూమిని అప్పగించాలని 2017లో రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించింది. తర్వాత ఆ సంస్థ.. అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తికి స్థలాన్ని జీపీఏ చేసింది. ఆ వ్యక్తి ఇటీవల పోలీసుల ఆధ్వర్యంలో స్థలాన్ని స్వాధీనపరచుకోవడానికి యత్నించగా.. ప్రజాప్రతినిధి ఓ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్యను సృష్టించారు. ఫలితంగా.. భూమి స్వాధీన ప్రక్రియను నిలిపేయాలని ఓ మంత్రి ద్వారా పోలీసులపై ఒత్తిడి చేయించారు. రూ.100 కోట్ల విలువైన ఆ భూమిని కొట్టేసేందుకే ఈ నాయకుడు అడ్డుకుంటున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసుల అండతో కేసులు
నియోజకవర్గంలో ఆ ప్రజాప్రతినిధి పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని పాలన సాగిస్తున్నారు. తన ఫ్లెక్సీని చించిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయించారు. పలువురు తెదేపా మండలస్థాయి నేతలపై రౌడీషీట్లు, గ్రామస్థాయి నాయకులపై సస్పెక్ట్ షీట్లు తెరిపించారు. పట్టణంలో ప్రతిపక్షాలకు చెందిన కొందరు మైనారిటీ నాయకులపై వైకాపా కార్యకర్తలు దాడి చేసి తలలు పగలగొట్టారు. దాడికి పాల్పడినవారిపై కేసులు నమోదు చేయాల్సిన పోలీసులు.. బాధితులపై నాన్బెయిలబుల్ కేసులు, దాడి చేసినవారిపై సాధారణ కేసులు పెట్టారు. వక్ఫ్ భూముల్లో కొందరు 15 ఏళ్ల కిందట నివాసాలు, దుకాణం ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ఆక్రమిత భూమిలో నివాసాలు, దుకాణాలు ఏర్పరచుకున్నారంటూ వైకాపా నేతలే అధికారుల అవతారమెత్తి వాటిని పొక్లెయిన్తో ధ్వంసం చేశారు. దీనిపై బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. బాధితులు కోర్టును ఆశ్రయించారు.
కాలు దువ్వి.. కాల్పుల వరకు..
ఇటీవల పట్టణంలో తెదేపా ప్రదర్శన నిర్వహించగా.. ఈ ప్రజాప్రతినిధి ఉద్దేశపూర్వకంగా అటువైపు వెళ్లి వివాదానికి కారకుడయ్యారు. రెండు గంటలపాటు ఆ నేత అక్కడే ఉండి ఘర్షణను పెంచిపోషించారు. వైకాపా కార్యకర్తలతో పోలీసుల సమక్షంలోనే తెదేపా నేతలపై కర్రలు, రాళ్లతో దగ్గరుండి మరీ దాడి చేయించారు. ఇందులో తెదేపా నేత ఒకరికి తల పగిలింది. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన పోలీసు కాల్పులకు దారితీసింది. ఇంత జరిగినా పోలీసులు నామమాత్రపు కేసులతో సరిపెట్టారు.
రైతుపై హత్యాయత్నం కేసు
ఈ ప్రజాప్రతినిధి తన సొంతూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో... తమ సమస్యలు చెప్పుకోవడానికి గ్రామంలో నాయకుడు ఎవరున్నారని ఓ రైతు వాపోయారు. అందుకు ప్రజాప్రతినిధి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఈ గ్రామంలో కూడా నేనే నాయకుడిని అని రైతుపై రుసరుసలాడుతూ కాలిచెప్పును తీయబోయారు. పక్కనున్న ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులు ఆ నేతను అడ్డుకున్నారు. అయితే తనను ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేని నాయకుడు రైతుపై తన పీఏతో హత్యాయత్నం కేసు పెట్టించి జైలుకు పంపారు. ఈ ఘటనలో రైతు తప్పేమీ లేదని కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ... ఐజీతో మాట్లాడారు. ఐజీ ఆదేశంతో విచారణ జరిపిన జిల్లా ఎస్పీ రైతుపై అక్రమంగా కేసు మోపారని తేల్చి బాధ్యుడైన సీఐని వీఆర్కు పంపారు. దీన్ని సహించని ప్రజాప్రతినిధి పట్టుబట్టి మరీ వెంటనే ఆ సీఐని తన నియోజకవర్గ కేంద్రానికి తెప్పించుకున్నారు. పాసుపుస్తకాల కుంభకోణం ఆరోపణలపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఓ తహసీల్దారును కలెక్టర్ బదిలీ చేశారు. తన అక్రమాలకు వంతపాడిన తహసీల్దారు బదిలీని ఈ నాయకుడు అడ్డుకున్నారు.
అనుచరుల అక్రమ వ్యాపారం
నియోజకవర్గంలోని వాగులు, నదుల్లోని ఇసుకను తవ్వి తరలిస్తూ ఆ నాయకుడు రెండు చేతులా ఆర్జిస్తున్నారు. స్థానిక వైకాపా నేతల ట్రాక్టర్లు మాత్రమే ఇసుక రవాణా చేస్తాయి. ఈ ప్రజాప్రతినిధి అనుచరులే మండలంలో చౌకబియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్నారు. నేత సూచించినవారే రేషన్ బియ్యం వ్యాపారం చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి