బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం.
ఎక్కడికక్కడ భూ కబ్జాలు
ఎసైన్డ్ స్థలాల ఎసరుకు యత్నం
సొంత భూముల ధరలు పెంచుకోవడానికి పన్నాగం
ఆయన పేరు చెబితేనే కంపించిపోతున్న జనం
పోలీసుల అండతో అరాచకాలు
ప్రశ్నించే రైతులు, ప్రజలపై కేసులు
పల్నాడులో ఓ ప్రజాప్రతినిధి అక్రమాల దందా
ఈనాడు, అమరావతి
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. మరి ఇప్పుడో.. ఈ ‘బ్రహ్మ’నేత్రుడు కాలుమోపితే అక్కడి భూములు భస్మమైపోతున్నాయి. ఆయన పేరు చెబితే చాలు.. రైతులు, ప్రజలు కంపించిపోతున్నారు. ప్రజల అవసరాలు కాదు.. తనకు లబ్ధికలగడమే ఆ నేత అంతిమ లక్ష్యం. ఆయనకు అడ్డుతిరిగితే.. ఆ ‘బ్రహ్మ’ చెప్పినా వినడు అంతే..!!
‘రాజ్యం వీరభోజ్యం కాదు.. ఫలాలన్నీ ప్రజలందరికీ సమానంగా అందాలి’ అంటూ అలనాటి రాచరిక వ్యవస్థలో ధర్మమే ధ్యేయంగా, న్యాయబద్ధ పాలన కోసం కృషి చేసిన మహాయోధుడు.. పలనాటి బ్రహ్మనాయుడు. తరాలుగా వేళ్లూనుకుపోయిన కుల, మత, వర్ణ విభేదాలను పెకిలించి.. అంతా సమానమేనని చాటేందుకు చాపకూటి(సహపంక్తి భోజనం) సిద్ధాంతాన్ని సృష్టించిన సంఘ సంస్కర్త. అంతటి ఆదర్శ పురుషుడు ఏలిన గడ్డపై ప్రస్తుతం అధికారాన్ని వెలగబెడుతున్న ప్రజాప్రతినిధి తీరు మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. జగన్ పాలన అంతా రివర్సే కదా.. ‘యథా రాజ తథా ప్రజ’ అన్నట్లు ఆయన కూడా ‘రివర్స్’ బాటలో నడుస్తున్నారు. కన్నమదాసుకు అప్పట్లోనే సర్వ సైన్యాధ్యక్ష పదవిని కట్టబెట్టి రాజ్యాధికారంలో దళితులకు పట్టం కట్టిన మహామనీషి బ్రహ్మనాయుడు. ఈ ప్రజాప్రతినిధి మాత్రం ‘రాజ్యం’ కట్టబెట్టిన దళితుల ఎసైన్డ్ భూములకు ఎసరు పెడుతున్నారు. ఒకప్పటి విష్ణుకుండినుల రాజ్యంగా విలసిల్లిన ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ మహా‘మేత’.. రెవెన్యూ, పోలీసు వ్యవస్థలను తన అక్రమాలకు కవచ కుండలాలుగా వాడుకుంటున్నారు. ప్రశ్నించే వారిపై పోలీసులను ఉసిగొల్పుతూ సాధారణ జనాన్ని వణికిస్తున్నారు.
వంద ఎకరాలపై కన్నేశారు
జగన్ పాలనలో పేదల కోసం ఉద్దేశించిన ఇళ్ల పట్టాలు, జగనన్న కాలనీలు ఆ ప్రజాప్రతినిధికి సిరులు కురిపించాయి. భవిష్యత్తులో మంచి ధర పలుకుతుందన్న ఉద్దేశంతో ఆ నేత.. నియోజకవర్గ కేంద్రానికి కొంత దూరంలో 2016లో భూమిని కొనుగోలు చేశారు. ‘ఉపాధి’ నిధులతో ఆ భూమిని చదును చేయించి రహదారులు నిర్మించారు. అధికారులతో ఒత్తిడి తీసుకొచ్చి జగనన్న కాలనీ కోసం తన 120 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసేలా చక్రం తిప్పారు. గతంలో ఎకరాకు రూ.8 లక్షల చొప్పున కొనుగోలు చేసిన భూమిని ప్రభుత్వానికి ఎకరాకు రూ.16 లక్షల చొప్పున విక్రయించారు. వాస్తవానికి జాతీయ రహదారికి సమీపంలో 100 ఎకరాలకుపైగా ఉన్న ఎసైన్డ్ భూమిని అధికారులు ఇళ్ల స్థలాల కోసం పరిశీలించారు. ఆ భూమిని తీసుకోనివ్వకుండా తన భూమినే కొనుగోలు చేసేలా పన్నాగం పన్నిన ఆ నేత ఖజానాకు చిల్లుపెట్టారు. అలా వచ్చిన రూ. కోట్లతో అక్కడి 100 ఎకరాలకుపైగా ఉన్న ఎసైన్డ్ స్థలాన్ని తన పేరిట క్రమబద్ధీకరించుకోవాలని పావులు కదుపుతున్నారు.
భూ యజమానులకు చుక్కలు చూపుతారు
నియోజకవర్గ కేంద్రానికి శివారులోని 9.31 ఎకరాల వివాదాస్పద భూమిని గతంలో ఆ నాయకుడు చౌకగా కొట్టేశారు. దాని పక్కనే ఉన్న మరో సర్వే నం.లోని 1.72 ఎకరాల్లో 60 సెంట్లను ఆ ప్రజాప్రతినిధి 2022లో తన బంధువు పేరిట కొనుగోలు చేశారు. ఇదే సర్వే నం.లో ఇద్దరు తెదేపా నేతలు గతంలో 24 సెంట్ల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ భూమి తమదే అంటూ ప్రజాప్రతినిధి అందులో పాగా వేశారు. అధికారులూ నాయకుడి అడుగులకు మడుగు లొత్తుతుండటంతో ఆ భూముల యజమానులు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఈ పట్టణ సమీపంలో 37.74 ఎకరాల చుక్కల భూమిని తన అనుచరులతో కొనుగోలు చేయించారు. దానికి డీటీసీపీ అనుమతులు ఇప్పించి ప్లాట్లు వేసి అమ్ముతున్నారు. ఆ స్థలంలో అధికారులు అంతకుముందు ‘ఇది ప్రభుత్వ భూమి’ అంటూ బోర్డులు పెట్టారు. ఆ నేత అనుయాయులు భూమిని సొంతం చేసుకున్నాక బోర్డులు మాయమవడం గమనార్హం. నాయకుడి ప్రోద్బలంతోనే అధికారులు బోర్డులు తీసేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రూ.100 కోట్ల విలువైన భూమి కొట్టేసేందుకు యత్నం!
నియోజకవర్గ కేంద్రంలో ఒక మత సంస్థకు 3.14 ఎకరాల భూమి ఉంది. దీని ధర ప్రభుత్వ విలువ ప్రకారమే రూ.19 కోట్లు. మార్కెట్ ధర ప్రకారం రూ.100 కోట్ల వరకు ఉంటుంది. ఇక్కడ వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించి ఆ మత సంస్థకు భూమిని అప్పగించాలని 2017లో రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించింది. తర్వాత ఆ సంస్థ.. అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తికి స్థలాన్ని జీపీఏ చేసింది. ఆ వ్యక్తి ఇటీవల పోలీసుల ఆధ్వర్యంలో స్థలాన్ని స్వాధీనపరచుకోవడానికి యత్నించగా.. ప్రజాప్రతినిధి ఓ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్యను సృష్టించారు. ఫలితంగా.. భూమి స్వాధీన ప్రక్రియను నిలిపేయాలని ఓ మంత్రి ద్వారా పోలీసులపై ఒత్తిడి చేయించారు. రూ.100 కోట్ల విలువైన ఆ భూమిని కొట్టేసేందుకే ఈ నాయకుడు అడ్డుకుంటున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసుల అండతో కేసులు
నియోజకవర్గంలో ఆ ప్రజాప్రతినిధి పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని పాలన సాగిస్తున్నారు. తన ఫ్లెక్సీని చించిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయించారు. పలువురు తెదేపా మండలస్థాయి నేతలపై రౌడీషీట్లు, గ్రామస్థాయి నాయకులపై సస్పెక్ట్ షీట్లు తెరిపించారు. పట్టణంలో ప్రతిపక్షాలకు చెందిన కొందరు మైనారిటీ నాయకులపై వైకాపా కార్యకర్తలు దాడి చేసి తలలు పగలగొట్టారు. దాడికి పాల్పడినవారిపై కేసులు నమోదు చేయాల్సిన పోలీసులు.. బాధితులపై నాన్బెయిలబుల్ కేసులు, దాడి చేసినవారిపై సాధారణ కేసులు పెట్టారు. వక్ఫ్ భూముల్లో కొందరు 15 ఏళ్ల కిందట నివాసాలు, దుకాణం ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ఆక్రమిత భూమిలో నివాసాలు, దుకాణాలు ఏర్పరచుకున్నారంటూ వైకాపా నేతలే అధికారుల అవతారమెత్తి వాటిని పొక్లెయిన్తో ధ్వంసం చేశారు. దీనిపై బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. బాధితులు కోర్టును ఆశ్రయించారు.
కాలు దువ్వి.. కాల్పుల వరకు..
ఇటీవల పట్టణంలో తెదేపా ప్రదర్శన నిర్వహించగా.. ఈ ప్రజాప్రతినిధి ఉద్దేశపూర్వకంగా అటువైపు వెళ్లి వివాదానికి కారకుడయ్యారు. రెండు గంటలపాటు ఆ నేత అక్కడే ఉండి ఘర్షణను పెంచిపోషించారు. వైకాపా కార్యకర్తలతో పోలీసుల సమక్షంలోనే తెదేపా నేతలపై కర్రలు, రాళ్లతో దగ్గరుండి మరీ దాడి చేయించారు. ఇందులో తెదేపా నేత ఒకరికి తల పగిలింది. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన పోలీసు కాల్పులకు దారితీసింది. ఇంత జరిగినా పోలీసులు నామమాత్రపు కేసులతో సరిపెట్టారు.
రైతుపై హత్యాయత్నం కేసు
ఈ ప్రజాప్రతినిధి తన సొంతూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో... తమ సమస్యలు చెప్పుకోవడానికి గ్రామంలో నాయకుడు ఎవరున్నారని ఓ రైతు వాపోయారు. అందుకు ప్రజాప్రతినిధి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఈ గ్రామంలో కూడా నేనే నాయకుడిని అని రైతుపై రుసరుసలాడుతూ కాలిచెప్పును తీయబోయారు. పక్కనున్న ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులు ఆ నేతను అడ్డుకున్నారు. అయితే తనను ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేని నాయకుడు రైతుపై తన పీఏతో హత్యాయత్నం కేసు పెట్టించి జైలుకు పంపారు. ఈ ఘటనలో రైతు తప్పేమీ లేదని కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ... ఐజీతో మాట్లాడారు. ఐజీ ఆదేశంతో విచారణ జరిపిన జిల్లా ఎస్పీ రైతుపై అక్రమంగా కేసు మోపారని తేల్చి బాధ్యుడైన సీఐని వీఆర్కు పంపారు. దీన్ని సహించని ప్రజాప్రతినిధి పట్టుబట్టి మరీ వెంటనే ఆ సీఐని తన నియోజకవర్గ కేంద్రానికి తెప్పించుకున్నారు. పాసుపుస్తకాల కుంభకోణం ఆరోపణలపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఓ తహసీల్దారును కలెక్టర్ బదిలీ చేశారు. తన అక్రమాలకు వంతపాడిన తహసీల్దారు బదిలీని ఈ నాయకుడు అడ్డుకున్నారు.
అనుచరుల అక్రమ వ్యాపారం
నియోజకవర్గంలోని వాగులు, నదుల్లోని ఇసుకను తవ్వి తరలిస్తూ ఆ నాయకుడు రెండు చేతులా ఆర్జిస్తున్నారు. స్థానిక వైకాపా నేతల ట్రాక్టర్లు మాత్రమే ఇసుక రవాణా చేస్తాయి. ఈ ప్రజాప్రతినిధి అనుచరులే మండలంలో చౌకబియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్నారు. నేత సూచించినవారే రేషన్ బియ్యం వ్యాపారం చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!