కరవును కళ్లారా చూడు జగనన్నా
‘ఏడాది ఓపిక పట్టండి. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. వలసల నివారణకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం.
జిల్లాలో ఊళ్లకు ఊళ్లే ఖాళీ
నేడు కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర
ఈనాడు, అమరావతి, కర్నూలు న్యూస్టుడే యంత్రాంగం: ‘ఏడాది ఓపిక పట్టండి. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. వలసల నివారణకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. ఇక్కడే ఉపాధి కల్పిస్తాం’ అని పాదయాత్రలో కరవు ప్రాంతమైన కర్నూలు జిల్లా ప్రజలకు జగన్ చెప్పిన మాటలు ఇవి. 2019 ఎన్నికల ప్రచారంలోనూ అవే మాటలు ఊదరగొట్టారు. ఆయన ముఖ్యమంత్రి అయి అయిదేళ్లయినా.. ఇప్పటికీ అక్కడ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. వలసలు ఆగలేదు. ఇన్నాళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయని జగనన్న ఇప్పుడు ఎన్నికల వేళ బస్సు యాత్ర అంటూ ఆ ప్రాంతానికి వెళ్తున్నారు. కాస్త బస్సు దిగి ఊళ్లలోకి వెళ్లి చూస్తే.. వరుసగా రెండు సీజన్లలో పంటలుపోయి నష్టపోయిన రైతన్నల అప్పుల గోడు, కరవు కోరలు చాచడంతో ఉపాధి లేక ఊళ్లకు ఊళ్లే ఖాళీ అయిన దీనావస్థలు, అన్నదాతలు వలసకూలీలుగా మారి ఊరొదిలిన వాస్తవాలు, తాగునీటి కోసం కిలోమీటర్లకు కిలోమీటర్లు వెళుతున్న అక్కచెల్లెమ్మల దుర్భర పరిస్థితి, చిల్లిగవ్వ సాయమందించని కారణంగా ఖాయిలా పడ్డ స్పిన్నింగ్, వంటనూనెల మిల్లులు ఆయన కళ్లకు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో పల్లె కన్నీటిని తుడిచే ప్రయత్నం సీఎం ఎలాగో చేయలేదు. మరీ.. జిల్లాలో ఏడుకు ఏడింటా వైకాపా ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇందులో ఆరు నియోజకవర్గాల్లో వలసలున్నాయి. అయినా ఏ ఎమ్మెల్యే ఈ సమస్యపై అసెంబ్లీలో ప్రస్తావించిందీ లేదు, నిధులు తెచ్చి పనులు చేసిందీ లేదు. ఎన్నికల ప్రచారానికి మాత్రం చుట్టూ మందీ మార్బలంతో ఇక్కడికి వస్తున్న జగన్ బస్సు దిగి జనం కష్టాలు వింటారా? లేదా.. అన్నీ చేసేశాం.. అంతా బాగుంది అని చెప్పి వెళ్లిపోతారో చూడాలి మరీ.
నేతన్నపైనా కక్షే?
‘నేతన్నను అన్ని విధాలుగా ఆదుకుంటాం.. ప్రతి ఒక్కరికీ నేతన్న నేస్తం, మగ్గాలకు షెడ్లు వేయిస్తాం. వడ్డీలేని రుణాలిస్తాం’అంటూ అనేక హామీలను గుప్పించి జగన్.. అధికారంలోకి వచ్చాక వారిపైనే కక్ష గట్టారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి కల్పించేలా 2015 మే 2న బనవాసి వద్ద అప్పటి సీఎం చంద్రబాబు 91.31 ఎకరాల్లో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు కోసం శంకుస్థాపన చేశారు. అక్కడ రూ.44 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 8 కంపెనీలు ముందుకొచ్చాయి. కానీ జగన్ సర్కారొచ్చాక ఆ పార్కును రద్దు చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 17 వేల మంది చేనేత కార్మికులుంటే, ఈ ప్రాంతంలోనే 10 వేల మందివరకు ఉన్నారు. కానీ.. జిల్లాలో 2023లో నేతన్న నేస్తం పథకం కింద 4 వేల మందిని మాత్రమే ఎంపిక చేశారు. అంతే ఇక మగ్గాలకు షెడ్లు లేవు, వడ్డీలేని రుణాలూ లేవు.
‘ఆడా’తో అభివృద్ధి ఏదీ?
ఆదోని ప్రాంతీయ అభివృద్ధి యాజమాన్య సంస్థ(ఆడా)ను 2022 జనవరిలో ప్రారంభించినా.. దాంతో పైసా పని చేసింది లేదు. మరోవైపు ఈ ప్రాంతంలో దాదాపు 5 వేల మందికి ఉపాధిని కల్పిస్తున్న స్పిన్నింగ్ మిల్లులు, వంటనూనె తదితర కర్మాగారాలకు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా వాటిని ఖాయిలా పడే దశకు చేర్చారు. అవి ఒక్కొక్కటిగా మూతపడుతుండడంతో కార్మికులు పొట్ట చేతపట్టుకుని పొరుగు రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 5-6వేల హెక్టార్లలో టమాటా సాగవుతోంది. వాటిని కిలో రూపాయి, అర్ధ రూపాయికే అమ్ముకోవాల్సిన దుస్థితితో రైతన్న నష్టపోతూనే ఉన్నారు. ఈ సమస్య పరిష్కారానికి రూ.10 కోట్లతో పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్, జ్యూస్ ఫ్యాక్టరీ యూనిట్ను రెండు నెలల్లోనే శంకుస్థాపన చేస్తానంటూ గతేడాది జగనే స్వయంగా చెప్పారు. ఇప్పుడు కోడ్కు కొద్దిరోజుల ముందు హడావుడిగా భూమి పూజ చేసి మమ అనిపించగా.. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.
కరవు కాటకం..
జిల్లాలో కరవు కమ్మేయడంతో ఖరీఫ్, రబీ రెండు సీజన్లలోనూ పంటలన్నీ దెబ్బతిన్నాయి. ఖరీఫ్ సీజన్లో 2,38,230.92 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిని, రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. పరిహారం పేరుతో ముఖ్యమంత్రి బటన్ నొక్కినా ఆ డబ్బు రైతుకు అందని పరిస్థితి.
ఏడింటిలో 6 నియోజకవర్గాల్లో వలసలే
కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆలూరు నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల ఊళ్లకు ఊళ్లే ఖాళీ అవుతున్నాయి. ఒక్క మంత్రాలయం నియోజకవర్గం నుంచే సుమారు 75 వేల మంది వలసబాట పట్టిన దురవస్థ నెలకొంది.
పడకేసిన ప్రాజెక్టులు..
కర్నూలు జిల్లాకు గుండెలాంటి గుండ్రేవుల రిజర్వాయరుకు, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల పరిధిలోని ఆర్డీఎస్ కాలువ నిర్మాణానికి తెదేపా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే జగన్ ప్రభుత్వం విడుదల చేయలేదు. వేదవతి, నగరడోణ పనులు ఒక్క అడుగూ ముందుకు పడలేదు.
ఒక్క పైసా కేటాయించ లేదు..
జిల్లాలో 2023-24 సంవత్సరానికి సంబంధించి 169 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు డ్రాట్ కంటింజెంట్ యాక్షన్ ప్లాన్ కింద రూ.14.98 కోట్లు అవసరమని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గత డిసెంబరులోనే ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినా ఒక్క పైసా కేటాయించలేదు. ఇప్పటికీ మంత్రాలయం మండలంలో కల్లుదేవకుంట గ్రామస్థులు 4 కిలోమీటర్ల దూరంలోని చిలకలడోణ, ఇబ్రహీంపట్నం గ్రామాలకు వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్న దుస్థితి ఉంది.
మూగ జీవాల వేదనా పట్టదా..?
జిల్లాలోని కరవు మండలాల్లో పశువులకు దాణా కోసం 1,195 టన్నుల మిశ్రమ దాణా(టీఎంఆర్), 240 గడ్డి కత్తిరించే యంత్రాలు, 12.88 లక్షల గొర్రెలు, మేకలకు సంబంధించి నట్టల నివారణ మందు కోసం రూ.2.34 కోట్లను కేటాయించాలని 4 నెలల కిందటే ప్రతిపాదించినా నగదు మంజూరుకు జగనన్నకు మనసు రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్