కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి.
అయిదేళ్లుగా అమరావతి రైతులు నేరస్థుల్లా కోర్టుల్లో నిలబడుతున్నారు
ప్రభుత్వం వారికి న్యాయం చేయాలి
సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ ఎన్.వి.రమణ
తమపై ఎన్నో కేసులు పెట్టారన్న రాజధాని మహిళలు
మా పిల్లలపైనా కేసులు పెట్టారమ్మా.. అన్న జస్టిస్
గన్నవరం విమానాశ్రయంలో తనను కలిసిన అన్నదాతలకు ఓదార్పు
ఈనాడు, అమరావతి - న్యూస్టుడే, గన్నవరం గ్రామీణం, హనుమాన్ జంక్షన్: ‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. ఎప్పుడూ పోలీసుస్టేషనే చూడనోళ్లం.. ఇప్పుడు కేసు వాయిదాల కోసం వారానికి రెండు, మూడు రోజులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. ఉదయం నుంచి సాయంత్రం దాకా కోర్టుల్లో ఉండాల్సి వస్తోంది. హైకోర్టు తీర్పు ఇచ్చినా.. జగన్ ప్రభుత్వం ఇంత వరకు ప్లాట్లను అభివృద్ధి చేయలేదు’ అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఎదుట రాజధాని రైతులు, మహిళలు తమ గోడు వెల్లబోసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ.. ‘ఇక మీకు మంచి జరుగుతుందని ఆశిద్దాం.. మీరు కొంచెం ఓపిక పట్టండి’ అని ధైర్యం చెప్పారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒకరోజు పర్యటన కోసం గురువారం ఉదయం జస్టిస్ రమణ హైదరాబాద్ నుంచి విజయవాడకు విమానంలో వచ్చారు. గన్నవరం విమానాశ్రయం వెలుపల ఆయనను కలిసిన రైతులు తమ సమస్యల్ని విన్నవించుకున్నారు.
‘మాకు ఇచ్చిన ప్లాట్లను తాకట్టు పెట్టి రుణాలు తీసుకుందామన్నా బ్యాంకర్లు ఇవ్వడం లేదు. 2019 వరకు బ్యాంకులు రుణాలు ఇచ్చేవి. వైకాపా ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. గత ప్రభుత్వం 25 రెవెన్యూ గ్రామాల పరిధిలో పూలింగ్లో భూములు ఇవ్వని చోట్ల భూసేకరణ ప్రకటన ఇచ్చింది. వైకాపా ప్రభుత్వం ఇటీవల దీనిని ఉపసంహరించింది. దీని వల్ల రాజధాని మాస్టర్ప్లాన్కు తీవ్ర విఘాతం ఏర్పడుతుంది’ అని రైతులు వివరించారు. ‘ఎన్నికలయ్యాక.. ఒకసారి మా శిబిరాలకు రావాలి. మాలో ధైర్యాన్ని నింపాలి. సూచనలు, సలహాలు ఇవ్వాలి’ అని రైతులు కోరగా.. తప్పనిసరిగా వస్తానని ఆయన హామీ ఇచ్చారు. కౌలు ఇవ్వాల్సిన గడువు దాటి ఏడాది అయినా ఇంకా జమ కాలేదనీ, జీవనం చాలా కష్టంగా ఉందని అన్నదాతలు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తంచేశారు.
2,700 మందిపై 470 కేసులు పెట్టారు
‘నా మీద నాలుగు కేసులు పెట్టారు. వాయిదాల కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నా. కేసులు చూసుకోవాలా? కుటుంబాన్ని చూసుకోవాలా? అర్థం కావడం లేదు’ అని మందడం గ్రామానికి చెందిన ప్రియాంక వాపోయారు. జస్టిస్ రమణ స్పందిస్తూ.. ‘మా పిల్లల పైనా కేసులు పెట్టారమ్మా..’ అని వ్యాఖ్యానించారు. ‘ఏనాడూ ఎవరినీ చేయి చాచి అడగలేదు. ఎన్ని వానలు పడినా తట్టుకున్నాం. ఇవాళ ప్రభుత్వం ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఊహించలేదు. ఈ కష్టాన్ని తట్టుకోలేకపోతున్నాం. ప్రతిరోజూ చచ్చి బతుకుతున్నాం’ అని తుళ్లూరుకు చెందిన రజిని కంటతడి పెట్టారు. ‘వారసత్వంగా వచ్చిన భూముల్ని ఇచ్చి.. బిడ్డలకు ఉద్యోగాలు లేక కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం’ అని మహిళా రైతు మల్లీశ్వరి వాపోయారు. తనపై పోలీసులు 20 కేసులు పెట్టారని.. తాను ఎదుర్కొంటున్న ఇక్కట్లను జస్టిస్ రమణ ముందు చెప్పుకొన్నారు.
తమ జీవితంలో ఇన్ని కష్టాల్ని ఎన్నడూ చూడలేదని, తమను న్యాయవ్యవస్థే కాపాడుతోందని పలువురు మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. పోలీసులు 2,700 మందిపై 470 కేసులు పెట్టారని అమరావతి రాజధాని ఐకాస సమన్వయ కమిటీ సభ్యుడు సుధాకర్.. జస్టిస్ రమణ దృష్టికి తీసుకొచ్చారు. ‘మీరు ధైర్యంగా ఉండండి. ఏ ప్రభుత్వం ఉన్నా.. మీరు గట్టిగా పోరాటం చేయాలి. లేనిపక్షంలో రైతుల్ని ఎవరూ లెక్కచేయరు. మద్దతు ధరపై దిల్లీ శివారులో ప్రతికూల పరిస్థితుల్లోనూ అన్నదాతలు పోరాడారు. అంతకంటే గొప్ప పోరాటం మీరు చేస్తున్నారు. తప్పనిసరిగా మీకు న్యాయం జరుగుతుంది’ అని జస్టిస్ రమణ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయనకు రైతులు, మహిళలు వినతిపత్రం అందించారు.
ఆలస్యమైనా రైతులకు న్యాయం లభిస్తుంది
‘రాజధాని నిర్మాణానికి భూములిచ్చి.. ప్రస్తుత ప్రభుత్వ విధానాలతో 1,563 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. అమరావతి నిర్మాణానికి చాలా త్యాగం చేశారు’ అని జస్టిస్ రమణ అన్నారు. విమానాశ్రయం బయట ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అయిదేళ్లుగా కోర్టుల్లో నేరస్థుల్లా నిలబడుతూ... అనేక కష్టనష్టాలకోర్చి రైతులు గొప్ప ఉద్యమం చేస్తున్నారు. వారి పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వీరికి మేలు చేస్తుందని ఆశిస్తున్నా. న్యాయవ్యవస్థ కూడా వీరికి న్యాయం చేస్తుందని విశ్వసిస్తున్నా.. ఆలస్యమైనా తప్పక న్యాయం లభిస్తుంది. మంచి రాజధాని నిర్మాణం జరగాలని కోరుకుంటున్నాను’ అని ఆయన అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా