కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి.
అయిదేళ్లుగా అమరావతి రైతులు నేరస్థుల్లా కోర్టుల్లో నిలబడుతున్నారు
ప్రభుత్వం వారికి న్యాయం చేయాలి
సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ ఎన్.వి.రమణ
తమపై ఎన్నో కేసులు పెట్టారన్న రాజధాని మహిళలు
మా పిల్లలపైనా కేసులు పెట్టారమ్మా.. అన్న జస్టిస్
గన్నవరం విమానాశ్రయంలో తనను కలిసిన అన్నదాతలకు ఓదార్పు
ఈనాడు, అమరావతి - న్యూస్టుడే, గన్నవరం గ్రామీణం, హనుమాన్ జంక్షన్: ‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. ఎప్పుడూ పోలీసుస్టేషనే చూడనోళ్లం.. ఇప్పుడు కేసు వాయిదాల కోసం వారానికి రెండు, మూడు రోజులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. ఉదయం నుంచి సాయంత్రం దాకా కోర్టుల్లో ఉండాల్సి వస్తోంది. హైకోర్టు తీర్పు ఇచ్చినా.. జగన్ ప్రభుత్వం ఇంత వరకు ప్లాట్లను అభివృద్ధి చేయలేదు’ అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఎదుట రాజధాని రైతులు, మహిళలు తమ గోడు వెల్లబోసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ.. ‘ఇక మీకు మంచి జరుగుతుందని ఆశిద్దాం.. మీరు కొంచెం ఓపిక పట్టండి’ అని ధైర్యం చెప్పారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒకరోజు పర్యటన కోసం గురువారం ఉదయం జస్టిస్ రమణ హైదరాబాద్ నుంచి విజయవాడకు విమానంలో వచ్చారు. గన్నవరం విమానాశ్రయం వెలుపల ఆయనను కలిసిన రైతులు తమ సమస్యల్ని విన్నవించుకున్నారు.
‘మాకు ఇచ్చిన ప్లాట్లను తాకట్టు పెట్టి రుణాలు తీసుకుందామన్నా బ్యాంకర్లు ఇవ్వడం లేదు. 2019 వరకు బ్యాంకులు రుణాలు ఇచ్చేవి. వైకాపా ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. గత ప్రభుత్వం 25 రెవెన్యూ గ్రామాల పరిధిలో పూలింగ్లో భూములు ఇవ్వని చోట్ల భూసేకరణ ప్రకటన ఇచ్చింది. వైకాపా ప్రభుత్వం ఇటీవల దీనిని ఉపసంహరించింది. దీని వల్ల రాజధాని మాస్టర్ప్లాన్కు తీవ్ర విఘాతం ఏర్పడుతుంది’ అని రైతులు వివరించారు. ‘ఎన్నికలయ్యాక.. ఒకసారి మా శిబిరాలకు రావాలి. మాలో ధైర్యాన్ని నింపాలి. సూచనలు, సలహాలు ఇవ్వాలి’ అని రైతులు కోరగా.. తప్పనిసరిగా వస్తానని ఆయన హామీ ఇచ్చారు. కౌలు ఇవ్వాల్సిన గడువు దాటి ఏడాది అయినా ఇంకా జమ కాలేదనీ, జీవనం చాలా కష్టంగా ఉందని అన్నదాతలు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తంచేశారు.
2,700 మందిపై 470 కేసులు పెట్టారు
‘నా మీద నాలుగు కేసులు పెట్టారు. వాయిదాల కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నా. కేసులు చూసుకోవాలా? కుటుంబాన్ని చూసుకోవాలా? అర్థం కావడం లేదు’ అని మందడం గ్రామానికి చెందిన ప్రియాంక వాపోయారు. జస్టిస్ రమణ స్పందిస్తూ.. ‘మా పిల్లల పైనా కేసులు పెట్టారమ్మా..’ అని వ్యాఖ్యానించారు. ‘ఏనాడూ ఎవరినీ చేయి చాచి అడగలేదు. ఎన్ని వానలు పడినా తట్టుకున్నాం. ఇవాళ ప్రభుత్వం ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఊహించలేదు. ఈ కష్టాన్ని తట్టుకోలేకపోతున్నాం. ప్రతిరోజూ చచ్చి బతుకుతున్నాం’ అని తుళ్లూరుకు చెందిన రజిని కంటతడి పెట్టారు. ‘వారసత్వంగా వచ్చిన భూముల్ని ఇచ్చి.. బిడ్డలకు ఉద్యోగాలు లేక కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం’ అని మహిళా రైతు మల్లీశ్వరి వాపోయారు. తనపై పోలీసులు 20 కేసులు పెట్టారని.. తాను ఎదుర్కొంటున్న ఇక్కట్లను జస్టిస్ రమణ ముందు చెప్పుకొన్నారు.
తమ జీవితంలో ఇన్ని కష్టాల్ని ఎన్నడూ చూడలేదని, తమను న్యాయవ్యవస్థే కాపాడుతోందని పలువురు మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. పోలీసులు 2,700 మందిపై 470 కేసులు పెట్టారని అమరావతి రాజధాని ఐకాస సమన్వయ కమిటీ సభ్యుడు సుధాకర్.. జస్టిస్ రమణ దృష్టికి తీసుకొచ్చారు. ‘మీరు ధైర్యంగా ఉండండి. ఏ ప్రభుత్వం ఉన్నా.. మీరు గట్టిగా పోరాటం చేయాలి. లేనిపక్షంలో రైతుల్ని ఎవరూ లెక్కచేయరు. మద్దతు ధరపై దిల్లీ శివారులో ప్రతికూల పరిస్థితుల్లోనూ అన్నదాతలు పోరాడారు. అంతకంటే గొప్ప పోరాటం మీరు చేస్తున్నారు. తప్పనిసరిగా మీకు న్యాయం జరుగుతుంది’ అని జస్టిస్ రమణ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయనకు రైతులు, మహిళలు వినతిపత్రం అందించారు.
ఆలస్యమైనా రైతులకు న్యాయం లభిస్తుంది
‘రాజధాని నిర్మాణానికి భూములిచ్చి.. ప్రస్తుత ప్రభుత్వ విధానాలతో 1,563 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. అమరావతి నిర్మాణానికి చాలా త్యాగం చేశారు’ అని జస్టిస్ రమణ అన్నారు. విమానాశ్రయం బయట ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అయిదేళ్లుగా కోర్టుల్లో నేరస్థుల్లా నిలబడుతూ... అనేక కష్టనష్టాలకోర్చి రైతులు గొప్ప ఉద్యమం చేస్తున్నారు. వారి పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వీరికి మేలు చేస్తుందని ఆశిస్తున్నా. న్యాయవ్యవస్థ కూడా వీరికి న్యాయం చేస్తుందని విశ్వసిస్తున్నా.. ఆలస్యమైనా తప్పక న్యాయం లభిస్తుంది. మంచి రాజధాని నిర్మాణం జరగాలని కోరుకుంటున్నాను’ అని ఆయన అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!