నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు.
డ్వాక్రా సంఘాలకు తీరని ద్రోహం
మహిళల స్వయం ఉపాధిపై జగన్ దెబ్బ
అధికారంలోకి రాగానే 7,500 మంది ‘మిత్ర’లపై వేటు
సున్నా వడ్డీ రాయితీ కుదింపు
ఉన్నతి పథకానికి చేయూత కరవు
ఈనాడు, అమరావతి
డ్వాక్రా సంఘాల మహిళలు...
ఐదేళ్ల క్రితం దాకా దేశానికే దిక్సూచిగా నిలిచారు...
సేంద్రియ వ్యవసాయం చేశారు...
జనరిక్ ఔషధాలు విక్రయించారు...
మొక్కలు నాటారు... పింఛన్లూ పంచారు...
నేడు ప్రోత్సాహం కరవై దిక్కులు చూస్తున్నారు...
అది చేస్తా, ఇది చేస్తానంటూ ఊరూరూ తిరిగిన జగన్...
ఒక్కసారి అవకాశమిస్తే... ఐదేళ్లూ పీఠంపై ఉండి...
అవకాశాలను తుంచేసి... వారి వెన్ను విరిచారు!!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. ముఖ్యంగా కోటి మంది సభ్యులతో అలరారుతూ... పొదుపులో, స్వయం ఉపాధిలో దూసుకెళుతూ దేశానికే ఆదర్శంగా నిలిచిన డ్వాక్రా సంఘాలను నిలువునా మోసం చేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో డ్వాక్రా మహిళలు ఒక వెలుగు వెలిగారు. అన్నింటా వారికే అగ్రతాంబూలం దక్కింది. అవకాశమున్న ప్రతిచోటా అప్పటి ప్రభుత్వం వారి సేవల్ని వినియోగించుకుంది. దానికి ప్రతిఫలంగా ఆర్థిక ప్రోత్సాహకాలను అందించి... వారి కుటుంబాలు నిలుదొక్కుకునేలా చేసింది. పేదరిక నిర్మూలనకు కావాల్సింది ఇదే కదా. నాడు ఏదో ఒకట్రెండు చోట్లకాదు... ఈ సంఘాల సభ్యుల్లోని వేల మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఏజెంట్లుగా సేవలందించారు. డిపాజిట్లు సేకరించారు. అప్పులు ఇచ్చారు. జమ చేసుకున్నారు... ఉపకార వేతనాలను, ఉపాధి వేతనాలను, పింఛన్లను పంపిణీ చేశారు. బీమా, కల్యాణ మిత్రలుగా సేవలందించారు. ఏకంగా మూడు లక్షల మంది సేంద్రియ వ్యవసాయంలో ప్రవేశించారు. ‘అన్న సంజీవని’ పేరుతో జనరిక్ మెడికల్ దుకాణాలు నిర్వహించారు. ఉపాధి హామీలో వేసిన రహదారుల వెంట మొక్కలు పెంచారు. తెదేపా హయాంలో ఉచిత ఇసుక విధానాన్ని కూడా తొలుత డ్వాక్రా సంఘాల ద్వారానే అమలు చేయించారు. ఇంతగా వారికి అప్పట్లో ప్రాధాన్యం దక్కింది. జగన్ ప్రభుత్వంలో అంతకంటే ఎక్కువ చేయూత లభిస్తుందని ఆశించిన డ్వాక్రా మహిళలకు భంగపాటే ఎదురైంది. సీఎం పీఠం ఎక్కగానే ఈ విధానాలన్నింటికీ ఆయన చరమగీతం పాడారు. పైకి మాత్రం అక్కచెల్లెమ్మలంటూ పదేపదే పలవరించారు. వారి ప్రగతిని పాతాళానికి తొక్కే ఎత్తుగడలు అమలు చేశారు.
‘మిత్ర’లకు తీరని ద్రోహం
ఇంటిపట్టునే ఉండి ఎంతోకొంత సంపాదిస్తూ కుటుంబానికి చేదోడుగా నిలుస్తున్న వేల మంది డ్వాక్రా మహిళల ఉపాధిని జగన్ అధికారంలోకి రాగానే దెబ్బతీశారు. కనీసం వారిలో వితంతువులు, ఒంటరి మహిళలు ఉన్నారన్న కనికరం కూడా చూపించలేదు. తాను అధికారంలోకి వస్తే వేతనాలు పెంచి గొప్ప మేలు చేస్తానని ఎన్నికల ముందు ఊరూరూ తిరుగుతూ హామీలిచ్చారు. సీఎం కాగానే ఏకంగా 7,500 మందిని రోడ్డున పడేశారు. పెళ్లికానుక పథకాన్ని అమలు చేసేందుకు తెదేపా ప్రభుత్వం 2,500 మంది కల్యాణమిత్రలను, చంద్రన్న బీమా పథకం అమలుకు 2,000 మంది బీమామిత్రలను, పశువుల పెంపకంలో రైతులకు చేయూతగా నిలిచేందుకు 3,000 మంది పశుమిత్రలను డ్వాక్రా మహిళల నుంచే నియమించింది. వీరంతా నెలకు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు సంపాదించేవారు. అప్పట్లో వీరు ప్రతి పథకాన్ని లబ్ధిదారులకు చేరువ చేశారు. ఇలాంటి వారిని మరింత ప్రోత్సహించాల్సింది పోయి... విధుల్లో నుంచే తీసేశారు.
‘ఉన్నతి’కి అదనపు ప్రోత్సాహమే లేదు
ఉన్నతి పథకం కింద తెదేపా ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలకు చక్కటి ఆదరవు దక్కేది. మహిళల స్వయం ఉపాధికి చేయూతనివ్వడానికి... 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం వీరికి రూ.800 కోట్లను వడ్డీ లేకుండా రుణాలుగా ఇచ్చింది. అప్పును నెలవారీ వాయిదాల్లో తిరిగి కట్టించుకునేది. మహిళా సాధికారతకు పెద్దపీట వేయడంలో తనను మించిన వారే లేరన్నట్లుగా గొప్పలు చెప్పుకొనే జగన్... ఈ అయిదేళ్లలో ఉన్నతికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. గత ప్రభుత్వాలు ఇచ్చిన మొత్తాన్నే రొటేషన్ చేసుకుంటూ కాలాన్ని నెట్టుకొచ్చారు.
సభలకు తరలింపులో జగన్ది వికృతరూపం
రాష్ట్రంలో ఎక్కడైనా ముఖ్యమంత్రి జగన్ బహిరంగ సభ ఉందన్నా... మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనే సమావేశాలు ఏర్పాటు చేస్తారన్నా డ్వాక్రా మహిళలు బెంబేలెత్తే పరిస్థితిని తీసుకొచ్చారు. సమావేశం ఉందంటే చాలు కిమ్మనకుండా వెళ్లాల్సి వచ్చేది. రాలేమని చెప్పే స్వేచ్ఛ, ఎదిరించే హక్కు లేకుండా చేశారు. ‘ఎన్ని పనులున్నా సభకు హాజరు కావాల్సిందే. లేకపోతే సంక్షేమ పథకాలు నిలిపేస్తాం’ అని అధికారులతో హుకుం జారీ చేయించారు. అనారోగ్యమైనా, అత్యవసర పనులున్నా వినలేదు. భార్యకు వీలవకుంటే భర్త వెళ్లాల్సి వచ్చింది. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితం కాలేదు. వైకాపా నిర్వహించిన ర్యాలీలు, మూడు రాజధానుల పేరుతో చేపట్టిన గర్జనలు, సామాజిక సాధికారత సభలు, ప్లీనరీ వంటి పార్టీ సమావేశాలకూ వర్తింపజేశారు. గతంలోనూ ప్రభుత్వ కార్యక్రమాలకు డ్వాక్రా మహిళల్ని తరలించడం ఉన్నా ఇంతస్థాయిలో బెదిరింపులు ఎప్పుడూ లేవు.
రూ.2 వేల కోట్లను లాగేసుకున్నారు
డ్వాక్రా సంఘాల్లోని 18-59 ఏళ్లు నిండిన మహిళలకు 60 ఏళ్లు దాటిన తర్వాత పింఛన్లు ఇచ్చేందుకు ఉమ్మడి రాష్ట్రంలో 2009లో అభయహస్తం పథకాన్ని తీసుకొచ్చారు. దీనికి అర్హతలున్న మహిళలు ఏటా ప్రీమియం చెల్లిస్తూ వస్తున్నారు. పింఛను చెల్లించేందుకు ప్రభుత్వం ఎల్ఐసీతో ఒప్పందం చేసుకుంది. దరఖాస్తుదారుల వాటా, ప్రభుత్వ వాటా కలిపి రూ.2 వేల కోట్ల వరకు చేరింది. అభినవ అప్పుల అప్పారావు... జగన్ కన్ను ఈ నిధిపై పడింది. ఎల్ఐసీని పథకం నుంచి తప్పించి ఆ మొత్తాన్ని తీసేసుకున్నారు. రెండు వేల కోట్లను ఏం చేశారో... ఎటు మళ్లించారో కూడా తెలియడం లేదు.
సున్నా వడ్డీ రాయితీలోనూ కోత
తెదేపా ప్రభుత్వ హయాంలో డ్వాక్రా సంఘాలకు బ్యాంకులు ఇచ్చే రుణ పరిమితి రూ.10 లక్షల వరకు ఉండేది. ఆ లోపు రుణం ఎంత తీసుకున్నా రూ.5 లక్షల వరకు సున్నా వడ్డీ రాయితీ వర్తించేది. జగన్ అధికారంలో రాగానే రూ.3 లక్షలకే వడ్డీ రాయితీ వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. దాంతో డ్వాక్రా మహిళలపై వడ్డీ భారం పెరిగింది. వడ్డీ ఎందుకు పెరుగుతోందో అర్థంకాక వారు తలలు పట్టుకున్నారు. దీనిపై ఏమీ మాట్లాడకుండా ఠంచనుగా సున్నా వడ్డీ రాయితీకి బటన్ నొక్కుతున్నట్లు బాకాలు ఊదుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల