‘పర్యాటకం...’ పక్కా నాటకం!
జగన్ ప్రభుత్వంలో పర్యాటక రంగం అభివృద్ధికి అప్పులివ్వడానికి బ్యాంకులే కాదు... పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలూ ముందుకు రాలేదు.
పర్యాటక రంగంలో పెట్టుబడులకు ప్రైవేటు సంస్థల వెనకంజ
రూ.17,127 కోట్ల ఒప్పందాల్లో వచ్చినవి 18.67 శాతమే
బయటపడిన విశాఖ పెట్టుబడుల సదస్సు డొల్లతనం
ఈనాడు, అమరావతి
గొప్పలు చెప్పడం... తుస్సుమనిపించడం... జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిందిదే... ఇందుకు పర్యాటకరంగమే చక్కటి ఉదాహరణ... పెట్టుబడిదారుల సదస్సులో 117 ఒప్పందాలు కుదిరాయంది... రూ.17,127 కోట్ల పెట్టుబడులు వస్తాయంది... ఏకంగా 39,170 మందికి ఉద్యోగాలు లభిస్తాయంది... తీరా ఈ మాటలన్నీ సముద్రం ఒడ్డున కట్టే ఇసుక గూళ్ల మాదిరే కనుమరుగయ్యాయి... కేవలం రూ.3,094 కోట్ల పెట్టుబడులతో 20 ప్రాజెక్టులు చేపట్టగా... అందులో మూడే మొదలవగా... వచ్చిన ఉద్యోగాలు 346 మాత్రమే... ఆయన నికరంగా చేసిందేమిటయ్యా అంటే... రుషికొండపై ప్యాలెస్ కట్టుకోవడం... పర్యాటకాభివృద్ధి సంస్థ ఆస్తులపై అప్పులు తేవడం... అస్మదీయులకు పర్యాటక ప్రాజెక్టులు అప్పగించడం!
జగన్ ప్రభుత్వంలో పర్యాటక రంగం అభివృద్ధికి అప్పులివ్వడానికి బ్యాంకులే కాదు... పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలూ ముందుకు రాలేదు. ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందనో, అధికారుల మాట కాదనలేకో పెట్టుబడుల సదస్సులో అవగాహన ఒప్పందం చేసుకున్న అనేక సంస్థలు అనంతరం ముఖం చాటేశాయి. పర్యాటక రంగం అభివృద్ధిపై అయిదేళ్లలో జగన్ ప్రభుత్వ ఆర్భాటం అంతాఇంతా కాదు. లండన్-ఐ తరహా ప్రాజెక్టులు అభివృద్ధి చేసి ప్రపంచం నలుమూలల నుంచీ పర్యాటకులను ఆకట్టుకోవాలని ఈ రంగంపై నిర్వహించిన సమీక్షల్లో సీఎం ఇచ్చిన ఆదేశాల్లో పసలేదని తేలిపోయింది. పైగా సుదూరాల నుంచి విశాఖ నగర సందర్శనకు వచ్చే పర్యాటకులకు సౌకర్యంగా ఉండే రుషికొండపై రిసార్టును కూల్చేసి, రూ.450 కోట్లతో సీఎం జగన్ రాజభవనం నిర్మించుకున్నారు. పాడైన రిసార్టులు, హోటళ్ల ఆధునికీకరణ కోసం ప్రభుత్వం నుంచి రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కు ఒక్క రూపాయి కేటాయించలేదు. ఏపీటీడీసీ ఆస్తులు తనఖా పెట్టుకుని అప్పు ఇవ్వాలని ఏడాదిన్నరగా బ్యాంకుల చుట్టూ అధికారులు తిరుగుతున్నారు. ఎట్టకేలకు ఎస్బీఐ ముందుకొచ్చినా.. రుణం ఇంకా విడుదల చేయలేదు. పర్యాటక రంగంలోనూ ప్రైవేటు పెట్టుబడులు ఉత్తుత్తివేనని తేటతెల్లమైంది. గతేడాది నిర్వహించిన పెట్టుబడుదారుల సదస్సులో ఒప్పందం కుదిరిన ప్రాజెక్టుల్లో కేవలం మూడే కార్యరూపం దాల్చాయి. ఒప్పందాల విలువలో 18.07% పెట్టుబడులే వచ్చాయి. పనులు ప్రారంభించిన 20 ప్రాజెక్టుల్లో.. విజయవాడలో ఒక హోటల్, బాపట్లలో బీచ్ రిసార్టు, సత్యసాయి జిల్లాలో వెల్నెస్ సెంటర్ మాత్రమే మనుగడలోకి వచ్చాయి. మిగిలిన 17 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. మిగతా సంస్థలతో పెట్టుబడులు పెట్టించేలా రెండు కమిటీలను ఏర్పాటు చేశామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఫలితం కనిపించడం లేదు.
రాయితీలు కాగితాలకే పరిమితం...
పెట్టుబడులపై ప్రభుత్వ రాయితీలు కాగితాలకే పరిమితమవడంతో ఎక్కువమంది ఆసక్తి చూపడం లేదు. ఉదాహరణకు పాలసీలో భాగంగా పెట్టుబడులు పెట్టి ప్రారంభించే హోటళ్లకు ఏపీజీఎస్టీ అయిదేళ్ల వరకు మినహాయింపు, బార్ల ఫీజుల్లో రాయితీ వంటివి సరిగా అమలుకావడం లేదు. హోటళ్ల నిర్వాహకులనుంచి ముక్కుపిండి ప్రభుత్వం వసూలు చేస్తోంది.
ఈ ఏడాది జనవరి 29 నుంచి 31 వరకు మూడు రోజులపాటు విశాఖలో నిర్వహించిన దక్షిణ భారత హోటళ్ల అసోసియేషన్ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ ప్రాతినిధ్యం లేదంటే పర్యాటక రంగానికి ఎంత ప్రాధాన్యమిచ్చారో అర్థమవుతోంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల పర్యాటకశాఖల నుంచి ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు హాజరైనా ఏపీ నుంచి ఎవరూ పాల్గొనలేదు.
వెంకన్ననీ విడిచిపెట్టలేదు!
రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోగా.. ఉన్న ఆస్తులను, పర్యాటకుల కోసం అమలు చేస్తున్న వివిధ ప్యాకేజీలను ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేశారు. దాదాపు 15 రిసార్టులను ఎన్నికల కోడ్ వచ్చే ముందు ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ఏపీటీడీసీ టెండర్లు పిలిచింది. దీనిపై ‘ఈనాడు’లో కథనం వెలువడడంతో టెండర్ల ప్రక్రియను నిలిపేశారు. అయినప్పటికీ నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్ రిసార్టును ఇటీవలే ఒక ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారు.
రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల కోసం అమలుచేస్తున్న ప్యాకేజీలను సైతం ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి తిరుమల వచ్చేవారికి ప్రత్యేకంగా బస్సు ప్యాకేజీ ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ఏళ్లుగా అమలు చేస్తున్నారు. బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులను బస్సుల్లో తీసుకొచ్చి తిరుమలలో స్వామి వారి దర్శనం చేయించి మళ్లీ అవే బస్సుల్లో వెనక్కి పంపుతారు. వీరికి వసతి, భోజన సదుపాయమూ ఏపీటీడీసీయే సమకూర్చేది. ఆదాయం సమకూరే ఈ ప్యాకేజీని ఇటీవలే ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారు. ఒక్కో టికెట్పై ప్రైవేటు సంస్థ.. ఏపీటీడీసీకి కమీషన్ చెల్లించనుంది. దాంతో ఏపీటీడీసీ కోసం తితిదే రోజూ కేటాయించే 1,100 దర్శన టిక్కెట్లను అధికారులు ప్రైవేటు చేతుల్లో పెట్టినట్లయింది. దీనివల్ల టికెట్లు దుర్వినియోగమయ్యే ఆస్కారముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
-
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
-
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
-
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
-
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్