గుత్తేదార్ల దయ.. గనులశాఖ ప్రాప్తం
టెండరు దక్కించుకున్న గుత్తేదారు ఒకటో తేదీన ఆ నెల సొమ్ము అడ్వాన్స్గా జమ చేయాలనేది నిబంధన. కానీ అత్యధిక జిల్లాల్లో గుత్తేదారులు ఆ డబ్బు చెల్లించడం లేదు.
సీనరేజ్ సొమ్ము ప్రతి నెలా చెల్లించని గుత్తేదార్లు
వీరంతా ప్రభుత్వ పెద్దలకు కావాల్సినవారే
అందుకే కోట్ల కొద్దీ బకాయిలున్నా నోరెత్తని గనులశాఖ అధికారులు
వారు ఇచ్చినప్పుడే తీసుకుని కళ్లకు అద్దుకుంటున్న వైనం
ఈనాడు - అమరావతి
‘ప్రైవేట్ సంస్థలకు సీనరేజ్ వసూళ్ల బాధ్యతలు అప్పగిస్తే.. ప్రతి నెలా నిర్దిష్టమైన ఆదాయం వస్తుంది. ప్రభుత్వ ఖజానాకు రాబడి పెరుగుతుంది’
లీజుదారుల నుంచి సీనరేజ్ వసూళ్లు ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధానం ప్రవేశపెట్టినప్పుడు జగన్ ప్రభుత్వం చెప్పిన మాటలివి.
టెండరు దక్కించుకున్న గుత్తేదారు ఒకటో తేదీన ఆ నెల సొమ్ము అడ్వాన్స్గా జమ చేయాలనేది నిబంధన. కానీ అత్యధిక జిల్లాల్లో గుత్తేదారులు ఆ డబ్బు చెల్లించడం లేదు. ఆ గుత్తేదార్లంతా వైకాపా ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులు కావడంతో గనుల శాఖ అధికారులు ఇదేంటని అడిగే ధైర్యం చేయలేకపోతున్నారు. వాళ్లు ఎప్పుడు చెల్లిస్తే అప్పుడే తీసుకొని.. మీ దయ, మా ప్రాప్తం అంటున్నారు. సీనరేజ్ వసూళ్ల బాధ్యతలు ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ద్వారా గనులశాఖ ఆదాయం పెరగకపోగా తగ్గుతోంది. గుత్తేదార్లు లీజుదార్ల నుంచి సీనరేజ్, తదితరాలు వసూలు చేస్తూ, ప్రభుత్వానికి మాత్రం సకాలంలో డబ్బు చెల్లించడం లేదు. గనుల శాఖలో మొదటి నుంచి అధికారులే సీనరేజ్ వసూలు చేసేవారు. కొన్నిచోట్ల అధికారులు లీజుదారులతో లాలూచీపడి సీనరేజ్ చెల్లించకపోయినా ఖనిజాలు తరలించేలా చూస్తున్నారనే వాదన తెరపైకి తెచ్చి.. సీనరేజ్ వసూళ్లు ప్రైవేటుకు అప్పగించే విధానాన్ని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశంలో కేవలం రాజస్థాన్లో మాత్రమే గ్రానైట్ సీనరేజ్ వసూళ్లు ప్రైవేటు సంస్థలకు ఇచ్చారు. దీనిని నమూనాగా తీసుకొని మన రాష్ట్రంలో అన్ని చిన్న తరహా ఖనిజాలకూ సీనరేజ్ వసూళ్లు ప్రైవేటుకు అప్పగించేలా నిబంధనలు మార్చేశారు. ఉమ్మడి జిల్లాల వారీగా రెండేళ్ల కిందట టెండర్లు పిలిచారు. ఏడు ఉమ్మడి జిల్లాలకు బిడ్లు ఖరారు చేసి, గుత్తేదార్లకు సీనరేజ్ వసూళ్ల బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచే అసలు కథ మొదలైంది.
అన్నీ పెద్దల సన్నిహితులవే..
ఉమ్మడి చిత్తూరు, విజయనగరం జిల్లా టెండరును రాఘవ కన్స్ట్రక్షన్స్, కడప జిల్లా టెండరును హిల్సైడ్ ఎస్టేట్స్ సంస్థలు దక్కించుకున్నాయి. ఇవి రెండూ తెలంగాణ మంత్రి, సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందినవి. అనంతపురం జిల్లా టెండరును అమిగోస్ మినరల్స్, గుంటూరు జిల్లాలో ఏఎంఆర్, తూర్పుగోదావరి టెండరును సుధాకర్ ఇన్ఫ్రా దక్కించుకున్నాయి. ఇవి రెండూ ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన సంస్థలే. శ్రీకాకుళం జిల్లా టెండరు విశ్వసముద్రకు వచ్చింది.
చెల్లింపులేవీ?
టెండరు దక్కించుకున్న సంస్థలు రెండేళ్లపాటు ఆయా లీజుదారుల నుంచి సీనరేజ్, కన్సిడరేషన్ ఎమౌంట్, జిల్లా ఖనిజ నిధి (డీఎంఎఫ్), ఖనిజాన్వేషణ నిధి (మెరిట్), ఆదాయ పన్ను వసూలు చేయాలి. టెండరులో కోట్ చేసిన ధరను 24 వాయిదాలుగా విభజించి.. ఆ మొత్తాన్ని ప్రతి నెలా ఒకటో తేదీలోపు చెల్లించాలనేది ఒప్పందం. కడప, చిత్తూరు, అనంతపురం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల గుత్తేదార్లు సకాలంలో ఈ సొమ్ము చెల్లించడం లేదు. కడప జిల్లాలో గుత్తేదారు సంస్థ నెలకు రూ.9 కోట్ల మేర గనుల శాఖకు చెల్లించాల్సి ఉండగా ఏడు నెలల బకాయి పేరుకుపోయింది. అనంతపురం జిల్లాలో నెలకు రూ.10.79 కోట్లు కట్టాలి. అక్కడా మూడు నెలల బకాయి ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో నెలకు రూ.9.7 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉండగా, డిసెంబరు నుంచి సొమ్ము కట్టడం లేదు. చిత్తూరు జిల్లాలో నెలకు రూ.12 కోట్ల మేర చెల్లించాల్సి ఉండగా, అందులో కొంత మొత్తమే చెల్లిస్తున్నారు.
నిబంధనలన్నీ కాగితాల్లోనే..
సీనరేజ్ గుత్తేదారులు పాటించాల్సిన నిబంధనలతో నిరుడు ఫిబ్రవరి 3న గనులశాఖ సంచాలకులు వెంకటరెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. దీని ప్రకారం టెండర్లో కోట్ చేసిన మేరకు ఏ నెలయినా చెల్లించకపోతే.. ఆ గుత్తేదారు కాంట్రాక్ట్ను రద్దు చేయాలి. రాతపూర్వకంగా కారణాలు తెలియజేస్తే మరుసటి నెల 24 శాతం వడ్డీతో రాబట్టాలి. గుత్తేదారు ఇలా ప్రతి నెలా చెల్లింపులు చేయకపోతే, సీనరేజ్ కింద వసూలు చేసిన సొమ్మును సీజ్చేసి, వెంటనే గనులశాఖ ద్వారా సీనరేజ్ వసూళ్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. అయితే నెలల తరబడి గుత్తేదారులు చెల్లింపులు చేయకపోయినా గనులశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. వాళ్లు చెబుతున్న కారణాలకు గుడ్డిగా తలూపుతున్నారు. గుత్తేదారులంతా ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులు కావడమే ఇందుకు కారణం.
డెడ్ రెంట్ చెల్లించకపోయినా పర్మిట్లు
నిబంధనల ప్రకారం ప్రతి లీజుదారు వార్షిక డెడ్ రెంట్ చెల్లించాకే, ఆ లీజులో తవ్వి, తరలించే ఖనిజానికి పర్మిట్లు జారీ చేయాలి. గనులశాఖ ద్వారా పర్మిట్ల జారీ ఉన్నప్పుడు.. అంతా ఆన్లైన్ విధానమే నడిచేది. దీనివల్ల లీజుదారు డెడ్రెంట్ చెల్లించారా లేదా తెలిసేది. ఇప్పుడు సీనరేజ్ గుత్తేదారులు ఆన్లైన్ కాకుండా, ఆఫ్లైన్లో ముద్రిత పర్మిట్లు జారీ చేస్తున్నారు. దీనివల్ల కొందరు లీజుదారులు వార్షిక డెడ్ రెంట్ చెల్లించకపోయినా పర్మిట్లు జారీ చేసేస్తున్నారు. దీనివల్ల గనులశాఖ రాబడి తగ్గినట్లు తెలిసింది.
ఇసుకలో జేపీ మాదిరిగా ఎగవేతేనా?
రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాల టెండరు పొందిన గుత్తేదారు సంస్థ జేపీ పవర్ వెంచర్స్ రెండేళ్లకు రూ.1,528 కోట్లు చెల్లించే ఒప్పందంతో టెండరు దక్కించుకుంది. 30 నెలలపాటు ఇసుక వ్యాపారం చేసింది. ఈ లెక్కన ప్రభుత్వానికి రూ.1,909 కోట్లు చెల్లించాలి. రూ.1,059 కోట్లు మాత్రమే చెల్లించి, చేతులు దులిపేసుకుంది. ప్రభుత్వ పెద్దలు పూర్తి స్థాయిలో ఇసుక దందా చేసి వందల కోట్లు దోచేశారు. అందుకే జేపీ సంస్థ బకాయి రూ.850 కోట్లపై ప్రభుత్వం గానీ, గనులశాఖ గానీ గట్టిగా అడగటం లేదనే విమర్శలున్నాయి. ఇప్పుడు సీనరేజ్ వసూళ్ల గుత్తేదారులు కూడా.. లీజుదారుల నుంచి వసూళ్లు చేసుకొని, చివరకు ప్రభుత్వానికి ఎగనామం పెడితే దానికి బాధ్యులెవరనే ప్రశ్న తలెత్తుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం