గుత్తేదార్ల దయ.. గనులశాఖ ప్రాప్తం
టెండరు దక్కించుకున్న గుత్తేదారు ఒకటో తేదీన ఆ నెల సొమ్ము అడ్వాన్స్గా జమ చేయాలనేది నిబంధన. కానీ అత్యధిక జిల్లాల్లో గుత్తేదారులు ఆ డబ్బు చెల్లించడం లేదు.
సీనరేజ్ సొమ్ము ప్రతి నెలా చెల్లించని గుత్తేదార్లు
వీరంతా ప్రభుత్వ పెద్దలకు కావాల్సినవారే
అందుకే కోట్ల కొద్దీ బకాయిలున్నా నోరెత్తని గనులశాఖ అధికారులు
వారు ఇచ్చినప్పుడే తీసుకుని కళ్లకు అద్దుకుంటున్న వైనం
ఈనాడు - అమరావతి
‘ప్రైవేట్ సంస్థలకు సీనరేజ్ వసూళ్ల బాధ్యతలు అప్పగిస్తే.. ప్రతి నెలా నిర్దిష్టమైన ఆదాయం వస్తుంది. ప్రభుత్వ ఖజానాకు రాబడి పెరుగుతుంది’
లీజుదారుల నుంచి సీనరేజ్ వసూళ్లు ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధానం ప్రవేశపెట్టినప్పుడు జగన్ ప్రభుత్వం చెప్పిన మాటలివి.
టెండరు దక్కించుకున్న గుత్తేదారు ఒకటో తేదీన ఆ నెల సొమ్ము అడ్వాన్స్గా జమ చేయాలనేది నిబంధన. కానీ అత్యధిక జిల్లాల్లో గుత్తేదారులు ఆ డబ్బు చెల్లించడం లేదు. ఆ గుత్తేదార్లంతా వైకాపా ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులు కావడంతో గనుల శాఖ అధికారులు ఇదేంటని అడిగే ధైర్యం చేయలేకపోతున్నారు. వాళ్లు ఎప్పుడు చెల్లిస్తే అప్పుడే తీసుకొని.. మీ దయ, మా ప్రాప్తం అంటున్నారు. సీనరేజ్ వసూళ్ల బాధ్యతలు ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ద్వారా గనులశాఖ ఆదాయం పెరగకపోగా తగ్గుతోంది. గుత్తేదార్లు లీజుదార్ల నుంచి సీనరేజ్, తదితరాలు వసూలు చేస్తూ, ప్రభుత్వానికి మాత్రం సకాలంలో డబ్బు చెల్లించడం లేదు. గనుల శాఖలో మొదటి నుంచి అధికారులే సీనరేజ్ వసూలు చేసేవారు. కొన్నిచోట్ల అధికారులు లీజుదారులతో లాలూచీపడి సీనరేజ్ చెల్లించకపోయినా ఖనిజాలు తరలించేలా చూస్తున్నారనే వాదన తెరపైకి తెచ్చి.. సీనరేజ్ వసూళ్లు ప్రైవేటుకు అప్పగించే విధానాన్ని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశంలో కేవలం రాజస్థాన్లో మాత్రమే గ్రానైట్ సీనరేజ్ వసూళ్లు ప్రైవేటు సంస్థలకు ఇచ్చారు. దీనిని నమూనాగా తీసుకొని మన రాష్ట్రంలో అన్ని చిన్న తరహా ఖనిజాలకూ సీనరేజ్ వసూళ్లు ప్రైవేటుకు అప్పగించేలా నిబంధనలు మార్చేశారు. ఉమ్మడి జిల్లాల వారీగా రెండేళ్ల కిందట టెండర్లు పిలిచారు. ఏడు ఉమ్మడి జిల్లాలకు బిడ్లు ఖరారు చేసి, గుత్తేదార్లకు సీనరేజ్ వసూళ్ల బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచే అసలు కథ మొదలైంది.
అన్నీ పెద్దల సన్నిహితులవే..
ఉమ్మడి చిత్తూరు, విజయనగరం జిల్లా టెండరును రాఘవ కన్స్ట్రక్షన్స్, కడప జిల్లా టెండరును హిల్సైడ్ ఎస్టేట్స్ సంస్థలు దక్కించుకున్నాయి. ఇవి రెండూ తెలంగాణ మంత్రి, సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందినవి. అనంతపురం జిల్లా టెండరును అమిగోస్ మినరల్స్, గుంటూరు జిల్లాలో ఏఎంఆర్, తూర్పుగోదావరి టెండరును సుధాకర్ ఇన్ఫ్రా దక్కించుకున్నాయి. ఇవి రెండూ ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన సంస్థలే. శ్రీకాకుళం జిల్లా టెండరు విశ్వసముద్రకు వచ్చింది.
చెల్లింపులేవీ?
టెండరు దక్కించుకున్న సంస్థలు రెండేళ్లపాటు ఆయా లీజుదారుల నుంచి సీనరేజ్, కన్సిడరేషన్ ఎమౌంట్, జిల్లా ఖనిజ నిధి (డీఎంఎఫ్), ఖనిజాన్వేషణ నిధి (మెరిట్), ఆదాయ పన్ను వసూలు చేయాలి. టెండరులో కోట్ చేసిన ధరను 24 వాయిదాలుగా విభజించి.. ఆ మొత్తాన్ని ప్రతి నెలా ఒకటో తేదీలోపు చెల్లించాలనేది ఒప్పందం. కడప, చిత్తూరు, అనంతపురం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల గుత్తేదార్లు సకాలంలో ఈ సొమ్ము చెల్లించడం లేదు. కడప జిల్లాలో గుత్తేదారు సంస్థ నెలకు రూ.9 కోట్ల మేర గనుల శాఖకు చెల్లించాల్సి ఉండగా ఏడు నెలల బకాయి పేరుకుపోయింది. అనంతపురం జిల్లాలో నెలకు రూ.10.79 కోట్లు కట్టాలి. అక్కడా మూడు నెలల బకాయి ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో నెలకు రూ.9.7 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉండగా, డిసెంబరు నుంచి సొమ్ము కట్టడం లేదు. చిత్తూరు జిల్లాలో నెలకు రూ.12 కోట్ల మేర చెల్లించాల్సి ఉండగా, అందులో కొంత మొత్తమే చెల్లిస్తున్నారు.
నిబంధనలన్నీ కాగితాల్లోనే..
సీనరేజ్ గుత్తేదారులు పాటించాల్సిన నిబంధనలతో నిరుడు ఫిబ్రవరి 3న గనులశాఖ సంచాలకులు వెంకటరెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. దీని ప్రకారం టెండర్లో కోట్ చేసిన మేరకు ఏ నెలయినా చెల్లించకపోతే.. ఆ గుత్తేదారు కాంట్రాక్ట్ను రద్దు చేయాలి. రాతపూర్వకంగా కారణాలు తెలియజేస్తే మరుసటి నెల 24 శాతం వడ్డీతో రాబట్టాలి. గుత్తేదారు ఇలా ప్రతి నెలా చెల్లింపులు చేయకపోతే, సీనరేజ్ కింద వసూలు చేసిన సొమ్మును సీజ్చేసి, వెంటనే గనులశాఖ ద్వారా సీనరేజ్ వసూళ్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. అయితే నెలల తరబడి గుత్తేదారులు చెల్లింపులు చేయకపోయినా గనులశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. వాళ్లు చెబుతున్న కారణాలకు గుడ్డిగా తలూపుతున్నారు. గుత్తేదారులంతా ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులు కావడమే ఇందుకు కారణం.
డెడ్ రెంట్ చెల్లించకపోయినా పర్మిట్లు
నిబంధనల ప్రకారం ప్రతి లీజుదారు వార్షిక డెడ్ రెంట్ చెల్లించాకే, ఆ లీజులో తవ్వి, తరలించే ఖనిజానికి పర్మిట్లు జారీ చేయాలి. గనులశాఖ ద్వారా పర్మిట్ల జారీ ఉన్నప్పుడు.. అంతా ఆన్లైన్ విధానమే నడిచేది. దీనివల్ల లీజుదారు డెడ్రెంట్ చెల్లించారా లేదా తెలిసేది. ఇప్పుడు సీనరేజ్ గుత్తేదారులు ఆన్లైన్ కాకుండా, ఆఫ్లైన్లో ముద్రిత పర్మిట్లు జారీ చేస్తున్నారు. దీనివల్ల కొందరు లీజుదారులు వార్షిక డెడ్ రెంట్ చెల్లించకపోయినా పర్మిట్లు జారీ చేసేస్తున్నారు. దీనివల్ల గనులశాఖ రాబడి తగ్గినట్లు తెలిసింది.
ఇసుకలో జేపీ మాదిరిగా ఎగవేతేనా?
రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాల టెండరు పొందిన గుత్తేదారు సంస్థ జేపీ పవర్ వెంచర్స్ రెండేళ్లకు రూ.1,528 కోట్లు చెల్లించే ఒప్పందంతో టెండరు దక్కించుకుంది. 30 నెలలపాటు ఇసుక వ్యాపారం చేసింది. ఈ లెక్కన ప్రభుత్వానికి రూ.1,909 కోట్లు చెల్లించాలి. రూ.1,059 కోట్లు మాత్రమే చెల్లించి, చేతులు దులిపేసుకుంది. ప్రభుత్వ పెద్దలు పూర్తి స్థాయిలో ఇసుక దందా చేసి వందల కోట్లు దోచేశారు. అందుకే జేపీ సంస్థ బకాయి రూ.850 కోట్లపై ప్రభుత్వం గానీ, గనులశాఖ గానీ గట్టిగా అడగటం లేదనే విమర్శలున్నాయి. ఇప్పుడు సీనరేజ్ వసూళ్ల గుత్తేదారులు కూడా.. లీజుదారుల నుంచి వసూళ్లు చేసుకొని, చివరకు ప్రభుత్వానికి ఎగనామం పెడితే దానికి బాధ్యులెవరనే ప్రశ్న తలెత్తుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!