వాసుపల్లికి సర్కారు నజరానాలు
విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్కు దోచిపెట్టేందుకు గుర్తించిన ప్రభుత్వ భూముల విలువ రూ.206 కోట్లు. తన ‘వైజాగ్ డిఫెన్స్ అకాడమీ’ విద్యాసంస్థ కార్యకలాపాల విస్తరణకు ప్రభుత్వం నుంచి కారుచౌకగా భూమిని పొందేందుకు వాసుపల్లి చేయని ప్రయత్నం లేదు.
రూ.206 కోట్ల భూ సంతర్పణ!
భూ సేకరణ చట్టం ప్రకారం చెల్లించాల్సిన మొత్తంతో కలిపి
భారీగా ఫీజులు.. చౌకగా భూమి కొట్టేసేందుకు కుయుక్తులు!
ఈనాడు-అమరావతి, విశాఖపట్నం: విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్కు దోచిపెట్టేందుకు గుర్తించిన ప్రభుత్వ భూముల విలువ రూ.206 కోట్లు. తన ‘వైజాగ్ డిఫెన్స్ అకాడమీ’ విద్యాసంస్థ కార్యకలాపాల విస్తరణకు ప్రభుత్వం నుంచి కారుచౌకగా భూమిని పొందేందుకు వాసుపల్లి చేయని ప్రయత్నం లేదు. 10 ఎకరాల వరకు భూములు నామమాత్రపు ధరకు కేటాయించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. చివరికి ముఖ్యమంత్రి కార్యాలయం జారీచేసిన ఆదేశాలతో విశాఖ జిల్లా అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. దీని ప్రకారం మూడుచోట్ల కలిపి 6.90 ఎకరాలను గుర్తించారు. ఈ మొత్తం భూమి మార్కెట్ విలువ సుమారు రూ.82 కోట్లు అవుతుంది. మధురవాడలో 1.50 ఎకరాలు, బక్కన్నపాలెంలో 40 సెంట్లు, కుసలవాడలో 5 ఎకరాల చొప్పున గుర్తించారు. చదరపు గజం మార్కెట్ విలువ మధురవాడలో రూ.1.15 లక్షలు, బక్కన్నపాలెంలో రూ.90,000 చొప్పున ఉంది. కుసలవాడలో ఎకరా రూ.45 లక్షల వరకు పలుకుతోంది. ప్రజల నుంచి భూసేకరణ జరిగినప్పుడు భూసేకరణ చట్టం-2013 ప్రకారం ప్రభుత్వపరంగా చేసే నష్టపరిహారం చెల్లింపుల మాదిరిగానే.. ప్రభుత్వ భూమిని పొందిన వారు కూడా చెల్లించాలి. ఈ ప్రకారమే వాసుపల్లికి భూమి కేటాయిస్తే.. మొత్తం రూ.206 కోట్లు చెల్లించాలని అధికారులు లెక్కలు తేల్చారు. ఈ మేరకు అధికార యంత్రాంగం ప్రభుత్వానికి ఇటీవల పంపిన నివేదికలో స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి.
ఎమ్మెల్యే డిఫెన్స్ అకాడమీ ద్వారా పలుచోట్ల ఎంపీసీ, ఐఐటీ, డిఫెన్స్ రంగాల్లో అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఒక్కో విద్యార్థికి హాస్టల్ వసతితో కలిపి సుమారు రూ.2.20లక్షలు, డేస్కాలర్ అయితే రూ.80వేల చొప్పున ఫీజులు తీసుకుంటున్నారు. ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ భూమికి టెండర్ పెట్టడం గమనార్హం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వాసుపల్లి విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి తెదేపా తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన విద్యాసంస్థలపై వైకాపా ప్రభుత్వం దాడులు చేయించింది. ఆ పరిణామాల నేపథ్యంలో వాసుపల్లి వైకాపా పంచన చేరారు. నజరానా కింద ప్రభుత్వ భూమికి వాసుపల్లి గురిపెట్టారు. ప్రైవేటు రంగంలో ఉన్న డిఫెన్స్ అకాడమీకి భూముల కేటాయింపులకు అనుకూలంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ నుంచి సిఫార్సులు రెవెన్యూ శాఖకు అందాలి. జీవీఎంసీ నుంచి ఎన్ఓసీ రావాలి. ఇవేమీ లేకుండానే విశాఖ జిల్లా కలెక్టర్ నుంచి భూ కేటాయింపులపై ప్రతిపాదనలు రెవెన్యూ శాఖకు అందాయి.
రూ.1.90 కోట్లతో రోడ్డేశారు
విశాఖపట్నం (వేపగుంట), న్యూస్టుడే: నగరంలో చాలా రోడ్లు అధ్వానంగా తయారై ప్రజలు అవస్థలు పడుతున్నా పట్టించుకోని వైకాపా ఎమ్మెల్యేలు నగర శివారులోని తమవారి భూముల విలువ పెరిగేలా రోడ్లు, ఇతర వసతులను కల్పిస్తున్నారు. తెదేపాలో గెలిచి వైకాపా పంచన చేరిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్కుమార్ మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధి 88వ వార్డు నరవలో కొనుక్కున్న భూములకు జీవీఎంసీ నిధులు రూ.1.90 కోట్లు వెచ్చించి ప్రస్తుతం రహదారి పనులు చేపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే గణేశ్కుమార్ తన పలుకుబడిని ఉపయోగించి స్థానిక పెందుర్తి ఎమ్మెల్యే అదీప్రాజ్ సహకారంతో తన భూముల వరకు రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించుకున్నారు. ఈ పనులకు ఈ ఏడాది జనవరి 12న శంకుస్థాపన చేయడానికి ఇంజినీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న వార్డు తెదేపా కార్పొరేటర్ ముత్యాలనాయుడు, తెదేపా, జనసేన నాయకులు మేయర్కు ఫిర్యాదు చేశారు. జనసంచారం లేనిచోట, వ్యక్తిగత ప్రయోజనాలకు రహదారి నిర్మించడమేంటని ప్రశ్నించారు. వీరంతా ధర్నాకు దిగడంతో అధికారులు కాస్త వెనకడుగు వేసి శంకుస్థాపనను వాయిదా వేశారు. ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో అధికారులంతా ఆ విధుల్లో నిమగ్నమవడంతో సందట్లో సడేమియాలా గుట్టుచప్పుడు కాకుండా నాలుగు రోజుల కిందట రహదారి పనులు ప్రారంభించారు. ప్రస్తుతం మట్టి పని చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రహదారిని నిర్మించడంపై విచారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
జగన్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ దయనీయంగా తయారైంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను విద్యుత్తు కోతల కష్టాలు పీడిస్తున్నాయి. -
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
‘ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడతా. జగనన్న ప్రభుత్వంలో నాకు, నా బిడ్డకు రక్షణ లేదు. వారణాసిలో కుమార్తెతో కలిసి తలదాచుకుంటున్నా..’ అని కాకినాడకు చెందిన రాజులపల్లి ఆరుద్ర తెలిపారు. -
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్లపై జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానానికి చరమగీతం పాడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నాసిక్ నుంచి స్టాంపు పేపర్లను తెప్పించడం ఇప్పటికే నిలిపేసింది. -
గోవా మద్యానికి ‘వైకాపా’ గ్రీన్ఛానల్!
సార్వత్రిక ఎన్నికల వేళ కొంతమంది వైకాపా నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యంతో జనాల్ని ప్రలోభపెడుతూ వారి ప్రాణాల్ని బలిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
అన్న క్లాస్.. తమ్ముడు మాస్.. భూములన్నీ ఖల్లాస్!
భూమిని నమ్ముకున్నోళ్లెవ్వరూ ఆగం కాలేదు. అందుకేనేమో.. వైకాపా నేతలంతా ఒకరిని మించి మరొకరు కబ్జాలకు తెరతీశారు. -
ఎవరి ఆధీనంలో ఎవరు?
ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా...? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది. -
బ్రో... ఏ రాష్ట్రానికి పొమ్మంటావ్?
మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడి ఎక్కడా అభివృద్ధి లేకుండా చేశారు. నిర్మాణ రంగం కుదేలైంది. స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినడంతో వ్యాపారులు పెద్ద నగరాలకు తరలిపోయారు. -
మేనమామ కాదు.. మేకవన్నె పులి
ఓట్ల వేటలో.. చిన్నారులనూ పావులను చేసి... వారి చదువులను చట్టుబండలు చేసి... బైజూసనీ... ట్యాబ్లనీ.. టోఫెలనీ... ఐబీ అనీ... అమాయక పిల్లల్ని అర్థంలేని ప్రయోగాలకు బలి చేసిన... అయోమయం జగన్నాథం.... ఆంధ్రావని చేసుకున్న పాపం! -
ప్లాస్టర్ తీసేసిన సీఎం.. వెలంపల్లి ‘కట్టు’ కథా ముగిసింది!
సీఎం జగన్ నుదిటిపై వేసుకున్న ప్లాస్టర్ను తీసేశారు. ఈనెల 13న విజయవాడలో గులకరాయి తగిలిన రోజు నుంచి 25 వరకూ ప్లాస్టర్తోనే కనిపించారు. శనివారం పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా సీఎం ప్లాస్టర్ లేకుండా కనిపించారు. -
ఇలాగేటి.. బాదేస్తన్రు!
ఉత్తరాంధ్ర ప్రజానీకం ఏ సంకోచాలు లేకుండా వైకాపా పాలనపై గళమెత్తుతోంది. జగన్ ప్రభుత్వంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. విశాఖ వంటి మహా నగరంలోనే కాదు శ్రీకాకుళం వంటి నగరం, పలాస, పాలకొండ వంటి పల్లెలను ఆనుకుని ఉన్న పెద్ద, చిన్న పట్టణ ప్రాంతాల్లోనే కాదు. -
వైద్య సీట్లకు కోత
వైకాపా ప్రభుత్వం సన్నద్ధంగా లేనందున ఎంబీబీఎస్ సీట్లకు కోత పడింది. 2024-25లో కొత్తగా ప్రారంభం కానున్న 5 వైద్య కళాశాలల్లో వంద చొప్పున మాత్రమే ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయబోతున్నారు. -
యువ ఓటర్ల భుజస్కంధాలపైనే దేశ భవిష్యత్తు
పోలింగ్ శాతం గణనీయంగా పెంచేందుకు ప్రతి జిల్లాలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. లెట్స్ ఓట్ సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా శనివారం గుంటూరులో 3కె వాక్ నిర్వహించాయి. -
ఉపాధి పనుల్లో పశువులు!
‘ఉపాధి’ పని చేస్తున్న కూలీల చిత్రం ఉండాల్సిన చోట గేదెల చిత్రం అప్లోడ్ చేశారు.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల ఉపాధి ఉద్యోగులు. -
సంపాదనపై కాదు.. నేర్చుకోవడంపై దృష్టి సారించాలి
యువ న్యాయవాదులు ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో సంపాదనపై కాకుండా నేర్చుకోవడంపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు. -
‘ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ని విధుల నుంచి తప్పించండి’
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి నిరుద్యోగులను ప్రభావితం చేసేలా ఈనెల 29న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం (ఏపీఎన్ఎఫ్) అధ్యక్షుడు బి.శ్రీరాములు పేర్కొన్నారు. -
వారాంతమిస్తానని.. వాయింపే.. వాయింపు!
అధికారంలోకి రావడానికి జగన్ అన్ని వర్గాలను పావులుగా వాడుకున్నారు. ఎన్నెన్నో హామీలను గుప్పించారు. అన్నింటినీ నెరవేరుస్తానంటూ మ్యానిఫెస్టో ముద్రించారు. -
గులకరాయి కేసు నిందితుడికి ముగిసిన పోలీసు కస్టడీ
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ మూడు రోజుల పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. -
పాలిసెట్- 2024కి 88.74 శాతం మంది హాజరు
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్-2024కు 88.74శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్