జగన్నాటకంలో జీడిపల్లి గొంతు జీర!
జీడిపల్లి జలాశయం, ఎగువ పెన్నా (పేరూరు) ప్రాజెక్టులను అనుసంధానించి అనంతపురం జిల్లాలోని 8 మండలాల పరిధిలో 75 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ఇందుకు రూ.803 కోట్ల ఖర్చుతో ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ, సోమరవాండ్లపల్లి వద్ద నాలుగు జలాశయాలను నిర్మిస్తాం.
తెదేపా చేపట్టిన జీడిపల్లి-పేరూరు నీటి పథకానికి పాతర
కొత్తది శిలాఫలకానికే పరిమితమై రైతన్నల గోడుగోడు
గుత్తి జనానికి ఉప్పునీరే మిగిల్చారు..
గుత్తి, రాప్తాడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ బస్సు యాత్ర నేడు
జీడిపల్లి జలాశయం, ఎగువ పెన్నా (పేరూరు) ప్రాజెక్టులను అనుసంధానించి అనంతపురం జిల్లాలోని 8 మండలాల పరిధిలో 75 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ఇందుకు రూ.803 కోట్ల ఖర్చుతో ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ, సోమరవాండ్లపల్లి వద్ద నాలుగు జలాశయాలను నిర్మిస్తాం. నాలుగు ఎత్తిపోతల పథకాలను చేపడతాం.
2020 డిసెంబరు 9న శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి వద్ద జలాశయాల నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేసిన సందర్భంగా సీఎం జగన్ హామీ ఇది..
ఈనాడు డిజిటల్, అనంతపురం: ఏరు దాటాక తెప్ప తగలేయడం ముఖ్యమంత్రి జగన్ నైజం. అవసరాల కోసం హామీలివ్వడం.. మరుక్షణమే మరిచిపోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఊరించి ఉసూరుమనిపించడంలో దిట్ట. 2020 చివరలో శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి వద్ద జీడిపల్లి-పేరూరు పథకానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాయమాటలెన్నో చెప్పారు. పథకాన్ని సత్వరం పూర్తిచేసి ఎనిమిది మండలాల్లో 75 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని పెద్దపెద్ద హామీలిచ్చారు. మూడేళ్లు గడిచినా దీని అతీగతీ లేదు. శనివారం ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కార్యరూపం దాల్చుతున్న పథకాన్ని నిలిపేయడమే కాకుండా కొత్తదీ అందించక దుర్భిక్షంలోకి నెట్టేసిన జగన్ వైఖరిని స్థానిక రైతులు ప్రశ్నిస్తున్నారు. జీడిపల్లి-పేరూరు ప్రాజెక్టు పూర్తికి ఇచ్చిన హామీ అడుగు ముందుకు పడలేదు. అధికారంలోకి వచ్చాక సీఎం హోదాలో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి మరిచిపోయారు. ఈ ఒక్క పథకంపైనే సీఎం జగన్ మూడుసార్లు స్వయంగా హామీనిచ్చినా పనులు చేపట్టలేదు. శంకుస్థాపన శిలాఫలకాలు తప్ప గంప మట్టి తీసింది లేదు. నిధులు కేటాయించకుండా డిజైన్లు, సర్వే, భూసేకరణ పేరుతో జాప్యం చేశారు. దీన్నిబట్టి ఉమ్మడి అనంతపురం జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ చిత్తశుద్ధి స్పష్టమవుతుంది.
అధికారంలోకి రాగానే పనుల రద్దు
జీడిపల్లి-పేరూరు పథకానికి 2018లోనే తెదేపా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పుట్టకనుమ, సోమరవాండ్లపల్లి వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిర్మించాలని నిర్ణయించింది. రూ.803 కోట్లకు పరిపాలన అనుమతులనిచ్చి రూ.565 కోట్లకు టెండర్లనూ పిలిచింది. 37 కి.మీ. కాలువ పనులూ పూర్తయ్యాయి. నాలుగు పంపుహౌస్ల నిర్మాణాన్నీ మొదలుపెట్టారు. 16 కి.మీ. కాలువ పనులు పెండింగ్లో ఉన్నాయి. అప్పట్లోనే 988 ఎకరాల భూమి సేకరించారు. 95 ఎకరాలకు సంబంధించి రూ.5.20 కోట్ల పరిహారమూ చెల్లించారు. ఆ రోజు ధర ప్రకారం ఇంకా రూ.50.75 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇంతలో ప్రభుత్వం మారడంతో పనులు ఎక్కడివక్కడ నిలిచాయి. వైకాపా ప్రభుత్వం రాగానే ప్రాజెక్టు నమూనాను మార్చేసింది. తెదేపా హయాంలో చేపట్టిన పుట్టకనుమ రిజర్వాయరును రద్దు చేసింది. రూ.803 కోట్ల ఖర్చుతో ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ, సోమరవాండ్లపల్లి వద్ద నాలుగు జలాశయాల నిర్మిస్తామని ప్రకటించింది.
ఇదీ లక్ష్యం..
హంద్రీనీవాలో భాగంగా నిర్మించిన జీడిపల్లి జలాశయం నుంచి పేరూరుకు కృష్ణా జలాలు అందించాలని లక్ష్యం. ఎత్తిపోతల ద్వారా జీడిపల్లి జలాశయం నుంచి పేరూరు డ్యాంకు మూడు నెలల్లో 7.2 టీఎంసీలను తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నిర్మించే దేవరకొండ, ముట్టాల, తోపుదుర్తి, సోమరవాండ్లపల్లి జలాశయాలను కృష్ణా జలాలతో నింపి కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రాప్తాడు, రామగిరి, ఆత్మకూరు, కంబదూరు, కూడేరు, బెళుగుప్ప మండలాలకు నీరందించాలని నిర్ణయించుకున్నారు. వీటి నిర్మాణానికి 5,171 ఎకరాలు అవసరమవుతాయని అంచనా. జీడిపల్లి నుంచి ఎగువ పెన్నా జలాశయం వరకున్న 53.45 కి.మీ. ప్రధాన కాలువపై నాలుగు ఎత్తిపోతలు, 110 కాంక్రీటు కట్టడాలు చేపట్టాల్సి ఉంది. కొత్తపల్లి, ఆత్మకూరు, బాలవెంకటాపురం, మద్దెలచెరువు వద్ద ఎత్తిపోతల పథకాలు చేపట్టేలా ప్రాజెక్టు రూపొందింది. అయిదేళ్లలో ఈ పనులు ముందుకెళ్లలేదు.
గుత్తి దాహం కేకలు వినిపించవా?
అనంతపురం జిల్లా గుత్తి పురపాలికతోపాటు బసినేపల్లిలో తాగునీటి సమస్య తీరుస్తామని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం జగన్ హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదు. పట్టణంలో 55 వేల మంది నివసిస్తున్నారు. ఇంటింటికి కుళాయిలు ఏర్పాటుచేయించి నీటి సమస్య లేకుండా చూస్తామని ప్రకటించిన జగన్ అధికారంలోకి వచ్చాక విస్మరించారు. ఈసారి ప్రయాణంలో కర్నూలు జిల్లా నుంచి అనంతపురం జిల్లాలో జగన్ తొలి అడుగు గుత్తి ప్రాంతంలోనే పడనుంది.
గుత్తి పురపాలికలోని చెట్నేపల్లి, గుత్తి ఆర్.ఎస్, గుత్తి పట్టణంలో ప్రజలకు నెలకోసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పామిడి సమీపంలోని పెన్నా నుంచి నీరు రావాల్సి ఉంది. పెన్నాలో వైటీ చెరువు, సత్యసాయి పథకాలున్నాయి. వాటి నుంచి రోజుకు 30 లక్షల లీటర్ల నీరు రావాల్సి ఉంది. వైటీ చెరువు పథకం నుంచి రోజుకు పది లక్షల లీటర్లే అందుతున్నాయి. ఈ నీరు ఏమూలకూ సరిపోవు.
పురపాలిక అధికారులు ప్రస్తుతం 20 ట్యాంకర్లతో అందించే నీరు ఉప్పగానే ఉంటున్నాయి. తెదేపా ప్రభుత్వం గుత్తి వాసుల దాహార్తి తీర్చేందుకు రూ.173 కోట్లతో నీటి పథకాన్ని మంజూరు చేసింది. గార్లదిన్నె ఎంపీఆర్ డ్యామ్లో తుంగభద్ర జలాలను నిల్వ ఉంచి పైపులైన్ ద్వారా గుత్తికి అందించాలని పథకం రూపొందించారు. పథకం మంజూరై అయిదేళ్లు గడిచినా వైకాపా ప్రభుత్వం పూర్తి చేయలేదు. తెదేపాకు మంచి పేరు వస్తుందని మూలన పడేశారు. గుత్తి, సూరశింగనపల్లిలో ట్యాంకులను మాత్రం నిర్మించారు. కేవలం ఒకటిన్నర కి.మీ.దూరమే పైప్లైన్ వేశారు. పూర్తికి దాదాపు రూ.70 కోట్ల విలువైన పైపులు అవసరం. బిల్లుల చెల్లింపులో జాప్యం వల్ల పథకం పూర్తికి గుత్తేదారు సంస్థ చొరవ చూపడం లేదు. ట్యాంకర్లలో వచ్చే ఉప్పునీటి కోసం ఘర్షణలు తప్పడం లేదు.
నిధులు రాలిస్తేనే కదా!
2018లో తెదేపా ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించి ఈ పథకం పనులను పరుగులు పెట్టించింది. 53 కి.మీ. ప్రధాన కాలువను దాదాపు పూర్తి చేసింది. భూనిర్వాసితులకు పరిహారమూ చెల్లించారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక పరిహారం పెంచి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి అప్పట్లో హామీనిచ్చారు. అయిదేళ్లు పూర్తయి మళ్లీ ఎన్నికలు వస్తున్నా సొమ్ము జమ చేయలేదు. నాలుగు ప్రాజెక్టుల నిర్మాణానికి 13 గ్రామాల రైతులు భూములిస్తున్నారు. ఎకరాకు రూ.20 లక్షలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే నిబంధనల మేరకు ఎకరాకు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలు ఇస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో రైతులు ఒప్పుకోవడం లేదు. ఈ అయిదేళ్లలో ప్రాజెక్టు నిర్మాణానికి రూపాయి కేటాయించలేదు. ఇప్పుడు సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి వస్తున్నందున గతంలో తాను ఇచ్చిన హామీలపై ఏం మాట్లాడతారనేది చర్చనీయాంశమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు. -
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
కంట్రోల్లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం
సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’ -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
కొండల్ని మింగి.. గోతులు మిగిల్చారు!
విజయవాడ సమీపం జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొండపావులూరు పరిసరాల్లో కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. -
వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం
వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. -
ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు
రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! -
నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. -
మాటల ఏలిక.. మీటలో మెలిక!
అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్ లీవర్, పీఅండ్జీ, ఐటీసీ, రిలయన్స్, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
దండుకో.. వాటాలు పంచుకో!
జగన్ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్ అధికారులు చెలరేగిపోతున్నారు. -
రోగుల సమాచారం మీకెందుకు?
వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!