జగన్నాటకంలో జీడిపల్లి గొంతు జీర!
జీడిపల్లి జలాశయం, ఎగువ పెన్నా (పేరూరు) ప్రాజెక్టులను అనుసంధానించి అనంతపురం జిల్లాలోని 8 మండలాల పరిధిలో 75 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ఇందుకు రూ.803 కోట్ల ఖర్చుతో ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ, సోమరవాండ్లపల్లి వద్ద నాలుగు జలాశయాలను నిర్మిస్తాం.
తెదేపా చేపట్టిన జీడిపల్లి-పేరూరు నీటి పథకానికి పాతర
కొత్తది శిలాఫలకానికే పరిమితమై రైతన్నల గోడుగోడు
గుత్తి జనానికి ఉప్పునీరే మిగిల్చారు..
గుత్తి, రాప్తాడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ బస్సు యాత్ర నేడు
జీడిపల్లి జలాశయం, ఎగువ పెన్నా (పేరూరు) ప్రాజెక్టులను అనుసంధానించి అనంతపురం జిల్లాలోని 8 మండలాల పరిధిలో 75 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ఇందుకు రూ.803 కోట్ల ఖర్చుతో ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ, సోమరవాండ్లపల్లి వద్ద నాలుగు జలాశయాలను నిర్మిస్తాం. నాలుగు ఎత్తిపోతల పథకాలను చేపడతాం.
2020 డిసెంబరు 9న శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి వద్ద జలాశయాల నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేసిన సందర్భంగా సీఎం జగన్ హామీ ఇది..
ఈనాడు డిజిటల్, అనంతపురం: ఏరు దాటాక తెప్ప తగలేయడం ముఖ్యమంత్రి జగన్ నైజం. అవసరాల కోసం హామీలివ్వడం.. మరుక్షణమే మరిచిపోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఊరించి ఉసూరుమనిపించడంలో దిట్ట. 2020 చివరలో శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి వద్ద జీడిపల్లి-పేరూరు పథకానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాయమాటలెన్నో చెప్పారు. పథకాన్ని సత్వరం పూర్తిచేసి ఎనిమిది మండలాల్లో 75 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని పెద్దపెద్ద హామీలిచ్చారు. మూడేళ్లు గడిచినా దీని అతీగతీ లేదు. శనివారం ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కార్యరూపం దాల్చుతున్న పథకాన్ని నిలిపేయడమే కాకుండా కొత్తదీ అందించక దుర్భిక్షంలోకి నెట్టేసిన జగన్ వైఖరిని స్థానిక రైతులు ప్రశ్నిస్తున్నారు. జీడిపల్లి-పేరూరు ప్రాజెక్టు పూర్తికి ఇచ్చిన హామీ అడుగు ముందుకు పడలేదు. అధికారంలోకి వచ్చాక సీఎం హోదాలో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి మరిచిపోయారు. ఈ ఒక్క పథకంపైనే సీఎం జగన్ మూడుసార్లు స్వయంగా హామీనిచ్చినా పనులు చేపట్టలేదు. శంకుస్థాపన శిలాఫలకాలు తప్ప గంప మట్టి తీసింది లేదు. నిధులు కేటాయించకుండా డిజైన్లు, సర్వే, భూసేకరణ పేరుతో జాప్యం చేశారు. దీన్నిబట్టి ఉమ్మడి అనంతపురం జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ చిత్తశుద్ధి స్పష్టమవుతుంది.
అధికారంలోకి రాగానే పనుల రద్దు
జీడిపల్లి-పేరూరు పథకానికి 2018లోనే తెదేపా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పుట్టకనుమ, సోమరవాండ్లపల్లి వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిర్మించాలని నిర్ణయించింది. రూ.803 కోట్లకు పరిపాలన అనుమతులనిచ్చి రూ.565 కోట్లకు టెండర్లనూ పిలిచింది. 37 కి.మీ. కాలువ పనులూ పూర్తయ్యాయి. నాలుగు పంపుహౌస్ల నిర్మాణాన్నీ మొదలుపెట్టారు. 16 కి.మీ. కాలువ పనులు పెండింగ్లో ఉన్నాయి. అప్పట్లోనే 988 ఎకరాల భూమి సేకరించారు. 95 ఎకరాలకు సంబంధించి రూ.5.20 కోట్ల పరిహారమూ చెల్లించారు. ఆ రోజు ధర ప్రకారం ఇంకా రూ.50.75 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇంతలో ప్రభుత్వం మారడంతో పనులు ఎక్కడివక్కడ నిలిచాయి. వైకాపా ప్రభుత్వం రాగానే ప్రాజెక్టు నమూనాను మార్చేసింది. తెదేపా హయాంలో చేపట్టిన పుట్టకనుమ రిజర్వాయరును రద్దు చేసింది. రూ.803 కోట్ల ఖర్చుతో ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ, సోమరవాండ్లపల్లి వద్ద నాలుగు జలాశయాల నిర్మిస్తామని ప్రకటించింది.
ఇదీ లక్ష్యం..
హంద్రీనీవాలో భాగంగా నిర్మించిన జీడిపల్లి జలాశయం నుంచి పేరూరుకు కృష్ణా జలాలు అందించాలని లక్ష్యం. ఎత్తిపోతల ద్వారా జీడిపల్లి జలాశయం నుంచి పేరూరు డ్యాంకు మూడు నెలల్లో 7.2 టీఎంసీలను తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నిర్మించే దేవరకొండ, ముట్టాల, తోపుదుర్తి, సోమరవాండ్లపల్లి జలాశయాలను కృష్ణా జలాలతో నింపి కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రాప్తాడు, రామగిరి, ఆత్మకూరు, కంబదూరు, కూడేరు, బెళుగుప్ప మండలాలకు నీరందించాలని నిర్ణయించుకున్నారు. వీటి నిర్మాణానికి 5,171 ఎకరాలు అవసరమవుతాయని అంచనా. జీడిపల్లి నుంచి ఎగువ పెన్నా జలాశయం వరకున్న 53.45 కి.మీ. ప్రధాన కాలువపై నాలుగు ఎత్తిపోతలు, 110 కాంక్రీటు కట్టడాలు చేపట్టాల్సి ఉంది. కొత్తపల్లి, ఆత్మకూరు, బాలవెంకటాపురం, మద్దెలచెరువు వద్ద ఎత్తిపోతల పథకాలు చేపట్టేలా ప్రాజెక్టు రూపొందింది. అయిదేళ్లలో ఈ పనులు ముందుకెళ్లలేదు.
గుత్తి దాహం కేకలు వినిపించవా?
అనంతపురం జిల్లా గుత్తి పురపాలికతోపాటు బసినేపల్లిలో తాగునీటి సమస్య తీరుస్తామని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం జగన్ హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదు. పట్టణంలో 55 వేల మంది నివసిస్తున్నారు. ఇంటింటికి కుళాయిలు ఏర్పాటుచేయించి నీటి సమస్య లేకుండా చూస్తామని ప్రకటించిన జగన్ అధికారంలోకి వచ్చాక విస్మరించారు. ఈసారి ప్రయాణంలో కర్నూలు జిల్లా నుంచి అనంతపురం జిల్లాలో జగన్ తొలి అడుగు గుత్తి ప్రాంతంలోనే పడనుంది.
గుత్తి పురపాలికలోని చెట్నేపల్లి, గుత్తి ఆర్.ఎస్, గుత్తి పట్టణంలో ప్రజలకు నెలకోసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పామిడి సమీపంలోని పెన్నా నుంచి నీరు రావాల్సి ఉంది. పెన్నాలో వైటీ చెరువు, సత్యసాయి పథకాలున్నాయి. వాటి నుంచి రోజుకు 30 లక్షల లీటర్ల నీరు రావాల్సి ఉంది. వైటీ చెరువు పథకం నుంచి రోజుకు పది లక్షల లీటర్లే అందుతున్నాయి. ఈ నీరు ఏమూలకూ సరిపోవు.
పురపాలిక అధికారులు ప్రస్తుతం 20 ట్యాంకర్లతో అందించే నీరు ఉప్పగానే ఉంటున్నాయి. తెదేపా ప్రభుత్వం గుత్తి వాసుల దాహార్తి తీర్చేందుకు రూ.173 కోట్లతో నీటి పథకాన్ని మంజూరు చేసింది. గార్లదిన్నె ఎంపీఆర్ డ్యామ్లో తుంగభద్ర జలాలను నిల్వ ఉంచి పైపులైన్ ద్వారా గుత్తికి అందించాలని పథకం రూపొందించారు. పథకం మంజూరై అయిదేళ్లు గడిచినా వైకాపా ప్రభుత్వం పూర్తి చేయలేదు. తెదేపాకు మంచి పేరు వస్తుందని మూలన పడేశారు. గుత్తి, సూరశింగనపల్లిలో ట్యాంకులను మాత్రం నిర్మించారు. కేవలం ఒకటిన్నర కి.మీ.దూరమే పైప్లైన్ వేశారు. పూర్తికి దాదాపు రూ.70 కోట్ల విలువైన పైపులు అవసరం. బిల్లుల చెల్లింపులో జాప్యం వల్ల పథకం పూర్తికి గుత్తేదారు సంస్థ చొరవ చూపడం లేదు. ట్యాంకర్లలో వచ్చే ఉప్పునీటి కోసం ఘర్షణలు తప్పడం లేదు.
నిధులు రాలిస్తేనే కదా!
2018లో తెదేపా ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించి ఈ పథకం పనులను పరుగులు పెట్టించింది. 53 కి.మీ. ప్రధాన కాలువను దాదాపు పూర్తి చేసింది. భూనిర్వాసితులకు పరిహారమూ చెల్లించారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక పరిహారం పెంచి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి అప్పట్లో హామీనిచ్చారు. అయిదేళ్లు పూర్తయి మళ్లీ ఎన్నికలు వస్తున్నా సొమ్ము జమ చేయలేదు. నాలుగు ప్రాజెక్టుల నిర్మాణానికి 13 గ్రామాల రైతులు భూములిస్తున్నారు. ఎకరాకు రూ.20 లక్షలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే నిబంధనల మేరకు ఎకరాకు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలు ఇస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో రైతులు ఒప్పుకోవడం లేదు. ఈ అయిదేళ్లలో ప్రాజెక్టు నిర్మాణానికి రూపాయి కేటాయించలేదు. ఇప్పుడు సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి వస్తున్నందున గతంలో తాను ఇచ్చిన హామీలపై ఏం మాట్లాడతారనేది చర్చనీయాంశమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ