మా అభ్యర్థులు పేదోళ్లు
వైకాపా తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులు పేదోళ్లని.. వారి ఆర్థికపరిస్థితి అంతంత మాత్రమేనని సీఎం జగన్ శుక్రవారం ఎమ్మిగనూరులో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభలో వ్యాఖ్యానించడంతో పలువురు ఆశ్చర్యపోయారు.
పలువురి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనన్న సీఎం
ఆ వ్యాఖ్యలపై పలువురి విస్మయం
ఈనాడు-కర్నూలు, న్యూస్టుడే-ఎమ్మిగనూరు: వైకాపా తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులు పేదోళ్లని.. వారి ఆర్థికపరిస్థితి అంతంత మాత్రమేనని సీఎం జగన్ శుక్రవారం ఎమ్మిగనూరులో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభలో వ్యాఖ్యానించడంతో పలువురు ఆశ్చర్యపోయారు. కర్నూలు మేయర్ బీవై రామయ్య పేదవాడని, ఆలూరు అభ్యర్థిగా పోటీచేస్తున్న విరూపాక్షి కూడా పేద వ్యక్తని, తన చెల్లెలు బుట్టమ్మ (బుట్టా రేణుక) ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని, కోడుమూరు అభ్యర్థి డాక్టర్ సతీశ్ దగ్గర డబ్బుల్లేవని, ఐఏఎస్ అధికారిగా పనిచేసి, ఇటీవలే రాజీనామా చేసి కర్నూలు అభ్యర్థిగా పోటీచేస్తున్న డాక్టర్ ఇంతియాజ్ దగ్గర కూడా డబ్బులు లేవని, ఆదోని అభ్యర్థి సాయన్న (సాయి ప్రసాద్రెడ్డి), మంత్రాలయం అభ్యర్థి బాలనాగిరెడ్డి కూడా సౌమ్యులని, వారిద్దరి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేననడంతో అందరూ ఆశ్చర్యపోయారు. వారంతా కోటీశ్వరులని, విలాసవంతమైన కార్లు, బంగళాలు ఉన్నాయని అంతా అనుకుంటున్న వేళ ముఖ్యమంత్రి పేదలు అనేసరికి అందరికీ ఒక్కసారి షాకయ్యారు. తనది పేదల పార్టీ అని, మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని, అందులో పెత్తందారులంతా ఒకవైపు, పేదలంతా ఒకవైపు ఉండి పోరాడాలంటూ సీఎం పిలుపునివ్వడం గమనార్హం.
చెప్పిందే... చెప్పారు.. వినలేక జనం వెనక్కి
నా అక్కలు, చెల్లెళ్లు, నా బీసీలు, ఎస్సీలు అంటూ సీఎం జగన్ ప్రభుత్వ పథకాల గురించి చెప్పిందే పదే పదే వల్లెవేశారు. సాయంత్రం 4:30 గంటలకు అని చెప్పి 5:53 గంటలకు సభకు హాజరయ్యారు. సభలో ప్రసంగిస్తూ నాడు-నేడు, విద్యా దీవెన, అమ్మఒడి పథకాల గురించే చెప్పినా, ప్రజల నుంచి స్పందన లేదు. సీఎం మాట్లాడిన ఐదు నిమిషాలకే ప్రజలు వెనుదిరిగారు. ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, పత్తికొండ, డోన్, కోడుమూరు, కర్నూలు, పాణ్యం, ఇతర ప్రాంతాల నుంచి 1,300 బస్సుల్లో ప్రజలను తరలించారు. ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ చేనేత మైదానంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేశారు. దీనికి ఇరువైపులా బారికేడ్లు కట్టి, బ్యానర్లు వేశారు. మధ్యలో ర్యాంప్ వేసి పెద్దఎత్తున జనం పోగైనట్లు చూపించారు. జగన్ ఏదో హామీ ఇస్తారని ఆశతో వచ్చి నిరాశతో వెళ్లిపోయారు.
పొంగిన పొరుగు మద్యం
జగన్ సభకు కర్ణాటక మద్యం ఏరులై పారింది. సభకు వచ్చినవారికి డబ్బులతో పాటు మద్యం, బిర్యానీ ప్యాకెట్లు అందించారు. పలువురు మద్యం దుకాణాల వద్ద తాగుతూ అక్కడే ఉండిపోయారు. సభస్థలానికి చాలామంది రాకపోవడంతో పాటు బస్సులోనే మద్యం తాగి ఊగుతూ ఎక్కడ పడితే అక్కడే ఉండిపోయారు. రూ.లక్షల విలువ చేసే కర్ణాటకకు చెందిన టెట్రా ప్యాకెట్లు అక్రమంగా కొనుగోలు చేసి పంపిణీ చేశారు. బహిరంగంగా తాగుతున్నా పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరించారు.
అన్నీ అబద్ధాలే
- ప్రసంగంలో పదే పదే ఆయా పథకాలకు సంబంధించిన డబ్బులు మీ ఖాతాల్లో వేశామంటూ చెప్పారు. గత ప్రభుత్వ ఆలోచనలతో రాష్ట్రంలో నూటికి 30 మంది ఆడపిల్లలు పదో తరగతి పూర్తిచేసే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ గురించి 14 నిమిషాలు మాట్లాడారు. బాల్యవివాహాలు తగ్గాయని చెప్పినా, జిల్లాలో పశ్చిమ ప్రాంతంలోనే ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు, క్షేత్రస్థాయిలో కొండలు, గుట్టలే కనిపిస్తున్నాయి.
- తాము మహిళలు, యువత సంక్షేమానికి ఎంతో పాటుపడ్డామని, మహిళల ఖాతాల్లో రూ.లక్షలకు లక్షలు కనిపిస్తాయని, మహిళలు తన ప్రభుత్వానికి రక్షాబంధన్ కట్టాలంటూ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో కరవు కారణంగా వేలమంది రైతులు వలసపోతున్నా.... తాను రైతులను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నానంటూ ముఖ్యమంత్రి ప్రకటించడంపై పలువురు అసహనానికి లోనయ్యారు.
- పదవులిచ్చినా పెత్తనం లేకుండా చేస్తున్నారని.. రిజర్వుడు నియోజకవర్గాల్లో పెద్దల ఆధిపత్యమే కొనసాగుతోందని.. నియోజకవర్గంలో తమకు విలువే లేకుండా పోతోందని వైకాపా దళిత ఎమ్మెల్యే ఆర్థర్ బహిరంగంగా ప్రకటించారు. అయినా ముఖ్యమంత్రి మాత్రం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ వారికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నానని, 50% టికెట్లు వారికే ఇస్తున్నానని చెప్పడం గమనార్హం.
వినతిపత్రం ఇస్తామంటే ఈడ్చిపారేశారు
దళితులకు గతంలో అమలుచేసిన 27 పథకాలు రద్దుచేయడం, ఎస్సీ సబ్ప్లాన్ నిధులను పక్కదారి పట్టించడంపై సమతా సైనిక్దళ్ రాయలసీమ అధ్యక్షుడు రంగయ్య ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించారు. సంస్థ సభ్యులను తన ఇంటికి పిలిచి మాట్లాడారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని గృహనిర్బంధం చేశారు. కమిటీ రోడ్డులో ఉన్న ఆయనతోపాటు మల్లేశ్, పరమేశ్, రాజోలప్ప తదితరులను గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు మంత్రాలయం పోలీసుస్టేషన్కు తరలించారు. ఇదెక్కడి అన్యామని అడిగితే వారిని ఈడ్చిపారేశారు.దీంతో కొందరికి దెబ్బలు తగిలాయి. దీంతో వారు ‘సీఎం డౌన్డౌన్’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం