ఉన్నాడు.. ఊరికో జగన్!
ఆవు చేలో మేస్తే... దూడ గట్టున మేస్తుందా..? గత ప్రభుత్వ పథకాల్ని కొనసాగిస్తే.. ఎక్కడ వారికి పేరొస్తుందోనని.. అధికారంలోకి రాగానే వాటిని ఆపేశారు జగన్. తమ అధినేత స్ఫూర్తిగా జూనియర్ జగన్లూ ఊళ్లలో అదే తీరు ప్రదర్శిస్తున్నారు!
అభివృద్ధి పనులు చేయరు!
ఎవరైనా చేస్తామని ముందుకొస్తే దాడులు
ఇదీ రాష్ట్రంలో వైకాపా నాయకుల తీరు
ఈనాడు - అమరావతి
ఆవు చేలో మేస్తే... దూడ గట్టున మేస్తుందా..? గత ప్రభుత్వ పథకాల్ని కొనసాగిస్తే.. ఎక్కడ వారికి పేరొస్తుందోనని.. అధికారంలోకి రాగానే వాటిని ఆపేశారు జగన్. తమ అధినేత స్ఫూర్తిగా జూనియర్ జగన్లూ ఊళ్లలో అదే తీరు ప్రదర్శిస్తున్నారు! దాహంతో అల్లాడే ప్రజలకు నీరందిస్తే.. వద్దంటారు. రోడ్లపైన గుంతల్ని పూడుస్తుంటే.. అడ్డుకుంటారు. సామాన్యులు తమ పని చేసుకుంటామన్నా.. నిలువరిస్తారు. పోనీ అవన్నీ వాళ్లయినా చేస్తారా అంటే.. అదీ చేతకాదు.
ప్రజావేదిక ధ్వంసంతో ప్రారంభమైన జగన్ ప్రభుత్వ ఏలుబడిలో అయిదేళ్లూ అరాచకమే నడిచింది. తమ అధినేత చూపిన విధ్వంస బాటలోనే ఆ పార్టీ నాయకులూ నడుస్తూ వచ్చారు. ‘రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేయం.. ఇతరులెవరైనా చేస్తే ఊరుకోం’ అంటూ ప్రతిపక్ష పార్టీల నేతలను బెదిరించి ఎక్కడికక్కడ వారిపై దౌర్జన్యాలకు దిగారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు మళ్లించి గ్రామీణాభివృద్ధికి జగన్ ప్రభుత్వం ద్రోహం చేసింది. అధ్వానమైన రహదారులు, మురుగు కాలువలు, తాగునీరు.. ఇలా అనేక సమస్యలతో ప్రజలను సీఎం జగన్ కష్టాల్లోకి నెట్టేశారు. వీరి బాధలు చూసిన ప్రతిపక్ష తెదేపా నేతలు, కొందరు వ్యక్తులు తమ సొంత నిధులతో పనులు చేసేందుకు ముందుకు వస్తే వైకాపా నేతలు అడ్డంకులు సృష్టించారు.
ప్రతిపక్షానికి ఉన్న బాధ్యతా లేకపోయే!
స్వప్రయోజనాల కోసం వైకాపా సర్కారు చూపించే శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంమీద కనబరచలేదు. ఫలితమే గ్రామాలూ, పట్టణాలనే వ్యత్యాసం లేకుండా ప్రతి చోటా ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. వేసవి ప్రారంభంతోనే ప్రజలు తాగునీటికి అల్లాడుతున్నారు. ‘బిందెడు నీళ్లు ఇప్పించండి మహా ప్రభో’ అంటూ ఖాళీ బిందెలతో మహిళలు రోడ్లపైకి వస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే పాడైన కాలువలతో రోడ్లపైకి వచ్చే మరుగునీరు, వీటికి తోడు దోమల రొద, అనారోగ్య సమస్యలు.. కాలం ఏదైనా జగన్ జమానాలో జనాలకు కష్టకాలమే. ప్రజల అవస్థలు చూసిన ప్రతిపక్ష తెదేపా ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచులు, కొంతమంది వ్యక్తులు సమస్యల పరిష్కారానికి ముందుకొస్తే.. ప్రభుత్వం చేయని పనులు చేస్తున్నందుకు అభినందించాల్సింది పోయి తిరిగి వారిపై దౌర్జన్యాలకు పాల్పడ్డారు వైకాపా నేతలు. తెదేపాకి ఎక్కడ పేరొస్తుందోనని కొన్నిచోట్ల చేసిన పనులూ తొలగించి ప్రజలకు కష్టాలే మిగిల్చారు.
ఊరూరా అరాచకాలే!
రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇచ్చిన రూ.5 లక్షల నిధులతో వైయస్ఆర్ జిల్లా బద్వేల్ మండలంలో చేపట్టిన ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు పనులను వైకాపా మహిళా నేత ఇటీవల అడ్డుకున్నారు. ఐదు ఆర్వో ప్లాంట్ల నిర్మాణాన్ని అడ్డుకుని.. కట్టిన గోడలను కూల్చేశారు. పైగా తనపై దౌర్జన్యం చేశారని సేవ చేయటానికి వచ్చినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్న స్థలాన్ని కబ్జా చేయడానికే మహిళా నేత ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారు.
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం కొమడవోలు, చొదిమెళ్ల జగనన్న లేఅవుట్లలోని ఆరువేల ఇళ్ల పునాదుల్లో మెరక చేసేందుకు పేదలు దగ్గర్లోనే మట్టి తవ్వకాలు చేపట్టారు.
వీటికి కలెక్టర్ అనుమతిచ్చారు కూడా. అయినా ఆ తవ్వకాలను ఆపేయాల్సిందేనని వైకాపా నేతలు గొడవ చేశారు. ఒక్కో లారీ మట్టికి రూ.500 చొప్పున తమకు కప్పం కట్టాలని పట్టుబట్టారు.
- శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలో వర్షాలకు దెబ్బతిన్న బయనపల్లి కల్వర్టుని తన సొంత నిధులతో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పునర్నిర్మించే పనులను వైకాపా నేతలు అడ్డుకున్నారు. తమ ఆధ్వర్యంలోనే కల్వర్టుని పునర్నిర్మిస్తామని అప్పటివరకు వేచి ఉండాల్సిందేనని పనులు చేయనివ్వలేదు.
- ప్రకాశం జిల్లాలోని రావెళ్లవారిపాలెం కస్తూర్బా పాఠశాల అభివృద్ధి పనుల టెండర్ రాలేదన్న అక్కసుతో వైకాపా నాయకులు అడ్డంకులు సృష్టించారు. రూ.95 లక్షల పనులను పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ ఆధ్వర్యంలో చేయించాలని అధికారులు నిర్ణయించారు. పనుల కోసం ఒత్తిడి చేసిన వైకాపా నేతల పన్నాగం ఫలించకపోవడంతో అవరోధం కలిగించారు. మెటీరియల్ పాఠశాల వద్దకు రాకుండా రహదారిని తవ్వించేశారు. మరో రెండు చోట్ల రహదారులకు అడ్డంగా మట్టి కుప్పలు పోసి అడ్డంకులు సృష్టించారు.
- సత్యసాయి జిల్లా ఉప్పరపల్లి ఎస్సీ కాలనీలో సిమెంట్ రహదారి ఏర్పాటుకు ఎమ్మెల్యే బాలకృష్ణ విజ్ఞప్తిపై లోక్సభ సభ్యుడు కేశినేని నాని ఎంపీ ల్యాడ్స్లో రూ.6.50 లక్షలు కేటాయించారు. రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక మిగిలిన నిధులతో గుత్తేదారు నాయనపల్లి ఎస్సీ కాలనీ సప్లమ్మ దేవాలయం వద్ద సిమెంట్ రహదారి నిర్మాణం చేపట్టగా వైకాపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పాలనలో రోడ్డు వేయడానికి మీరెవరంటూ గుత్తేదారుని దూషించడంతో మనస్తాపానికి గురైన ఆయన వేసిన రోడ్డుని రోజుల వ్యవధిలో తొలగించారు.
- అనంతపురం జిల్లా నుసికొట్టాలలో.. 9కి.మీ. రోడ్డు అధ్వానంగా ఉన్న విషయాన్ని గ్రామస్థులు తెదేపా నేత సురేంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తన సొంత నిధులతో పొక్లెయినర్లతో ముళ్ల చెట్లను తొలగించి గుంతల్లో మట్టి వేయించారు. అధికారులను రంగంలోకి దించి వైకాపా నేతలు ఆ పనులకు ఆటంకం సృష్టించారు.
- ప్రకాశం జిల్లా మారెళ్ల గ్రామ పంచాయతీలో వైకాపా నేతల నిర్వాకంతో అభివృద్ధి పనులకు గ్రహణం పట్టింది. పంచాయతీ నిధులతో సిమెంట్ రోడ్లు, కాలువలు నిర్మించేందుకు సర్పంచి చేసిన ప్రయత్నాలను వైకాపా నాయకులు ముందుకు సాగనివ్వలేదు. గ్రామంలో అంతర్గత రహదారుల నిర్మాణం అనివార్యమైనప్పటికీ వైకాపా నేతలు అవరోధాలు సృష్టించి గ్రామాభివృద్ధిని అడ్డుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే