ఉన్నాడు.. ఊరికో జగన్!
ఆవు చేలో మేస్తే... దూడ గట్టున మేస్తుందా..? గత ప్రభుత్వ పథకాల్ని కొనసాగిస్తే.. ఎక్కడ వారికి పేరొస్తుందోనని.. అధికారంలోకి రాగానే వాటిని ఆపేశారు జగన్. తమ అధినేత స్ఫూర్తిగా జూనియర్ జగన్లూ ఊళ్లలో అదే తీరు ప్రదర్శిస్తున్నారు!
అభివృద్ధి పనులు చేయరు!
ఎవరైనా చేస్తామని ముందుకొస్తే దాడులు
ఇదీ రాష్ట్రంలో వైకాపా నాయకుల తీరు
ఈనాడు - అమరావతి
ఆవు చేలో మేస్తే... దూడ గట్టున మేస్తుందా..? గత ప్రభుత్వ పథకాల్ని కొనసాగిస్తే.. ఎక్కడ వారికి పేరొస్తుందోనని.. అధికారంలోకి రాగానే వాటిని ఆపేశారు జగన్. తమ అధినేత స్ఫూర్తిగా జూనియర్ జగన్లూ ఊళ్లలో అదే తీరు ప్రదర్శిస్తున్నారు! దాహంతో అల్లాడే ప్రజలకు నీరందిస్తే.. వద్దంటారు. రోడ్లపైన గుంతల్ని పూడుస్తుంటే.. అడ్డుకుంటారు. సామాన్యులు తమ పని చేసుకుంటామన్నా.. నిలువరిస్తారు. పోనీ అవన్నీ వాళ్లయినా చేస్తారా అంటే.. అదీ చేతకాదు.
ప్రజావేదిక ధ్వంసంతో ప్రారంభమైన జగన్ ప్రభుత్వ ఏలుబడిలో అయిదేళ్లూ అరాచకమే నడిచింది. తమ అధినేత చూపిన విధ్వంస బాటలోనే ఆ పార్టీ నాయకులూ నడుస్తూ వచ్చారు. ‘రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేయం.. ఇతరులెవరైనా చేస్తే ఊరుకోం’ అంటూ ప్రతిపక్ష పార్టీల నేతలను బెదిరించి ఎక్కడికక్కడ వారిపై దౌర్జన్యాలకు దిగారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు మళ్లించి గ్రామీణాభివృద్ధికి జగన్ ప్రభుత్వం ద్రోహం చేసింది. అధ్వానమైన రహదారులు, మురుగు కాలువలు, తాగునీరు.. ఇలా అనేక సమస్యలతో ప్రజలను సీఎం జగన్ కష్టాల్లోకి నెట్టేశారు. వీరి బాధలు చూసిన ప్రతిపక్ష తెదేపా నేతలు, కొందరు వ్యక్తులు తమ సొంత నిధులతో పనులు చేసేందుకు ముందుకు వస్తే వైకాపా నేతలు అడ్డంకులు సృష్టించారు.
ప్రతిపక్షానికి ఉన్న బాధ్యతా లేకపోయే!
స్వప్రయోజనాల కోసం వైకాపా సర్కారు చూపించే శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంమీద కనబరచలేదు. ఫలితమే గ్రామాలూ, పట్టణాలనే వ్యత్యాసం లేకుండా ప్రతి చోటా ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. వేసవి ప్రారంభంతోనే ప్రజలు తాగునీటికి అల్లాడుతున్నారు. ‘బిందెడు నీళ్లు ఇప్పించండి మహా ప్రభో’ అంటూ ఖాళీ బిందెలతో మహిళలు రోడ్లపైకి వస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే పాడైన కాలువలతో రోడ్లపైకి వచ్చే మరుగునీరు, వీటికి తోడు దోమల రొద, అనారోగ్య సమస్యలు.. కాలం ఏదైనా జగన్ జమానాలో జనాలకు కష్టకాలమే. ప్రజల అవస్థలు చూసిన ప్రతిపక్ష తెదేపా ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచులు, కొంతమంది వ్యక్తులు సమస్యల పరిష్కారానికి ముందుకొస్తే.. ప్రభుత్వం చేయని పనులు చేస్తున్నందుకు అభినందించాల్సింది పోయి తిరిగి వారిపై దౌర్జన్యాలకు పాల్పడ్డారు వైకాపా నేతలు. తెదేపాకి ఎక్కడ పేరొస్తుందోనని కొన్నిచోట్ల చేసిన పనులూ తొలగించి ప్రజలకు కష్టాలే మిగిల్చారు.
ఊరూరా అరాచకాలే!
రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇచ్చిన రూ.5 లక్షల నిధులతో వైయస్ఆర్ జిల్లా బద్వేల్ మండలంలో చేపట్టిన ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు పనులను వైకాపా మహిళా నేత ఇటీవల అడ్డుకున్నారు. ఐదు ఆర్వో ప్లాంట్ల నిర్మాణాన్ని అడ్డుకుని.. కట్టిన గోడలను కూల్చేశారు. పైగా తనపై దౌర్జన్యం చేశారని సేవ చేయటానికి వచ్చినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్న స్థలాన్ని కబ్జా చేయడానికే మహిళా నేత ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారు.
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం కొమడవోలు, చొదిమెళ్ల జగనన్న లేఅవుట్లలోని ఆరువేల ఇళ్ల పునాదుల్లో మెరక చేసేందుకు పేదలు దగ్గర్లోనే మట్టి తవ్వకాలు చేపట్టారు.
వీటికి కలెక్టర్ అనుమతిచ్చారు కూడా. అయినా ఆ తవ్వకాలను ఆపేయాల్సిందేనని వైకాపా నేతలు గొడవ చేశారు. ఒక్కో లారీ మట్టికి రూ.500 చొప్పున తమకు కప్పం కట్టాలని పట్టుబట్టారు.
- శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలో వర్షాలకు దెబ్బతిన్న బయనపల్లి కల్వర్టుని తన సొంత నిధులతో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పునర్నిర్మించే పనులను వైకాపా నేతలు అడ్డుకున్నారు. తమ ఆధ్వర్యంలోనే కల్వర్టుని పునర్నిర్మిస్తామని అప్పటివరకు వేచి ఉండాల్సిందేనని పనులు చేయనివ్వలేదు.
- ప్రకాశం జిల్లాలోని రావెళ్లవారిపాలెం కస్తూర్బా పాఠశాల అభివృద్ధి పనుల టెండర్ రాలేదన్న అక్కసుతో వైకాపా నాయకులు అడ్డంకులు సృష్టించారు. రూ.95 లక్షల పనులను పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ ఆధ్వర్యంలో చేయించాలని అధికారులు నిర్ణయించారు. పనుల కోసం ఒత్తిడి చేసిన వైకాపా నేతల పన్నాగం ఫలించకపోవడంతో అవరోధం కలిగించారు. మెటీరియల్ పాఠశాల వద్దకు రాకుండా రహదారిని తవ్వించేశారు. మరో రెండు చోట్ల రహదారులకు అడ్డంగా మట్టి కుప్పలు పోసి అడ్డంకులు సృష్టించారు.
- సత్యసాయి జిల్లా ఉప్పరపల్లి ఎస్సీ కాలనీలో సిమెంట్ రహదారి ఏర్పాటుకు ఎమ్మెల్యే బాలకృష్ణ విజ్ఞప్తిపై లోక్సభ సభ్యుడు కేశినేని నాని ఎంపీ ల్యాడ్స్లో రూ.6.50 లక్షలు కేటాయించారు. రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక మిగిలిన నిధులతో గుత్తేదారు నాయనపల్లి ఎస్సీ కాలనీ సప్లమ్మ దేవాలయం వద్ద సిమెంట్ రహదారి నిర్మాణం చేపట్టగా వైకాపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పాలనలో రోడ్డు వేయడానికి మీరెవరంటూ గుత్తేదారుని దూషించడంతో మనస్తాపానికి గురైన ఆయన వేసిన రోడ్డుని రోజుల వ్యవధిలో తొలగించారు.
- అనంతపురం జిల్లా నుసికొట్టాలలో.. 9కి.మీ. రోడ్డు అధ్వానంగా ఉన్న విషయాన్ని గ్రామస్థులు తెదేపా నేత సురేంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తన సొంత నిధులతో పొక్లెయినర్లతో ముళ్ల చెట్లను తొలగించి గుంతల్లో మట్టి వేయించారు. అధికారులను రంగంలోకి దించి వైకాపా నేతలు ఆ పనులకు ఆటంకం సృష్టించారు.
- ప్రకాశం జిల్లా మారెళ్ల గ్రామ పంచాయతీలో వైకాపా నేతల నిర్వాకంతో అభివృద్ధి పనులకు గ్రహణం పట్టింది. పంచాయతీ నిధులతో సిమెంట్ రోడ్లు, కాలువలు నిర్మించేందుకు సర్పంచి చేసిన ప్రయత్నాలను వైకాపా నాయకులు ముందుకు సాగనివ్వలేదు. గ్రామంలో అంతర్గత రహదారుల నిర్మాణం అనివార్యమైనప్పటికీ వైకాపా నేతలు అవరోధాలు సృష్టించి గ్రామాభివృద్ధిని అడ్డుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
జగన్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ దయనీయంగా తయారైంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను విద్యుత్తు కోతల కష్టాలు పీడిస్తున్నాయి. -
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
‘ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడతా. జగనన్న ప్రభుత్వంలో నాకు, నా బిడ్డకు రక్షణ లేదు. వారణాసిలో కుమార్తెతో కలిసి తలదాచుకుంటున్నా..’ అని కాకినాడకు చెందిన రాజులపల్లి ఆరుద్ర తెలిపారు. -
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్లపై జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానానికి చరమగీతం పాడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నాసిక్ నుంచి స్టాంపు పేపర్లను తెప్పించడం ఇప్పటికే నిలిపేసింది. -
గోవా మద్యానికి ‘వైకాపా’ గ్రీన్ఛానల్!
సార్వత్రిక ఎన్నికల వేళ కొంతమంది వైకాపా నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యంతో జనాల్ని ప్రలోభపెడుతూ వారి ప్రాణాల్ని బలిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
అన్న క్లాస్.. తమ్ముడు మాస్.. భూములన్నీ ఖల్లాస్!
భూమిని నమ్ముకున్నోళ్లెవ్వరూ ఆగం కాలేదు. అందుకేనేమో.. వైకాపా నేతలంతా ఒకరిని మించి మరొకరు కబ్జాలకు తెరతీశారు. -
ఎవరి ఆధీనంలో ఎవరు?
ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా...? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది. -
బ్రో... ఏ రాష్ట్రానికి పొమ్మంటావ్?
మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడి ఎక్కడా అభివృద్ధి లేకుండా చేశారు. నిర్మాణ రంగం కుదేలైంది. స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినడంతో వ్యాపారులు పెద్ద నగరాలకు తరలిపోయారు. -
మేనమామ కాదు.. మేకవన్నె పులి
ఓట్ల వేటలో.. చిన్నారులనూ పావులను చేసి... వారి చదువులను చట్టుబండలు చేసి... బైజూసనీ... ట్యాబ్లనీ.. టోఫెలనీ... ఐబీ అనీ... అమాయక పిల్లల్ని అర్థంలేని ప్రయోగాలకు బలి చేసిన... అయోమయం జగన్నాథం.... ఆంధ్రావని చేసుకున్న పాపం! -
ప్లాస్టర్ తీసేసిన సీఎం.. వెలంపల్లి ‘కట్టు’ కథా ముగిసింది!
సీఎం జగన్ నుదిటిపై వేసుకున్న ప్లాస్టర్ను తీసేశారు. ఈనెల 13న విజయవాడలో గులకరాయి తగిలిన రోజు నుంచి 25 వరకూ ప్లాస్టర్తోనే కనిపించారు. శనివారం పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా సీఎం ప్లాస్టర్ లేకుండా కనిపించారు. -
ఇలాగేటి.. బాదేస్తన్రు!
ఉత్తరాంధ్ర ప్రజానీకం ఏ సంకోచాలు లేకుండా వైకాపా పాలనపై గళమెత్తుతోంది. జగన్ ప్రభుత్వంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. విశాఖ వంటి మహా నగరంలోనే కాదు శ్రీకాకుళం వంటి నగరం, పలాస, పాలకొండ వంటి పల్లెలను ఆనుకుని ఉన్న పెద్ద, చిన్న పట్టణ ప్రాంతాల్లోనే కాదు. -
వైద్య సీట్లకు కోత
వైకాపా ప్రభుత్వం సన్నద్ధంగా లేనందున ఎంబీబీఎస్ సీట్లకు కోత పడింది. 2024-25లో కొత్తగా ప్రారంభం కానున్న 5 వైద్య కళాశాలల్లో వంద చొప్పున మాత్రమే ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయబోతున్నారు. -
యువ ఓటర్ల భుజస్కంధాలపైనే దేశ భవిష్యత్తు
పోలింగ్ శాతం గణనీయంగా పెంచేందుకు ప్రతి జిల్లాలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. లెట్స్ ఓట్ సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా శనివారం గుంటూరులో 3కె వాక్ నిర్వహించాయి. -
ఉపాధి పనుల్లో పశువులు!
‘ఉపాధి’ పని చేస్తున్న కూలీల చిత్రం ఉండాల్సిన చోట గేదెల చిత్రం అప్లోడ్ చేశారు.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల ఉపాధి ఉద్యోగులు. -
సంపాదనపై కాదు.. నేర్చుకోవడంపై దృష్టి సారించాలి
యువ న్యాయవాదులు ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో సంపాదనపై కాకుండా నేర్చుకోవడంపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు. -
‘ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ని విధుల నుంచి తప్పించండి’
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి నిరుద్యోగులను ప్రభావితం చేసేలా ఈనెల 29న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం (ఏపీఎన్ఎఫ్) అధ్యక్షుడు బి.శ్రీరాములు పేర్కొన్నారు. -
వారాంతమిస్తానని.. వాయింపే.. వాయింపు!
అధికారంలోకి రావడానికి జగన్ అన్ని వర్గాలను పావులుగా వాడుకున్నారు. ఎన్నెన్నో హామీలను గుప్పించారు. అన్నింటినీ నెరవేరుస్తానంటూ మ్యానిఫెస్టో ముద్రించారు. -
గులకరాయి కేసు నిందితుడికి ముగిసిన పోలీసు కస్టడీ
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ మూడు రోజుల పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. -
పాలిసెట్- 2024కి 88.74 శాతం మంది హాజరు
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్-2024కు 88.74శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..