సంక్షిప్త వార్తలు (6)
తిరుమల శ్రీవారిని గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.మానవేంద్రనాథ్ రాయ్ శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకున్నారు.
శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్
తిరుమల, న్యూస్టుడే: తిరుమల శ్రీవారిని గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.మానవేంద్రనాథ్ రాయ్ శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం, తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఏపీ ఎన్జీఓ ఉద్యోగులతో ప్రభుత్వ సలహాదారు సమావేశాలు
సీఈఓకి ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ఫిర్యాదు
ఈనాడు, అమరావతి: ఏపీ ఎన్జీఓ ఉద్యోగులను ప్రభావితం చేసేలా ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి సమావేశాలు నిర్వహిస్తున్నారని పేర్కొంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ)కి ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఏపీ ఎన్జీఓ నూతన కార్యవర్గాన్ని సన్మానించేందుకంటూ విశాఖపట్నం, విజయనగరం, విజయవాడల్లో ఈ సమావేశాలు నిర్వహించబోతున్నారని, ఓటర్లుగా ఉన్న ఉద్యోగులతో ప్రభుత్వ సలహాదారు సమావేశం కావడం ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. శనివారం విజయనగరంలో సమావేశం ఉందని, దీనిని అడ్డుకోవాలని ఆయన సీఈఓను కోరారు. వైకాపాకు అనుకూలంగా ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారని వివరించారు.
ఏ ఐకాసలో చేరలేదు: సీపీఎస్ఈఏ
ఈనాడు, అమరావతి: ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్(సీపీఎస్ఈఏ) ఏ ఐకాసలో చేరలేదని, అసత్య ప్రచారాలు నమ్మొద్దని ఆ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోరుకొండ సతీష్, సీఎం దాస్ ఓ ప్రకటనలో తెలిపారు. సీపీఎస్ ఉద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నామని, ఉద్యోగుల భవిష్యత్తే తమకుముఖ్యమని పేర్కొన్నారు. కొన్ని ఐకాసల్లో తాము చేరినట్లు వస్తున్న వార్తలను వారు ఖండించారు.
ఉపాధి కూలి రూ.600కు పెంచండి
వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
ఈనాడు, అమరావతి: ఉపాధి హామీ పథకంలో పని దినాలను 200 రోజులకు పెంచాలని, కూలిని రూ.600 చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దడాల సుబ్బారావు, వెంకటేశ్వర్లు శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలిని రూ.27 పెంచి, మొత్తంగా రూ.300 చేసింది. ఇది ఏ మాత్రం సరిపోదు. గత పదేళ్లలో నిత్యావసర సరకుల ధరలు భారీగా పెరిగాయి. కనీస వేతనాలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన అనూప్ సత్పతి కమిటీ కూడా రోజుకు రూ.375కు తక్కువ కాకుండా కూలి ఇవ్వాలని సూచించింది. మరోవైపు కార్పొరేట్ శక్తుల ఒత్తిడి మేరకు ఏటా ఈ పథకానికి నిధులు తగ్గిస్తున్నారు’ అని వారు విమర్శించారు.
జీపీఎఫ్ డబ్బుల కోసం ప్రాధేయపడాల్సి వస్తోంది
సచివాలయ ఉద్యోగుల సంఘం నేత నాపా ప్రసాద్
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్కు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వం ఆ ధర్మకర్త లక్షణాన్నే కోల్పోయిందని, ఇంత దారుణమైన పరిస్థితి వస్తుందని ఏ ఉద్యోగీ ఊహించి ఉండరని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి నాపా ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘గతేడాది జులై నుంచి కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. పీఆర్సీ ఆలస్యమైనందున మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటన కోసం ఉద్యోగులు ఎదురుచూడడం సాధారణం. కానీ, ఇప్పుడు ఐఆర్ గురించి కాకుండా ఉద్యోగులు కుటుంబ అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ సొమ్ముల కోసం ప్రభుత్వాన్ని ప్రాధేయపడాల్సిన పరిస్థితి నెలకొంది’ అని పేర్కొన్నారు.
‘మద్య నియంత్రణ’పై 2న రౌండ్టేబుల్ సమావేశం
ఈనాడు డిజిటల్, అమరావతి: సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) ఆధ్వర్యంలో ‘మద్య నియంత్రణ’ అంశంపై వచ్చేనెల 2న విజయవాడలోని బాలోత్సవ భవన్లో రౌండ్టేబుల్ సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ మద్యాంధ్రప్రదేశ్గా మారుతున్న తరుణంలో దీని నియంత్రణ ఆవశ్యకతను అన్ని రాజకీయ పార్టీలు వారి ఎన్నికల ప్రణాళికల్లో పొందుపర్చాలని సీఎఫ్డీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. ఈ సమావేశంలో పలు పార్టీలకు చెందిన మహిళా ప్రజాప్రతినిధులు, పౌర సంస్థలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. సమాజంలో హత్యలు, అత్యాచారాలు, రోడ్డు ప్రమాదాలు, గృహహింస, అనారోగ్యాలకు కేంద్ర బిందువైన మద్యాన్ని, మత్తు పానీయాలను నిరోధించాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం