రాష్ట్రాభివృద్ధికి పరితపించే వ్యక్తి చంద్రబాబు

‘‘వైకాపా పాలనలో రాష్ట్రాన్ని గంజాయి, ఇసుక మాఫియా, డ్రగ్స్‌, కల్తీ మద్యం, హత్యలు, అత్యాచారాల్లో ముందు వరుసలో నిలిపి తెలుగు వారి పరువు తీస్తున్నారు.

Published : 30 Mar 2024 04:35 IST

‘నిజం గెలవాలి’ యాత్రలో నారా భువనేశ్వరి

ఈనాడు డిజిటల్‌ - మచిలీపట్నం: ‘‘వైకాపా పాలనలో రాష్ట్రాన్ని గంజాయి, ఇసుక మాఫియా, డ్రగ్స్‌, కల్తీ మద్యం, హత్యలు, అత్యాచారాల్లో ముందు వరుసలో నిలిపి తెలుగు వారి పరువు తీస్తున్నారు. గత అయిదేళ్లలో రాష్ట్రంలో 30,196 మంది మహిళలు కనిపించకుండా పోయారు. రాష్ట్రాభివృద్ధికి పరితపించే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయని ఆకాంక్షిస్తున్నా’’ అని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో శుక్రవారం ఆమె ‘నిజం గెలవాలి’ యాత్ర చేపట్టారు. తొలుత ఎన్టీఆర్‌ సొంతూరు నిమ్మకూరును భువనేశ్వరి సందర్శించారు. అక్కడి నుంచి మచిలీపట్నం చేరుకున్నారు. గుడ్‌ఫ్రైడే సందర్భంగా స్థానిక నోబుల్‌ చర్చిలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మచిలీపట్నం 23వ వార్డులో మృతి చెందిన కార్యకర్త సోమయ్య కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం కోన గ్రామం వెళ్లి మరో కార్యకర్త పిట్ల బసవయ్య కుటుంబాన్ని పరామర్శించారు. కోనలో గంగపుత్రులతో మాటామంతీలో పాల్గొన్నారు. ఘంటసాల మండలం తాడేపల్లిలో కొడాలి సుధాకరరావు కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పారు. చంద్రబాబు భరోసా పత్రాన్ని బాధిత కుటుంబానికి భువనేశ్వరి అందించారు. తర్వాత అక్కడి నుంచి మొవ్వ మండలం కూచిపూడి వెళ్లి గ్రామస్థులతో మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని