డబ్బు కొట్టు.. ఇల్లు కట్టు!
ఆ నేత పేరు వింటేనే.. ‘నాటుకొట్టుడు.. వీరకొట్టుడు.. దంచికొట్టుడు..’ అన్న పాట గుర్తొస్తుంది. పాటకు తగినట్లుగానే అవినీతి సొమ్మును దంచి కొట్టడంలో ఆయనకు ఆయనే సాటి! యజమానులు డబ్బు కొడితే కానీ ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేదు.
దక్షిణ సమర్పిస్తేనే నిర్మాణాలకు అనుమతులు
‘పశ్చిమ’లో ప్రజాప్రతినిధి అక్రమ దందా
పక్కా ప్రణాళికతో తండ్రీకొడుకుల వసూళ్లు
ఈనాడు, ఏలూరు
ఆ నేత పేరు వింటేనే.. ‘నాటుకొట్టుడు.. వీరకొట్టుడు.. దంచికొట్టుడు..’ అన్న పాట గుర్తొస్తుంది. పాటకు తగినట్లుగానే అవినీతి సొమ్మును దంచి కొట్టడంలో ఆయనకు ఆయనే సాటి! యజమానులు డబ్బు కొడితే కానీ ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేదు.. అందుకు ఆయన పెట్టిన పథకం.. ‘డబ్బు కొట్టు.. ఇల్లు కట్టు’! తండ్రికి తోడుగా తనయుడూ వేర్వేరుగా కౌంటర్లు తెరిచారు. కాదూ.. కూడదు అని తోకజాడిస్తే.. తండ్రీకొడుకులు గుండెల్లో ‘బాంబులు’ పేల్చుతారంతే..!!
ఆ నాయకుడికి దైవభక్తి ఎక్కువ అని చెబుతుంటారు. దేవుడి సొమ్ము తినడం మహాపాపం అని ఆయన కూడా ఎన్నో నీతులు వల్లెవేస్తుంటారు. దేవుడికి ఎంతో సేవ చేస్తున్నట్లు సొంత భజన చేసుకుంటారు. ఇదంతా విని ఆ నేతకు ఎంతో దైవభీతి, పాపభీతి ఉందనుకుంటే మోసపోయినట్లే. ప్రజాస్వామ్యంలో ప్రజలే అసలైన దేవుళ్లు కదా.. దేవుళ్ల లాంటి ప్రజల నుంచి డబ్బు పిండుకోవడంలోనూ ఆయన సిద్ధహస్తుడు. ముడుపులు ముట్టజెప్పనిదే ఏ పనీ చేయరు. ఆ నేతకు అంత ‘దైవ’భక్తి మరి! ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ‘గూడెం’లో ఒక్క ఇల్లు కట్టుకోవాలనుకున్నా జనాలు జడిసిపోతున్నారు. భవనాలు నిర్మించుకోవాలనుకునేవారు బెంబేలెత్తిపోతున్నారు. ఆ నాయకుడి తీరుతో కొన్నాళ్లుగా అక్కడ నిర్మాణ రంగమే స్తంభించిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఇదొక్కటే కాదు.. ఇంకెన్నింట్లోనో ఆ నేత చిలక్కొట్టుడు కొడుతుంటారు. అడిగినంత సమర్పించుకుని మిన్నకుండటమే ప్రజల వంతు!!
అది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మధ్యలో జాతీయ రహదారిని ఆనుకుని ఉండే ప్రాంతం. ఇటు డెల్టా, అటు మెట్ట నేలల అనుసంధానంగా ఉన్న ఆ ప్రాంతం హోల్సేల్ ఉల్లి వ్యాపారానికి ప్రసిద్ధి. అపరాల వ్యాపారమూ ఎక్కువే. రాష్ట్రంలో కీలకస్థానంలో ఉండి అక్కడ ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్న ఆ నాయకుడి శైలే వేరు. ఆయన కుటుంబంలోని ఒకరు మహానగరంలో బడా వ్యాపారంలో చక్రం
తిప్పుతుంటారు. కార్పొరేట్ స్థాయి వ్యవహారాలు కూడా సాగిస్తుంటారు. ఆ మంత్రాంగంతోనే ఈ నేతకు ప్రభుత్వంలో కీలకపదవి దక్కిందన్న చర్చలు ఉన్నాయి. అంత ఉండి కూడా చిన్న పట్టణంలో నాయకుడి ‘చిలక్కొట్టుడు’ సామాన్యులకు విస్మయం కలిగిస్తోంది. బాణసంచా అమ్మేవారి నుంచి బడా వ్యాపారి వరకు ఎవరిస్థాయిలో వారు ఈ మహా‘మేత’కు ముడుపులు సమర్పించుకోవాల్సిందే! అందుకు తండ్రి పెద్దకౌంటర్ తెరిస్తే. కుమారుడు చిన్నకౌంటర్ తెరిచారు!!
పునాదులు కదులుతాయ్..!
పట్టణ ప్రణాళిక విభాగం మొత్తం ఆ నేత కనుసన్నల్లోనే పనిచేస్తుంది. ఇల్లు, భవనం నిర్మించాలంటే అధికారుల అనుమతి కంటే ముందు ఆ నేత అనుమతి ఉండాల్సిందే. ప్రజా ప్రతినిధికి ముడుపులు చెల్లిస్తేనే పునాదిలో రాళ్లు పడతాయి. మరోవైపు నాయకుడి అనుచరులు పట్టణంలో సంచరిస్తూ భవన నిర్మాణాలపై నిరంతరం ఆరా తీస్తుంటారు. సంబంధిత యజమాని భవన నిర్మాణానికి అనుమతి
తీసుకున్నారా? తమ నేతకు కప్పం కట్టారా? అన్న వివరాలు తెలుసుకుంటారు. అనుమతులు తీసుకుని తమ నాయకుడికి ముడుపులు ఇస్తే సరే. లేనిపక్షంలో అధికారులను ఉసిగొల్పుతారు.
అంతా పక్కా ‘ప్లానింగ్’ ప్రకారమే..
పట్టణంలో ఇళ్ల స్థలాలు విక్రయించడానికి లేఅవుట్ వేస్తే ఆ నాయకుడికి రూ.లక్షలు సమర్పించుకోవాల్సిందే. ఏదైనా వెంచర్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే... రూ.50 లక్షల వరకు సమర్పించుకోవాలి. అన్నీ సక్రమంగా ఉండి... అనుమతులు తీసుకున్న వెంచర్కు కూడా స్థలాన్ని బట్టి రూ.5-10 లక్షల వరకు ముట్టజెప్పాల్సిందే. కొన్ని రోజుల కిందట పట్టణంలో ఓ స్థిరాస్తి వ్యాపారి అక్రమ లేఅవుట్ వేశారు. అందుకు వ్యాపారి రూ.40 లక్షలు ప్రజాప్రతినిధికి ఇచ్చినట్లు సమాచారం.
టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలు
రాష్ట్రంలో టీడీఆర్ బాండ్లలో సాగిన అక్రమాల లీలలు ఇన్నీఅన్ని కావు. 80 అడుగులు ఉన్న నల్లజర్ల-కోడేరు రహదారిని 100 అడుగులకు విస్తరించాలని సంకల్పించారు. ఈమేరకు 3వేల చదరపు గజాలకు బాండ్లు జారీ చేశారు. ఆ స్థలం విలువను రూ.18 కోట్లుగా లెక్కగట్టి అందుకు 4రెట్ల విలువైన బాండ్లు విడుదల చేశారు. అక్కడ ఉన్న వాస్తవ విలువను పెంచి బాండ్లు జారీ చేయడం ఒక తప్పిదం అయితే.. ఆ స్థలాలు స్వాధీనం చేసుకోకుండానే బాండ్లు ఇవ్వడం మరో తప్పిదం. అనంతరం ఈ బాండ్లను వారే అమ్మేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రజాప్రతినిధి కీలకపాత్ర పోషించి రూ.కోట్లను కొల్లగొట్టారు.
నిరుద్యోగుల నుంచి వసూళ్లు
నిట్, ఉద్యానవర్సిటీ, ఇతర విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ప్రజాప్రతినిధి అనుచరుడు కొందరు నిరుద్యోగులను నమ్మించారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేశాడు. అందులో సగం వరకు ప్రజాప్రతినిధికే అందినట్లు సమాచారం. డబ్బులిచ్చి రెండేళ్ల వుతున్నా ఉద్యోగాలు రాకపోవడంతో నిరుద్యోగులు ప్రజాప్రతినిధిని కలవగా... తనకేం సంబంధం లేదని ఆయన చేతులు ఎత్తేశారు. దీంతో అనుచరుడు ప్రజాప్రతినిధికి ఇచ్చిన సొమ్మును సర్దుబాటు చేయలేక సతమతమవుతున్నారు.
సుతిమెత్తగా నొక్కేశారు...
పట్టణంలో ఓ నిర్మాణ సంస్థ.. అన్ని అనుమతులు తీసుకుని గృహ సముదాయాల నిర్మాణాలు చేపట్టింది. అయినా ప్రజాప్రతినిధి నుంచి కబురు వచ్చింది. తమకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయంటూ
ఆ సంస్థ వివరించింది. దానికి ప్రజాప్రతినిధి..‘అంతా బాగుంది కానీ.. రేపు ఆ పక్కన కంపోస్టు యార్డు వస్తే ఇబ్బంది పడతారు కదా.. ఆలోచించుకోండి’ అంటూ సుతిమెత్తగా చెప్పారు. దాంతో నిర్మాణ సంస్థ.. ప్రజాప్రతినిధికి లక్షల రూపాయలు సమర్పించుకుంది.
ఇదే ప్రాంతంలోని రాష్ట్రస్థాయి విద్యాసంస్థకు వెళ్లే మార్గంలో పట్టణ బృహత్ ప్రణాళికలో 80 అడుగుల రోడ్డు ఉంది. ఆ రోడ్డుకు ఇరువైపులా పేదలు తాత్కాలిక నివాసాలు ఏర్పాటుచేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆ వెనకాలే ఓ ప్రముఖ వ్యాపార సంస్థకు స్థలం ఉంది. వ్యాపార సంస్థకు అడ్డుగా ఉన్న ఆ నివాసాలను తొలగించేందుకు నాయకుడు ఆ సంస్థ నుంచి అక్షరాల రూ.2 కోట్లు దండుకున్నారని ఆరోపణ. అలా ఖాళీ చేయించిన స్థలాన్ని ఆ వ్యాపార సంస్థ వాహనాల పార్కింగుకు ఉపయోగించుకుంటోంది. నియోజకవర్గ కేంద్రానికి సమీపంలోని గ్రామంలో సొంత పార్టీ నాయకుడే ఓ కల్యాణమండపాన్ని నిర్మించాలనుకున్నాడు. దానికి అధికారులు అనుమతులు ఇవ్వకుండా ప్రజాప్రతినిధి అడ్డుకున్నారు. ఆయనకు డబ్బులు సమర్పించుకున్న తర్వాతే అనుమతులు జారీ అయ్యాయి. ఇలా సొంత పార్టీ నాయకుడిని కూడా పిండేశారు ఈ ప్రజాప్రతినిధి.
నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో గ్రావెల్ నిక్షేపాలు ఉన్నాయి. వ్యాపారులు కొంతమేరకు అనుమతులు తీసుకుని ఇష్టానుసారం మట్టి తవ్వుతున్నారు. అనుమతులు లేని ప్రాంతాల్లో యంత్రాలతో అక్రమంగా మట్టి తవ్వి తరలిస్తున్నారు. అందుకు ప్రజాప్రతినిధికి లక్షల్లో కప్పం చెల్లిస్తున్నారు.
బాణసంచా వ్యాపారులకూ బాజా!
ఈ నియోజకవర్గ ప్రాంతం బాణసంచా వ్యాపారానికి ప్రసిద్ధి. ఇక్కడి నుంచే రాష్ట్రంలోని రిటైల్ వ్యాపారులకు టపాకాయలు సరఫరా అవుతుంటాయి. ప్రతి దీపావళికి ఇక్కడ రూ.కోట్ల వ్యాపారం సాగుతుంది. దీపావళి వచ్చిందంటే అందరికంటే ముందు ఆ నేతకే పండుగ. వ్యాపారుల నుంచి ముక్కుపిండి మరీ రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేస్తారు. గత దీపావళి సమయంలో వ్యాపారులందరిని తన ఇంటికి పిలిపించుకుని.. ఒక్కో వ్యాపారి రూ.5 లక్షల చొప్పున ఇస్తేనే బాణసంచా అమ్మకాలు చేయిస్తానని తెగేసి చెప్పారు. ఇలా ఒక్క దీపావళికే రూ. కోట్లు వసూలు చేశారు.
తండ్రీ కొడుకుల కౌంటర్లు వేరే..
పట్టణంలోని ఓ కుటుంబం తమ స్థలంలో భవన నిర్మాణానికి ఓ బిల్డర్తో ఒప్పందం కుదుర్చుకుంది. బిల్డర్ భవనాన్ని పూర్తిగా నిర్మించకుండా ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో ఆ కుటుంబం ప్రజాప్రతినిధి కుమారుడిని కలిసి సమస్యను పరిష్కరించాలని వేడుకుంది. ప్రతిఫలంగా ఆయన అడిగిన మొత్తాన్ని సమర్పించుకున్నారు. మొదట పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయండని, పోలీసులకు చెప్పి అంతా తాను చూసుకుంటానని తనయుడు హామీ ఇచ్చారు. బాధిత కుటుంబం స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినా పోలీసులు మాత్రం కేసు నమోదు చేయలేదు. కారణం ఏంటని ఆరా తీస్తే.. బిల్డర్ అప్పటికే ప్రజాప్రతినిధికి డబ్బులు ముట్టజెప్పి కేసు నమోదు కాకుండా పోలీసులను ‘మేనేజ్’ చేసుకున్నారని తెలిసింది. ఇలా తండ్రి ఒక కౌంటర్, కుమారుడు మరో కౌంటర్ నిర్వహిస్తున్నారని అప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
-
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
-
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ