అన్నతంత్రం.. కుదేలైన యంత్రం
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) రాయితీ ధరకు విద్యుత్ అందించడంతోపాటు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వగలిగితేనే ఈ పోటీ ప్రపంచంలో అవి నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది.
ఐదేళ్లలో పారిశ్రామిక రంగం తిరోగమనం
వైకాపా సర్కారు వడ్డింపులతో 40 శాతం పెరిగిన ఉత్పత్తి వ్యయం
జగన్ దెబ్బకు లబోదిబోమంటున్న పారిశ్రామికవేత్తలు
రెండేళ్లుగా రాయితీలూ ఎగ్గొట్టిన ప్రభుత్వం
పరిశ్రమల భూములనూ 50 శాతం లాక్కునేలా ఉత్తర్వులు
ఈనాడు, అమరావతి
ప్రభుత్వమేదైనా.. పాలకులెవరైనా..
పారిశ్రామికవేత్తలను రా.. రమ్మంటారు..
రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తామంటారు..
కానీ, ‘ఊరందరిదో దారి..’ అన్నట్లుంది వైకాపా సర్కారు తీరు..
పరిశ్రమలకు విద్యుత్ ఛార్జీలు పెంచుతారు..
ట్రూఅప్ లేదా సర్దుబాటు పేరిట భారం వేస్తారు..
లైసెన్సు ఫీజులు పెంచుతారు..
ఆస్తి పన్నులోనూ దండుకుంటారు..
జీవో ఎప్పుడిచ్చినా..
సారు గద్దెనెక్కిన నాటి నుంచి పన్ను కట్టాలట..
ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఉందండోయ్..
పన్నులు కట్టలేకపోతే సగం భూములను తిరిగిచ్చేయాలట..
దీంతో ‘నీకో నమస్కారం.. నీ బాదుడుకో నమస్కారం’ అంటూ..
పారిశ్రామికవేత్తలంతా తిరిగి చూడకుండా పలాయనం చిత్తగించారు!
రాయితీ అంటూనే..
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) రాయితీ ధరకు విద్యుత్ అందించడంతోపాటు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వగలిగితేనే ఈ పోటీ ప్రపంచంలో అవి నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది. దీనికోసం కేంద్రంతో సంప్రదించి ప్రత్యేక విధానాన్ని రూపొందించాలి.
తాడేపల్లిలోకి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షలో సీఎం జగన్ వ్యాఖ్యలివి.
ఈ మాటలు విన్న ఎవరికైనా ఏమనిపిస్తుంది? చిన్న పరిశ్రమలపై సీఎం జగన్కు ఎనలేని ప్రేమ ఉందనే అనిపిస్తుంది. కానీ, ఆయన చేతలు మాత్రం భిన్నం. కొవిడ్ దెబ్బ నుంచి కోలుకునేలా రాయితీలు ఇవ్వకపోగా.. విద్యుత్ ఛార్జీల భారం మోపారు. గతంలో వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల నుంచి యూనిట్కు 6 పైసల చొప్పున సుంకం వసూలు చేసేవారు. కానీ, జగన్ సర్కారు ఈ మొత్తాన్ని రూపాయికి పెంచుతూ(1,667 శాతం) 2022 ఏప్రిల్లో ఉత్తర్వులు ఇచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా యూనిట్కు 47 పైసలు వసూలు చేసే కర్ణాటకను మించిపోయాం. తెలంగాణలో 6 పైసలు, కేరళలో 10 పైసలు, తమిళనాడులో 36 పైసల వంతున అక్కడి డిస్కంలు వసూలు చేస్తుండటం గమనార్హం. ట్రూఅప్, ఇంధన సర్దుబాటు ఛార్జీలు(ఎఫ్పీపీసీఏ), సుంకం ఇలా మొత్తం కలిపి పరిశ్రమలపై ఏటా సుమారు రూ.2,600 కోట్ల అదనపు భారం పడింది.
రాష్ట్ర ప్రభుత్వమేదైనా పారిశ్రామికవేత్తలకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందించి.. పరిశ్రమలు ఏర్పాటు చేసేలా చూస్తుంది. వైకాపా సర్కారు మాత్రం అందుకు రివర్స్. రాష్ట్రంలోని పరిశ్రమలపై విద్యుత్ ఛార్జీలు, ఆస్తి పన్ను, నీటి పన్ను, వార్షిక లైసెన్సు ఫీజులు.. ఇలా రకరకాల భారాలను మోపుతోంది. ఈ ఐదేళ్ల జగన్ ‘బాదుడే బాదుడు’ పాలనలో ఉత్పత్తి వ్యయం కనీసం 40% పెరిగినట్లు పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు. పెట్టుబడిదారులకు రాయితీలు కల్పిస్తామని, మూలధన వ్యయ భారం తగ్గిస్తామని, చేయిపట్టి నడిపిస్తామని పలుమార్లు ఆయన చెప్పిన మాటలన్నీ డొల్లేనని తేలింది. దాంతో రాష్ట్రంలోని సుమారు 27 వేల భారీ పరిశ్రమలు, సుమారు 5 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి.
విలువ పెరిగిందా.. అంతే..
పరిశ్రమ భూములకు కూడా ఆస్తి పన్ను విధానాన్ని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలో భవనాల వరకే పన్ను లెక్కించేవారు. దీంతో 2019లో రూ.1.13 లక్షలు ఆస్తి పన్ను చెల్లించిన ఓ కంపెనీ.. ప్రస్తుతం రూ.1.44 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. అది చాలదన్నట్లు ఏటా 5 శాతం పన్ను పెంపు వర్తించేలా నిబంధన విధించింది.
జీఓ ఎప్పుడిచ్చామని కాదన్నయ్యా..
ఎక్కడైనా ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి పెంచిన లైసెన్సు ఫీజులు వసూలు చేయడం సహజం. కానీ, జగన్ ప్రభుత్వం రూటే సెపరేటు. పరిశ్రమల నుంచి వసూలు చేసే వార్షిక లైసెన్సుల ఫీజులను పెంచుతూ 2023లో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటినుంచి కాకుండా.. 2019 నుంచి లెక్కగట్టి మరీ (రెట్రాస్పెక్టివ్) వసూలు చేసింది. వార్షిక లైసెన్సు ఫీజు హార్స్పవర్ (హెచ్పీ), కిలోవాట్(కేడబ్ల్యూ) ఆధారంగా పెంచుతూ ప్రభుత్వం గత ఏడాది ఉత్తర్వులు ఇచ్చింది. 2007 తర్వాత వార్షిక లైసెన్సు ఫీజులను పెంచడం ఇదే తొలిసారి. ఈ పెంపు కూడా 2019 నుంచి వర్తిస్తుందని జగన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ ఉత్తర్వులతో కాలుష్య నియంత్రణ మండలి, బాయిలర్, ఫ్యాక్టరీ లైసెన్సు, అగ్నిమాపక శాఖ, కార్మిక శాఖతోపాటు వివిధ శాఖల లైసెన్సుల ఫీజులు గతంతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు పెరిగాయి. రాష్ట్రంలోని సుమారు 25,270 పరిశ్రమలపై ఈ పెంపు ప్రభావం పడింది. ఒక్క కాలుష్య నియంత్రణ మండలి ధ్రువీకరణ కోసం 2019లో మూడేళ్లకు రూ.90 వేలు చెల్లిస్తే.. ఇప్పుడది రూ.4 లక్షలకు పెరిగింది.
మామూలు ‘ఇంపాక్ట్’ కాదు..
రాష్ట్రంలో చిన్నా పెద్దా కలిపి మొత్తం 1,500 పారిశ్రామిక పార్కులు, పారిశ్రామికవాడలను ఏపీఐఐసీ అభివృద్ధి చేసింది. చాలా ఏళ్ల క్రితం పరిశ్రమల కోసం తీసుకున్న భూములపై ‘గ్రోత్ పాలసీ’ పేరుతో భారం మోపేందుకు వైకాపా ప్రభుత్వం హడావుడిగా జీవో నం-5, 6 తెచ్చింది. ఇలా రూ.3,500 కోట్లు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీఐఐసీ ద్వారా పరిశ్రమల కోసం తీసుకున్న భూముల్లో.. తొలుత ప్రతిపాదించిన కార్యకలాపాల్లో మార్పులు చేయాలని భావిస్తే(మరో తరహా పరిశ్రమకు వినియోగించాలనుకుంటే) అప్పటి మార్కెట్ విలువలో 50 శాతాన్ని ఇంపాక్ట్ ఫీజుగా చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ మొత్తాన్ని చెల్లించలేని పక్షంలో 50 శాతం భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలంటూ మెలిక పెట్టింది. పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రైవేటు భూములు కొనుగోలు చేసిన వారు కూడా ప్రస్తుత మార్కెట్ విలువపై 15 శాతం ఇంపాక్ట్ ఫీజు చెల్లించాలట.
వేల ఎకరాలు వృథాగా..
పెట్టుబడులను ఆకర్షించేలా భూములను తక్కువ ధరకు అందించాలన్న మౌలిక విధానాన్ని జగన్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. పారిశ్రామిక పార్కుల్లో స్థలాల అభివృద్ధికి భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని, ఆ మొత్తాన్ని పరిశ్రమల యజమానుల నుంచే వసూలు చేయాలని జగన్ ఆదేశించారు. దీంతో కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో గతంలో ఎకరా రూ.16.5 లక్షలుగా ఉన్న భూముల ధరలను సర్కారు అమాంతం రూ.80 లక్షలకు పెంచింది.
ఇదే తరహాలో వీరపనేని గూడెం పారిశ్రామిక పార్కులో ఎకరా ధరను రూ.91 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ దెబ్బకు అప్పటికే పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్న పారిశ్రామికవేత్తలు తమ ప్రతిపాదనలను విరమించుకున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని అన్ని పారిశ్రామిక పార్కుల్లో స్థలాల ధరలను ప్రభుత్వం భారీగా పెంచడంతో.. పారిశ్రామికవేత్తల్లో ఆసక్తి తగ్గిపోయింది. ఏపీఐఐసీ రికార్డుల ప్రకారం అన్ని పారిశ్రామిక పార్కుల్లో కలిపి 44,767 ఎకరాలు వృథాగా పడి ఉన్నాయి.
కొనేటప్పుడు కిలో వాట్.. అమ్మేటప్పుడు కిలో వోల్ట్!
వివిధ ఉత్పత్తి సంస్థల నుంచి కిలో వాట్ అవర్(కేడబ్ల్యూహెచ్) ఆధారంగా డిస్కంలు విద్యుత్ను కొంటాయి. వారికి చెల్లించే బిల్లు కూడా ఆ ప్రకారమే చెల్లిస్తాయి. కానీ, పరిశ్రమల దగ్గరకు వచ్చేప్పటికి కిలో వోల్ట్ అవర్(కేవీహెచ్) విధానంలో బిల్లులు వసూలు చేస్తున్నాయి. రెండేళ్ల కిందటి వరకు కేడబ్ల్యూహెచ్ విధానంలోనే పరిశ్రమలు వినియోగించిన విద్యుత్కు డిస్కంలు బిల్లులు ఇచ్చాయి. బిల్లింగ్ను కేవీహెచ్ విధానంలోకి మార్పు చేయడం ద్వారా పవర్ ఫ్యాక్టర్ ఆధారంగా చెల్లించాల్సి వస్తోంది. ట్రూఅప్, ఎఫ్పీపీసీఏ, కేవీహెచ్ బిల్లింగ్ విధానం వల్ల యూనిట్కు సగటున రూ.14 వంతున చెల్లించాల్సి వస్తోంది. కర్ణాటక, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పరిశ్రమలు వినియోగించే విద్యుత్కు యూనిట్కు గరిష్ఠంగా రూ.7 మాత్రమే వసూలు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట