జీవితాల్ని మూల్యంగా చెల్లించుకోవాల్సిందే
ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తూ అధికార వైకాపా అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్న గ్రామ, వార్డు వాలంటీర్లు.. దానికి వారి జీవితాలు, భవిష్యత్తు మూల్యంగా చెల్లించుకోవాల్సిందే.
ఈసీ ఆదేశాలను ధిక్కరిస్తే కేసులు ఎదుర్కోవాల్సిందే
విధుల నుంచి ఉద్వాసనకు గురైనా, క్రిమినల్ కేసులున్నా భవిష్యత్తులో ఇబ్బందులే
ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులయ్యే ముప్పు
వాలంటీర్లూ బహుపరాక్
ఈనాడు, అమరావతి: ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తూ అధికార వైకాపా అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్న గ్రామ, వార్డు వాలంటీర్లు.. దానికి వారి జీవితాలు, భవిష్యత్తు మూల్యంగా చెల్లించుకోవాల్సిందే. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినందుకు విధుల నుంచి ఉద్వాసనకు గురైనా, క్రిమినల్ కేసులు నమోదైనా అవి దీర్ఘకాలం పాటు వారిని వెంటాడుతూనే ఉంటాయి. ‘మమ్మల్ని విధుల నుంచి తొలగించేసి, కేసులు నమోదు చేసినంత మాత్రాన ఏమైపోతుందిలే’ అనే పెడధోరణితో వ్యవహరిస్తే జీవితాలను చేజేతులా నాశనం చేసుకున్నట్లే. భవిష్యత్తులో వారు ఏ ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైనా ఈ కళంకం వల్ల అనర్హులవుతారు. ఒక మాదిరి ప్రైవేటు ఉద్యోగం పొందాలన్నా ఇది ఆటంకంగా మారొచ్చు. ప్రస్తుతం నమోదైన క్రిమినల్ కేసుల్లో న్యాయస్థానాల్లో శిక్ష పడితే సంవత్సరంపైనే జైలు శిక్షతోపాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నికల వేళ అధికార పార్టీ నాయకుల ఉచ్చులో చిక్కుకుని, వారిచ్చే తాత్కాలిక ప్రలోభాలకు లోనై ఆడించినట్టల్లా ఆడితే.. ఆ తర్వాత వాలంటీర్లను కాపాడేందుకు వారిలో ఏ ఒక్క నాయకుడూ ముందుకు రారు. వాలంటీర్లు ఇప్పుడు వేస్తున్న ప్రతి తప్పటడుగుకు పర్యవసానం, ఫలితం వారు సొంతంగా అనుభవించాల్సిందే.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు
ప్రభుత్వ ఖజానా నుంచి గౌరవవేతనం పొందుతున్న గ్రామ, వార్డు వాలంటీర్లు ‘పబ్లిక్ సర్వెంట్’ కేటగిరీలోకి వస్తారు. వీరు ఎన్నికల ప్రచారంలో, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనటం నిబంధనలకు విరుద్ధం. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ నిబంధనలు ఉల్లంఘించిన వందల మంది వాలంటీర్లను ఎన్నికల సంఘం విధుల నుంచి తొలగించింది. పలువురిపైన ఐపీసీ, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. మరికొందరిపై సర్వీసు నియమావళి ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అయితే కొందరు వాలంటీర్లు మాత్రం ‘విధుల నుంచి తొలగించేస్తే మరీ మంచిది.. స్వేచ్ఛగా ప్రచారం చేసుకుంటాం’ అనే బరితెగింపుతో వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారందరూ మున్ముందు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సిందే.
కేసుంటే... ప్రభుత్వ ఉద్యోగంపై ఆశలు వదులుకోవాల్సిందే
వాలంటీర్లలో ఎక్కువ మంది డిగ్రీలు, పీజీలు, ఇంజినీరింగ్, ఎంబీఏ తదితర ఉన్నత చదువులు చదివిన యువతే. వీరిలో చాలా మంది వాలంటీరుగా పనిచేస్తూనే ప్రభుత్వోద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నవారూ ఉన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉద్వాసనకు గురైనా, కేసు నమోదైనా ప్రభుత్వం ఉద్యోగంపై వారు ఆశలు వదలుకోవాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైనవారికి ఉద్యోగమిచ్చే ముందు.. నిఘా విభాగం ద్వారా ‘క్యారెక్టర్ అండ్ యాంటిసెడెంట్స్’ వెరిఫికేషన్ చేయిస్తారు. వ్యక్తిగత వివరాలతో పాటు గతంలో ప్రభుత్వంలో ఏదైనా బాధ్యతల్లో పనిచేశారా? ఆ విధుల్లో నుంచి ఉద్వాసన, సస్పెన్షన్, క్రమశిక్షణ చర్యలకు గురయ్యారా? నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన అభియోగాలున్నాయా? ఎక్కడైనా కేసులు నమోదయ్యాయా? వాటిలో అరెస్టయ్యారా? న్యాయ, పోలీసు విచారణను ఎదుర్కొన్నారా? జైలుకెళ్లారా? కోర్టు జరిమానా, అపరాధరుసుం విధించిందా? ఏదైనా కేసులో శిక్ష పడిందా? కోర్టుల్లో ఏదైనా విచారణ పెండింగ్లో ఉందా తదితర అంశాలన్నీ పరిశీలిస్తారు. ఏ కేసులూ లేనివారికే ‘క్యారెక్టర్ అండ్ యాంటిసెడెంట్స్’ సర్టిఫికెట్ జారీ అవుతుంది. అది ఉంటేనే ఉద్యోగంలోకి తీసుకుంటారు. లేకపోతే పరీక్షలు రాసి, అర్హత సాధించి ఉద్యోగానికి ఎంపికైనా ప్రభుత్వోద్యోగం ఇవ్వరు.
జైలు ఊచలు లెక్కించక తప్పదు
కొందరు వాలంటీర్లు వైకాపా అభ్యర్థుల తరఫున ఓటర్లకు నగదు, కానుకలు పంపిణీ చేస్తున్నారు. ఇది ఓట్ల కొనుగోలు కిందే లెక్క. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 123 (1) ప్రకారం ఇది తీవ్రమైన నేరం. అధికార పార్టీ నాయకులు వాలంటీర్లకు కానుకలిస్తున్నారు. ఇది లంచం కిందే లెక్క. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7తో పాటు, ఐపీసీలోని 171బీ, 171ఈ ప్రకారం ఇది నేరం. వైకాపా అభ్యర్థుల నుంచి విలువైన కానుకలు స్వీకరిస్తున్న వాలంటీర్లపై సర్వీసు ప్రవర్తన నియమావళి ప్రకారం విచారణ జరిపేందుకు కూడా ఆస్కారం ఉంది. ఈ నేర నిరూపణ జరిగి శిక్ష పడితే వాలంటీర్లు జైలు ఉచలు లెక్కించక తప్పదు. వాలంటీర్లు పబ్లిక్ సర్వెంట్ల కిందకు వస్తారు కాబట్టి వారికీ ఈ కింది చట్టాలు వర్తిస్తాయి.
1. ప్రభుత్వోద్యోగిని ప్రలోభపెట్టటం నేరం
ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 సెక్షన్ 123 (7): ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి లేదా వారి ప్రతినిధి ఎవరైనా ప్రభుత్వోద్యోగి నుంచి ఎన్నికల్లో సహకారం పొందటం, పొందేందుకు యత్నించటం, కానుకలతో ప్రలోభపెట్టటం నేరం. ఈ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయొచ్చు. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి ఈ అవినీతి కార్యకలాపాల్ని సవాల్ చేయొచ్చు.
2. ఓటర్లకు నగదు, కానుకల పంపిణీ లంచమివ్వటమే
ఐపీసీ సెక్షన్ 171బీ, 171ఈ: ఎవరైనా సరే తనకు లేదా తాను మద్దతిచ్చేవారికి ఓటేయాలంటూ ఓటర్లకు నగదు, కానుకలు, బహుమతులు పంపిణీ చేయటం నేరం. దీన్ని లంచం ఇవ్వటంగానే పరిగణిస్తారు. ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిపై పైన పేర్కొన్న సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయాలి. ఈ నేరం నిరూపణయితే ఏడాది జైలు లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది.
తనకు లేదా తాను మద్దతిచ్చేవారికి ఓటు వేయాలంటూ ఎవరైనా వ్యక్తి ఇచ్చిన నగదు, కానుకలు తీసుకోవటం కూడా లంచం తీసుకున్నట్లే అవుతుంది. ఇది కూడా పై సెక్షన్ల ప్రకారం నేరమే.
3. ఓటర్లకు నగదు, కానుకలు ఇవ్వటం నేరం
ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 సెక్షన్ 123(1): ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థి లేదా అతని ప్రతినిధి ఓటర్లకు నగదు, కానుకలు ఇవ్వటం నేరం. ఓటరు ఎన్నికల్లో తన ఓటు వేయటానికి లేదా ఓటు వేయకుండా నిరోధించటానికి కానుకలివ్వటం నేరం. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేయొచ్చు. ఈ అవినీతి కార్యకలాపాల్ని న్యాయస్థానాల్లో సవాల్ చేయొచ్చు.
4. ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకోవటం నేరం
అవినీతి నిరోధక చట్టం సెక్షన్ (7): అధికారిక విధులు, కార్యకలాపాల నిర్వహణ కోసం ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకోవటం నేరం. ఓటర్లను ప్రభావితం చేసేందుకు వైకాపా నాయకుల నుంచి కానుకలు, బహుమతులు తీసుకోవటం కూడా ఈ సెక్షన్ కింద నేరమే అవుతుంది.
5. పోలింగ్ ఏజెంట్గా పాల్గొనటం నేరం
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 134(ఏ): ఎవరైనా ప్రభుత్వోద్యోగి ఏ అభ్యర్థి తరఫున అయినా ఎన్నికల ఏజెంట్/పోలింగ్ ఏజెంట్/ కౌంటింగ్ ఏజెంట్గా పాల్గొనడం చట్టప్రకారం నేరం. దీనికి మూడు నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు