సంక్షిప్తవార్తలు (6)
ఏపీ బార్ కౌన్సిల్ ఛైర్మన్ గంటా రామారావు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని బార్ కౌన్సిల్ కార్యదర్శికి శనివారం సమర్పించినట్లు తెలిసింది.
బార్ కౌన్సిల్ ఛైర్మన్ పదవికి గంటా రామారావు రాజీనామా
ఈనాడు, అమరావతి: ఏపీ బార్ కౌన్సిల్ ఛైర్మన్ గంటా రామారావు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని బార్ కౌన్సిల్ కార్యదర్శికి శనివారం సమర్పించినట్లు తెలిసింది. దాంతో ఛైర్మన్ పదవికి త్వరలో ఎన్నిక జరగనుంది.
పాలిటెక్నిక్ విద్యార్థిని బలవన్మరణంపై విచారణ కమిటీ
ఈనాడు డిజిటల్, అమరావతి: విశాఖపట్నం జిల్లా కొమ్మాది ప్రాంతంలోని ఓ ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థిని బలవన్మరణంపై ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని సాంకేతిక విద్యాశాఖ నియమించింది. ఆత్మహత్యపై పూర్తిస్థాయి విచారణ జరిపి వివరణాత్మక నివేదికను 24 గంటల్లో సమర్పించాలని కమిషనర్ చదలవాడ నాగరాణి శనివారం ఆదేశించారు. విద్యాసంస్థలోని ఓ అధ్యాపకుని లైంగిక వేధింపుల కారణంగానే తాను చనిపోతున్నానని తండ్రికి ఆ విద్యార్థిని వాట్సప్ సమాచారం పంపినట్టు పలు పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. కళాశాలలో పలువురు విద్యార్థినులు తనలాగే ఇబ్బంది పడుతున్నారని.. ఆ విషయం బయటకు రావాలనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆమె ఆ సంక్షిప్త సమాచారంలో పేర్కొంది. దీంతో అప్రమత్తమైన సాంకేతిక విద్యాశాఖ విచారణ బృందాన్ని నియమించింది. మరోవైపు ఈ కేసులో వాస్తవాలను వెలికితీసేందుకు పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. శనివారం కళాశాలకు వెళ్లి సీజింగ్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను మరోమారు పరిశీలించారు. వివరాలను నమోదు చేసుకున్నారు.
ఏడుగురు వాలంటీర్లపై వేటు
విశాఖపట్నం (పద్మనాభం), న్యూస్టుడే: నిబంధనలు ఉల్లంఘించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఏడుగురు వాలంటీర్లను విధుల నుంచి తొలగించినట్లు ఎంసీసీ సభ్యురాలు, పద్మనాభం ఎంపీడీఓ బి.శైలజ తెలిపారు. ఈ నెల 26న విశాఖలోని గంధవరం గ్రామంలో వైకాపా ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు నిర్వహించిన ప్రచారంలో ఏడుగురు వాలంటీర్లు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈ మేరకు విచారణ చేపట్టి వారిని తొలగించినట్లు శైలజ పేర్కొన్నారు. నియమావళిని ఉల్లంఘించిన ఆ ఏడుగురి వాలంటీర్లతో పాటు కో-ఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగి గల్లా రామకృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేష్ తెలిపారు.
13 మంది వాలంటీర్ల రాజీనామా
విజయనగరం గ్రామీణం, న్యూస్టుడే: విజయనగరం జిల్లాలో గొల్లలపేట పంచాయతీకి చెందిన 13 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను ఎంపీడీఓ జి.వెంకటరావు ధ్రువీకరించారు. తొలినుంచి వీరు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీరి సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు అధికార పార్టీ నాయకుడే వారితో రాజీనామా చేయించారనే చర్చ జరుగుతోంది.
సీనియర్లను కాదని జూనియర్లకు కీలక పోస్టింగులు!
నిబంధనల అతిక్రమణపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
ఈనాడు, అమరావతి: స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందిన జాబితాలోని సీనియర్లను కాదని జూనియర్లకు కీలకమైన పోస్టింగులు ఇచ్చారని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. డిప్యూటీ కలెక్టర్లుగా ఉన్న వారిలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందేందుకు అర్హులైన 106 మందితో ఓ జాబితా (ప్రొవిజనల్ సీనియార్టీ లిస్ట్)ను రెవెన్యూ శాఖ గెజిట్ రూపంలో గత ఏడాది డిసెంబరులో విడుదల చేసింది. అయితే... వీరిలో ఎనిమిది మందికే స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో పోస్టింగులు ఇచ్చారని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. వీరుకాకుండా పోస్టింగులు పొందిన మరో 18 మంది బాగా జూనియర్లని, వీరిలో కొందరు ప్రస్తుతం జిల్లాల్లో డీఆర్ఓలుగా పని చేస్తున్నారని తెలిపారు. అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్/డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ హోదా వీరికి ఉందని తెలిపారు. పది, పన్నెండేళ్ల నుంచి పనిచేస్తున్న సీనియర్లను కాదని జూనియర్లకు ఎలా అవకాశాన్ని కల్పిస్తారని ప్రశ్నించారు. నిబంధనల అతిక్రమణ జరిగిందని ఆరోపించారు. అంతేకాకుండా జూనియర్లలో పలువురిపై ఆదాయానికి మించిన కేసులు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించి అర్హులైన వారికి న్యాయం చేయాలని కోరారు.
డీఎస్సీ వాయిదా హర్షణీయం
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేయడంపై నిరుద్యోగ ఐక్య కార్యాచరణ సమితి (ఐకాస) హర్షం వ్యక్తం చేసింది. ‘జగన్ ప్రభుత్వం అయిదేళ్లు కాలయాపన చేసి ఎన్నికలున్నాయని తెలిసినా.. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి హడావుడిగా పరీక్షలు నిర్వహించాలనుకుంది. నిరుద్యోగుల వినతులపై స్పందించిన ఈసీ డీఎస్సీని వాయిదా వేసింది. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేస్తామన్న చంద్రబాబు హామీపై నిరుద్యోగులకు నమ్మకముంది’ అని ఐకాస అధ్యక్ష, కన్వీనర్లు హేమంత్కుమార్, షేక్ సిద్దిక్ శనివారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం