జగన్ యాత్ర.. జనానికి యాతన
జగన్మోహన్రెడ్డి అయిదేళ్లుగా సీఎం హోదాలో ఎక్కడికెళ్లినా ప్రజలకు నరకం చూపించారు. ఇప్పుడు వైకాపా అధినేతగా ఎన్నికల ప్రచారానికి వెళ్లినా పరిస్థితి మారలేదు.
అవసరం లేకపోయినా 44వ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిపివేత
బస్సు యాత్రకు ఇబ్బందవుతుందని ఉదయం 8 నుంచే కరెంటు సరఫరా కట్
12 గంటలపాటు కరెంటు కోతతో పట్టణవాసుల నరకయాతన
ఈనాడు డిజిటల్- అనంతపురం, న్యూస్టుడే- గుత్తి, గుత్తి గ్రామీణం: జగన్మోహన్రెడ్డి అయిదేళ్లుగా సీఎం హోదాలో ఎక్కడికెళ్లినా ప్రజలకు నరకం చూపించారు. ఇప్పుడు వైకాపా అధినేతగా ఎన్నికల ప్రచారానికి వెళ్లినా పరిస్థితి మారలేదు. వైకాపా నాయకుల దౌర్జన్యానికి పోలీసుల అత్యుత్సాహం తోడై జగన్ బస్సుయాత్రలో జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా సీఎం జగన్ శనివారం ఉదయం 10.30కు అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి రావాల్సి ఉంది. అయితే ఆయన 6 గంటల ఆలస్యంగా సాయంత్రం 4.30కు చేరుకున్నారు. దానికి రెండు గంటల ముందే పోలీసులు 44వ నంబరు జాతీయరహదారిపై ట్రాఫిక్ను నిలిపివేశారు. దాంతో హైదరాబాద్, బెంగళూరు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. జగన్ కర్నూలు జిల్లాలో ఉండగానే గుత్తి మండలం బసినేపల్లి క్రాస్ వద్ద పత్తికొండ, ఆదోని, మంత్రాలయం మీదుగా వెళ్లాల్సిన వాహనాలను రెండు గంటలపాటు నిలిపివేశారు. సాయంత్రం 4.30 గంటలకు గుత్తి పట్టణంలోకి బస్సు యాత్ర ప్రవేశించింది. 5.30 గంటలకు గుత్తి శివారులోని ఓ ప్రైవేటు పాఠశాల వద్ద జగన్ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలోనూ హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిపివేశారు. సుమారు 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందిపడ్డారు. సీఎం జగన్ గుత్తి నుంచి జాతీయ రహదారి మీదుగా అనంతపురం చేరుకునే వరకు ట్రాఫిక్ను ఒకవైపునకు మళ్లించారు. దీంతో 50 కిలోమీటర్ల దూరానికి 4.30 గంటల సమయం పట్టిందని వాహనదారులు వాపోయారు. బస్సుయాత్ర ఆలస్యం కావడంతో వైకాపా నాయకులు తరలించిన జనం జగన్ రాక ముందే ఇళ్లకు వెళ్లిపోయారు.
గుత్తివాసులకు 12 గంటల ఉక్కపోత
జగన్ బస్సుయాత్ర ఉదయం 10:30 గంటలకే గుత్తి చేరుకుంటుందని.. అక్కడే మధ్యాహ్నం 3 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారని ముందురోజు ప్రకటించారు. సీఎం ప్రయాణించే బస్సుకు అసౌకర్యం కలగకూడదనే కారణంతో ఉదయం 8 గంటలకే గుత్తిలో కరెంటు నిలిపివేశారు. బస్సు యాత్ర పూర్తయిన తర్వాత కూడా కరెంటు ఇవ్వలేదు. రాత్రి 8.40 గంటలకు సరఫరాను పునరుద్ధరించారు. దీంతో 12 గంటలపాటు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. కరెంటు లేకపోవడంతో ఆసుపత్రుల్లోని రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బేకరీలు, శీతల పానీయాల దుకాణాల్లో వ్యాపారం జరగక నష్టపోయినట్లు యజమానులు వాపోయారు. సీఎం జగన్ రావడానికి రెండు గంటల ముందే గుత్తిలో ట్రాఫిక్ నిలిపివేయడంతో రైల్వేస్టేషన్కు వెళ్లాల్సిన ప్రయాణికులు 3 కిలోమీటర్లు కాలినడకన వెళ్తూ కనిపించారు.
మాటైనా మాట్లాడకుండా వెళ్లిపోయిన సీఎం
బస్సుయాత్ర సందర్భంగా గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి పెద్దఎత్తున జనాల్ని గుత్తికి తరలించారు. మహిళా కూలీలకు రూ.500 చొప్పున ఇచ్చి ఆటోల్లో తీసుకొచ్చారు. పురుషులకు డబ్బుతోపాటు మద్యం సీసాలు పంచారు. గుత్తిలోని మహాత్మాగాంధీ కూడలికి మధ్యాహ్నం 12 గంటలకే జనాల్ని తరలించారు. జగన్ రాక 6 గంటలు ఆలస్యమవడంతో జనాలు ఎండకు మాడిపోయారు. బస్సుయాత్ర వచ్చేసరికి పట్టుమని 3 వేల మంది కూడా మిగల్లేదు. ఉన్న కొద్దిపాటి జనాలకు బస్సు పైనుంచి అభివాదం చేసుకుంటూనే జగన్ ఒక్కమాటైనా మాట్లాడకుండానే ముందుకు వెళ్లిపోయారు.
పొలాలు ఎండుతున్నాయి..
ఈనాడు, కర్నూలు: ‘పల్లెల్లో చెరువులకు నీరు చేరక రైతులమంతా అవస్థలు పడుతున్నాం. కుళాయిల్లో నీరు రాక దాహంతో తల్లడిల్లుతున్నాం..’ అని పలు గ్రామాల ప్రజలు ముఖ్యమంత్రి జగన్కు వివరించారు. ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమంలో భాగంగా శనివారం కర్నూలు జిల్లా తుగ్గలిలో ఆయన ‘ముఖాముఖి’ నిర్వహించారు. ఇందులో పలువురు స్థానికులు తమ సమస్యలు వివరించారు. తుగ్గలి మండలంలో దుర్భిక్ష పరిస్థితులున్నాయని, కరవు మండలంగా ప్రకటించాలని రాతన గ్రామానికి చెందిన సురేశ్ కోరారు. ఆయన ఉపాధి హామీ మేటీగానూ విధులు నిర్వహిస్తున్నారు. రైతు రుణాలను మాఫీ చేయాలని ఇదే గ్రామానికి చెందిన శ్యామలాదేవి కోరారు. పంటలు బాగా పండినప్పుడు ధరలు ఉండటం లేదని, ధరలు ఉన్నప్పుడు పంటలు చేతికందడం లేదని హోసూరుకు చెందిన లాల్బాషా వాపోయారు. రైతులకూ పింఛను ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు.
తుగ్గలిలో ముఖాముఖి సందర్భంగా గ్రామానికి ఏమైనా ప్రత్యేక హామీలిస్తారేమోనని ఎదురుచూసినవారికి నిరాశ తప్పలేదు. ఉదయం 9.30 గంటలకు కార్యక్రమం ప్రారంభిస్తామని 11 గంటలకు మొదలుపెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!