గురువులకూ చుట్టేశారు గుండు సున్న!
అధికారంలోకి వచ్చేందుకు ఐదేళ్ల కిందట జగన్ చెప్పని మాట లేదు... ఇవ్వని హామీ లేదు... ప్రైవేటు టీచర్లకు ఎన్నో ఆశలు కల్పించారు... తీరా గద్దెనెక్కిన తర్వాత తూచ్ అనేశారు.
ప్రైవేటు ఉపాధ్యాయులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కరవు
పాదయాత్రలో మాటిచ్చి మరచిన జగన్
పాఠశాల విద్య కమిషన్ను నామమాత్రంగా మార్చేసిన వైనం
కరోనా సమయంలోనూ ఆదుకోని వైకాపా సర్కారు
అధికారంలోకి వచ్చేందుకు ఐదేళ్ల కిందట జగన్ చెప్పని మాట లేదు... ఇవ్వని హామీ లేదు... ప్రైవేటు టీచర్లకు ఎన్నో ఆశలు కల్పించారు... తీరా గద్దెనెక్కిన తర్వాత తూచ్ అనేశారు... రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రైవేటు వ్యవస్థను... వైకాపా సర్కారు అసలేమీ పట్టించుకోలేదు... అందుకే గురువులంతా కలిసి... ఈసారి గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారు!
కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించాం. మన ప్రభుత్వం రాగానే అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టం తీసుకొస్తాం. కనీస వేతనం, రెగ్యులర్గా జీతాలు, పని గంటలు, సెలవులు, పీఎఫ్, ఈఎస్ఐ, ఆరోగ్యబీమా తదితరాలన్నీ వర్తించేలా చూస్తాం.
ప్రతిపక్ష నేతగా జగన్ హామీ
అబద్ధాలు, మాయమాటలతో ఆకాశానికి నిచ్చెనలు వేయడంలో జగన్ దిట్ట. గత ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చేందుకు ఏదేదో చేసేస్తామని ప్రజలను నమ్మించిన ఆయన.. సీఎం పీఠంపై కూర్చున్నాక హామీల తెప్పను తగలేశారు. అన్ని వర్గాల మాదిరే లక్షల మంది ప్రైవేటు ఉపాధ్యాయులనూ మోసం చేశారు. పాదయాత్ర సమయంలో వారు ఎక్కడ కనిపించినా.. ఉద్యోగ జీవితానికి భద్రత కల్పిస్తానంటూ అర చేతిలో స్వర్గం చూపించారు. అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. కనీస వేతనాలు, ఆరోగ్య బీమా, ఈఎస్ఐ, పీఎఫ్లాంటి సదుపాయాలు అమలు చేసేందుకు ఐదేళ్లలో ఒక్కసారైనా పట్టించుకున్న పాపాన పోలేదు. కరోనా సమయంలో ఉపాధి కరవై.. జీవనోపాధి కోసం వారి కుటుంబాలు రోడ్డున పడినా ఎలాంటి సాయం చేయలేదు. కొందరు కుటుంబ పోషణ కోసం... ఉపాధి హామీ కూలీలుగా, రోడ్డు పక్కన దుస్తుల వ్యాపారులుగా, కరోనా వార్డులకు మందుల సరఫరాదారులుగా, సెక్యూరిటీ గార్డులుగా పనిచేశారు. అయినా, నాడు జగన్ మనసు ఏమాత్రం చలించలేదు.
4 లక్షల మంది ప్రైవేటు ఉద్యోగులు...
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, లెక్చరర్లు కలిపి నాలుగు లక్షల మందికిపైగా ఉన్నారు. ప్రైవేటురంగంలో ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులున్న వ్యవస్థ మరొకటి లేదు. వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రైవేటు ఉపాధ్యాయ, లెక్చరర్ల సంఘాల ప్రతినిధులు పలుమార్లు తమ సమస్యలను వినతిపత్రాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కానీ, సర్కారు మాత్రం వీరిని అసలు లెక్కలోకే తీసుకోలేదు.
- అరకొర జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామని, తమకూ కనీస వేతనాలు అందేలా చూడాలని ఉపాధ్యాయులు, లెక్చరర్లు కొన్నేళ్లుగా కోరుతున్నారు.
- కొన్నిచోట్ల వారంలో ఒక్కరోజు సెలవు దొరకడమూ కష్టంగా ఉంటోంది. ఉదయం పాఠశాల, కళాశాలకు వెళ్లింది మొదలు... ఇంటికొచ్చే వరకు విరామం లేకుండా బోధించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి నుంచి కాస్త ఉపశమనం దక్కేలా చూడాలని విన్నవించారు.
- దురదృష్టవశాత్తు ఏదైన అనుకోని సంఘటన ఎదురైతే కుటుంబం మొత్తం రోడ్డు పడాల్సి వస్తోందని, ప్రభుత్వం ప్రత్యేకంగా ఆరోగ్య కార్డులు, బీమా అమలు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం కొందరికి మాత్రమే నవరత్నాల్లో ఇచ్చే వాటినే అందిస్తోంది.
- పట్టణాల్లో నెలకు రూ.12 వేలు, గ్రామాల్లో నెలకు రూ.10 వేల కంటే ఎక్కువ ఆదాయం ఉందని కొందరు ప్రైవేటు ఉపాధ్యాయులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కోత విధిస్తున్నారు. అద్దె ఇళ్లలో ఉంటున్న తమకు ఈ వేతనాలను సాకుగా చూపి పథకాలు దక్కకుండా చేయడం సరికాదని వారు వాపోతున్నారు.
కోరలు లేని కమిషన్ ఎందుకు?
ప్రైవేటు ఉపాధ్యాయుల భద్రత కోసమంటూ ‘పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్’ను జగన్ సర్కారు తీసుకొచ్చినా... దానికి కోరలు లేకుండా చేసింది. ఈ కమిషన్కు మూడేళ్లకోసారి నూతన కార్యవర్గాన్ని నియమించాల్సి ఉండగా.. 2022 అక్టోబరు నుంచి ఆ ఊసేలేదు. దాదాపు 18 నెలల నుంచి ఒక్క ఛైర్మన్తోనే ఈ కమిషన్ కొనసాగుతోంది. ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలపై గతంలో ఓ కమిటీ నివేదిక సమర్పించినా... ఇంతవరకు దానిపై జగన్ స్పందించిన దాఖలాలే లేవు. ఒకపక్క చట్టాన్ని తీసుకొచ్చామని గొప్పగా చెబుతున్న జగన్.. అది సక్రమంగా పనిచేసేలా చూడటంలో విఫలమయ్యారు.
భర్తీ చేస్తే కొందరికైనా అవకాశం
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తే ప్రైవేటులో పనిచేస్తున్న కొందరికైనా అవకాశం లభిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో 25 వేలకుపైగా ఖాళీలు ఉంటే... సర్కారు మాత్రం 6,100 పోస్టులకే డీఎస్సీ ప్రకటించింది. గత ఎన్నికల ముందు మెగా డీఎస్సీ నిర్వహిస్తామని బీరాలు పోయి, గడిచిన ఐదేళ్లు ఏమాత్రం పట్టించుకోని జగన్.. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రభుత్వ ఉదాసీనతతో ప్రైవేటులో పనిచేస్తున్న వారి కష్టాలు అరణ్య రోదనగానే మిగిలిపోతున్నాయి.
ఉపాధ్యాయ విద్యకు తగ్గిన ఆదరణ
ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు తగ్గిపోవడం, ప్రైవేటులో భద్రత లేకపోవడంతో బీఈడీ, డీఈడీ కోర్సుల్లో చేరేవారి సంఖ్య ఏటా గణనీయంగా తగ్గిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా 411 బీఈడీ కళాశాలలు ఉండగా.. వాటిలో 34 వేల సీట్లు ఉన్నాయి. కన్వీనర్ కోటాలో సుమారు 24 వేల సీట్లుంటే మూడు వేలకు మించి ప్రవేశాలు పొందడంలేదు. డీఈడీలో ప్రభుత్వ కళాశాలలు మినహా మరెక్కడా విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్న దాఖలాలే లేవు.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!