‘ఎన్నికల’ డీఎస్సీ వాయిదా
ఎన్నికల ముందు నిరుద్యోగ యువతను మభ్యపెట్టేందుకు జగన్ సర్కార్ ప్రకటించిన డీఎస్సీకి ఎన్నికల కోడ్తో బ్రేక్ పడింది.
కోడ్ ముగిసిన తర్వాతే టెట్ ఫలితాల విడుదల, డీఎస్సీ నిర్వహణ
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం
యువతను మభ్యపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసిన జగన్
ఉపాధ్యాయ నియామకాలు జరగవని తెలిసే ఎన్నికల ముందు ప్రకటన
అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామంటూ తెదేపా హామీ
ఈనాడు, అమరావతి: ఎన్నికల ముందు నిరుద్యోగ యువతను మభ్యపెట్టేందుకు జగన్ సర్కార్ ప్రకటించిన డీఎస్సీకి ఎన్నికల కోడ్తో బ్రేక్ పడింది. కోడ్ ముగిసిన తర్వాతే ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదల చేయాలని, ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. ఎన్నికల నియమావళి కారణంగా డీఎస్సీ నిర్వహణ ఆగిపోతుందని ముందే తెలిసే.. నిరుద్యోగులను మోసం చేసేందుకు జగన్ డీఎస్సీ ప్రకటించారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తూ వచ్చాయి. 2019 ఎన్నికలకు ముందు మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చి.. నాలుగున్నరేళ్లు నిద్రపోయారు. ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు నిద్ర లేచి, డీఎస్సీ అంటూ హడావుడి చేశారు. ఎన్నికల షెడ్యూల్ రావడానికి నెల ముందు 6,100 అరకొర పోస్టులతో డీఎస్సీ ప్రకటించారు. అది కూడా సక్రమంగా చేయకుండా, ప్రకటనలో గందరగోళం సృష్టించారు. న్యాయచిక్కుల కారణంగా మొదట్లోనే వాయిదాల పర్వం కొనసాగింది. ఈలోపు ఎన్నికల కోడ్ వచ్చేసింది. జగన్ స్వార్థ ఆలోచనలకు ఈ డీఎస్సీనే పెద్ద నిదర్శనం. యువతకు ఏదో మేలుచేసినట్లు నటించడం.. తరువాత దాన్ని ముందుకు కదలకుండా చేయడంలో జగన్ను మించిన వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.
వివాదాలు సృష్టించిన జగన్ సర్కార్..
ఎన్నికల ముందు డీఎస్సీ ప్రకటించిన జగన్ సర్కార్.. ఆ ప్రక్రియను ముందుకెళ్లకుండా అడ్డుకునేందుకు కావాలనే అర్హతల్లో అయోమయం సృష్టించింది. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులకు బీఈడీ వారికి అర్హత కల్పించింది. బీఈడీ చేసిన వారికి ఎస్జీటీ పోస్టులకు అర్హత లేదని మొదట జనవరి 26న జీవో 4ను ప్రవీణ్ప్రకాష్ జారీ చేశారు. తర్వాత ఫిబ్రవరి 12న జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్లో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారికి అర్హత కల్పించారు. 17 రోజుల్లోనే రెండు విరుద్ధ నిర్ణయాలను ప్రకటించారు. ఈ గందరగోళంపై కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారు అనర్హులంటూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. న్యాయస్థానం ఆదేశాలతో ప్రభుత్వం డీఎస్సీ దరఖాస్తు గడువును ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు పొడిగించింది. అభ్యర్థులకు సన్నద్ధత సమయం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలివ్వడంతో డీఎస్సీ పరీక్షను మార్పు చేసింది. మార్చి 15 నుంచి నిర్వహించాల్సిన పరీక్షలను మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తామంటూ ప్రకటించింది. ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో టెట్ ఫలితాల విడుదల, డీఎస్సీ నిర్వహణపై ఈసీ నిర్ణయం కోసం నివేదిక పంపారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం శనివారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. కోడ్ ముగిశాకే టెట్ ఫలితాలు వెల్లడించాలని, డీఎస్సీ నిర్వహించుకోవాలని సూచించింది. ఇలా ప్రభుత్వమే వివాదం సృష్టించి వాయిదాకు కారణమైంది.
తొలిరోజే మెగా డీఎస్సీ ఇస్తామంటూ తెదేపా హామీ
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం వస్తూనే తొలిరోజు తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతామని తెదేపా అధినేత చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. 2014-19 మధ్య తెదేపా హయాంలో రెండుసార్లు డీఎస్సీ నిర్వహించారు. డీఎస్సీ-2014లో 10,313 పోస్టులు భర్తీ చేయగా.. డీఎస్సీ-2018లో 7,902 పోస్టులకు ప్రకటన ఇచ్చారు. వీటిని భర్తీచేసే సమయానికి వైకాపా అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి ఏపీ నుంచి విభజిత ఏపీ వరకు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో మొత్తం 8 సార్లు డీఎస్సీ ప్రకటించడం విశేషం.
టెట్ ఫలితాలు, డీఎస్సీ వాయిదా: కమిషనర్
కేంద్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాలు, ఉపాధ్యాయ నియామక పరీక్షల నిర్వహణను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. కొత్త తేదీలతో షెడ్యూల్ను తరువాత ప్రకటిస్తామని వెల్లడించారు. ‘‘మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డీఎస్సీ నిర్వహించేందుకు షెడ్యూల్ ఇచ్చాం. ఇంతలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో టెట్ ఫలితాలు, ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున కోడ్ ముగిసే వరకు వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు