అనంత పట్టు రైతుకు పుట్టెడు కష్టాలు
పట్టుగూళ్లు కేజీ రూ.650 ఉండేది. ఇప్పుడు రూ.300లకూ అమ్ముకోలేని పరిస్థితి. కిలోకు రూ.50 చొప్పున ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల్లోనూ ఇప్పటికీ రూ.4 కోట్ల బకాయిలు ఉన్నాయి.
ప్రోత్సాహకాలు పెంచుతామని.. నట్టేట ముంచిన వైకాపా ప్రభుత్వం
ఐదేళ్లలో అనంతపురం రైతులకే రూ.50 కోట్ల బకాయి
పింఛన్లు పీకేసి, రాయితీలు ఎత్తేసి.. మళ్లీ మాయ యాత్రలా!
పట్టు నేసే కార్మికులనూ దగా చేశారే..
పట్టుగూళ్లు కేజీ రూ.650 ఉండేది. ఇప్పుడు రూ.300లకూ అమ్ముకోలేని పరిస్థితి. కిలోకు రూ.50 చొప్పున ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల్లోనూ ఇప్పటికీ రూ.4 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. వైకాపా అధికారంలోకి రాగానే పట్టు రైతులకు ప్రోత్సాహకాలు పెంచుతామని హామీ ఇస్తున్నా.’’
2019 ఏప్రిల్ 4న ఎన్నికల ప్రచారం కోసం హిందూపురం వచ్చిన సందర్భంగా జగన్ అన్న మాటలివి.
ఈనాడు, అమరావతి- ఈనాడు డిజిటల్, అనంతపురం: ప్రోత్సాహకాలనందిస్తా.. మిమ్మల్ని నిలబెడతానంటూ ఎన్నికల ముందు తేనె పలుకులు పలికి నేతన్నను నమ్మించిన జగన్.. అధికారంలోకొచ్చాక వారిని నిలువునా ముంచారు. గత ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలు సరిపోలేదని, వాటిని పెంచుతామన్న ఆయన.. సీఎం పీఠం ఎక్కాక మాట తప్పారు. కిలో పట్టుగూళ్లకు రూ.50 చొప్పున గత తెదేపా ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాన్ని అధికారంలోకి వచ్చాక జగన్ పూర్తిగా నిలిపివేశారు. ఓ వైపు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం అందక, మరోవైపు మార్కెట్లో పట్టుగూళ్ల ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. చంద్రబాబు ప్రభుత్వం అందించిన రాయితీలనూ జగన్ నిలిపివేశారు. దీంతో పెట్టుబడులు రెండింతలు పెరిగిపోయాయి రైతులు అల్లాడిపోయారు. ఐదేళ్లలో సగటున ఒక్కో రైతుకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకూ ప్రోత్సాహకాలు చెల్లించాల్సి ఉంది. ఇవన్నీ చెల్లించకుండా మోసం చేస్తున్న జగన్.. ఇప్పుడు ఏం మాయమాటలు చెప్పడానికి వస్తున్నారు? ఎన్నికలు వచ్చాయని మళ్లీ అనంతపురం వచ్చారు.. ఈ సందర్భంలోనైనా గతంలో మీరిచ్చిన హామీలు గుర్తుకు తెచ్చుకొని.. రైతన్నలు, నేతన్నల బాధలపై చర్చించే మనసుందా మీకు..?
నాడు: జగన్ మొసలికన్నీరు..
నేడు: రైతుల రక్తకన్నీరు!
2019 ఎన్నికల ప్రచారంలో పట్టు పరిశ్రమపై సీఎం జగన్ మొసలి కన్నీరు ఒలకబోశారు. నిజంగా తెదేపా, వైకాపా ప్రభుత్వాల హయాంలో ఆ రంగం ఎలా ఉందో పరిశీలిద్దాం..!
తెదేపా ప్రభుత్వ హయాంలో లబ్ధి ఇలా..
- పట్టు రైతులకు పెద్దమొత్తంలో రాయితీలు అందించారు.
- బైవోల్టిన్ పట్టు సాగు చేసే వారికి ఎరువులు, మందులను రాయితీతో అందించా. పట్టుగూళ్లను మార్కెట్లో విక్రయించిన రైతులకు కిలోకు రూ.50 చొప్పున ప్రోత్సాహకం ఇచ్చారు.
- పట్టు రైతు రూ.1,250 చెల్లిస్తే రూ.5,000 విలువైన రోగ నిరోధక మందులు, బ్లీచింగ్, సున్నం వంటివి అందిచారు.
- నేత కార్మికులకు ముడి పట్టుపై కిలోకు రూ.500 చొప్పున 4 కిలోల వరకు రాయితీ ఇచ్చారు. ఇలా నెలకు రూ.2 వేలు, ఏడాదికి రూ.24 వేల లబ్ధి చేకూర్చారు.
- ఆదరణ పథకం కింద చేనేతలకు వృత్తి పరికరాలు ఇచ్చారు. ఒక్క ధర్మవరంలోనే 10 వేల మందికి లబ్ధి కలిగింది.
- ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం, పుట్టపర్తి, ఉరవకొండ ప్రాంతాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేసి చేనేత వృత్తిలో నైపుణ్య శిక్షణ ఇచ్చారు. అనంతపురంలోనే 10 వేల మందికి శిక్షణ ఇప్పించారు.
- రుణాలు ఇప్పించి వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహించారు.
- చేనేత ఉత్పత్తులపై ఎలాంటి పన్నులు ఉండేవి కాదు.
జగన్ మోసానికి సాక్ష్యాలిగో..
జగన్ హయాంలో నేతన్న బతుకు రోడ్డున పడింది. అయిదేళ్లలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే 40 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. చాలా కుటుంబాలకు పరిహారమూ ఎగ్గొట్టారు.
- 50 ఏళ్లు నిండిన నేతన్నలకు పింఛను ఇస్తామని హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చాక నిబంధనల సాకుతో అప్పటివరకూ పింఛను పొందుతున్న వారికీ రాకుండా చేశారు.
- నేతన్నలకు ఏటా రూ.24 వేలు ఇస్తామన్నారు.. కేవలం సొంత మగ్గాలు ఉన్నవారికే ‘నేతన్న నేస్తం’ పేరుతో సాయం అందిస్తున్నారు. ఫోర్ వీలర్ ఉందని, 10ఎకరాల భూమి ఉందని చెప్పి 15 వేల మందికి కోత పెట్టారు. ధర్మవరం నియోజకవర్గంలో 80 వేల మంది కార్మికులుంటే.. కేవలం 10 వేల మందికే ‘నేతన్న నేస్తం’ వస్తోంది.
- పింఛను కోసం దరఖాస్తు చేసుకున్న నేతన్నలకు నిబంధనల మెలికలు పెట్టి.. దరఖాస్తులు నిలిపివేశారు. గతేడాది జులై నుంచి ఈ ఏడాది జనవరి వరకు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఎదురుచూపులే మిగిలాయి.
వైకాపా పాలనలో అదనపు భారం...
- వైకాపా వచ్చిన తొలి ఏడాది అరకొరగా ప్రోత్సాహకాలు ఇచ్చి, ఆ తరువాత నిలిపివేశారు.
- ఈ అయిదేళ్లలో రూ.50 కోట్ల బకాయి పెట్టారు.
- రాయితీ మందులు నిలిపివేయడంతో రైతులు అధిక ధరలు చెల్లించి ప్రైవేటుగా కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ మందుల విషయంలోనే ప్రతి రైతుకూ ఒక్కో పంటపై రూ.4 వేల నుంచి 5 వేల అదనపు భారం పడుతోంది.
- ముడి పట్టుపై రాయితీలనూ పూర్తిగా ఎత్తేశారు.
- నేత సామగ్రిపై రాయితీని నిలిపివేశారు.
- ఒక్కరికీ శిక్షణ ఇవ్వలేదు. క్టస్లర్లనూ మూసేశారు.
- పరిశ్రమల దిక్కే లేదు.. ఇంకా రుణాలు ఇప్పించిన దాఖలాలెక్కడివి.
- జగన్ అధికారంలోకి వచ్చాక పట్టు ఉత్పత్తులపై 18% జీఎస్టీ విధించారు. పైగా కరెంటు ఛార్జీలు పెంచడంతో పెట్టుబడి భారం పెరిగిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. -
మడ అడవుల పరిరక్షణకు ప్రత్యేక విభాగం
మడ అడవుల పరిరక్షణ కోసం వెంటనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆసక్తి, అనుభవం ఉన్న అధికారులను ఎంపిక చేసి ప్రత్యేకాధికారులుగా నియమించాలని సూచించారు. -
పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటరు నమోదుకు షెడ్యూల్ ఖరారు
తూర్పు-పశ్చిమగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. -
ఇలాంటివి మీ ఇంట్లో తింటారా టీచర్!
తిరుపతి జిల్లాలోని బీఎన్కండ్రిగ ఏకలవ్య గురుకుల పాఠశాల వంట గదిలో కుళ్లిన క్యాబేజీ, అరటిపండ్లు కనిపించాయి. శుక్రవారం మండలస్థాయి అధికారులు తనిఖీ చేసి అక్కడి పరిస్థితిని చూసి అవాక్కయ్యారు. -
సంక్షిప్త వార్తలు(11)
తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.సుజాత శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి తితిదే అధికారులు స్వాగతం పలికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం
వరదలతో కోస్తా జిల్లాల్లో నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నష్టాల తీవ్రతపై అవసరమైతే నిబంధనలు సడలించి అయినా అదనపు సాయం అందించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.