YS Jagan: వికటిస్తున్న జగన్నాటకం
వివిధ పథకాల లబ్ధిదారులు, వైకాపా భజన బృందంతో జగన్నాటకాన్ని రక్తికట్టించేందుకు ఐప్యాక్ ప్రతినిధులు చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్నాయి.
ప్రశ్నించేందుకు మేమంతా సిద్ధమంటున్న జనం
భజనపరులను తెచ్చినా నిలదీస్తున్న వైనం
ఈనాడు-అమరావతి, కర్నూలు, న్యూస్టుడే-తుగ్గలి: వివిధ పథకాల లబ్ధిదారులు, వైకాపా భజన బృందంతో జగన్నాటకాన్ని రక్తికట్టించేందుకు ఐప్యాక్ ప్రతినిధులు చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్నాయి. వారిని జగన్ ముందు నిలబెట్టి ముఖాముఖి పేరుతో నడుపుతున్న ఈ ప్రహసనం అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారుతోంది. ఇక్కడ లబ్ధిదారులు వారికి అందుతున్న లబ్ధి గురించి చెబుతూనే సమస్యలను ఏకరవు పెడుతున్నారు. శనివారం కర్నూలు జిల్లా తుగ్గలి వేదికగా నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ ముఖాముఖి కార్యక్రమంలో స్థానికుల ప్రశ్నలతో జగన్కు దిమ్మతిరిగింది. కొందరు జగన్ భజన చేసినా మరికొందరు నిర్మొహమాటంగా ప్రభుత్వ లోపాలను కడిగిపారేశారు. పింఛన్లు రావడం లేదని ప్రశ్నించారు. మరొకరు పంటలకు గిట్టుబాటు ధర ఎక్కడుందని ప్రశ్నించారు. వైకాపా హయాంలో రైతులు పడిన బాధలు అన్నీ ఇన్నీ కావని వాపోయారు.
వాలంటీర్ను రమ్మని ఎలా ఆదేశిస్తారు?.
ఈ సమావేశం సందర్భంగా ఓ మహిళ.. భర్త చనిపోయినా తనకు పింఛను ఇవ్వట్లేదని ప్రశ్నించింది. దీనికి స్పందించిన సీఎం..సంబంధిత వాలంటీర్ను రమ్మని సీఎం ఆదేశాలిచ్చారు. జరిగేది పార్టీ ప్రచారమని, వాలంటీర్లు ఉండకూడదని ఆయనకు గుర్తులేదా? వాలంటీర్ను రమ్మని సభా వేదిక మీద నుంచి ఎలా ఆదేశిస్తారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
జగన్ భజనపాట పాడిన వాలంటీర్...
వాలంటీర్లు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని హైకోర్టు, ఎన్నికల సంఘం ఆదేశాలున్నా జగన్ మేమంతా సిద్ధం కార్యక్రమంలో వారినీ భాగస్వాములను చేస్తున్నారు. శనివారం హోసూరుకు చెందిన వాలంటీరు శివ.. జగన్ను కీర్తిస్తూ పాటపాడటం గమనార్హం.
రూ.2 వేల పింఛన్ ఇచ్చింది గత ప్రభుత్వమే
పింఛన్లపై అబద్ధాలను వల్లెవేసే జగన్కు రాతన గ్రామానికి చెందిన రంగమ్మ దిమ్మ తిరిగే సమాధానమిచ్చారు. గత ప్రభుత్వంలోనే రూ.2 వేల పింఛను అందేదని, వైకాపా వచ్చిన తర్వాత దాన్ని రూ.3 వేలకు పెంచినట్టు సీఎం ఎదుట పేర్కొన్నారు. అంతకుముందే జగన్ తన ప్రసంగంలో గత ప్రభుత్వంలో రూ.వెయ్యి మాత్రమే పింఛను వచ్చేదని తెలిపారు.
పింఛను లేదు: సరస్వతి, తుగ్గలి
రెండేళ్ల క్రితం మా ఆయన చనిపోయారు. పింఛను రావడం లేదు. నాకు ఎలాంటి జీవనభృతీ లేదు. పింఛను రాకపోడానికి కారణం ఏంటో తెలియదు. వచ్చేలా చేస్తారని అడుగుతున్నా. నేను డిగ్రీ చదివాను. విద్యార్హతకు సరిపడా చిన్న ఉద్యోగం ఇప్పించండి.
గిట్టుబాటు ధర ఏది?: లాల్బాషా, హోసూరు
రైతులు చాలా నష్టపోయారు. పంట ఉంటే గిట్టుబాటు ధర ఉండదు. ధర ఉన్నప్పుడు పంట చేతికి రావడం లేదు. రైతులకు పింఛను ఇవ్వాలి
చెరువుకు నీళ్లివ్వాలి: సురేశ్, ఉపాధి మేట్
రాతన గ్రామంలో చెరువుకు నీళ్లు రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తుగ్గలిని కరవు మండలంగా ప్రకటించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
కష్టాల్లో రైతులు: శ్యామలాదేవి, పత్తిపాడు
రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. వారిని ఆదుకోవాలి. రైతు రుణమాఫీ ప్రకటిస్తే మీరు ఇంట్లో ఉన్నా మేం గెలిపిస్తాం. రైతు భరోసా, చేయూత, ఆసరా, తోడు పథకాలు అందాయి.
యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన
ఈనాడు డిజిటల్, అనంతపురం: అనంతపురం జిల్లాలో బస్సుయాత్ర చేపట్టిన సీఎం జగన్ శనివారం రాత్రి 11.30 వరకు ప్రచారం నిర్వహించారు. నిబంధనల మేరకు రాత్రి 10 తర్వాత ప్రచారం చేయడం నిషిద్ధం. సీఎం జగన్ యథేచ్ఛగా కోడ్ను ఉల్లంఘించారు. యాత్ర రాప్తాడుకు చేరుకునే సరికి రాత్రి 10.20 అయ్యింది. ఆ సమయంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, ఆర్వో ఉన్నా, అడ్డు చెప్పలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ