విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రవీణ్‌ప్రకాశ్‌ సమావేశాలు వాయిదా

ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్‌ 2, 23న నిర్వహించాల్సిన వీడియో కాన్ఫరెన్సులను అత్యవసర కార్యక్రమాల కారణంగా వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ప్రకటించారు.

Published : 31 Mar 2024 04:27 IST

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్‌ 2, 23న నిర్వహించాల్సిన వీడియో కాన్ఫరెన్సులను అత్యవసర కార్యక్రమాల కారణంగా వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ప్రకటించారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ఏప్రిల్‌ 2 ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో, ఏప్రిల్‌ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో వీసీలు నిర్వహిస్తానంటూ ఆయన ఇటీవల ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఎన్నికల విధులు నిర్వర్తించే ఉపాధ్యాయులు, ఓటర్లు అయిన విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభావితం చేసేందుకే ఇవి ఏర్పాటు చేశారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయన వాటిని వాయిదా వేసుకోవడం గమనార్హం.

 సార్వత్రిక ఎన్నికల విధుల శిక్షణ, పదో తరగతి పరీక్షల మూల్యాంకనం.. రెండూ ఏప్రిల్‌ 1నే ఉండటంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు దేనికి హాజరుకావాలా? అనే సందిగ్ధంలో ఉన్నారని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్‌.చిరంజీవి తెలిపారు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాల్సిందిగా పదో తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డిని సమాఖ్య ప్రతినిధులు కోరారు. జిల్లా విద్యాధికారులతో చర్చించాక సమాచారమిస్తామని ఆయన తెలిపినట్లు శనివారం ఓ ప్రకటనలో సంఘ నాయకులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని