చెప్పు విసరడం దాడి కాదు... భావ ప్రకటన స్వేచ్ఛ: వైరల్‌గా మారిన గౌతం సవాంగ్‌ వ్యాఖ్యలు

అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకుని గుత్తిలో గుర్తుతెలియని వ్యక్తి చెప్పు విసిరిన నేపథ్యంలో... గతంలో అప్పటి డీజీపీ గౌతం సవాంగ్‌ చేసిన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Updated : 31 Mar 2024 10:15 IST

ఈనాడు, అమరావతి: అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకుని గుత్తిలో గుర్తుతెలియని వ్యక్తి చెప్పు విసిరిన నేపథ్యంలో... గతంలో అప్పటి డీజీపీ గౌతం సవాంగ్‌ చేసిన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జగన్‌ ప్రభుత్వం రాజధాని అమరావతి పనుల్ని ఎక్కడికక్కడ నిలిపివేసి, కక్ష సాధింపు చర్యలకు దిగినప్పుడు రైతులకు భరోసా ఇచ్చేందుకు తెదేపా అధినేత చంద్రబాబు రాజధాని గ్రామాల్లో పర్యటించారు. వైకాపా ప్రేరేపిత దుండగులు కొందరు ఆయన వాహనంపై కర్రలు, చెప్పులు విసిరారు. జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతలో ఉన్న మాజీ ముఖ్యమంత్రిపై దాడిని తీవ్రంగా పరిగణించి, దుండగులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, అప్పటి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌... అది దాడి కాదని, వారి భావప్రకటన స్వేచ్ఛ అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, చెప్పులు విసరడం కూడా ఒక విధమైన భావప్రకటన స్వేచ్ఛే అన్నట్టు మాట్లాడారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని