ఖాతాలు ఖాళీ చేసి.. మళ్లీ ఏంటీ షాక్లు?
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను విద్యుత్తు ఛార్జీల బకాయిలకు అడ్డగోలుగా మళ్లించి, పంచాయతీ ఖాతాలు ఖాళీ చేసేసిన జగన్ ప్రభుత్వానికి ఇంకా ధనదాహం తీరడం లేదు.
విద్యుత్తు బకాయిలు చెల్లించాలని సర్పంచులకు వేధింపులు
పంచాయతీ కార్యాలయాలకు సరఫరా నిలిపివేత
అయిదేళ్లలో రూ.2 వేల కోట్లకు పైగా ఆర్థిక సంఘం నిధులు మళ్లించిన జగన్ ప్రభుత్వం
ఇంకా తీరని ధనదాహం
ఈనాడు, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను విద్యుత్తు ఛార్జీల బకాయిలకు అడ్డగోలుగా మళ్లించి, పంచాయతీ ఖాతాలు ఖాళీ చేసేసిన జగన్ ప్రభుత్వానికి ఇంకా ధనదాహం తీరడం లేదు. సర్పంచుల పోరాటాల ఫలితంగా పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమయిన నిధులపైనా కన్నేసింది. వీటిని లాగేసుకోవడానికి విద్యుత్తు పంపిణీ సంస్థలను పంచాయతీలపైకి ఎగదోస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో దాదాపు 40 పంచాయతీ కార్యాలయాలకు శనివారం విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోనూ పలు కార్యాలయాలకు బకాయిలు చెల్లించాలని నోటీసులిచ్చారు. ఇదే జిల్లా పెనుమంట్ర మండలంలో కొన్ని పంచాయతీ కార్యాలయాలకు కొద్దిరోజుల క్రితం సరఫరా నిలిపివేశారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ బకాయిలు చెల్లించాలని పంచాయతీలకు నోటీసులిస్తున్నారు.
ఈ పరిణామాలతో సర్పంచుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్రం పంచాయతీలకు ఇచ్చిన 14, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి విద్యుత్తు ఛార్జీల బకాయిల పేరుతో రాష్ట్రప్రభుత్వం గత అయిదేళ్లలో రూ.2వేల కోట్లకు పైగా మళ్లించింది. పంచాయతీల తీర్మానం లేకుండా, సర్పంచుల అనుమతి తీసుకోకుండా పీడీ ఖాతాల్లో నుంచి నిధులు లాగేసుకుంది. దీనిపై సర్పంచులు చేసిన పోరాటాలు దిల్లీని కూడా తాకాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పంచాయతీల పేరుతో ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిపించిన రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ... దాదాపు రూ.2వేల కోట్లకు పైగా 15వ ఆర్థిక సంఘం నిధులు ఇటీవల జమచేసింది.
లెక్కాపత్రం లేని బకాయిలు
పంచాయతీల ఖాతాల్లో నిధులు జమయ్యాయని తెలియగానే విద్యుత్తు పంపిణీ సంస్థలు పాత బకాయిల పేరుతో వసూళ్లకు సిద్ధమైపోతున్నాయి. బకాయిల పేరుతో ఒకవైపు ఖాతాల్లో డబ్బులు తీసేసుకుంటూ.. ఇంకా రూ.లక్షల్లో బకాయిలు చూపించడంపై సర్పంచుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. చెల్లించిన డబ్బులు ఎక్కడికి వెళుతున్నాయి? బకాయిలపై సరైన లెక్క చెప్పాలన్న సర్పంచుల విజ్ఞప్తిని విద్యుత్తు పంపిణీ సంస్థలు పట్టించుకోవడం లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన కొందరు సర్పంచులు కొద్ది నెలల క్రితం పంచాయతీరాజ్శాఖ అధికారులను కలిసి విద్యుత్తు ఛార్జీల బకాయిల లెక్కలు తేల్చాలని విజ్ఞప్తి చేశారు. బకాయిలను మించి వసూలు చేసి, మళ్లీ బకాయిలు చూపిస్తున్నారని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక పంచాయతీ కార్యదర్శి విద్యుత్తు ఛార్జీల బకాయిలపై రెండు పేజీల లేఖ రాశారు. నిధులన్నీ విద్యుత్తు ఛార్జీల బకాయిలకే తీసుకుంటే పంచాయతీల్లో అత్యవసర పనులు కూడా చేయలేమని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా నిధుల్లో నుంచి పెద్ద మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలకు మళ్లిస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఉప కార్యదర్శి విజయ్కుమార్కు కృష్ణా జిల్లాకు చెందిన ఓ సర్పంచి కొద్ది నెలల క్రితం ఫిర్యాదు చేశారు.
లెక్కలు తేల్చరు.. కట్టాల్సిందేనట!
బకాయిలు చెల్లించకపోతే పంచాయతీ కార్యాలయాలకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామని విద్యుత్తు పంపిణీ సంస్థల ఇంజినీర్లు బెదిరింపులకు దిగడంపై సర్పంచులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని కొందరు రాష్ట్ర పంచాయతీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇంతవరకు చెల్లించిన బకాయిలపై డిస్కంలు లెక్కలు చెబితే.. మిగతా వాటి గురించి ఆలోచిస్తామని సర్పంచులు చెబుతున్నారు. లెక్కల సంగతి తరువాత.. మొదట పంచాయతీ బ్యాంకు ఖాతాల్లోని నిధుల నుంచి ఎంతో కొంత చెల్లించాలని అధికారులు సర్పంచులకు ఉచిత సలహాలిస్తుండటం గమనార్హం.
మీటర్లు లేకుండా బిల్లులెలా ఇస్తారు?
విద్యుత్తు వినియోగంపై చాలా పంచాయతీల్లో రీడింగ్ మీటర్లే లేవు. రీడింగ్ తీశాకే నోటీసులివ్వాలి కదా? రూ.లక్షల్లో బకాయిలు ఎలా చూపిస్తున్నారు? కొన్ని చోట్ల వసూలు చేసిన మొత్తాలకు రసీదులూ ఇవ్వడం లేదు. ఆర్థిక సంఘం నిధులు పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో జమైనప్పుడల్లా ఇదో పెద్ద సమస్యగా మారింది. ఇది చాలా అన్యాయం. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
వైవీబీ రాజేంద్రప్రసాద్, ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల