యువత కలలపై జగన్ ‘బండరాయి’!
కరవు సీమ అనంతను పారిశ్రామిక కేంద్రంగా మారుస్తాం.. జిల్లాలో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తాం.. తద్వారా భారీగా ఉపాధి కల్పిస్తామంటూ 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్ ఈ జిల్లా ప్రజలకు అర చేతిలో స్వర్గం చూపించారు.
వైకాపా సర్కార్ దెబ్బకు గ్రానైట్ రంగం అతలాకుతలం
ఒక్క తాడిపత్రిలోనే 200కు పైగా గ్రానైట్ పరిశ్రమల మూత
కమీషన్ల కోసం ‘జాకీ’ని తరిమేశారు
లేపాక్షి భూములను కాజేసే కుట్ర
వీటిపై శ్రీసత్యసాయి జిల్లాలో సమాధానం చెప్పగలరా జగన్?
‘గ్రానైట్ పరిశ్రమను ఆదుకుంటాం. మూతపడిన పరిశ్రమలను తెరిపించి.. 20 వేల మందికి ఉపాధి కల్పిస్తాం. విద్యుత్తు ఛార్జీలతో పాటు గ్రానైట్పై రాయల్టీ తగ్గించి నిర్వాహకుల్ని ఆదుకుంటాం. కియా పరిశ్రమలోని ఉపాధి అవకాశాల్లో స్థానిక యువతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాం’
2019 మార్చిలో అనంతపురంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్ హామీలివి.
ఈనాడు, అమరావతి, ఈనాడు డిజిటల్, అనంతపురం: కరవు సీమ అనంతను పారిశ్రామిక కేంద్రంగా మారుస్తాం.. జిల్లాలో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తాం.. తద్వారా భారీగా ఉపాధి కల్పిస్తామంటూ 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్ ఈ జిల్లా ప్రజలకు అర చేతిలో స్వర్గం చూపించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన ‘కియా’ పరిశ్రమలో స్థానిక యువతకు ఉపాధి లభించేలా ప్రాధాన్యం ఇప్పిస్తామనీ కల్లబొల్లి మాటలూ చెప్పారు. వేలమందికి ఉపాధి కల్పిస్తున్న గ్రానైట్ పరిశ్రమలను ఉద్ధరిస్తామంటూ ప్రగల్భాలు పలికారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తామని ఉత్తుత్తి హామీలు గుప్పించారు. తీరా గద్దెనెక్కాక తన అసలు రంగును బయటపెట్టారు. ఈ అయిదేళ్లలో జిల్లాకు ఒక్కటంటే ఒక్క సంస్థనూ తీసుకురాలేదు. పరిశ్రమల ఏర్పాటు కోసం గతంలో ఏర్పాటు చేసిన ‘లేపాక్షి నాలెడ్జ్ హబ్’ కోసం గతంలో రైతులిచ్చిన 8వేల ఎకరాలను అయినవారికి దోచిపెట్టే ప్రయత్నం చేశారు. గ్రానైట్ పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచారు. ఇప్పుడు మరోసారి మోసం చేయడానికి ఎన్నికల ప్రచారం కోసం బస్సులో శ్రీసత్యసాయి జిల్లాకు వచ్చేందుకు సిద్ధమైపోయారు.
గ్రానైట్ రంగానికి శరాఘాతం
తాడిపత్రి ప్రాంతంలో 300 వరకు గ్రానైట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉండేవి. 10వేల మంది కూలీలు వీటిపై ఆధారపడి జీవించేవారు. వైకాపా విధానాలు ఈ యూనిట్లకు శరఘాతంగా మారాయి. రాయల్టీ పెంపు, విద్యుత్తు ఛార్జీల బాదుడు, ఎండీఎల్ల రద్దు, సీనరేజీ వసూళ్ల బాధ్యతను ప్రయివేటుకు అప్పగించడం వంటి చర్యలతో ఇక్కడ 200 వరకు పరిశ్రమలు మూతపడ్డాయి. విద్యుత్ బిల్లులు కట్టలేక కొందరు యూనిట్లను మూసేసుకుంటే.. మరికొందరు యంత్ర సామగ్రిని తుక్కుకు అమ్మేసుకొని వెళ్లిపోయారు. దీంతో వేలమంది కూలీలకు ఉపాధి కరవైంది. తెదేపా హయాంలో మీటరు గ్రానైట్కు రూ.2వేల రాయల్టీ ఉంటే.. జగన్ ప్రభుత్వంలో దాన్ని రూ.3,450కు పెంచారు. గతంతో ఒక్కో పరిశ్రమకు సగటున రూ.1.30 లక్షల మేర విద్యుత్తు బిల్లు వచ్చేది. జగన్ ప్రభుత్వం కరెంటుఛార్జీలు పెంచడంతో రూ.1.80 లక్షల వరకు బిల్లు వస్తోందని నిర్వాహకులు వాపోతున్నారు. దీనికితోడు స్థానిక వైకాపా నాయకులకు కమీషన్లు ఇవ్వలేదనే కారణంతో ఎండీఎల్ (మినరల్ డీలర్ లైసెన్స్)లను కొద్ది రోజులు బ్లాక్లో ఉంచారు. దీంతో ముడిసరకు దిగుమతి కష్టంగా మారి ఇబ్బంది పడ్డారు.
జాకీ జాడ లేకుండా చేశారు
తెదేపా హయాంలో ప్రముఖ టెక్స్టైల్స్ కంపెనీ జాకీ అనంతపురం జిల్లాలో యూనిట్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. అప్పట్లోనే అవసరమైన అనుమతులు, భూ కేటాయింపుల ప్రక్రియ పూర్తిచేశారు. రాప్తాడు సమీపంలో 27 ఎకరాలు కేటాయించారు. ప్రత్యక్షంగా 6వేల మందికి ఉపాధి కల్పించేలా రూ.129 కోట్ల పెట్టుబడితో ఏటా 32.4 మిలియన్ల దుస్తులు తయారుచేసేలా కర్మాగారం ఏర్పాటు చేయాలనేది ప్రణాళిక. నిర్మాణ పనులూ మొదలుపెట్టారు. ఇంతలో వైకాపా అధికారంలోకి వచ్చింది. స్థానిక వైకాపా ప్రజాప్రతినిధి తనకు రూ.20 కోట్లు కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఒత్తిళ్లు పెరిగిపోవడంతో ఆ కంపెనీ తెలంగాణకు తరలిపోయింది.
ప్రోత్సాహకాల ఊసే లేదు
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సిన రాయితీలను జగన్ ప్రభుత్వం మూడేళ్లుగా నిలిపివేసింది. దీంతో ప్రభుత్వాన్ని నమ్ముకుని పెట్టుబడులు పెట్టిన యువ పారిశ్రామికవేత్తలు తీవ్రంగా నష్టపోయారు. అనంతపురం జిల్లాలో ఎంఎస్ఎంఈలు 361 వరకు ఉన్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక 2020లో రాయితీలు అందజేశారు. తరువాత ఏటా సెప్టెంబరులో రాయితీలు చెల్లిస్తామంటూ సీఎం జగన్ అప్పట్లో ప్రకటించారు. మూడేళ్లు పూర్తయినా ఇప్పటివరకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 361 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ.50 కోట్ల మేర ఈ బకాయిలున్నాయి. దీంతోపాటు ఎస్సీ, ఎస్టీలకైతే రెట్టింపు రాయితీలు ఇస్తామని హామీ ఇచ్చారు. అలా చూస్తే అనంతపురం జిల్లాలోని దళిత, గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ.35 కోట్లు చెల్లించాల్సి ఉంది.
హిందూపురం సమీపంలోని తూముకుంట పారిశ్రామికవాడలో 110 వరకు భారీ, మధ్య తరహా పరిశ్రమలున్నాయి. వీటికి అవసరమైన నీటిని శ్రీరామిరెడ్డి పథకం నుంచి సరఫరా చేసేవారు. వైకాపా పాలనలో నిర్వహణ కరవై పైపులైను దెబ్బతింది. దానికి కనీస మరమ్మతులు కూడా చేయించలేదు. దీంతో పరిశ్రమల యజమానులు ప్రయివేటు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నారు. ఈ సమస్యపై యజమానులు పలుమార్లు ప్రభుత్వాన్ని అభ్యర్థించినా పట్టించుకోలేదు. నీటి సమస్య కారణంగా కొత్త యూనిట్లు ప్రారంభించడం లేదు. మరోవైపు విద్యుత్తు ఛార్జీల భారంతో రెండేళ్లలో ఇక్కడి పది తుక్కు పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో వాటిలో పనిచేసే 700 మంది కార్మికులు ఉపాధికి దూరమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్