ఇది జనాన్ని ఫూల్స్ చేయడం కాదా జగన్?
ఈ రోజు ఏప్రిల్ ఒకటో తేదీ.. ఆల్ఫూల్స్ డే..! బహుశా ఈ రోజు సీఎం జగన్ కంటే ఆనందంగా ఎవరూ ఉండరేమో..! ఎందుకంటే జనం చెవుల్లో అనునిత్యం పువ్వులు పెడుతూ వారిని పదేపదే ఫూల్స్ని చేయడంలో ఆయనకు మించినవాళ్లెవరు..!
99 శాతం హామీలు అమలు చేశామనడం అతిపెద్ద జోక్
నేడు ఏప్రిల్ ఫూల్స్ డే
ఈనాడు - అమరావతి
ఈ రోజు ఏప్రిల్ ఒకటో తేదీ.. ఆల్ఫూల్స్ డే..! బహుశా ఈ రోజు సీఎం జగన్ కంటే ఆనందంగా ఎవరూ ఉండరేమో..! ఎందుకంటే జనం చెవుల్లో అనునిత్యం పువ్వులు పెడుతూ వారిని పదేపదే ఫూల్స్ని చేయడంలో ఆయనకు మించినవాళ్లెవరు..! విపక్ష నేతగా పాదయాత్రలో ఇచ్చిన హామీలు, ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన అంశాలు, అధికారంలోకి వచ్చిన ఈ అయిదేళ్లలో ఇచ్చిన హామీల్లో 99% పూర్తిచేసేశామని సీఎం చెప్పడం అతి పెద్ద జోక్. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచీ ప్రజలపై జోక్స్ వేస్తూనే ఉన్నారు.. ఇచ్చిన హామీలను అమలు చేయకుండానే, చేసేసినట్లు చెబుతూ ప్రజల్ని ఫూల్స్ను చేస్తూనే ఉన్నారు..!
మద్యనిషేధం... అతి పెద్ద జోక్
ప్రజలపై జగన్ సంధించిన అతి పెద్ద జోక్ మద్యనిషేధం. ‘మేము అధికారంలోకి వచ్చాక మూడుదశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. 2024 ఎన్నికల్లో నేను ఓట్లడిగే సమయానికి మద్యాన్ని అయిదు నక్షత్రాల హోటళ్లకే పరిమితం చేస్తాం. ఆ తర్వాతే ఓట్లడుగుతా. దశలవారీగా మద్య నిషేధం అమలుచేస్తామని మ్యానిఫెస్టోలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నా’ ఇవి 2019 ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ చెప్పిన మాటలు. కానీ మద్యనిషేధం హామీకి మంగళం పాడేశారు. జగన్ అధికారం చేపట్టాక రూ.1.20 లక్షల కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. జె-బ్రాండ్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు రైతుల్ని ఆకట్టుకునేందుకు జగన్ ఊరికో హామీ ఇచ్చారు. రైతులకు ఏటా రూ.12,500 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. చెప్పినదాని కంటే మిన్నగా ఏడాదికి రూ.13,500 ఇస్తున్నామని ఇప్పుడు గొప్పలు చెబుతున్నారు. కానీ రాష్ట్రప్రభుత్వం ఇస్తోంది ఏటా రూ.7,500 మాత్రమే. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్నిధి కింద ఇస్తున్న రూ.6వేలు కూడా కలిపి..రూ.13,500 ఇస్తున్నట్లుగా లెక్కలు చెబుతున్నారు. ఇది రైతుల్ని ఫూల్స్ చేయడం కాదా? టమాటా ఎక్కువగా పండే రాయలసీమలో ప్రతి మండలంలోను జ్యూస్ పరిశ్రమలు, రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఇలా చాలా హామీలిచ్చి జనాన్ని మభ్యపెట్టారు.
ప్రత్యేక హోదాపై..
‘హోదా సాధిద్దాం..ఉద్యోగాల విప్లవం తెద్దాం’.. ఇది వైకాపా మ్యానిఫెస్టోలోని నినాదం. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేకహోదా తెస్తానన్న జగన్.. అధికారంలోకి వచ్చిన వెంటనే దిల్లీ వేదికగా రాష్ట్ర ప్రజల్ని ఫూల్స్ని చేశారు.
నిరుద్యోగుల్ని ముంచారు
లక్షల మంది నిరుద్యోగులు జగన్ చేతిలో ఫూల్స్గా మిగిలిపోయారు. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేయడంతో పాటు, ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని వైకాపా మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఈ అయిదేళ్లలో ఒక్కసారే జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. అది కూడా అరకొర ఉద్యోగాలకే. అటు ప్రభుత్వ ఉద్యోగాలూ లేక, జగన్ అరాచక విధానాలకు భయపడి రాష్ట్రానికి పరిశ్రమలు ముఖం చాటేయడం, ఉన్న పరిశ్రమల్ని ప్రభుత్వం తరిమేయడం, ఐటీ రంగం అభివృద్ధిపై ఎలాంటి శ్రద్ధా పెట్టకపోవడంతో ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగాల్లేక యువత రాష్ట్రం నుంచి విపరీతంగా వలస పోతోంది. రాష్ట్రంలోని యువతలో వలసల రేటు 31.6 శాతం ఉన్నట్లుగా తాజా నివేదిక పేర్కొంది. దీనికేమంటారు జగన్? ఇచ్చిన హామీలను 99 శాతం పూర్తిచేస్తే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది?
ఉద్యోగులకు వంచన
‘సీపీఎస్ రద్దు చేస్తాం. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం. సకాలంలో పీఆర్సీ అమలు పరుస్తాం’ ఇది వైకాపా ఇచ్చిన హామీ. ఈ హామీలను గాలికొదిలేసి ఈ అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం ఉద్యోగుల్ని ఎంతగా ముప్పుతిప్పలు పెట్టిందో అందరికీ తెలుసు. సీపీఎస్ రద్దు చేయలేదు సరికదా.. దాని కోసం ఉద్యమించిన ఉద్యోగులపై ఉక్కుపాదం మోపారు. ఉద్యోగుల అభిప్రాయంతో సంబంధం లేకుండా ఏకపక్షంగా జీపీఎస్ పేరుతో కొత్త విధానం తెచ్చి వారిని ఫూల్స్ని చేశారు. పీఆర్సీలో ఐఆర్ కంటే ఫిట్మెంట్ తగ్గించేసి మరోసారి ఫూల్స్ని చేశారు.
‘రాజధాని’పై ఎన్ని నాటకాలో..!
రాజధానిపై జగన్ ఎన్నిసార్లు జనాన్ని ఫూల్స్ని చేశారో లెక్కేలేదు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటుకు తమకు అభ్యంతరం లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే.. మూడు రాజధానులను తెరపైకి తెచ్చి అమరావతిని దెబ్బతీశారు. పైగా ఇటీవల ఎన్నికల ప్రచారంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసేసినట్లు చెప్పారు. ప్రజలను ఎన్నిసార్లైనా ఫూల్స్ని చేయవచ్చని బలమైన నమ్మకమేదో జగన్కు ఉన్నట్లుంది.
పోలవరం ప్రాజెక్టుపై..
‘పోలవరం సహా అన్ని సాగునీటి ప్రాజెక్టుల్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం’- ఇదీ వైకాపా మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ. 2019 జూన్ 20న సీఎం హోదాలో తొలిసారి పోలవరం ప్రాజెక్టుని సందర్శించిన జగన్... 2021 జూన్ నాటికి పోలవరం పూర్తి చేసి నీళ్లందిస్తామని చెప్పారు. పోలవరం సహా అన్ని ప్రాజెక్టుల్నీ అటకెక్కించేశారు.
ఏపీలో పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని ఎన్నికల ముందు గగ్గోలు పెట్టారు. అధికారంలోకి వచ్చాక అప్పటి వరకు లీటరుకు రూ.2 ఉన్న అదనపు వ్యాట్ని రూ.4కు పెంచారు. ప్రస్తుతం కర్ణాటక, తమిళనాడుతో పోలిస్తే లీటరు ధర రూ.10 ఎక్కువగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు