వారే అడ్డుకుంటూ.. నెపం తెదేపాపై నెట్టేస్తూ
సామాజిక పింఛన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వం భారీ కుట్రకు తెరలేపింది. నాలుగున్నరేళ్లుగా నడుస్తున్న ఇంటింటికీ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తానే అడ్డుకుని ఆ నెపాన్ని ప్రతిపక్ష తెదేపాపై నెడుతోంది.
ఇంటింటికీ పింఛన్ల పంపిణీపై వైకాపా కుట్ర
దీనికి ఉన్నతాధికారుల అండ
వృద్ధుల్ని ఎండల్లో నడిపించే దుర్మార్గపు ఆట
పంపిణీలో జాప్యం చేయాలని ముందే నిర్ణయం
పథకం ప్రకారమే అమలు
ఈనాడు - అమరావతి
సామాజిక పింఛన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వం భారీ కుట్రకు తెరలేపింది. నాలుగున్నరేళ్లుగా నడుస్తున్న ఇంటింటికీ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తానే అడ్డుకుని ఆ నెపాన్ని ప్రతిపక్ష తెదేపాపై నెడుతోంది. పింఛన్ల పంపిణీని గ్రామ/వార్డు సచివాలయాలకే పరిమితం చేసి వృద్ధులతోపాటు దివ్యాంగులు, మహిళల్ని మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలోని సచివాలయాలకు 42 డిగ్రీలకు పైగా ఎండల్లో నడిపించే వికృత రాజకీయ క్రీడ ప్రారంభించింది. గిరిజన ప్రాంతాల్లోని పింఛనుదారుల్ని కొండలు, గుట్టలు ఎక్కించి వాగులు, వంకలు దాటించి మరింత ఇబ్బందులు పెట్టే దుర్మార్గానికి ఒడిగట్టింది. దీనంతటికీ ప్రతిపక్షాలే కారణమనేలా.. పింఛనుదారులందరిలో విషబీజాలు నాటడమే వైకాపా సర్కారు ముఖ్య ఉద్దేశం. అందుకు అనుగుణంగానే శనివారం సాయంత్రం నుంచే సామాజిక మాధ్యమాల వేదికగా విషం చిమ్మే ప్రక్రియ మొదలు పెట్టింది. 15 వేలకు పైగా సచివాలయాల్లోని 1.35 లక్షల మంది గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు సునాయాసంగా ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నా కావాలనే పక్కన పెట్టి కుటిల రాజకీయం చేస్తోంది. ఇందులో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓ కీలక అధికారి, సెర్ప్ సీఈఓ మురళీధర్రెడ్డిల ప్రమేయం ఉందని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శల్ని సీఎస్ జవహర్రెడ్డి మూటగట్టుకుంటున్నారు. పింఛనుదారుల్ని సచివాలయాల దగ్గరకు రప్పించి నిరీక్షించేలా చేయాలని.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇబ్బందులు పెట్టి చంద్రబాబు కారణంగానే ఇలాంటి పరిస్థితొచ్చిందని వైకాపా ప్రచారం చేసేలా అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నాయి.
సచివాలయాల దగ్గరే పంపిణీ అంటూ ఉత్తర్వులు
వాస్తవానికి వాలంటీర్లు లేకపోయినా ఇంటింటికీ పింఛను పంపిణీ చేయడానికి సరిపడా ఉద్యోగులు గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉన్నారని ఎన్నికల సంఘానికి ప్రభుత్వ యంత్రాంగం ముందుగానే సమాచారం ఇచ్చింది. తీరా వాలంటీర్లను పక్కన పెట్టాలనే ఆదేశాలు వెలువడ్డాక అసలు వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. సచివాలయాల వద్దనే పంపిణీ చేయాలంటూ సెర్ప్ సీఈఓ మురళీధర్రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలని తాము డిమాండు చేశాక.. ఆఘమేఘాలపై సచివాలయాల వద్దే ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారని తెదేపా అనుమానిస్తోంది. ఈ ఉత్తర్వులు ఇంకా క్షేత్రస్థాయి అధికారులకు చేరకముందే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటింటికీ పింఛన్లు ఇవ్వడం లేదంటూ విలేకరుల సమావేశం పెట్టి ప్రకటించడం గమనార్హం.
ఎన్నికల సంఘం పవిత్రతపైనా బురదజల్లేలా
ఎన్నికల సంఘం పవిత్రతపైనా బురద జల్లేందుకు వైకాపా తెగబడింది. ‘రాష్ట్రంలో వాలంటీర్లంతా వైకాపా కార్యకర్తలే, మా అభ్యర్థుల గెలుపుకోసం పనిచేయాలి’ అని ముఖ్యమంత్రి జగన్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు గతంలోనూ, ఇటీవల ఆదేశించారు. అలాంటప్పుడు వైకాపా కార్యకర్తలతో నగదు పంపిణీని ఎన్నికల సంఘం ఎలా అనుమతిస్తుందనే ఇంగితం కూడా వైకాపా నేతలకు లేకపోయింది. నగదు పంపిణీకి వాలంటీర్లను దూరంగా పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చేసరికి ఏకంగా రాజ్యాంగబద్ధ సంస్థపై దాడికీ వెనకాడటం లేదు. వాస్తవానికి అమల్లో ఉన్న ప్రభుత్వ పథకాలను కొనసాగించడమంటే ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడమే. ఈ విషయంపై ఎన్నికల సంఘం కూడా జోక్యం చేసుకుని ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ముఖ్యమంత్రి కార్యాలయం పాత్రేంటి?
వాలంటీర్లను పింఛన్ల పంపిణీ నుంచి పక్కన పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీపై ఉన్నతస్థాయి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సరిపడా ఉద్యోగులు ఉన్నా, మూడు రోజుల్లో పంపిణీ పూర్తి చేయొచ్చని తెలిసినా సీఎంఓలో అన్ని వ్యవహారాలూ తానై నడిపే కీలక అధికారి అలా చేయొద్దని చెప్పారని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. పింఛనుదారులందరినీ సచివాలయాలకు పిలిపించేలా ఆయన నిర్ణయం తీసుకుని సెర్ప్ ద్వారా ఉత్తర్వులు ఇప్పించారని విమర్శిస్తున్నాయి. సదరు అధికారి 2019 ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జగన్ చెంత చేరారు. అప్పటి నుంచి అధికార యంత్రాంగంలో ఆయనే నంబర్ 1. సివిల్ సర్వీసు అధికారుల నియామకం నుంచి వైకాపా టికెట్ల పంపిణీ వరకు అన్నీ తానై చక్రం తిప్పుతుండటంతో పాటు వైకాపా ఎమ్మెల్యే, ఎంపీల పనితీరుపై సర్వే ఫలితాలను ఆయనే పర్యవేక్షించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో వైకాపాకు లబ్ధి చేకూర్చేందుకు వీలుగా వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శిస్తున్నాయి.]
జవహర్రెడ్డికి బాధ్యత లేదా?
అమల్లో ఉన్న ప్రభుత్వ పథకాల్లో మార్పులు చేస్తే ఆచరణలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో సీఎస్గా ఉన్న జవహర్రెడ్డికి తెలియదా? తెలిసినప్పుడు అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి కదా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పింఛన్ల పంపిణీపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఫోన్ చేస్తే పదిరోజులు పడుతుందని చెప్పడం ఏమిటని ఆయన వైపు కూడా అనుమానంగా చూస్తున్నాయి.
మురళీధర్రెడ్డి పాత్రలేదా?
ఇంటింటికీ పింఛన్ల పంపిణీని పక్కన పెట్టి సచివాలయాలకు రావాల్సిందే అంటూ సెర్ప్ సీఈఓ మురళీధర్రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన వైకాపా పెద్దలు చెప్పినట్లే తలాడిస్తున్నారని, కనీసం ఇంటింటికీ పింఛన్ల పంపిణీ చేయాలనే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపలేదని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. మురళీధర్రెడ్డి.. పూర్వాశ్రమంలో ఏపీఐఐసీ ద్వారా తక్కువ ధరకే భూములు కేటాయించి ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారని సీబీఐ నమోదు చేసిన కేసులో జగన్కు సహ నిందితుడు. వైకాపా ప్రభుత్వంలో కీలక అధికారి. సెర్ప్లో పనిచేస్తున్న అధికారుల్లో అత్యధికులు వైకాపాతో అంటకాగుతున్నవారేనన్న ఆరోపణలున్నాయి. నిన్నమొన్నటి వరకు సీఈఓగా పనిచేసిన ఇంతియాజ్.. ఇప్పుడు కర్నూలు నుంచి వైకాపా అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తుండటం తెలిసిందే.
నిధులు ముందే ఎందుకు తీసుకోలేదు?
ఎన్నికల కోడ్ వచ్చాక ప్రభుత్వం రూ.13వేల కోట్ల బిల్లులు చెల్లించింది. నియమావళి అమల్లో ఉన్నా.. స్క్రీనింగ్ కమిటీ ఆమోదం లేకుండా తమకు అనుకూలురైన వారికి రూ.వందలు, వేల కోట్ల బిల్లులు చెల్లించేశారు. పింఛన్ల పంపిణీ దగ్గరకు వచ్చేసరికి ఆర్థిక సంవత్సరం ముగింపు, బ్యాంకు సెలవులు అంటూ ప్రభుత్వం కొర్రీలు వేస్తోంది. సెలవు దినాలుంటే బ్యాంకుల్ని సంప్రదించి పింఛన్ల కోసం రూ.1,958 కోట్లు సిద్ధం చేయలేరా? సాధారణంగా ప్రతి నెలా 1వ తేదీకి ముందే నగదు తీసుకుంటారు. ఇప్పుడు ఆ ముందు చూపు ఏమైంది? మూడో తేదీ నుంచి పింఛను పంపిణీ అని సెర్ప్ ముందే చెప్పడంలో ఆంతర్యమేంటి? అంటే జాప్యం చేయాలని ముందే నిర్ణయించుకుని.. దాన్ని అమలు చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటింటికీ పంపిణీ సులువే..
ఒక్కో సచివాలయం పరిధిలో సగటున 9 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా పంపిణీ చేయాల్సిన పింఛన్లు 350 నుంచి 500 వరకు ఉంటాయి. అంటే ఒక్కో సచివాలయ ఉద్యోగికి సగటున 49 వరకు వస్తాయి. వాలంటీర్లు ఇప్పటి వరకు పింఛన్ల పంపిణీకి నాలుగైదు రోజుల సమయం తీసుకుంటున్నారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా రెండు, మూడు రోజుల్లోనే పంపిణీ పూర్తి చేయించవచ్చు. ఇప్పుడు వారికి పని ఒత్తిడి ఏమీ లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?