కోడిగుడ్డు కథల నేత.. అక్రమాలు, ఆక్రమణల కలబోత!!
కొండల్ని కొల్లగొట్టి మట్టి, కంకర అమ్మేస్తూ... స్థిరాస్తి వ్యాపారుల నుంచి కమీషన్లు పిండుకుంటూ... బినామీలను ముందు పెట్టి భారీ భూదందాలు నడుపుతూ... ఉమ్మడి విశాఖ జిల్లాలో ఓ ప్రజాప్రతినిధి అక్రమాలతో చెలరేగారు.
బినామీలను పెట్టి అడ్డంగా దోపిడీ
భారీ లేఅవుట్ల మాటున ప్రభుత్వ స్థలాల కబ్జా
దళితుల ఎసైన్డ్ భూములు కనిపిస్తే స్వాహా
సొంత స్థానంలో ఓటమి భయంతో నియోజకవర్గం మార్పు
ఈనాడు, అనకాపల్లి, విశాఖపట్నం
ఉమ్మడి విశాఖలో ఆయనో పేరున్న నేత... జగనన్న భజనలో ముందుంటారు... ‘కోడిగుడ్డు’ పేరు చెబితే ఠక్కున గుర్తొస్తారు... ఆయన చేయని అక్రమం లేదు... వసూళ్లు దండుకోని రంగం లేదు... కబ్జాలు, సెటిల్మెంట్లలో ముందున్నారు... ఆస్తులు కూడబెట్టడంలో ఆరితేరారు... నియోజకవర్గం ప్రగతిపై కాకుండా ప్రజలను పీడించడంపై శ్రద్ధ చూపారు... చివరికి... ఓటమి భయంతో పక్క జిల్లాకు వెళ్లారు!
కొండల్ని కొల్లగొట్టి మట్టి, కంకర అమ్మేస్తూ... స్థిరాస్తి వ్యాపారుల నుంచి కమీషన్లు పిండుకుంటూ... బినామీలను ముందు పెట్టి భారీ భూదందాలు నడుపుతూ... ఉమ్మడి విశాఖ జిల్లాలో ఓ ప్రజాప్రతినిధి అక్రమాలతో చెలరేగారు. ఎసైన్డ్, వివాదాస్పద భూముల్ని అక్రమంగా సొంతం చేసుకోవడం, క్వారీల యజమానుల్ని బెదిరించి జేబులు నింపుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. కొన్ని రోజుల క్రితం ఈ నాయకుడి జన్మదిన వేడుకల పేరిట క్వారీల యజమానుల నుంచి భారీగా వసూలు చేశారని సమాచారం. పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగితే బాధితులకు భరోసా ఇవ్వాల్సిన స్థానంలో ఉన్న ఆ నేత... వాటి యాజమాన్యాలను నిబంధనల పేరుతో భయపెట్టి డబ్బులు గుంజేస్తారన్న ఆరోపణలున్నాయి. విపక్ష నాయకులపైనా, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల్ని ప్రశ్నించేవారిపైనా, పత్రికలపైనా నోరు పారేసుకోవడం ద్వారా.. పార్టీ అధినేతతో శెభాష్...! అనిపించుకోవాలని తెగ తాపత్రయపడే ఆయనకు సిటింగ్ సీటు దక్కలేదు. ఐదేళ్లలో ఆయన నిర్వాకాలతో మళ్లీ అక్కడ పోటీ చేస్తే భారీ తేడాతో ఓడిపోతారని సర్వే నివేదికలు తేల్చడంతో పార్టీ అధినేత ఆయన్ను పక్క జిల్లాకు పంపేశారు.
బినామీ ‘బాబు’లతో అక్రమాల దందా
- ఆ ప్రజాప్రతినిధి రియల్ ఎస్టేట్ దందాలు, ప్రైవేట్ సెటిల్మెంట్లు చేసేందుకు అత్యంత విశ్వాసపాత్రులైన ఇద్దరు ‘బాబు’ల్ని బినామీలుగా పెట్టుకున్నారు. ఎవరికైనా పాసు పుస్తకాలు ఇవ్వాలన్నా, మ్యుటేషన్లు జరగాలన్నా... ఆ ఇద్దరు బినామీల అనుమతి తప్పనిసరి. పనికి అనుగుణంగా రూ.వేలల్లో పిండేస్తారు.
- కొవిడ్ సమయంలో రెవెన్యూ దస్త్రాల్ని తారుమారు చేసి బంజరు భూముల్ని జిరాయతీ భూములుగా చూపించి అమ్మేశారన్న ఆరోపణలున్నాయి. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న గ్రామాల్లోని ఇనాం, ఎసైన్డ్ భూములపై కన్నేసి సాగులో ఉన్న కొందరితో బేరసారాలు నడిపారు. జగనన్న కాలనీల కోసం సమీకరించిన భూములకు పరిహారంగా రైతులకు అభివృద్ధి చేసి ఇవ్వాల్సిన స్థలాలకు బేరం పెట్టి తమ పేరిట కాగితాలు రాయించుకున్నారు.
- తాజాగా ఈ బినామీ బాబుల్లో ఒకరు పిసినికాడలోని 80 ఎకరాల దళితుల ఎసైన్డ్ భూములపై కన్నేశారు. ఎకరాకు రూ.13 లక్షలు చొప్పున చెల్లించి బలవంతంగా లాక్కున్నారు. ప్రస్తుతం అక్కడ ఎకరం రూ.60 లక్షలకుపైగానే ధర పలుకుతోంది.
- ప్రజాప్రతినిధి బినామీల్లో ఒకరు కశింకోట మండలంలో జగనన్న కాలనీలకు ప్రభుత్వంతో ఎక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయించి... కొంత రైతులకు ముట్టజెప్పి, మిగతా మొత్తాన్ని తన జేబులో వేసుకున్నారు.
- ఆ బినామీలిద్దరూ పోలీసుస్టేషన్లలో పంచాయితీలు చేస్తుంటారు. వైకాపా కార్యకర్త ఒకరు క్రికెట్ బెట్టింగ్లో ప్రధాన బుకీగా వ్యవహరిస్తూ పోలీసులకు పట్టుబడితే ఒక్క ఫోన్ కాల్తో విడిపించారు. ఇలా బెట్టింగ్ రాయుళ్లు, మైనింగ్ మాఫియాకు రక్షణ కవచంలా నిలుస్తుంటారు. ఆ ప్రజాప్రతినిధి ఆగడాల్ని ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసులతో కేసులు పెట్టించి వేధిస్తారు. సొంత పార్టీ వాళ్లయినా సరే... ఎదురు తిరిగితే వాళ్ల ఆగ్రహానికి గురవ్వాల్సిందే. ఇద్దరు సొంత పార్టీ నాయకులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు పెట్టించి, రౌడీషీట్లు తెరిపించిన ఘనులు వీళ్లు.
ఎసైన్డ్, ప్రభుత్వ భూముల్లో లేఅవుట్లు
ఆ ప్రజాప్రతినిధికి కుడి భుజంలాంటి నాయకుడు ఒకరున్నారు. అతని మాట ఆ ప్రజాప్రతినిధికి మహా‘ప్రసాదం’..! డబ్బు పిండుకునే మార్గాలేంటి... పైసా పెట్టుబడి లేకుండా ఎలా డబ్బు సంపాదించాలి... ఏయే వ్యాపారాల్లో ఎవరెవర్ని కలుపుకోవాలి... పంపకాలు ఎలా చేసుకోవాలి... వంటి వ్యవహారాలన్నీ ఆ కుడి భుజంలాంటి నాయకుడి కనుసన్నల్లోనే జరుగుతాయి. అందుకే అతనికి జిల్లా పార్టీలో కీలకమైన పదవిని కట్టబెట్టారు. ఆ ప్రజాప్రతినిధి ఉత్తరాంధ్రకు చెందిన ముఖ్య నేతలు కొందర్ని భాగస్వాములుగా చేసుకుని 609 ఎకరాల్లో లేఅవుట్ వేసి... భారీ స్థిరాస్తి వ్యాపారానికి తెరలేపారు. దానికోసం కొందరు దళితుల భూముల్ని బలవంతంగా లాక్కున్నారు. సుమారు రూ.5 కోట్లకుపైగా విలువైన పదెకరాల ప్రభుత్వ భూముల్నీ కలిపేసుకున్నారు. అది తీవ్ర వివాదాస్పదమైనా, విమర్శలు వచ్చినా లెక్క చేయలేదు. తాజాగా ఆ ప్రజాప్రతినిధి భార్య పేరుతో అచ్యుతాపురం సెజ్లో 38 సెంట్ల స్థలం తీసుకున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.7.50 కోట్లు విలువైన ఈ భూమిని రూ.80 లక్షలకు దక్కించుకున్నారు.
క్వారీలన్నీ కప్పం కట్టాల్సిందే!
అనకాపల్లి జిల్లాలోని గ్రావెల్, మెటల్, గ్రానైట్ క్వారీల లీజుదారులు ప్రభుత్వం నుంచి పర్మిట్లు తీసుకున్నా ఈ ప్రజాప్రతినిధికి టన్నుకు ఇంతని కప్పం కట్టాల్సిందే. కొత్తగా ఎవరికైనా క్వారీ లీజు ఇవ్వాలంటే ఆయన అనుమతి ఉండాల్సిందే. ఆయన ఆశీస్సులుంటే... కొండల్ని పిండి చేసినా ఎవరూ పట్టించుకోరు. జిల్లాలో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న బయటి రాష్ట్రానికి చెందిన ఒక కంపెనీతో ఇటీవల చేతులు కలిపిన ఆయన వాటాలు పొందినట్టు సమాచారం. ఆ కంపెనీకి వ్యతిరేకంగా ఒక గ్రామ సర్పంచి ఫిర్యాదు చేస్తుండటం, సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు చేస్తుండటంతో రెండేళ్లలో ఏడుగురు పంచాయతీ కార్యదర్శుల్ని మార్చేశారు. జమ్మాదులపాలెంలోని ఒక క్వారీ యజమానిని నానా ఇబ్బందులూ పెట్టి, తన అనుచురులకు వాటా ఇప్పించుకున్నారు. కొండను పూర్తిగా కొల్లగొట్టేస్తున్నారు.
పక్క నియోజకవర్గంలోనూ చేతివాటం
పక్క నియోజకవర్గ పరిధిలోని ఫెర్రో పరిశ్రమ నుంచి వచ్చే ఫ్లైయాష్ వ్యర్థాల అమ్మకాలు, రవాణాలో వాటా కోసం తమ వర్గీయులను రెచ్చగొట్టి పొరుగు ఎమ్మెల్యే అనుచరులతో బాహాబాహీకి దిగే పరిస్థితి కల్పించారు. ఆ కంపెనీకి బొగ్గు సరఫరా చేసే ఓ ఏజెన్సీ ఆ నేతకు రెండుకార్లు బహుమతిగా ఇచ్చినట్టు సమాచారం. సెజ్లో 220 కేవీ విద్యుత్ ఉపకేంద్రం పనుల్ని ఈ ప్రజాప్రతినిధి తన బినామీలకు కట్టబెట్టడంతో... ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పనులను నిలిపి వేయడం వివాదాస్పదమైంది. గ్రామీణ సహకార విద్యుత్ సంస్థ (ఆర్ఈసీఎస్)ను కాసులురాల్చే కామధేనువుగా మార్చుకున్నారు. ఆ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని 33 మంది దగ్గర రూ.3-5 లక్షల చొప్పున వసూలు చేసినట్లు సమాచారం. ఆ సంస్థను ఈపీడీసీఎల్లో విలీనం చేయడంతో డబ్బులిచ్చిన వారు ఉద్యోగాలురాక లబోదిబోమంటున్నారు.
ట్రస్ట్ పేరుతో తీసుకున్న స్థలం అద్దెకి
అక్కిరెడ్డిపాలెం వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జాతీయ రహదారిని ఆనుకుని 2009లో తన తాత పేరుతో ఉన్న ఛారిటబుల్ ట్రస్టుకు వంద గజాల స్థలం ఇప్పించుకున్నారు. అక్కడ సేవాకార్యక్రమాలేమీ చేయకుండా అద్దెకు ఇచ్చేశారు. అదే ట్రస్ట్ కోసం మరో 200 గజాల ప్రభుత్వ స్థలం తీసుకుని... తన వాహనాల పార్కింగ్కు వాడుతున్నారు. వేపగుంటలోని 164/1లో 14.60 ఎకరాల ఓ వివాదాస్పద భూమిలోనూ ఈ నేత హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఓ ఎమ్మెల్యే, మంత్రి పేరుతో 50 మంది బెదిరింపులకు దిగారని బాధితుడు ఆరోపించారు. భోగాపురంలో సెజ్ను ఆనుకుని రూ.300 కోట్ల విలువైన భూమిపై రెండు కుటుంబాలకు కోర్టులో వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారంలో ఒక వర్గానికి ఈ ప్రజాప్రతినిధి, మరోవర్గానికి గతంలో ఉత్తరాంధ్ర వైకాపా ఇన్ఛార్జిగా పనిచేసిన కీలక నేత అండగా ఉండి.. సెటిల్మెంట్కు దిగినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!