జనం ఓట్లకు వెంపర్లాట.. జలకష్టాల దాటవేత!
గ్రామాల్లో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చే పథకాల్లో సమగ్ర రక్షిత తాగునీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్) ప్రధానమైనవి. అందుకే రాష్ట్రంలోని దాదాపు 4,000 ఆవాస ప్రాంతాల్లో ఉంటున్న లక్షల కుటుంబాలకు రోజూ తాగునీటిని సరఫరా చేయడానికి 591 పథకాలను నిర్మించారు.
ప్రజల క‘న్నీళ్లు’ పట్టించుకోని వైకాపా ప్రభుత్వం
591 సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణకు తిలోదకాలు
ఏడాదికి రూ.500 కోట్లు ఇవ్వడానికీ చేతులు రాని జగన్
వందల గ్రామాల్లో దాహార్తితో అల్లాడుతున్న ప్రజలు
ఇదేనా పేదల సర్కారు అంటే?
ఈనాడు, అమరావతి
ఆచరణవాది అధికారంలో ఉంటే... ప్రభుత్వ వ్యవస్థలన్నీ వేటి పని అవి చేస్తాయి... ప్రజలకు ఉపాధి దొరుకుతుంది... యువతకు ఉద్యోగాలూ లభిస్తాయి... సాగు, తాగునీటి సరఫరాకు ఢోకా ఉండదు... అదే, విధ్వంసకవాది చేతికి పగ్గాలు చిక్కితే... అంతా అస్తవ్యస్తంగా మారిపోతుంది... గుక్కెడు నీటికీ గుక్కపట్టాల్సిన దుస్థితి వస్తుంది... రాష్ట్రంలో ఐదేళ్ల జగన్ పాలనే దీనికి సాక్ష్యంగా నిలిచింది..!
గ్రామాల్లో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చే పథకాల్లో సమగ్ర రక్షిత తాగునీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్) ప్రధానమైనవి. అందుకే రాష్ట్రంలోని దాదాపు 4,000 ఆవాస ప్రాంతాల్లో ఉంటున్న లక్షల కుటుంబాలకు రోజూ తాగునీటిని సరఫరా చేయడానికి 591 పథకాలను నిర్మించారు. వీటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ... అవసరమైనచోట మరమ్మతులు చేస్తూ ఉంటే చక్కగా పనిచేస్తాయి. ఈ బాధ్యతలను గుత్తేదారు సంస్థలకు అప్పగించి, అవసరమైన నిధులను విడుదల చేస్తూ... వాటి పనితీరును పర్యవేక్షిస్తుంటే చాలు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుతుంది. మొత్తంగా ఆయా పథకాల నిర్వహణకు విద్యుత్ ఛార్జీలతో కలిపి ప్రతి సంవత్సరం రూ.500 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుంది.
తెదేపా ప్రభుత్వంలో ఏం జరిగేదంటే...!
తాగునీటి పథకాల నిర్వహణకు గత తెదేపా ప్రభుత్వంలో ఏటా రూ.500 కోట్లకు తక్కువ కాకుండా కేటాయించేవారు. జిల్లా పరిషత్ సాధారణ నిధుల నుంచి బిల్లులు చెల్లించేవారు. ఎక్కడైనా ఇంకా బకాయిలు ఉంటే... రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసేది. దీంతో తాగునీటి పథకాల నిర్వహణలో ఇబ్బందులకు ఆస్కారం ఉండేదికాదు. మరమ్మతులు, పరికరాలు, పైపుల మార్పులు ఎప్పటికప్పుడు చేసేవారు. వేసవిలో భూగర్భ జలాలు అడుగంటితే ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేవారు.
జగన్ వచ్చాక నిర్వహణ వ్యవస్థకు తూట్లు
జగన్ సీఎం అయ్యాక... మొదటి రెండేళ్లపాటు సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణ సరిగానే సాగింది. జిల్లా పరిషత్తుల్లో నిధుల కొరత ఉంటే పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం నిధులనూ అందించారు. మూడో ఏడాది నుంచి పథకాల నిర్వహణ బాధ్యతను జిల్లా పరిషత్తులే చూసుకోవాలని చేతులెత్తేశారు. సొంత ఆదాయ వనరులు లేని జడ్పీలు ఇన్ని కోట్ల విలువైన పథకాలను ఎలా నిర్వహిస్తాయనే ధ్యాస లేకుండా నిర్ణయం తీసుకున్నారు. మూడేళ్లుగా నిధులను కేటాయించడం లేదు. తెదేపా హయాంలో చేపట్టిన పలు పథకాలను సైతం పూర్తి చేయకుండా వదిలేశారు.
సర్కారు నిర్లక్ష్యంతో ఫిబ్రవరి నుంచే ఎద్దడి షురూ
జడ్పీల దగ్గర సొంత నిధులు లేవు. కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను జగన్ ప్రభుత్వం మళ్లించింది. ప్రజలకు తాగునీరు ఇవ్వడం ప్రభుత్వ విధి కాదన్నట్టుగా వ్యవహరించింది. మూడేళ్లుగా సొంత నిధులేమీ ఇవ్వలేదు. ఫలితంగా తాగునీటి పథకాల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. దాంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే గ్రామాల్లో నీటిఎద్దడి మొదలైంది. మార్చిలో తీవ్రరూపం దాల్చింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జనం తాగునీటికి రోడ్డెక్కుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.1,280 కోట్ల పెండింగ్ బిల్లులున్నాయి. వీటిలో విద్యుత్ ఛార్జీల బకాయిలు రూ.900 కోట్లు, పథకాల నిర్వహణ చూసే గుత్తేదారులకు చెల్లించాల్సినవి రూ.380 కోట్లు. గుట్టల్లా పేరుకుపోయిన ఈ బిల్లులను నెలాఖరులోగా చెల్లించకుంటే... బాధ్యతల నుంచి తప్పుకొంటామంటూ కొన్ని జిల్లాల్లో గుత్తేదారులు స్థానిక అధికారులకు మౌఖికంగా తేల్చిచెప్పారు. దాంతో పథకాల నిర్వహణపై గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రికేమో జనం ఓట్లు తప్ప వారి జల కష్టాలు పట్టడం లేదు.
నాలుగు ఉమ్మడి జిల్లాలను పరిశీలిస్తే..!
ఉమ్మడి కర్నూలు జిల్లాలో
60 సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణకు సంబంధించి రూ.161 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో విద్యుత్ ఛార్జీల బకాయిలు రూ.148 కోట్లు, పథకాల నిర్వహణకు గుత్తేదారులకు మరో రూ.13 కోట్లు చెల్లించాలి. జిల్లా పరిషత్తులో నిధులు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అక్కడి నుంచి ఉలుకూపలుకూ లేదు.
- ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 51 తాగునీటి పథకాల నిర్వహణకు సంబంధించి రూ.30 కోట్ల బకాయిలు ఉన్నాయి. వీటిలో విద్యుత్ ఛార్జీలకు రూ.25 కోట్లు, గుత్తేదారులకు రూ.5 కోట్లు చెల్లించాలి. ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వడంలేదు. గ్రామాలకు తాగునీరు సరిగా సరఫరా కావడంలేదు.
- ఉమ్మడి విశాఖ జిల్లాలో 43 సమగ్ర రక్షిత తాగునీటి పథకాలకు రూ.37 కోట్లు చెల్లించాలి. జిల్లా పరిషత్ నుంచి వచ్చే నిధులు ఏమూలకూ సరిపోవడం లేదు.
- ఉమ్మడి విజయనగరం జిల్లాలో 33 సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణకు ఏటా రూ.40 కోట్లు అవసరం. ఆర్థిక సంఘం నిధుల నుంచి సంవత్సరానికి రూ.15 నుంచి రూ.20 కోట్లు వెచ్చిస్తున్నారు. ఫలితంగా బకాయిలు పెరిగిపోయాయి.
ఆ 16 గ్రామాలకు కన్నీరే మిగిలింది!
ఉమ్మడి నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని 16 గ్రామాల ప్రజల దాహార్తి తీర్చేందుకు 2017లో అప్పటి తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన సమగ్ర రక్షిత మంచినీటి పథకం పనులు జగన్ ఉదాసీనత కారణంగా నిలిచిపోయాయి. ఈ పథకానికి సోమశిల నుంచి అర టీఎంసీ నీటిని కేటాయించారు. జక్కేపల్లిగూడూరు చెరువు సమీపంలో అప్పట్లోనే సర్వీస్ రిజర్వాయర్ తదితర పనులతోపాటు ప్రధాన పైపులైను నిర్మాణం పూర్తిచేశారు. వైకాపా ప్రభుత్వం గుత్తేదారుకు బిల్లులను ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయాయి.
ఇదో 57 ఊళ్ల సమస్య
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని 55, పొందూరు మండలంలోని రెండు గ్రామాల్లో ఫ్లోరైడ్, కలుషిత భూగర్భ జలాల సమస్య పరిష్కారానికి ఏర్పాటు చేసిన సమగ్ర రక్షిత తాగునీటి పథకం నిర్వహణ లోపం ప్రజలకు శాపమవుతోంది. ఎచ్చెర్ల మండలంలోని 25 గ్రామాలకే అరకొరగా నీరు ఇస్తున్నారు. కొన్ని ఊళ్లకు ఆరు నెలలుగా సరఫరా నిలిచింది.
లక్ష్యం 32 గ్రామాలైతే ఇస్తోంది... ఒక్క దానికే!
ఉమ్మడి విజయనగరం జిల్లా సీతానగరం, బొబ్బిలి మండలాల్లోని 32 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు బగ్గందొరవలసలో ప్రారంభించిన తాగునీటి పథకం పనులు ఏళ్లుగా పూర్తవడం లేదు. పైపులైన్లు పూర్తి చేయకపోవడం, పనులు చేసినచోట రహదారుల విస్తరణ కోసం తవ్వేయడం వంటి కారణాలతో నీటి సరఫరాను బగ్గందొరవలస గ్రామానికే పరిమితం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల