తిమ్మిని ‘బొమ్మ’ను చేసి.. దర్జాగా బాదేసి!
ధరలు తగ్గిస్తాను... సేవలను మరింత నాణ్యంగా అందించేలా చూస్తానని జగన్ హామీ ఇచ్చారంటే అంతే సంగతులని ఐదేళ్ల ఆయన పాలనలో ప్రజలకు అనుభవమైంది.
9 లక్షల వినియోగదారులకు ‘సినిమా’ చూపించిన జగన్
ఫైబర్నెట్ ప్యాకేజీ ధరలు రెండుసార్లు పెంపు
గత ప్రభుత్వం రూ.250కే అందించిన సేవలకు రూ.599 వసూలు
ఏటా రూ.108 కోట్లను అదనంగా పిండుకున్న వైనం
పైగా సంస్థ పేరిటే ఇటీవల రూ.902 కోట్ల అప్పుల సేకరణ
ఈనాడు, అమరావతి
జగన్ ఐదేళ్ల పాలనలో సామాన్యుడికి వినోదమూ భారమైంది... అధికారంలోకి వచ్చిన వెంటనే ఫైబర్నెట్ ధరలు తగ్గిస్తామని చెప్పి... ప్యాకేజీల పేరిట అడ్డగోలుగా పెంచే‘సారు’! అయిదేళ్లలో ఒక్కటంటే ఒక్క కొత్త కనెక్షనూ ఇవ్వలేదు... భారీ డిమాండ్ ఉన్నా పట్టించుకోలేదు! చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్లు... నష్టాల్లో ఉన్న సంస్థనే కుదువపెట్టి... వందల కోట్ల రుణం మాత్రం తెచ్చుకున్నారు...!
ధరలు తగ్గిస్తాను... సేవలను మరింత నాణ్యంగా అందించేలా చూస్తానని జగన్ హామీ ఇచ్చారంటే అంతే సంగతులని ఐదేళ్ల ఆయన పాలనలో ప్రజలకు అనుభవమైంది. ఏపీ ఫైబర్నెట్ ద్వారా రూ.150కే అన్ని ఛానళ్లతో కేబుల్ ప్రసారాలు అందిస్తామని పాదయాత్ర సందర్భంగా సాలూరులో ప్రతిపక్ష నేత హోదాలో జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే దాన్ని విస్మరించారు. పేదలు మోయలేనంతగా ప్యాకేజీల ధరలను పెంచి ‘బొమ్మ’ చూపించారు. ధరల పెంపు ద్వారా ఏటా రూ.108 కోట్ల చొప్పున అదనపు ఆదాయాన్ని పిండుకున్నారు. గత తెదేపా ప్రభుత్వం 2015 సంవత్సరంలో ఏపీ ఫైబర్నెట్ ద్వారా కేబుల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఏకంగా తొమ్మిది లక్షల మంది వినియోగదారులు కనెక్షన్లు తీసుకున్నారు. వారిపై భారం పడకుండా ఒక్కోటి రూ.4,400 ఖరీదైన ట్రిపుల్ప్లే బాక్సులను (కేబుల్, అపరిమిత నెట్, ల్యాండ్లైన్ ఫోన్ సేవలకు ఉపయోగపడే పరికరం) ఉచితంగా అందించింది. ఈ సేవలకు దాదాపు ఏడాదిన్నర కాలంపాటు ఎలాంటి రుసుం వసూలు చేయలేదు. ఆపరేటర్లు మాత్రం నిర్వహణ ఛార్జీల కింద నెలకు రూ.150 చొప్పున తీసుకున్నారు. అనంతరం ప్రతినెలా రూ.250 చొప్పున వసూలు చేస్తూ... అన్ని టీవీ ఛానళ్లతోపాటు అపరిమిత ఇంటర్నెట్ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. తనకు అధికారం అప్పగిస్తే నెలకు రూ.150 మాత్రమే వసూలు చేస్తామంటూ ప్రతిపక్ష నేత హోదాలో జగన్ చెప్పుకొచ్చారు. తీరా పీఠం ఎక్కాక స్వరం మార్చారు. ఆరు నెలల్లోనే కేబుల్ ఛార్జీలను అమాంతం పెంచేశారు. గత ప్రభుత్వ హయాంలో అందిన కేబుల్ సేవలను అదేస్థాయిలో... ప్రస్తుతం పొందాలంటే వినియోగదారులు ప్రతినెలా రూ.599 చెల్లించక తప్పని పరిస్థితి.
రాబడి కోసం మూడు ముక్కలు
ఆదాయాన్ని పెంచుకోడానికి... గతంలో ఒకే ప్యాకేజీ కింద ఉన్న సేవలను జగన్ ప్రభుత్వం మూడు ముక్కలు చేసింది. రూ.599 ధరలో మొత్తం కేబుల్ సేవలను హోమ్ ప్రీమియం ప్యాకేజీగా, రూ.449 ధరలో ఛానళ్ల సంఖ్య తగ్గించి, నెలకు 300 జీబీ ఇంటర్నెట్తో హోమ్ ఎసెన్షియల్ ప్యాకేజీగా, రూ.350 ధరలో నాలుగు ప్రధాన తెలుగు ఛానళ్ల సంఖ్యను తగ్గించి, నెట్ను 150 జీబీకి పరిమితం చేసి బేసిక్ ప్యాకేజీగా తీసుకొచ్చింది. ప్రధాన తెలుగు ఛానళ్ల కోసం వినియోగదారులు మళ్లీ అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోంది. ఎక్కువగా పేదలు వినియోగించే బేసిక్ ప్యాకేజీ ధరను రెండుసార్లు రూ.50 చొప్పున పెంచింది.
అంతా కాలయాపన.. ఏదీ తపన?
ఫైబర్నెట్ సంస్థకు ప్రస్తుతం తొమ్మిది లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. సంస్థ అప్పులు, ప్రతినెలా చెల్లించాల్సిన వాయిదాలు, సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులు పోను... ప్రతినెలా రూ.5 కోట్ల నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. వీటి నుంచి గట్టెక్కాలంటే మరో 10 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వాలి. ప్రజల నుంచి కూడా కనెక్షన్ల కోసం భారీ డిమాండ్ ఉన్నా... కొత్త బాక్సుల కొనుగోలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేయలేదు. రెండుసార్లు మొక్కుబడిగా టెండర్లు పిలిచి... బాక్సుల కొనుగోలుకయ్యే ఖర్చును కేబుల్ ఆపరేటర్లు భరించాలని మెలిక పెట్టింది. దీంతో ఆపరేటర్లు ముందుకు రావడం లేదు. మొత్తానికి కాలయాపన చేస్తూ ఐదేళ్లూ గడిపేసింది.
సొంత వ్యాపారాలను ఇలాగే చేస్తారా?
సీఎం జగన్ స్వతహాగా కార్పొరేట్ వ్యాపారవేత్త. ఆయన కుటుంబ సభ్యులు, బంధుగణానికి అనేక వ్యాపార సంస్థలున్నాయి. వారంతా అయిదేళ్ల కిందట ఉన్న వ్యాపారాలను విస్తరించకుండా వదిలేశారా? ఉన్నవే చాలన్నట్లుగా సరిపెట్టుకున్నారా? ఏ సంస్థ అయినా తన వ్యాపారాన్ని విస్తరించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తుంది. డిమాండ్ ఎక్కువగా ఉంటే అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి శతథా ప్రయత్నిస్తుంది. కానీ, జగన్ ప్రభుత్వం ఆలోచనే వేరు. ఫైబర్నెట్ ఐదేళ్ల కిందట ఎలా ఉందో... అలాగే ఉండేలా చూసింది. కొత్తగా ఒక్క కనెక్షన్ ఇవ్వలేదు. కొత్త కనెక్షన్లు ఇచ్చే ఉద్దేశం లేకపోవడంతోనే ఒక్క బాక్సును కూడా కొనలేదు. తెదేపా ప్రభుత్వం 2015లో అందించిన బాక్సులు క్రమంగా మరమ్మతులకు గురికావడం సహజం.
వాటి స్థానంలో కొత్తవి అమర్చడమో, మరమ్మతులు చేయించి ఇవ్వడమో చేయాలి.
ఈ రెండూ చేయకుండా ఫైబర్నెట్ సంస్థను మూలన పడేసేలా చేసింది. అది ప్రభుత్వ సంస్థ కాదన్నట్లే వ్యవహరించింది. ఫలితంగా చిన్నచిన్న మరమ్మతులు చేయాల్సిన సుమారు లక్ష వరకు బాక్సులు మూలనపడ్డాయి. వాటిని బాగుచేసే దిక్కు లేదు. మరమ్మతుల కోసం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన కేంద్రాలనూ మూసేసింది.
కోలుకోలేని దెబ్బ కొట్టారు!
కార్పొరేషన్ ఏదైనా.. జగన్ అప్పులు తేవడానికే అన్నట్లుంది. వివిధ కార్పొరేషన్ల పేర్లతో రుణాలు తెచ్చిన సర్కారు... నష్టాల్లో ఉన్న ఫైబర్నెట్నూ వదల్లేదు. దానికున్న ఆస్తులను తాకట్టు పెట్టి రూ.350 కోట్లు, ప్రభుత్వ హామీతో రూ.552.70 కోట్లు... మొత్తం రూ.902.70 కోట్ల అప్పులు తెచ్చింది. ఇంకా అప్పులు సృష్టించడానికి సంస్థ పరపతి సరిపోక వదిలేసింది. ఎన్నికల ప్రకటన రావడానికి కొద్ది నెలల ముందే జగన్ ప్రభుత్వం హడావుడిగా ఈ అప్పులు తెచ్చింది. వాటిని సీసీటీవీల నిర్వహణ పేరిట ఖాతాల నుంచి మళ్లించేసింది. రుణాల నుంచి సంస్థను గట్టెక్కించాల్సింది పోయి.. మరింత అప్పుల ఊబిలోకి నెట్టేసి ఫైబర్నెట్ సంస్థకు కోలుకునే అవకాశం లేకుండా చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50 చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?