ప్రభుత్వ ఉద్యోగులా?.. వైకాపా నాయకులా?
‘ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు ‘మన ప్రభుత్వం- మన ప్రగతి’ కార్యక్రమాన్ని చేపట్టాం’ ఇది వైకాపా నాయకులో.. మంత్రులో.. ప్రజాప్రతినిధులో చేసిన ప్రకటన కాదు.
కోడ్ ఉన్నా వైకాపాకు మద్దతుగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సమావేశాలు
ఇదే బాటలో మరికొందరు ‘ఉద్యోగ’ నేతలు
ప్రతిపక్షాలపై సలహాదారు చంద్రశేఖరరెడ్డి విమర్శలు
ఫిర్యాదులు చేసినా పట్టించుకోని ఎన్నికల సంఘం
ఈనాడు, అమరావతి: ‘ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు ‘మన ప్రభుత్వం- మన ప్రగతి’ కార్యక్రమాన్ని చేపట్టాం’ ఇది వైకాపా నాయకులో.. మంత్రులో.. ప్రజాప్రతినిధులో చేసిన ప్రకటన కాదు. ప్రజా ధనాన్ని జీతంగా తీసుకుంటూ ఉద్యోగ సంఘం నాయకుడిగా ఆన్డ్యూటీ సదుపాయం పొందుతున్న వెంకట్రామిరెడ్డి ఎన్నికల కోడ్కు ముందు చేసిన ప్రచారం. ఎన్నికల కోడ్ వచ్చినా ఆయన ప్రచారాన్ని ఆపలేదు. బరితెగించి బహిరంగంగా ప్రచారం చేస్తున్నా ఎన్నికల కమిషన్ మౌనం వహిస్తోంది. వైయస్ఆర్ జిల్లాలో ఆదివారం బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప ఆర్టీసీ డిపోల్లో ఉద్యోగులతో ఆ సంఘ నాయకుడు చంద్రయ్యతో కలిసి ప్రచారం చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం వల్ల మేలు జరిగిందంటూ ప్రచారం చేశారు. ఉద్యోగ సంఘం నాయకులు రాజకీయాల్లో పోటీ చేయాలనుకుంటే ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రయత్నించవచ్చు. కానీ, కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు, ఉపకులపతులు, ప్రొఫెసర్లు ప్రజల పన్నుల డబ్బును జీతాలుగా తీసుకుంటూ వైకాపాకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ ఎన్జీవోను ముందుపెట్టి..
ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా శివారెడ్డి, పురుషోత్తంనాయుడు కొత్తగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం ఎన్నిక గత ఫిబ్రవరిలో జరిగింది. నెల రోజులు పూర్తయిన తర్వాత ఎన్నికల కోడ్ సమయంలో సన్మాన కార్యక్రమాల పేరుతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీటికి ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి హాజరు కావాలని వ్యూహం రచించారు. అయితే, మాజీ అధ్యక్షులను ఆహ్వానిస్తే అందరినీ పిలవాలనే డిమాండ్ రావడంతో ఆయన కొంత తగ్గారు. ఉద్యోగులతో సమావేశమైనప్పుడు ఏం మాట్లాడాలనే స్క్రిప్టు మాత్రం ఆయన నుంచే ఏపీ ఎన్జీవో నేతలకు వస్తున్నట్లు విమర్శలున్నాయి. ఉద్యమాలతో ఎన్నో సాధించామని, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ డబ్బులను ప్రభుత్వం చెల్లించిందంటూ నాయకులు సన్మాన కార్యక్రమాల్లో చెబుతూ వైకాపాకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కడప సమావేశాలు పూర్తికాగా.. మంగళవారం గుంటూరు, విజయవాడ సీఆర్డీఏ పరిధిలోని ఉద్యోగుల సమావేశం నిర్వహిస్తున్నారు. రాత్రికి విందు ఉందంటూ ఇప్పటికే సమాచారాన్ని ఉద్యోగులకు పంపారు. వైకాపా అధిష్ఠానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ తతంగం నడుస్తోందనే విమర్శలున్నాయి. ఈ సన్మానాలపై కొందరు ఉద్యోగులు మండిపడుతున్నారు. ఏపీ ఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శి పురుషోత్తంనాయుడి కుమారుడు శ్రీకాకుళం జిల్లాలో వైకాపా నాయకుడిగా కొనసాగుతున్నారు.
సలహాదారా? వైకాపా నాయకుడా?
ఎన్నికల సంఘం కార్యాలయానికి కొన్ని అడుగుల దూరంలోని సచివాలయం నాలుగో బ్లాక్లో ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి మార్చి 26న విలేకర్ల సమావేశం పెట్టి రాజకీయ విమర్శలు చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్లపై విమర్శలు చేశారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని ఎన్నికల సంఘం నిలిపివేయిస్తే ఆ నెపాన్ని తెదేపాపైకి నెట్టేలా ఆదివారంనాడు కూడా ఆయన విమర్శలు గుప్పించారు. వైకాపా అధికార ప్రతినిధిలా ప్రకటన విడుదల చేశారు.పెన్షన్తోపాటు..సలహాదారుగా జీతభత్యాలు తీసుకుంటూ వైకాపా నాయకుడిగా ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారు.
ఆర్థిక లబ్ధి కోసమేనా?
హైదరాబాద్లోని ఏపీ ఎన్జీవో హోంను గతంలో విక్రయించారు. ఈ అమ్మకంలో అనేక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో వైకాపాలో సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్న సలహాదారు మద్దతుతో చంద్రశేఖరరెడ్డి భారీగా లబ్ధి పొందినట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవల ఈయన హైదరాబాద్లో రూ.4.50 కోట్లతో ఇల్లు కొనడం, రూ.90లక్షలతో ఖరీదైన ఆడి కారు కొనడంపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘సకల శాఖల మంత్రి’ ద్వారా ఇన్ని ప్రయోజనాలు పొందినందుకు చంద్రశేఖరరెడ్డి వైకాపాకు స్వామిభక్తి ప్రదర్శిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి ఏపీలో ఏపీ ఎన్జీవో సంఘం గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీలో జరిగిన అక్రమాల్లోనూ చంద్రశేఖరరెడ్డిపై ఆరోపణలున్నాయి. దీనిపై అప్పట్లో ఈయనపై కేసు నమోదైంది. ఈ కేసును తిరగ తోడకుండా ఉండేందుకు వైకాపా సహాయం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఎన్నికల కోడ్ రాక ముందూ అదే తీరు..
మార్చి 7న చిత్తూరు నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త విజయానందరెడ్డి నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మీయ సమావేశానికి వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు. గత పాలకులు ఎవరూ చేయనంత మేలు జగన్ చేశారని, ఆయనకే ఉద్యోగులు మద్దతు పలకాలంటూ ఈ సమావేశంలో ఆయన జగన్ భజన చేశారు. ఆ తర్వాత ఆర్టీసీ ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలోనూ వైకాపాకు మద్దతు తెలపాలంటూ ప్రకటన చేశారు. గత నెల 8న అనంతపురంలో నిర్వహించిన సమావేశంలో ‘గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులారా ప్రభుత్వ ప్రతిష్ఠ పెంచండి!’ అంటూ ఏకంగా కరపత్రాలను విడుదల చేశారు. గత నెల 10న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో నిర్వహించిన ర్యాలీ, అనంతరం ఆయన ఉద్యోగులను ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేశారు.
- జేఎన్టీయూ-కాకినాడలో జనవరి 30న వైకాపా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ‘జగనన్న కాలేజీ క్యాప్టెన్స్’ పేరిట రాజకీయ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఇక్కడి వీసీ ప్రసాదరాజు సెనేట్ హాల్ను ఇచ్చారు. సీఎం చిత్రంతో ఉన్న టీషర్టులను విద్యార్థులకు పంచి, వారితో జగన్కు జై కొట్టించారు. వైకాపా ప్రచారం కోసం ముద్రించిన పుస్తకాలు కరపత్రాలు పంచిపెట్టారు. వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో వైకాపా నాయకుల చిత్రాలు ఉన్నాయి. ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు.
- జేఎన్టీయూ, కాకినాడలో ఫిబ్రవరి 9న వైకాపా అనుకూల ప్రచార సభ నిర్వహించారు. వక్తలు వైకాపా భజన చేశారు. ఈ సమావేశానికి మందిరం అందించడంతోపాటు వీసీ ప్రసాదరాజు వక్తగా పాల్గొన్నారు.
- విశాఖపట్నంలో ఫిబ్రవరి 5న ‘ప్రగతి బాటలో రాష్ట్ర విద్యా వ్యవస్థ’ పేరుతో నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆంధ్ర వర్సిటీ ఆచార్య షారోన్రాజు మాట్లాడుతూ.. సీఎం జగన్ తీసుకొచ్చిన సంస్కరణలు కొందరు కళ్లుండీ చూడలేని ధృతరాష్ట్రులు.. చదువంటే గౌరవం లేని వ్యక్తులకు కనిపించడం లేదంటూ వ్యాఖ్యానించారు. ఈ సమావేశానికి ఆంధ్ర వర్సిటీ నుంచి 50మంది విద్యార్థులను తరలించారు.
ఏపీ సివిల్ సర్వీసుల ప్రవర్తన నియమావళి ఏం చెబుతోంది?
- పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ, ఏదైనా స్థానిక అథారిటీ లేదా సంస్థకు జరిగే ఎన్నికలకు సంబంధించి ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రచారం చేయరాదు. తన పలుకుబడిని ఉపయోగించరాదు
- ఏ ప్రభుత్వ ఉద్యోగి రాజకీయ ఉద్యమం, కార్యకలాపాలలో పాల్గొనకూడదు. సహాయం చేయకూడదు
బరి తెగిస్తున్నారు..
- రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సివిల్ సర్వీసుల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి యథేచ్చగా వైకాపా తరఫున ప్రచారం చేస్తున్నారు. సంఘం నాయకుడిగా ఆన్డ్యూటీ సదుపాయం వాడుకుంటూ.. ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ వైకాపాకు ఓటు వేయాలని, జగన్ను మరోసారి గెలిపించాలని బరితెగించి ప్రచారం చేస్తున్నారు. వైయస్ఆర్ జిల్లాలో ఆదివారం ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు.
- ఎన్నికల కోడ్ సమయంలో ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు సన్మానం పేరుతో ప్రత్యేకంగా ఉద్యోగులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనికి తెరవెనుక ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి చక్రం తిప్పుతున్నారు. ఇటీవల విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర ఎన్జీవో హోంలో మంగళవారం విజయవాడ, గుంటూరు జిల్లాల సీఆర్డీఏ పరిధిలోని ఉద్యోగులతో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
- ప్రభుత్వ సలహాదారుగా పని చేస్తున్న చంద్రశేఖరరెడ్డి పదవీవిరమణ చేసిన ఉద్యోగి. ఈయన ప్రజల సొమ్ము నుంచి పెన్షన్తోపాటు ప్రభుత్వ సలహాదారుగా జీతభత్యాలు తీసుకుంటున్నారు. సివిల్ సర్వీసుల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి వైకాపా అధికార ప్రతినిధిలా ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే